అక్టోబర్‌ 6న భారత్, పాక్‌ పోరు | ICC announces revised schedule for the ICC Women T20 World Cup in the UAE | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 6న భారత్, పాక్‌ పోరు

Published Tue, Aug 27 2024 5:00 AM | Last Updated on Tue, Aug 27 2024 5:00 AM

ICC announces revised schedule for the ICC Women T20 World Cup in the UAE

మహిళల టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల 

యూఏఈలో అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు టోర్నీ  

దుబాయ్‌: బంగ్లాదేశ్‌ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్‌) నిర్వహిస్తారు. 

రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్‌–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. 

అనంతరం అక్టోబర్‌ 9న శ్రీలంకతో, అక్టోబర్‌ 13న ఆ్రస్టేలియాతో భారత్‌ ఆడుతుంది. భారత్‌ సెమీఫైనల్‌ చేరుకుంటే అక్టోబర్‌ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో  ఆడుతుంది. అక్టోబర్‌ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్‌ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ జట్లున్నాయి. సెపె్టంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 1 వరకు 10 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement