schedule
-
IPL 2025: కోల్కతా X బెంగళూరు
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరిగే ఫైనల్తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు (7 లీగ్ మ్యాచ్లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి. » 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో; మార్చి 30న సన్రైజర్స్ హైదరాబాద్తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది. రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచ్ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి. » సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్కతాలో జరగనున్నాయి. » లీగ్లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లోని ఒక జట్టు తమ గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. » ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది. -
మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi
-
తెలంగాణలో వారం రోజుల్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్!
-
తెలంగాణ పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ను కాకతీయ యూనివర్శిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు యూనివర్శిటీ వెల్లడించింది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. -
తెలంగాణ ‘ఎప్’సెట్ షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే వెల్లడించింది. వీటిలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఎప్సెట్(EAPCET) ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి3) ఉన్నత విద్యామండలి ప్రకటించింది.ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది. ఎప్సెట్ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహిస్తోంది.పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారు..తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.కాగా, ఈ ఏడాది నిర్వహించనున్న అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్ష(సెట్)ల తేదీలను ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాసే వారికి ఇబ్బంది రాకుండా సెట్ పరీక్షల తేదీలను వేర్వేరు రోజుల్లో ఖరారు చేశారు. -
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలాఖరులో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, అలాగే ఉత్తరాంధ్ర టీచర్స్ MLC పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 27వ తేదీన పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
TG: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీకి రఘోత్తం రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నర్సిరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. -
TG: ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం(జనవరి15) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్(EAPCET), మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్,జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్జూన్ 8,9 న ఐసెట్,జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్,జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ(హెచ్),ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నాయి. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.ఇదీ చదవండి: మీరు డాక్టరా లేక ఇంజినీరా..? -
పీక్స్కు చేరిన కోడి పందేల సందడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి వేళ కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఏ రోజున ఎక్కడెక్కడ పందేలు జరుగుతాయనే షెడ్యూల్స్ ప్రకటిస్తున్నారు. పలానా చోట పలానా బరి సిద్ధమవుతోందని.. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఎంత మొత్తంలో పందేలు వేయొచ్చనే వివరాలతో కూడిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కోడిపందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ డే మ్యాచ్లట.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5, రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్ ప్రకటించుకున్నారు.మరోవైపు బడా కోడి పందేంరాయుళ్లు నలుగురు పేర్లతో 13వ తేదీ గణపవరం, 14వ తేదీ శింగవరం, 15వ తేదీ సీసలిలో బిగ్డే మ్యాచ్లంటూ షెడ్యూల్ ప్రకటించడం వంటివి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే తరహాలో భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని స్థానిక పందెంరాయుళ్లు బరులు, ఇతర వివరాలతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున పందేలకు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నిషేధం బేఖాతరు.. కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్–1974లోని సెక్షన్ 9 (1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి.దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్ లీగ్’ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్ లీగ్ (కోడి పందేల లీగ్) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ మాదిరిగా కోడి పందేల లీగ్ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
-
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్
-
కడప జిల్లాలో YS జగన్ పర్యటన
-
TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్మీడియేట్ బోర్డు సోమవారం(డిసెంబర్16) విడుదల చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు మార్చి 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 5న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1మార్చి 7న ఇంగ్లీష్ పేపర్ 1మార్చి 11న మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటని పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్1మార్చి 13న మ్యాథమెటిక్స్ పేపర్ 1 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1మార్చి 17న ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1మార్చి 19న కెమిస్ట్రీ పేపర్ 1 కామర్స్ పేపర్ 1ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ ఇదీ..మార్చి 6న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2మార్చి 10న ఇంగ్లీష్ పేపర్ 2మార్చి 12న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటని పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2మార్చి 15న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2మార్చి 18న ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2మార్చి 20న కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 -
తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-2 పరీక్షలు
-
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. -
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎక్స్ వేదికగా పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న ఫిజిక్స్, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్షలు జరపనున్నారు. -
ప్రజా పాలన విజయోత్సవాలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 9వ తేదీ సెక్రటేరియట్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం చేయనున్నారు. భారీ బహిరంగ సభకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 1వ తేదీ ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు జరగనుంది.డిసెంబర్ 2వ తేదీ అన్ని జిల్లాల్లో సీఎం కప్ పోటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో రోజు ఒక్కో డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శాఖల వారీగా ఏడాది కాలం పనితీరుపై లెక్కలను మంత్రులు వెల్లడించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మంత్రులు వరుస మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త వేడుకలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది.డిసెంబర్ 1:ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)డిసెంబర్ 2:16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం213 కొత్త అంబులెన్సులు ప్రారంభం33 ట్రాన్స్ జెండర్ క్లినిక్ల ప్రారంభంట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టుడిసెంబర్ 3:హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలుఆరాంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభండిసెంబర్ 4:తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపనవర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.డిసెంబర్ 5:ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభంస్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభంఘట్ కేసర్లో బాలికల ITI కాలేజీ ప్రారంభండిసెంబర్ 6:యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుదుత్పత్తి ప్రారంభం244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.డిసెంబర్ 7:స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభంపోలీస్ బ్యాండ్ ప్రదర్శనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.డిసెంబర్ 8:7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం130 కొత్త మీ సేవల ప్రారంభంయంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపనతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలుడిసెంబర్ 9:లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలుడ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు -
ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. డిసెంబర్ 20వ తేదీనే పోలింగ్ అయ్యాక సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇదీ చదవండి: హాయ్ చెప్తే.. అంత డ్రామా చేస్తారా? -
ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ, రోడ్ షోలో ప్రధాని పాల్గొననున్నారు. 29న సాయంత్రం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో తూర్పు నౌకాదళానికి చెందిన ఎయిర్బేస్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాన్వెంట్ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్ వినాయక్ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్రధాన వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు.టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర నిర్వహించే రోడ్షోలో ప్రధాని పాల్గొని బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ నిర్దేశించిన బహిరంగ సభ కార్యక్రమంలో 4.45 నుంచి 5.00 గంటల వరకు గవర్నర్, సీఎం, ఉప ముఖ్యమంత్రితో కలిసి పాల్గొని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్తో పాటు, రైల్వే లైన్లు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని ప్రధాని చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల అనంతరం సాయంత్రం 5.25 నుంచి 5.43 గంటల వరూ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అనంతరం.. సాయంత్రం 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్ పోర్టుకు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. -
Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్రాజ్లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్రాజ్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.ప్రయాగ్రాజ్లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. -
TG: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)మెయిన్స్ షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) సోమవారం విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండు సెషన్ల (జనవరి, ఏప్రిల్)లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి నవంబర్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.వచ్చే నెల 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా పేర్కొంది. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటించనుంది. పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలిపింది. జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది. -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే మరో రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికల వేడిని పెంచింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలు మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వయనాడ్, నాందేడ్ లోక్సభ స్థానాలు, 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూళ్లను విడుదలచేశారు.వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే పట్టణప్రాంత ఓటర్లు సెలవుదినంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో పోలింగ్ను కేవలం బుధవారాల్లోనే రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.పశ్చిమబెంగాల్లోని బసిర్హాట్ ఎంపీ, ఉత్తరప్రదేశ్లోని మిల్కిపూర్ ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలపై పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలచేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యలోని శివసేన పారీ్టతో బీజేపీ అధికారాన్ని పంచుకున్న విషయం తెల్సిందే. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 31 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్–ఎన్సీపీ(ఎస్పీ)–శివసేన(యూబీటీ) కూటమి నుంచి అధికార మహాయుతి కూటమికి గట్టిసవాల్ ఎదురవుతోంది. జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. మహారాష్ట్రలో 288, జార్ఖండ్లో 81 మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 9.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట ర్లలో 4.97 కోట్ల మంది పురుషులుకాగా 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో 9 ఎస్సీ, 28 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 2.60 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 29,562 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్కుమార్గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్కుమార్రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న న్యూజిలాండ్తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్లో జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతాయి. -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్(ఈసీ) శుక్రవారం(ఆగస్టు 16) మళ్లీ ఎన్నికల నగారా మోగించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్ముకు అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌధరీ, అంకిత దయాని హీట్స్లోనే వెనుదిరిగారు. భారత్ నుంచి రెండు ఈవెంట్లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.తొలి హీట్లో పోటీపడిన భారత మరో రన్నర్ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్కు అర్హత సాధించారు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్ కౌర్ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి) షూటింగ్ మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల 25 మీటర్ల పిస్టల్ (పతక పోరు): మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) బాక్సింగ్ పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్: నిశాంత్ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి) సెయిలింగ్పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్ (సాయంత్రం గం. 5:55 నుంచి) -
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: పీవీ సింధు x ఫాతిమత్ నభా (మాల్దీవులు) మధ్యాహ్నం గం. 12:50 నుంచి. పురుషుల సింగిల్స్ తొలి లీగ్ మ్యాచ్: హెచ్ఎస్ ప్రణయ్ x ఫాబియన్ రోథ్ (జర్మనీ) రాత్రి గం. 9:00 నుంచిషూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: ఇలవేనిల్ వలారివన్ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి). పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్: సందీప్ సింగ్, అర్జున్ బబూతా (మధ్యాహ్నం గం. 2:45 నుంచి). మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి). రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ (రెపిచేజ్ 2): బలరాజ్ పన్వర్ (మధ్యాహ్నం గం. 1:18 నుంచి).టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): ఆకుల శ్రీజ x క్రిస్టియానా క్లెబెర్గ్ (స్వీడన్) (మధ్యాహ్నం గం. 12:15 నుంచి). మహిళల సింగిల్స్ (రెండో రౌండ్): మనికా బత్రా x అన్నా హర్సే (ఇంగ్లండ్) (మధ్యాహ్నం 12:15 నుంచి). పురుషుల సింగిల్స్ (రెండో రౌండ్): శరత్ కమల్ x డేనీ కోజుల్ (స్లొవేనియా) (మధ్యాహ్నం గం. 3:00 నుంచి).స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ (హీట్–2): శ్రీహరి నటరాజ్ (మధ్యాహ్నం గం. 3:16 నుంచి). మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ (హీట్–1): ధీనిధి (మధ్యాహ్నం గం. 3.30 నుంచి).ఆర్చరీ మహిళల రికర్వ్ టీమ్ క్వార్టర్ ఫైనల్: భారత్ (దీపిక కుమారి, అంకిత భకత్, భజన్ కౌర్) ్ఠ ఫ్రాన్స్/నెదర్లాండ్స్ (సాయంత్రం గం. 5:45 నుంచి). మహిళల టీమ్ సెమీఫైనల్: (రాత్రి గం. 7:17 నుంచి). మహిళల టీమ్ ఫైనల్: (రాత్రి గం. 8:18 నుంచి). -
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్
-
తిరుమల బ్రహ్మోత్సవాలు షెడ్యూల్ 2024
-
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే..!
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ ఏడాది జులై 27న మొదలై ఆగస్ట్ 7 వరకు సాగనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డే సిరీస్ జరుగనున్నట్లు సమాచారం. పర్యటన తాలుకా షెడ్యూల్పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పర్యటనలోని మ్యాచ్లన్నీ సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.శ్రీలంక పర్యటనలో భారత షెడ్యూల్ ఇలా..తొలి టీ20- జులై 27రెండో టీ20- జులై 28మూడో టీ20- జులై 30తొలి వన్డే- ఆగస్ట్ 2రెండో వన్డే- ఆగస్ట్ 4మూడో వన్డే- ఆగస్ట్ 7ఈ సిరీస్కు ముందు టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేశారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్ జులై 6న మొదలై జులై 14 వరకు కొనసాగుతుంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే వేదికగా జరుగనున్నాయి.తొలి టీ20- జులై 6రెండో టీ20- జులై 7మూడో టీ20- జులై 10నాలుగో టీ20- జులై 13ఐదో టీ20- జులై 14జింబాబ్వే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే. -
టీమిండియా హోం సీజన్ (2024-25) షెడ్యూల్ విడుదల
2024-2025 హోం సీజన్కు సంబంధించి టీమిండియా ఆడబోయే మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ (జూన్ 20) ప్రకటించింది. ఈ సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలై వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో ముగుస్తుంది. ఈ మధ్యలో భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.2024-25 హోం సీజన్ షెడ్యూల్ వివరాలు..బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (చెన్నై): సెప్టెంబర్ 19 నుంచి 23 వరకురెండో టెస్ట్ (కాన్పూర్): సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకుతొలి టీ20 (ధర్మశాల): అక్టోబర్ 6రెండో టీ20 (ఢిల్లీ): అక్టోబర్ 9మూడో టీ20 (హైదరాబాద్): హైదరాబాద్న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టెస్ట్ (బెంగళూరు): అక్టోబర్ 16 నుంచి 20 వరకురెండో టెస్ట్ (పూణే): అక్టోబర్ 24 నుంచి 28 వరకుమూడో టెస్ట్ (ముంబై): నవంబర్ 1 నుంచి 5 వరకుఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియాతొలి టీ20 (చెన్నై): జనవరి 22రెండో టీ20 (కోల్కతా): జనవరి 25మూడో టీ20 (రాజ్కోట్): జనవరి 28నాలుగో టీ20 (పూణే): జనవరి 31ఐదో టీ20 (ముంబై): ఫిబ్రవరి 2తొలి వన్డే (నాగ్పూర్): ఫిబ్రవరి 6రెండో వన్డే (కటక్): ఫిబ్రవరి 9మూడో వన్డే (అహ్మదాబాద్): ఫిబ్రవరి 12టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత టీమిండియా షెడ్యూల్..ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే (5 టీ20లు)ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక (3 వన్డేలు, 3 టీ20లు)బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా (2 టెస్ట్లు, 3 టీ20లు)న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 టెస్ట్లు)ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా (5 టెస్ట్లు)ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా (3 వన్డేలు, 5 టీ20లు)ఛాంపియన్స్ ట్రోఫీ 2025వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా..అక్టోబర్ 21-జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)అక్టోబర్ 22-పేపర్ 1(జనరల్ ఎస్సే)అక్టోబర్ 23-పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)అక్టోబర్ 24-పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)అక్టోబర్ 25-పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్మెంట్)అక్టోబర్ 26-పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్)అక్టోబర్ 27-పేపర్ 6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) -
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే.. -
T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్లో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.మరి టీ20 వరల్డ్కప్-2024 పూర్తి షెడ్యూల్, సమయం, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు తెలుసుకుందామా?!గ్రూప్ దశలో...👉జూన్ 1: అమెరికా వర్సెస్ కెనడా- టెక్సాస్(భారత కాలమానం ప్రకారం జూన్ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)👉జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)నమీబియా వర్సెస్ ఒమన్- బార్బడోస్(జూన్ 3 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 4 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్- డల్లాస్- రాత్రి తొమ్మిది గంటలకు)👉జూన్ 5: ఇండియా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్- (రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్- బార్బడోస్- (జూన్ 6 ఉదయం ఆరు గంటలకు)పపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా- గయానా- (జూన్ 6 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 6- యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్- డల్లాస్(రాత్రి తొమ్మిది గంటలకు)నమీబియా వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(జూన్ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)👉జూన్ 7- కెనడా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- డల్లాస్(జూన్ 8 ఉదయం ఆరు గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- గయానా(జూన్ 8 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 8- నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బార్బడోస్- (రాత్రి 10 30 నిమిషాలకు)వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 9 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 9- ఇండియా వర్సెస్ పాకిస్తాన్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)👉జూన్ 10- సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 11- పాకిస్తాన్ వర్సెస్ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- అంటిగ్వా(జూన్ 12 ఉదయం ఆరు గంటలకు)శ్రీలంక వర్సెస్ నేపాల్- ఫ్లోరిడా(జూన్ 12 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 12- యూఎస్ఏ వర్సెస్ ఇండియా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్- ట్రినిడాడ్(జూన్ 13 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 13- బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ విన్సెంట్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్(జూన్ 14 ఉదయం ఆరు గంటలకు)ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్- అంటిగ్వా(జూన్ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)👉జూన్ 14- యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా-ట్రినిడాడ్(జూన్ 15 ఉదయం ఆరు గంటలకు)సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్(జూన్ 15 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 15- ఇండియా వర్సెస్ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)నమీబియా వర్సెస్ ఇంగ్లండ్- అంటిగ్వా(రాత్రి 10.30కి)ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్- సెయింట్ లూసియా(జూన్ 16 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 16- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ లూసియా(జూన్ 17 ఉదయం ఆరు గంటలకు)బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్- సెయింట్ విన్సెంట్(జూన్ 17 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 17- న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్ (రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ అఫ్గనిస్తాన్- సెయింట్ లూసియా(జూన్ 18 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 19- ఏ2 వర్సెస్ డీ1 సూపర్-8 గ్రూప్-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)బీ1 వర్సెస్ సీ2- సెయింట్ లూయీస్(జూన్ 20 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 20- సీ1 వర్సెస్ ఏ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)బీ2 వర్సెస్ డీ2- అంటిగ్వా(జూన్ 21 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 21- బీ1 వర్సెస్ డీ1- సెయింట్ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)ఏ2 వర్సెస్ సీ2- బార్బడోస్- (జూన్ 22 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 22- ఏ1 వర్సెస్ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ బీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 23 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 23- ఏ2 వర్సెస్ బీ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ2 వర్సెస్ డీ1- అంటిగ్వా(జూన్ 24 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 24- బీ2 వర్సెస్ ఏ1- సెయింట్ లూయీస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ డీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 25 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 26- సెమీ ఫైనల్ 1- ట్రినిడాడ్(జూన్ 27 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 27- సెమీ ఫైనల్ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 29- ఫైనల్- బార్బడోస్(రాత్రి ఏడున్నర గంటలకు).లైవ్ స్ట్రీమింగ్(ఇండియాలో)👉స్టార్ స్పోర్ట్స్ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)👉డిస్నీ+హాట్స్టార్(డిజిటల్)చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలు -
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార సభల మే 10వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గురువారం విడుదల చేశారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గంలో పుత్తూరులో కార్వేటి నగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలో కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
-
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరామ్ శుక్రవారం విడుదల చేశారు.సీఎం జగన్ 4వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధి హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధి పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధి నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగే సభలో పాల్గొననున్నారు.ఉదయం 10 గంటలకు బొబ్బిలి, మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేట, మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో జరిగే ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.కాగా, (ఈ రోజు) మంగళవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు, కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. -
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు.. షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: 22 రోజుల్లో 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు.. 2,188 కి.మీలు.. 9 భారీ రోడ్ షోలు 6 ప్రత్యేక సమావేశాలు 16 బహిరంగ సభలు.. జన ప్రభంజనం మధ్య జైత్ర యాత్రలా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగింది. మండుటెండైనా, అర్ధరాత్రయినా పిల్లలు, పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు. యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మరో జైత్రయాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించనున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు. 28న ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండేపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు30న కొండెపి, మైదుకూరు, పీలేరుమే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు షెడ్యూల్ విడుదల
-
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
సీఎం జగన్ 16వ రోజు బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 15వ రోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైఎస్ జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చదవండి: మేమంతా సిద్ధం: ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
పారదర్శక అనుమతుల జారీలో సువిధ పోర్టల్ రికార్డు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులు సులభతరంగా, పారదర్శకంగా అందించడానికి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అభ్యర్థనలు వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 60 శాతం (44,626) అభ్యర్థనలకు అనుమతులు ఇవ్వగా 15 శాతం (11,200) అభ్యర్థనలను తిరస్కరించినట్లు తెలిపింది. మిగిలిన అభ్యర్థనలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. సువిధ పోర్టల్ వినియోగంలో 23,239 అభ్యర్థనలతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11,976 అభ్యర్థనలు), మధ్యప్రదేశ్ (10,636 అభ్యర్థనలు) ఉన్నాయి. కనిష్టంగా చండీగఢ్లో 17 అభ్యర్థనలు, లక్షదీ్వప్లో 18, మణిపూర్లో 20 అభ్యర్థనలు అందాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సిన ఆంధ్రప్రదేశ్ నుంచి 1,153 అభ్యర్థనలు వచ్చాయి. ఉచిత, న్యాయమైన, పారదర్శకమైన ప్రజాస్వామ్యం అనే సూత్రాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి అనుమతి అభ్యర్థనలు స్వీకరించేందుకు, వెంటనే వాటిపై చర్యలు తీసుకునేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ పోర్టల్ను అభివృద్ధి చేసింది. పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు చేరువయ్యే కార్యక్రమాలకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రంపై పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకు ఈ పోర్టల్ వీలు కల్పిస్తోంది. ర్యాలీలు నిర్వహించడం, తాత్కాలిక పార్టీ కార్యాలయాలు తెరవడం, ఇంటింటికి ప్రచారం చేయడం, వీడియో వ్యాన్లు, హెలికాప్టర్లు, వాహనాలు, కరపత్రాలు పంపిణీ వంటి వాటికి అనుమతులు ఇస్తుంది. ఆన్లైన్ ద్వారా అనుమతులు సువిధ పోర్టల్ (https://suvidha.eci.gov. in) ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడనుంచైనా, ఎప్పుడైనా అనుమతి అభ్యర్థనలను ఆన్లైన్లో సమరి్పంచవచ్చు. ఆఫ్లైన్లో కూడా అభ్యర్థనలు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్ర విభాగాల నోడల్ అధికారులతో నిర్వహించే పటిష్టమైన ఐటీ ప్లాట్ఫాం సహకారంతో దరఖాస్తులను సమర్థంగా ప్రాసెస్ చేయడానికి ఈ పోర్టల్ సహాయకారిగా ఉంటోంది. యాప్ ద్వారా కూడా సువిధ సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారులు తమ అభ్యర్థనల స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫారాల్లో అందుబాటులో ఉంది. సువిధ ప్లాట్ఫాం ఎన్నికల ప్రక్రియ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, అప్లికేషన్ల రియల్ టైమ్ ట్రాకింగ్, స్టేటస్ అప్డేట్, టైమ్స్టాంప్ చేసిన సమర్పణలను ఎంఎస్ఎం ద్వారా తెలియజేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారిస్తుంది. ఇంకా పోర్టల్లో లభించే అనుమతి డేటా ఎన్నికల వ్యయాలను పరిశీలించడానికి విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం, సమగ్రతకు దోహదపడటమేగాక ఎన్నికల సంఘం నిబద్ధతను పునరుద్ఘాటించడానికి సువిధ ప్లాట్ఫాం ఎంతో దోహదపడుతుంది. న్యాయమైన, సమర్థమైన, పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయడానికి, అన్ని రాజకీయపార్టీలు, అభ్యర్థులు అవసరమైన అనుమతులు పొందేందుకు సమాన అవకాశాలు కలి్పంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. -
చలో రాజమహేంద్రవరం
‘గేమ్చేంజర్’ కోసం రాజమహేంద్రవరం వెళ్లనున్నారట రామ్చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తు్తన్న పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిల్మ్నగర్ సమాచారం. రామ్చరణ్తో పాటు ముఖ్యతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులోప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్కు వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.. రిలీజ్ డేట్పై త్వరలోనే స్పష్టత రానుంది. -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్ -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి,అమరావతి/సాక్షి, పుట్టపర్తి: మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల ఆదివారం విడుదల చేశారు. యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు. -
సీఎం జగన్ బస్సు యాత్ర డే-3 షెడ్యూల్
-
సీఎం జగన్ బస్సు యాత్ర 2వ రోజు షెడ్యూల్ ఇదే
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ ఇదే
సాక్షి, నంద్యాల జిల్లా: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు షెడ్యూల్ : మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు(గురువారం) నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం, పెంచికలపాడులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇదీ చదవండి: నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్ -
సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్..
-
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
40 సీట్లు.. 40 రోజులకుపైగా ఎన్నికలు! ఇక్కడ అప్పుడూ ఇంతే..
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్లో బిహార్ రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 40 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా 40 రోజులకు పైగా ఎన్నికలు జరగున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. దశలు నియోజకవర్గాలు దశ 1 (ఏప్రిల్ 19) ఔరంగాబాద్, గయా, నవాడా, జముయి దశ 2 (ఏప్రిల్ 26) కిషన్గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా దశ 3 (మే 7) ఝంఝర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా దశ 4 (మే 13) దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ దశ 5 (మే 20) సీతామర్హి, మధుబని, ముజఫర్పూర్, సరన్, హాజీపూర్ దశ 6 (మే 25) వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్గంజ్ దశ 7 (జూన్ 1) నలంద, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారం, కరకట్, జహనాబాద్ 2019లోనూ.. 2019లో కూడా బిహార్లో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. జేడీ‘యూ-టర్న్’ నితీష్ కుమార్ మరో యూ-టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలపడంతో బిహార్లో 2024 లోక్సభ ఎన్నికలపై చాలా ఉత్కంఠ నెలకొంది. 40 సీట్లతో బిహార్ దేశంలో అత్యంత కీలకమైన హార్ట్ల్యాండ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ రాజకీయంగా ముఖ్యమైనది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో మళ్లీ పొత్తు కుదుర్చుకోవడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన గత ఎన్నికల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తోంది. బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదుర్కోనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకోగా, జేడీయూ 16 సీట్లు గెలుచుకుంది. రెండు పార్టీలు కూటమిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీనియర్ మిత్రపక్షంగా జేడీయూ అవతరించింది. ఎన్డీయేలో భాగమైన ఎల్జేపీ 6 సీట్లు గెలుచుకుంది. మహాఘటబంధన్లో భాగమైన కాంగ్రెస్ బిహార్లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది. 23.58 శాతం ఓట్ షేర్తో అత్యధిక ఓట్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఆసక్తికరంగా ఈసారి నితీష్ కుమార్ పార్టీతో పొత్తుతో బీజేపీ బరిలోకి దిగుతోంది. భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా జేడీయూ 16 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో ఎల్జేపీ, ఇతర మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి. -
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో పోలింగ్..ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్... లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..ఇంకా ఇతర అప్డేట్స్
-
రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన: ఈసీ
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt — Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024 ఈసీ డేటా ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈసీలతో సీఈసీ భేటీ కేంద్ర ఎన్నికల సంఘంలో.. ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో షెడ్యూల్ ప్రకటన జాప్యం అవుతుందేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. గురువారం ప్రధాని నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ ఈసీ సభ్యుల ఎంపిక కోసం భేటీ అయ్యింది. తదనంతరం.. రెండు పేర్లను రాష్ట్రపతికి పంపగా.. వెంటనే ఆమోద ముద్ర లభించింది. అలా.. ఎన్నికల సంఘానికి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం ఆఘమేఘాల మీద జరిగింది. శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: ఇవాళో.. రేపో.. ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించి.. కాసేపట్లో కీలక భేటీలో పాల్గొననున్నారు. ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా.. సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. మరికాసేపట్లో సీఈసీ అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపైనా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ఆ వెంటనే.. ఏ క్షణమైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. CEC Shri Rajiv Kumar welcomed the two newly-appointed Election Commissioners, Shri Gyanesh Kumar & Dr Sukhbir Singh Sandhu who joined the Commission today #ECI #ChunavKaParv pic.twitter.com/9cHMWF0UOo — Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024 అంతా సిద్ధం.. లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. దఫాలవారీగా అక్కడి అధికార యంత్రాగంతో సమన్వయం జరిపింది కూడా. దీంతో ఈసీ ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. లోక్సభతోపాటే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక.. ప్రధాని మోదీ నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ నిన్న భేటీ అయ్యి.. ఆరుగురి పేర్ల పరిశీలన తదనంతరం చివరకు రిటైర్డ్ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులను నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది తెలిసిందే. ఆ వెంటనే వీళ్లిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. -
ఏపీ ఈఏపీ సెట్–2024 షెడ్యూల్ విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో 47, హైదరాబాద్లో 1, సికింద్రాబాద్లో 1 చొప్పున ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఎన్నికల షెడ్యూల్ అప్పుడే.. హింట్ ఇచ్చిన ఈసీ అధికారి!
Lok Sabha Elections 2024: దేశంలో 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. రాజకీయ పార్టీలతోపాటు దేశ ప్రజలంతా ఎన్నికల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, తేదీని ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. 15 నుంచి 20 రోజుల్లో లోక్సభ ఎన్నికల తేదీని ఈసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. కేంద్ర ఎన్నికల సంఘం రాబోయే 15- 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తుందని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఏవైనా సంభావ్య సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ అధికారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ ఎలక్షన్ చీఫ్ చెప్పడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని మరికొన్ని నివేదికలు కూడా పేర్కొన్నాయి. మార్చి 13 నాటికి భారత ఎన్నికల సంఘం రాష్ట్రాలలో తన అంచనాను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఈసీఐ త్వరలో ప్రకటించనుంది. -
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
-
విశాఖలో సీఎం జగన్ పర్యటన
-
టీఎస్ ఈసెట్, లాసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈసెట్, లాసెట్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్సీహెచ్ఈ పేర్కొంది. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే1 నుంచి విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహించనున్నారు. -
తాడేపల్లి టు దెందులూరు..సీఎం జగన్ షెడ్యూల్
-
‘థగ్ లైఫ్’ కోసం రష్యా వెళ్లనున్న కమల్
కమల్హాసన్ ‘థగ్ లైఫ్’ రష్యాలో ఆరంభం కానుందట. 1987లో వచ్చిన ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్హాసన్–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘జయం’ రవి, దుల్కర్ సల్మాన్, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్యా లక్ష్మీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తున్నారు కమల్హాసన్. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ్రపారంభమైంది. కమల్హాసన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణను రష్యాలో ప్లాన్ చేశారట మణిరత్నం. ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
56 రాజ్యసభ స్థానాలకు 27న ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ అవుతున్నాయి. వాటికి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రానుంది. 15 వరకు నామినేషన్ల స్వీకరిరణ, 16న పరిశీలన, 20 వరకు ఉపసంహరణ ఉంటాయి. ఫిబ్రవరి 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. ఐదింటికి గంటలకు కౌంటింగ్ ముగించి ఫలితాలను ప్రకటిస్తారు. పదవీకాలం ముగుస్తున్న ఎంపీల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తదితరులున్నారు. యూపీలో అత్యధికంగా 10 ఖాళీలు ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 ఉన్నాయి. బిహార్, మహారాష్ట్రల్లో చెరో 6, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్లో చెరో 5, కర్ణాటక, గుజరాత్లో చెరో 4, ఏపీ, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మూడేసి, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కోటి ఖాళీ అవుతున్నాయి. బీజేపీ పరం కానున్న 28 సీట్లు ఎన్నికలు జరిగే 56 రాజ్యసభ స్థానాల్లో 28 సీట్లను బీజేపీ గెలుచుకోనుంది. ప్రస్తుతం రాజ్యసభలో 93 మంది బీజేపీ సభ్యులతో కలిసి ఎన్డీఏ కూటమి బలం 114గా ఉంది. కాంగ్రెస్కు 30 సీట్లున్నాయి. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం దృష్ట్యా అక్కడి ఒక్క రాజ్యసభ స్థానం ఆ పార్టీకే దక్కనుంది. దాన్ని ప్రియాంక గాం«దీకి కేటాయించవచ్చని సమాచారం. ప్రస్తుతం అక్కడి నుంచి ఎంపీగా ఉన్న వహిస్తున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను మరో రాష్ట్రం నుంచి అధిష్టానం సర్దుబాటు చేయనుంది. -
భీమవరం దొరబాబుగా చిరంజీవి
చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడమే. ఇదే జోష్లో రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఆయన హీరోగా ‘బింబిసార’ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్లో ఆరంభం కానుంది. ఫ్యాంటసీ అడ్వెంచర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో భారీ ఖర్చుతో ఓ సెట్ ఏర్పాటు చేస్తున్నారట మేకర్స్. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సెట్ ఉంటుందని, అందుకోసం నిర్మాతలు కూడా భారీగా వెచ్చిస్తున్నారనీ తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఈ సెట్లో జరిగే షూటింగ్లో చిరంజీవి పాల్గొంటారని ఫిల్మ్నగర్ టాక్. చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరించనున్నారని భోగట్టా. భీమవరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం. దొరబాబు పాత్ర నవ్వుల్ని పంచుతూనే ప్రేక్షకులను మరో కొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళుతుందని తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
కమలం కసరత్తు తెలంగాణ నుంచే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. 29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు. టికెట్లకు పోటీ ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో 1.40కి మహబూబ్నగర్కు చేరుకుంటారు. 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటారు తర్వాత హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు. రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. -
ఇకపై ఎంసెట్.. టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఈఏపీసెట్), టీఎస్ ఈ సెట్, టీఎస్ ఎడ్సెట్ సహా మొత్తం ఎనిమిది ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను ప్రకటించింది. రాబోయే 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే పరీక్షల తేదీలు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గతంలో టీఎస్ ఎంసెట్గా ఉన్న పేరును గత కొంతకాలంగా విడిగా నీట్ ద్వారా మెడిసిన్ ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో టీఎస్ఈఏపీసెట్గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొ. ఆర్, లింబాద్రి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్ ప్రొ. ఎస్కే మహమూద్, జేఎన్టీయూ–హెచ్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.టి.రమేశ్ పాల్గొన్నారు. ఈ ప్రవేశపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ..షెడ్యూల్, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ పీజు తదితరాల గురించి సంబంధించి సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎనిమిది ప్రవేశపరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు) టీఎస్ సెట్ల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి....