Sharjah
-
విశాఖ చేరుకున్న షార్జా బాధితులు
-
షార్జా స్టేడియంలో చిరంజీవి సందడి (ఫోటోలు)
-
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న న్యూజిలాండ్తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్లో జరిగే ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్లు జరుగుతాయి. -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్పై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్పై దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) నిషేధం విధించింది. లీగ్లో భాగమైన షార్జా వారియర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నవీన్పై 20 నెలల నిషేధం విధిస్తున్నట్లు లీగ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నవీన్కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నవీన్పై నిషేధం విధించింది. నవీన్ ఈ ఏడాది ఆరంభంలో (2023, జనవరి) జరిగిన ILT20 సీజన్-1లో షార్జా వారియర్స్ తరపున ఆడాడు. ముందస్తు అగ్రిమెంట్లో భాగంగా ఫ్రాంచైజీ యాజమాన్యం నవీన్కు రిటెన్షన్ నోటీసులు పంపింది. అయితే నవీన్ సదరు నోటీసులపై సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో లీగ్ మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో నవీన్పై 20 నెలల నిషేధం విధించింది. నవీన్.. 2023 సీజన్లో వారియర్స్ తరఫున మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఆడి, 24.36 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ లీగ్లో నవీన్ ప్రాతినిథ్యం వహించిన షార్జా వారియర్స్ ఐదో స్థానంతో గత సీజన్ను ముగించింది. ఈ సీజన్లో వారు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించారు. -
పసికూనపై ప్రతాపం.. క్లీన్ స్వీప్ చేసిన విండీస్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు కూడా..!
షార్జా వేదికగా యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో విండీస్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి పసికూనపై ప్రతాపం చూపింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. విండీస్ స్పిన్నర్లు కెవిన్ సింక్లెయిర్ (4/24), కారియ (2/34) మాయాజాలం ధాటికి 36.1 ఓవర్లలో 184 పరుగులకు చాపచుట్టేసింది. యూఏఈ ఇన్నింగ్స్లో భారత సంతతి ఆటగాడు అరవింద్ (70) టాప్ స్కోరర్గా నిలువగా.. కెప్టెన్ ముహమ్మద్ వసీం (42), రమీజ్ షెహజాద్ (27), అలీ నసీర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్.. అలిక్ అతనాజే (45 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), షామారా బ్రూక్స్ (39), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్) రాణించడంతో మరో 89 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో అయాన్ అఫ్జల్, ముహమ్మద్ జవాదుల్లా, కార్తీక్ మెయ్యప్పన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి రెండు వన్డేల్లో విండీస్ ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్ ఓపెనర్ అలిక్ అతనాజే వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టి సాధించాడు. అతనాజే 26 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా (26 బంతుల్లో) పేరిట ఉండిన రికార్డును సమం చేశాడు. టీమిండియాకే చెందిన మరో బ్యాటర్ ఇషాన్ కిషన్.. తన వన్డే అరంగేట్రంలో 33 బంతుల్లో ఫిఫ్టి చేశాడు. చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్పై ఫ్యాన్స్ ఫైర్ -
రూట్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో డెసర్ట్ వైపర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్ క్యాపిటల్స్పై షార్జా వారియర్స్ ఓపెనర్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కాడ్మోర్ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్మోర్, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) వారియర్స్ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్ బౌలర్లలో అకీఫ్ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ జో రూట్ (54 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో టామ్ కోహ్లెర్ కాడ్మోర్ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్లో అలెక్స్ హేల్స్ చేసినది లీగ్లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. -
నిజామాబాద్: షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్ క్యాటరింగ్ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్ వీసాలపై పంపించిన ఏజెంట్ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్ వీసాలను జారీ చేశాడు. ఒక్కొక్కరి వద్ద విజిట్ కమ్ వర్క్ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఏజెంట్ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎస్ ట్రావెల్స్కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సాక్షికి వెల్లడించారు. -
ఆ ఒక్క సిక్స్తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సచిన్ బ్యాటింగ్ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో 49 ఏళ్ల వయసులో భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్ సచిన్ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తాజాగా ఈ మ్యాచ్లో సచిన్ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే క్రిస్ ట్రెమ్లెట్ బౌలింగ్లో అతను కొట్టిన ఒక సిక్స్ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సచిన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సచిన్ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. అందులో ఫ్రంట్పుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్మార్క్గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్ బౌలింగ్లో 6,6,4 బాదిన సచిన్.. ఆ ఓవర్లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్ఫుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్లో జోడించి ట్వీట్స్ చేశారు. ''సచిన్ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్ సచిన్ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్ మెరుపులకు యువరాజ్ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N — Ashish Verma (@ashu112) September 22, 2022 Vintage Sachin Tendulkar pic.twitter.com/qvogWLkVqC — Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) September 22, 2022 చదవండి: ఒకే ఫ్రేమ్లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
షార్జా-కొచ్చివిమానంలో లోపం: సేఫ్ ల్యాండింగ్
కొచ్చి: జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షార్జా నుంచి కొచ్చి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం(జి9-426) విమానం ల్యాండ్ అవుతుండగా సమస్య ఏర్పడింది. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది గందర గోళానికి గురయ్యారు. కొచ్చికి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం (జి9-426)లో లోపం తలెత్తింది. యుఎఇలోని షార్జా నుండి ఈరోజు సాయంత్రం కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సమస్య తలెత్తింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న మొత్తం 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని కొచ్చిన్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని డీజీసీఏ తెలిపింది. A Kochi-bound Air Arabia flight (G9- 426) departed from Sharjah in UAE and had a hydraulic failure while landing at Kochi airport, today evening. The aircraft landed safely. All 222 passengers and 7 crew members on board are safe: Cochin International Airport Authority pic.twitter.com/1bGS7xygTY — ANI (@ANI) July 15, 2022 -
మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్స్పేస్ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా బ్లాక్లిస్ట్లో పెగాసస్ Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
హమ్మయ్య.. శ్రీనివాస్ క్షేమంగా వచ్చేశాడు!
పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్ గల్ఫ్లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్ను బుధవారం ‘సాక్షి’పలకరించింది. శ్రీనివాస్ 2013లో దుబాయ్కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు. తర్వాత 2018లో లెబనాన్ వెళ్లిన శ్రీనివాస్ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు. గల్ఫ్లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు -
'ముంబైతో మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలే'
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో లీగ్ మ్యాచ్లు నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఆఖరి లీగ్ పోరు జరగనుంది. కాగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే 18 పాయింట్లతో టాప్ లేపి ప్లేఆఫ్కు చేరగా.. ఎస్ఆర్హెచ్కు మాత్రం ఈ మ్యాచ్ చావోరేవో అనే పరిస్థితి. ముంబైతో మ్యాచ్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుంది.. ఓడిపోతే కేకేఆర్ వెళుతుంది. అయితే విండీస్ దిగ్గజం.. మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా మాత్రం ముంబైతో జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కు మేలు చేయనుందని అంటున్నాడు. (చదవండి : ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్) ' ముంబై.. ఈ మ్యాచ్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్లో దుమ్మురేపే ప్రదర్శనతో టాప్ స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు అడుగుపెట్టిన ముంబై ఈ మ్యాచ్ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా.ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్ఆర్హెచ్కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ చేరుతుందనే అనుకుంటున్నా. 'అంటూ లారా చెప్పుకొచ్చాడు. (చదవండి :‘ధోని 400 పరుగులు చేయగలడు’) -
చెన్నైకి విజయం వరించేనా!
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరగనుంది. కాగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఈ సీజన్లో మంచి ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ మరోసారి ఫేవరెట్గా బరిలోకి దిగనుండగా.. మరోవైపు సన్రైజర్స్తో జరిగిన గత మ్యాచ్లో విజయం సాధించిన చెన్నై జట్టు 6వ స్థానంలో కొనసాగుతుంది. తొలి అంచెలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 44 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇక ఇరు జట్ల విషయానికి వస్తే సీఎస్కే.. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఆడిన జట్టుతోనే మరోసారి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. వాట్సన్, రాయుడు, డుప్లెసిస్లతో టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తున్నా.. మిడిలార్డర్ మాత్రం మంచి ప్రదర్శన కనబరచలేకపోతుంది. బౌలింగ్ విభాగంలో బ్రావో, దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్లు ఉన్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లతో పాటు శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, అజింక్యా రహానేలతో బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో కగిసో రబడ మంచి ఫామ్ కనబరుస్తుండగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరుగులు నియంత్రించడంతో పాటు కీలక వికెట్లు తీస్తున్నాడు. రిషబ్ పంత్ గాయంపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అతను ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. -
ఈ పేరును కొంచెం గౌరవించండి : గేల్
షార్జా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో తన ఆటను ఆరంభించాడు. గురువారం ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ ఆఖరి బంతికి విజయం సాధించి లీగ్లో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో బరిలోకి దిగిన గేల్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి రెండో వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గేల్ ఈ సీజన్ను ఘనంగా ఆరంభించాడు. గేల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అక్కడ ఉండే సరదా వేరుగా ఉంటుంది. తాను చేసే అల్లరితో గ్రౌండ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి మారిపోతుంది. (చదవండి : ఉత్కంఠ పోరు.. చివరి బంతికి గెలిచారు) తాజాగా కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్లో గేల్ తన అర్థసెంచరీ పూర్తి చేశాక ఒక సన్నివేశం చోటుచేసుకుంది. ఫిప్టీ పూర్తయిన తర్వాత బ్యాట్ పైకెత్తిన గేల్ బ్యాట్పై ఉన్న స్టిక్కర్ను చూపించాడు. ఆ స్టిక్కర్పై ది బాస్ అని రాసి ఉంది. బ్యాట్పై ఉన్న స్టిక్కర్ ద్వారా గేల్ ఒక మెసేజ్ను పాస్ చేశాడు. ' అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను చూపించే ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి' అంటూ పేర్కొన్నాడు. కాగా గేల్ చేసిన పనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రస్తావించాడు.(చదవండి : కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై) When he is on the mic, expect nothing less than entertainment and laughs 😅😅#Dream11IPL | @henrygayle pic.twitter.com/I62YPN1pES — IndianPremierLeague (@IPL) October 15, 2020 గేల్ ఒక మంచి గుణం కలిగిన ఆటగాడని.. క్రికెట్లో గొప్పగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆటగాళ్లలో అతను ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. అతను ఉన్న చోట ఎంటర్టైన్మెంట్కు కొదువ ఉండదు.. అందుకే గేల్ మంచి మనసున్న ఆటగాడయ్యాడని తెలిపాడు.అనంతరం మ్యాచ్ గురించి ప్రస్తావించగా.. కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని.. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. కింగ్స్ పంజాబ్ అసలైతే ఐదు మ్యాచ్లు గెలవాల్సి ఉండేది.. కానీ వారికి అదృష్టం కలిసిరావడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సినా.. చివరివరకు ఆడి క్లిష్టతరం చేసుకున్నారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అంతేగాక క్రీడల్లో గొప్ప అథ్లెట్గా కోహ్లితో పాటు ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను మొదటి చాయిస్గా తీసుకుంటానని రవిశాస్త్రి ఇంటర్య్వూలో సమాధానమిచ్చాడు. కాగా కింగ్స్ పంజాబ్ 8 మ్యచ్లాడి కేవలం రెండు విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్లో ఇకపై జరిగే అన్ని మ్యాచ్లను పంజాబ్ గెలవడంతో పాటు రన్రేట్ను మెరుగుపరుచుకుంటేనే ఫ్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. -
ఆర్సీబీ భళా.. కేకేఆర్ డీలా
షార్జా: కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ను 112 పరుగులకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్లో ఛేదించే క్రమంలో కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. శుబ్మన్ గిల్(34; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ముందుగా బ్యాటింగ్లో అదరగొట్టిన ఆర్సీబీ..అటు తర్వాత బౌలింగ్లోనూ విశేషంగా రాణించింది. కేకేఆర్ బ్యాట్స్మెన్కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. వాషింగ్టన్ సుందర్, మోరిస్లకు తలో రెండు వికెట్లు సాధించగా, చహల్, ఉదాన, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు ఒక్కో వికెట్ దక్కింది. సుందర్ నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులే ఇవ్వగా, చహల్ నాలుగు ఓవర్లకు 12 పరుగులిచ్చాడు. మోరిస్ నాలుగు ఓవర్లకు 17 పరుగులివ్వగా, సైనీ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చాడు. (‘ఈ ఏడాదే టీమిండియాకు ఆడతాడు’) ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దేవదూత్ పడిక్కల్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) అరోన్ ఫించ్(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), ఏబీ డివిలియర్స్(73 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి(33 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్)లు రాణించడంతో ఆర్సీబీ పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి తొలి వికెట్కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్ ఔటైన తర్వాత గేమ్ స్వరూపం మారిపోయింది. ఫించ్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్రేట్ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్లో ఉండటంతో ఆర్సీబీ 190 పరుగుల మార్కును చేరింది. కాగా, కోహ్లి ఫోర్ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్లో కోహ్లి సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ లభించింది.ఇది ఆర్సీబీకి ఐదో విజయం కాగా, కేకేఆర్కు మూడో ఓటమి. -
చెలరేగిన డివిలియర్స్
షార్జా: కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 195 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. దేవదూత్ పడిక్కల్(32; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అరోన్ ఫించ్(47; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్), ఏబీ డివిలియర్స్(73 నాటౌట్; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు), కోహ్లి(33 నాటౌట్; 28 బంతుల్లో 1 ఫోర్)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించింది. దేవదూత్ పడిక్కల్, అరోన్ ఫించ్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడి తొలి వికెట్కు 67 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఫించ్కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ స్టైక్ రొటేట్ చేశారు. కానీ ఫోర్లు, సిక్స్లు రావడం కష్టం కావడంతో ఆర్సీబీ స్కోరులో వేగం తగ్గింది. ఆర్సీబీ స్కోరు వద్ద ఫించ్ ఔటైన తర్వాత గేమ్ స్వరూపం మారిపోయింది. ఏబీడీ విశ్వరూపం ఫించ్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఏబీడీ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేస్తున్నాడు. ఆర్సీబీ రన్రేట్ను పెంచుకుంటూ పోయాడు. బౌలర్లు ఓవర్ ద వికెట్, రౌండ్ ద వికెట్ వేసినా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఏబీడీ కడవరకూ క్రీజ్లోకి ఉండటంతో ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కాగా, కోహ్లి ఫోర్ కొట్టడానికి చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. 19 ఓవర్లో కానీ కోహ్లి ఖాతాలో బౌండరీ రాలేదు. అదొక్క బౌండరీనే ఈ మ్యాచ్లో కోహ్లి సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో రసెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలో వికెట్ లభించింది. -
సునీల్ నరైన్ ఔట్
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ కోల్కతా, ఆర్సీబీలు తలో ఆరు మ్యాచ్లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. ఇరుజట్లు వరుసగా మ్యాచ్లు గెలుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లో కేకేఆర్ గెలుపును అందుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 24సార్లు తలపడగా కేకేఆర్ 14 మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 10 మ్యాచ్ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్కు కేకేఆర్ వివాదాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్ దూరమయ్యాడు. కింగ్స్ పంజాబ్తో ఆడిన గత మ్యాచ్లో నరైన్ బౌలింగ్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అంపైర్లు ఫిర్యాదు చేశారు. దాంతో నరైన్ బౌలింగ్ యాక్షన్పై తుది నివేదిక వచ్చే వరకూ అతను దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ క్రమంలోనే నరైన్ను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. మరి రాబోవు టోర్నీలో నరైన్ ఉంటాడా..లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నరైన్ యాక్షన్ సరిగా లేదని తేలితే మాత్రం ఈ సీజన్ ఐపీఎల్కు దూరమవుతాడు. కోహ్లి వర్సెస్ కమిన్స్ ఈ మ్యాచ్లో కోహ్లి-కమిన్స్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఆర్సీబీ ఆడిన ఆరంభపు మ్యాచ్ల్లో తడబడిన కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆపై మంచి ఫామ్లోకి వచ్చాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఓ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో సహకరించాడు. ఆ మ్యాచ్లో అజేయంగా 90 పరుగులు సాధించి పెద్ద విజయాన్ని బెంగళూరుకు అందించాడు. కోహ్లి ఎదుర్కొన చివరి 22 డెలివరీల్లో 56 పరుగులు సాధించాడు. దాంతో కోహ్లి మరోసారి మెరిసే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ జట్టు పేస్ విభాగంలో కమిన్స్ కీలకం కానున్నాడు. కమిన్స్ది కూడా కోహ్లి కథే. సీజన్ ఆరంభంలో తడబడ్డ కమిన్స్.. ఆపై బ్యాట్స్మెన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వికెట్లు సాధించకపోయినప్పటికీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్లతో పరుగులు నియంత్రిస్తున్నాడు. కానీ వరల్డ్ బెస్ట్ బౌలర్లలో ఒకడైన కమిన్స్ ఏ క్షణంలోనైనా తన ట్రాక్ను అందుపుచ్చుకోవచ్చు. ఇప్పటివరరకూ తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేయకపోయినప్పటికీ కమిన్స్తో ఆర్సీబీకి ప్రమాదం పొంచి ఉంది. కమిన్స్ ఆరు మ్యాచ్ల్లో రెండు వికెట్లు మాత్రమే తీయగా, కోహ్లి ఆరు మ్యాచ్ల్లో 223 పరుగులు చేశాడు. ఇక్కడ కోహ్లి యావరేజ్ 55.75గా ఉండగా, స్టైక్రేట్ 128.90గా ఉంది. ఆర్సీబీ తుదిజట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, చహల్ కేకేఆర్ తుదిజట్టు దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, శుబ్మన్ గిల్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటాన్, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, నాగర్కోటి, ప్రసిద్ద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి -
ముంబైతో మ్యాచ్కు భువీ దూరం
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో నేడు ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్రైజర్స్.. ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు ఓ మ్యాచ్లో ఓడి.. మరో మ్యాచ్లో గెలుస్తూ.. రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్పై గెలవాలనే కసితో బరిలో దిగనుంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు దుబాయ్, అబుదాబిల్లో మాత్రమే మ్యాచ్లు ఆడాయి. కాగా తొలిసారి షార్జాలో ఆడబోతున్నాయి. కాగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్ల బలబలాలు రోహిత్ శర్మ, పొలార్డ్, డికాక్, పాండ్య, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. చిన్న స్టేడియంలో ముంబై ఇండియన్స్ సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముంబై బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్లకు సన్రైజర్స్పై పెద్దగా చెప్పుకునే రికార్డేం లేదు. గతంలో జరిగిన మ్యాచ్ల్లో పొలార్డ్, పాండ్యాలను రషీద్ ఖాన్ నిలువరించగా.. కాగా పొలార్డ్కు 22 బంతులేసిన భువీ అతన్ని 3 సార్లు ఔట్ చేశాడు. బౌలింగ్లో బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్లతో ముంబై పటిష్టంగానే ఉంది. ఇక సన్రైజర్స్ విషయానికి వస్తే వార్నర్ టచ్లోనే కనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. బెయిర్ స్టో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్లు తమ ఫామ్ను కొనసాగిస్తే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. చెన్నైతో మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మలు మరోసారి రాణిస్తే ఎస్ఆర్హెచ్ జట్టుకు తిరుగుండదు. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ప్రధాన బౌలర్ భువీ గాయపడిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్ గాయంతో మ్యాచ్కు దూరమవడంతో అతని స్థానంలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, సన్రైజర్స్లు 14 మ్యాచ్ల్లో తలపడగా.. చెరో ఏడుసార్లు చొప్పున గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్ ద్వారా పలువురు ఆటగాళ్లు పలు మైలురాళ్లను చేరుకోనున్నారు. ట్రెంట్ బౌల్ట్కిది 100వ టీ20 మ్యాచ్ కాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా డేవిడ్ వార్నర్కు ఇది 50వ మ్యాచ్. మనీష్ పాండే ఐపీఎల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 40 పరుగులు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా సన్రైజర్స్ జట్టు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సామద్, అభిషేక్ శర్మ, ప్రియాం గార్గ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి. నటరాజన్ -
షార్జాలో భారీ అగ్ని ప్రమాదం
షార్జా: షార్జాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అల్ నహ్ డ్ ప్రాంతంలోని 49అంతస్తుల అబ్కో టవర్ లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకూ వ్యాపించాయి. దీంతో ఫ్లాట్స్ లో ఉన్న స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ బిల్డింగ్ లో 250 కుటుంబాలు నివాసముంటుండగా.. ఎక్కువ మంది భారతీయులేనని తెలుస్తోంది. ఘటనలో ఏడుగురు గాయపడగా.. వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, నగదు కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అక్కడి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. చదవండి: బాయ్స్ లాకర్ రూం: హైకోర్టు సీజేకు లాయర్ లేఖ ఎక్కువ మంది చనిపోతారు.. మాస్కు పెట్టుకోను -
‘దారుణంగా కొట్టాడు.. సాయం చేయండి ప్లీజ్’
షార్జా: భర్త వేధింపులను భరించలేని ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా తన మనో వేదనను పంచుకుంది. భర్త రోజూ వేధిస్తున్నాడని, తనకు సహాయం కావాలంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్టు చేసింది. వెంటనే ఈ విషయంపై స్పందించిన పోలీసులు బుధవారం సదరు మహిళ భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన యూఏఈలోని షార్జాలో చోటుచేసుకుంది. వివరాలు.. భారత్ చెందిన జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళకు మహ్మద్ ఖిజార్ ఉల్లా(47) అనే వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగరీత్యా షార్జాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యామని, తనపై హింసాత్మకంగా దాడి చేస్తున్నాడని నవంబర్ 12న ఓ వీడియోను ట్వీట్ చేసింది. అంతేగాక తమ పాస్పోర్టులను, బంగారాన్ని లాక్కొన్ని చిత్ర హింసలు పెడుతున్నాడని ఆమె వాపోయింది. భర్త నుంచి తనను, పిల్లలను రక్షించి సొంత ఊరు అయిన బెంగుళూరుకు పంపాలని అభ్యర్థించింది. తనకు ఇక్కడ(షార్జా)లో తెలిసిన వారు ఎవరూ లేరని పోలీసులను వేడుకుంది. ఇక దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ ఖిజార్ ఉల్లాను విచారిస్తున్నారు. -
షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు
గల్ఫ్ : షార్జాలో ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షార్జాలోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాల్లో కాన్సుల్ జనరల్ విపుల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం జాతీయ కన్వీనర్ భూపేందర్, ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్, సభ్యులు రమేష్, మహేందర్రెడ్డి, బాలకిషన్, గిరీష్ పంత్, విజయ్, ఐపీఎఫ్ అల్ ఎమిరేట్స్ సభ్యులు, ఇండియన్ కమిటీ సభ్యులు, ఇండియన్ అసోసియేషన్ షార్జా సభ్యులు, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
విమానంలోనే ప్రాణాలొదిలిన వ్యక్తి
తిరువనంతపురం : ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మార్గమధ్యలోనే ప్రాణాలొదిలాడు. తిరువనంతపురం-షార్జా ఎయిరిండియా విమానంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉందనీ అధికారులు తెలిపారు. ఈ విషాదం కారణంగా విమానం ఆలస్యంగా షార్జాకు బయలు దేరింది. తిరువంతనపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.24 నిమిషాలకు విమానం బయలుదేరింది. ఇంతలో ఒక ప్రయాణికుడు అనారోగ్యానికి గురికావడంతో వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. కానీ అప్పటికే సదరు ప్రయాణీకుడు కన్నుమూశాడని వైద్యులు ధృవీకరించారు. ప్యాసింజర్ వివరాలను గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ఎయిర్లైన్స్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎయిరిండియా విమానం 967 తిరువనంతపురం ప్రయాణీకులలో ఒకరు జబ్బుపడి మరణించంతో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనుంజయ్ కుమార్ తెలిపారు. అతనికి సంబంధించిన వస్తువులను సిబ్బందికి అందజేసామన్నారు. అయితే ప్రయాణికుడి ఆకస్మిక మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. -
లైవ్లో ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబాయ్: యూఏఈలోని షార్జాలో సోషల్ మీడియా లైవ్లో ఆత్మహత్యకు యత్నించి న భారత యువతిని ఆ దేశ పోలీసులు సకాలంలో అడ్డుకుని ప్రాణాల ను కాపాడారు. సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన తన చిత్రానికి ఎక్కువగా వ్యతిరేక స్పందనలు రావడంతో మనస్తాపం చెందిన యువతి బలవ న్మరణానికి యత్నించిందని పోలీసులు తెలిపారు. షార్జాలోని ఏ1 నహదా ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో సోషల్ మీడియాలో వీడియో లైవ్ పెట్టి ఆత్మహత్యకు సిద్ధం కాగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటి వద్దకు చేరుకుని తలుపు తట్టగా...ఆ యువతి తండ్రి తలుపు తీశాడు. పోలీసులు కన్పించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి ఆ యువతిని ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఆమెకు వైద్యులతో కౌన్సిలింగ్ ఇప్పించారు. -
మేకప్ తీశాక గుర్తుపట్టలేక విడాకులు...
అరబ్: కొత్తగా పెళ్లైన దంపతులు ఎంజాయ్ చేద్దామని షార్జాలోని అల్మాంజర్ బీచ్కు వెళ్లారు. బీచ్లో దిగి బయటకు వచ్చాక మేకప్ పోవడంతో భర్త తన భార్యను గుర్తు పట్టలేకపోయాడు. మేకప్తో తనను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదంటూ విడాకులు కోరాడు. ఈ వింత సంఘటన యూఏఈలో వెలుగు చూసింది. 28 సంవత్సరాల వయసున్న ఆ మహిళ డాక్టర్. అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టును కలిసి ఈ విషయం గురించి ప్రస్తావించారు. మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ విషయాన్ని గురించిన సమాచారాన్ని గల్ఫ్న్యూస్కు వెల్లడించారు. పెళ్లికి ముందు జరిగిన పలు సర్జరీలతో పాటు, కంటి చుట్టూ వేసుకున్న మేకప్ విషయాన్ని కూడా అతడి వద్ద దాచిందని ఆ సైకాలజిస్ట్ వెల్లడించారు. దీంతో పెళ్లికొడుకు విడాకులు కోరాడని, చివరకు ఆ మహిళ ముందుకు వచ్చి నిజం చెబుతానని ప్రయత్నించినా అతడిని ఒప్పించలేకపోయామని అన్నారు. వారికి పెళ్లయి ఆరు నెలలు కావడం గమనార్హం. -
షార్జాలో మరో అద్భుత నిర్మాణం
షార్జా : అరుదైన నిర్మాణాలకు ఖ్యాతిగాంచిన యూఏఈ మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దుబాయ్ తీరంలో ‘పామ్ ఐలాండ్’ పేరుతో నిర్మించిన దీవి.. ప్రపంచ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తున్నదో తెలిసిందే. దాదాపు అదే తరహాలో ‘సన్ ఐలాండ్’ పేరుతో సముద్ర భాగంలో చిన్నచిన్న ఎనిమిది ద్వీపాలను కలుపుతూ ఏకంగా నగరాన్నే నిర్మించ తలపెట్టింది. మొదటి విడతలో ఖరీదైన 231 విల్లాలతో నిర్మిస్తున్న ఈ వాటర్ ఫ్రంట్ సిటీకి సన్ ఐలాండ్ గా నామకరణం చేసింది. తాజాగా ఈ సన్ ఐలాండ్ నమునా చిత్రాన్ని విడుదల చేశారు దీని డెవలపర్లు. మొదటి దశలో ఖరీదైన 231 విల్లాలో కొన్ని మూడు, నాలుగు బెడ్రూంలతో, మరికొన్ని ఐదు, ఆరు బెడ్రూంలతో నిర్మించనున్నారు. 2019 చివరి నాటికి ఈ వాటర్ ఫ్రంట్ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే కెంపిన్స్కీ, డ్యూసిట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో ఆపరేటర్లుగా చేసేందుకు సంతకాలు చేశాయి. విల్లాల్లో వాణిజ్య యూనిట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్కు, హోటళ్ళు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును నిర్మించే ప్రదేశం హమ్రియయా జోన్ కిందికి వస్తుంది. 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందట. ఈ వాటర్ ఫ్రంట్ సిటీ ద్వారా ప్రక్కనే ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ఎమిరేట్స్ వాసులకు వినోదం, విశ్రాంతికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఎమిరేట్స్ను ఆకర్షించే నీటి టాక్సీలను అందించే దుబాయ్ ఆర్టీఏతో డెవలపర్లు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని తెలిసింది. -
రెండోసారి ప్రపంచ విజేతగా టీమిండియా
-
టూరిస్ట్ వీసాతో ఏజెంట్ మోసం
పశ్చిమగోదావరి, తణుకు : ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్ట్ వీసాపై షార్జాకు పంపిన ఏజెంట్ తనను మోసం చేశాడంటూ ఒక బాధితుడు వాపోయాడు. కుంచనపల్లి గ్రామానికి చెందిన పృథ్వి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అక్కడి నుంచి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తణుకు పట్టణానికి చెందిన రాయల్ ట్రావెల్స్ యజమాని నర్సింహరాజు ద్వారా తాను షార్జా వచ్చి మోసపోయానని చెబుతున్నారు. ఈ మేరకు సంబంధిత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వద్ద రూ.80 వేలు తీసుకుని ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఉందని గతేడాది నవంబర్ 15న షార్జా వచ్చానని చెప్పాడు. షార్జాలో ఖాన్ అనే ఏజెంట్ తనను హెల్పర్గా పనిచేయాలని చెప్పాడన్నారు. అన్ని పనులు చేయాలని చెప్పడంతో పాటు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. టూరిస్ట్ వీసా గడువు తీరిపోవడంతో డబ్బులు కట్టమంటున్నారని చెబుతున్నాడు. దీనిపై స్పందించిన తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి రాయల్ ట్రావెల్స్ యజమాని నర్సింహరాజును స్టేషన్కు పిలిపించి విచారించినట్టు చెప్పారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు సీఐ వివరించారు. -
ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా
దుబాయి: ప్రతిష్టాత్మక ప్రపంచ పుస్తక రాజధాని–2019 టైటిల్కు షార్జాను ఎంపిక చేసినట్లు యూనెస్కో ప్రకటించింది. స్థానిక, మతపరమైన ముద్రణా సంస్థలకు సహాయం చేయడంతో పాటు ప్రజలందరికీ పుస్తకాలను అందుబాటులో ఉండేలా చర్యలకు గాను షార్జాను ఎంపిక చేశామని యూనెస్కో తెలిపింది. దీనిపై ఎమిరెట్స్ పబ్లికేషన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షైకా అల్ క్యాసిమి మాట్లాడుతూ ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉందని, నాలుగు దశాబ్దాల క్రితం షేక్ మహ్మమద్ అల్ క్యాసిమి చేసిన కృషికి ఇది ఫలితమని వ్యాఖ్యానించారు. షార్జా చిల్డ్రన్ రీడింగ్ ఫెస్టివల్, ఉచిత హోమ్ లైబ్రరీలు ఏర్పాటు వంటి కార్యక్రమాలను షార్జా వార్షిక సాంస్కృతిక క్యాలెండర్ పేరుతో నిర్వహిస్తుంది. 2001 నుంచి వరల్డ్ బుక్ క్యాపిటల్ పేరుతో యూనెస్కో టైటిల్ను ప్రకటిస్తుంది. 2003లో ఢిల్లీ ఈ టైటిల్కు ఎంపికైంది. -
తొలి ఓవర్లోనే పాక్ కు ఎదురుదెబ్బ!
షార్జా: వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు షాక్ తగిలింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో పాకిస్తాన్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన గాబ్రియెల్ రెండో బంతికి అజహర్ అలీ(0)ని, నాలుగో బంతికి అసద్ షఫీఖ్ ను డకౌట్ గా పెవిలియిన్ బాట పట్టించాడు. బ్రాత్ వైట్ క్యాచ్ పట్టడంతో అజహర్ ఔట్ కాగా, అసద్ మాత్రం వికెట్లు ముందు అడ్డంగా దొరికిపోయాడు. సీమర్లకు అనుకూలించే పిచ్ పై విండీస్ బౌలర్ మంచి ఫలితాలను రాబట్టాడు. 145కి.మీ వేగంతో బంతులు విసురుతూ పాక్ బ్యాట్స్ మన్లను ఇబ్బంది పెడుతున్నాడు. మూడో టెస్టులో బౌలింగ్ విభాగంలో పట్టు సాధించేందుకు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కొన్ని మార్పులు చేసింది. వహబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్ లను తప్పించింది. రహత్ అలీ, సోహైల్ ఖాన్ లకు అవకాశం ఇచ్చింది. -
ప్రయాణికుల కోసం పుస్తక భాండాగారం!
టీవీలు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేనపుడు యువతీ యువకులకు పుస్తక పఠనమే అలవాటుగా ఉండేది. సాహిత్య సామాజిక రంగాలకు చెందిన పుస్తకాలు వారి చేతుల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి మచ్చుకు కూడ కనిపించడం లేదు. పుస్తకాల స్థానాన్ని సెల్ ఫోన్లు, మాధ్యమాలు ఆక్రమించేశాయి. పుస్తక పఠనం వ్యక్తుల్లో మానసిక వికాసాన్ని కలిగిస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారు లోకజ్ఞానంలోనే కాక, అనేక రకాల సామర్థ్యాలను, ప్రతిభను కలిగి ఉన్నట్లు పరిశోధకులు సైతం గుర్తించారు. అందుకే ప్రయాణీకుల ఖాళీ సమయం వృధా కాకుండా పుస్తక పఠనానికి వినియోగించుకునేందుకు వీలుగా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల ఆసక్తికి అనుగుణంగా, వారి వయసును, ఇష్టాన్నిబట్టి చదువుకునేందుకు వీలుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం ఓ పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు వారి ఖాళీ సమయంలో తమకిష్టమైన పుస్తకాలు, మ్యాగ్జిన్లు చదువుకునేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లోని మెయిన్ టర్మినల్ లో రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016 ను జరుపుకోవడంతోపాటు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణీకులకోసం ఈ కొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ జాతీయులు, నివాసితుల్లో చదివే సంస్కృతిని పెంపొందించాలన్నదే లక్ష్యంగా విమానాశ్రయాల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ చొరవ చూపించింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ మంత్రిత్వ శాఖ మార్గదర్వకత్వంలో ప్రయాణీకులకు మంచి అనుభవాన్ని అందించేందుకు ఈ రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్ అల్ నయాన్ తెలిపారు. విమానాశ్రయంలో ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, వినియోగదారులు పుస్తక పఠనంతో తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కొత్త అనుభవాన్నిపొందేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా అనేక ప్రచురణలను అక్కడ అందుబాటులో ఉంచినట్లు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయ అథారిటీ ఛైర్మన్ అలీ సేలం అల్ మడ్ఫా తెలిపారు. -
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: షార్జా నుండి కోయంబత్తూరు వస్తున్న ఎయిర్ అరేబియా విమానానికి సోమవారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పైలెట్ అప్రమత్తతో వ్యవహరించటంతో ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఈరోజు తెల్లవారుఝామున ఈ ఘటన చోసుకుంది. వంద మంది ప్రయాణీకులతో షార్జా నుంచి వస్తున్న విమానానికి అకస్మాత్తుగా ఓ పక్షి అడ్డుగా వచ్చింది. విమానానికి బలంగా వచ్చి తాకింది. ఒక్కసారి విమానం కుదుపుకు గురవటంతో... అప్రమత్తమైన పైలట్ చాకచ్యంగా విమానాన్ని కిందికి దించారు. దీంతో ప్రయాణీకులందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మరమ్మత్తు కార్యక్రమాల తరువాత విమానం తిరిగి షార్జాకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. షార్జా వెళ్లడానికి ఎదురు చూస్తున్న సుమారు 160 మంది ప్రయాణికులకు ఎయిర్ పోర్టు అధికారులు... హోటళ్లలో తగిన ఏర్పాట్లు చేశారు. -
యూఏఈలో భారతీయుడి ఆత్మహత్య
అబుదాబీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లో భారతీయ కార్మిడొకరు(29) ఆత్మహత్య చేసుకున్నాడు. షార్జాలోని అల్ నహద్దాలోని తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడు రూమ్మేట్స్ విధులు ముగించుకుని సాయంత్రం గదికి వచ్చి సరికి అతడు సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు బంధువులు, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
నా కొడుకు దగ్గరికి తోల్కపోండి
శరాది ఈమె పేరు ధరూరి లక్ష్మి. ఊరు కరీంనగర్జిల్లా రాయికల్మండలం కొత్తపేట. షార్జా ఈమెకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది! లక్ష్మికి ముగ్గురు కొడుకులు లక్ష్మణ్, బుచ్చన్న, లింగం. కూలితోనే కూడు దొరికే పేద దళిత కుటుంబం. ఎన్ని రోజులు ఈ కూలినాలి చేస్తాం.. దోస్తుల్లాగే తానూ గల్ఫ్కి పోవాలనుకున్నాడు బుచ్చన్న. అప్పు చేసి 70 వేలు కూడబెట్టి కొడుకు చేతికిచ్చారు తల్లిదండ్రులు. షార్జా వెళ్లాడు బుచ్చన్న. భవన నిర్మాణ పనికి కుదిరాడు. మూడేళ్లు బాగానే గడిచాయి. ఇంకో వారం పదిరోజుల్లో ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతాడనగా జరిగిన ఓ దుర్ఘటన బుచ్చన్నను దోషిని చేసింది! షార్జాలో బుచ్చన్న ఉంటున్న గదిలోకి కొత్తగా దిగాడు నిజామాబాద్జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన గోవర్థన్. వారంరోజులు గడిచాయి. ఏ విషయం మీదో కాని ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటామాటా పెరిగి చేయి చేసుకునేదాకా వెళ్లింది. ఆవేశంతో బుచ్చన్న సత్తయ్యను తోశాడు. సత్తయ్య తల గది గోడకు కొట్టుకుంది. క్షణాల్లో ప్రాణం పోయింది. అది మర్డర్గా నమోదైంది. నేరస్థుడిగా బుచ్చన్న షార్జాజైల్లో ఖైదీ అయ్యాడు. అక్కడి షరియత్ లా అతనికి మరణశిక్ష విధించింది. ఇది 2001 నాటి సంగతి! జీవితఖైదు: విషయం తెలిసిన బుచ్చన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏదో ఇన్ని డబ్బులు వెనకేసుకొని వస్తాడనుకుంటే ప్రాణాలనే పోగొట్టుకుంటున్నాడని. బుచ్చన్న కేసులో మైగ్రెంట్స్ కౌన్సిల్ ఇండియా కూడా స్పందించి అక్కడి న్యాయస్థానానికి విజ్ఞాపన పంపింది. ఆ వినతికి స్పందించిన షార్జాన్యాయస్థానం బుచ్చన్న మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. బుచ్చన్న నేటికి పదమూడేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. ఇప్పుడతని వయసు 44 ఏళ్లు. దేశంకాని దేశంలో.. నా అనే బంధంలేని బందిఖానాలో మగ్గుతున్న బుచ్చన్న మానసికంగా కుంగిపోయాడు. అది పక్షవాతం రూపంలో శరీరాన్ని అటాక్ చేసింది 2011 సంవత్సరంలో! నడుము నుంచి కింది భాగం అచేతనమైంది. కూర్చోలేడు.. కదలలేడు! బెంగతో తండ్రి... ఏళ్లకు ఏళ్లు జైల్లో మగ్గుతున్న కొడుకు కోసం బెంగటిల్లారు నర్సయ్య, లక్ష్మి. కొడుకు నడుము పడిపోయిందని తెలుసుకొని నర్సయ్య హతాశుడయ్యాడు. ఇంక కొడుకుని చూసుకోలేనేమో అని దిగులుతో ప్రాణాలే వదిలాడు. ‘కనీసం నేను చచ్చిపోయేలోపన్నా నా కొడుకుని చూపించుండ్రి సారూ’ అని ప్రాధేయపడుతోంది లక్ష్మి. ‘నా కొడుకుని ఇక్కడికి తెచ్చుడు మీతో అయితలేనట్టుంది. కనీసం నన్ను అయినా షార్జాకి తోల్కపొండ్రి. నా కొడుకుని చూస్కుంట’ అని కన్నీళ్లు పెడుతోంది. ఈ తల్లి మనసును అర్థం చేసుకునేదెవరు? ఆమెకు కొడుకును చూపించేదెవరు? -
బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిర్పోర్ట్ అధికారి అరెస్టు
ముంబై: మూడు వేర్వేరు బంగారం స్మగ్లింగ్ కేసుల్లో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ అధికారి సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సుమారు రూ.1.16 లక్షల విలువైన బంగారాన్ని వీరినుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. కస్టమ్స్ కమిషనర్ ఏపీఎస్ సూరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షార్జా నుంచి వచ్చిన షహబాజ్ ఖాన్ రూ.39.58 లక్షల విలువైన 1.62 కేజీల బరువున్న 14 బంగారం కడ్డీలను శుక్రవారం తన వెంట తీసుకువచ్చాడు. సదరు బంగారాన్ని అతడు ఏరోబ్రిడ్జి వద్ద జగదీష్ బాబుకు అందజేశాడు. అనంతరం ఆ కడ్డీలను ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్న షేక్ మొహిసిన్కు బాబు అందజేస్తుండగా కస్టమ్స్ అధికారులు వలపన్ని ముగ్గురినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సూరి మాట్లాడుతూ.. గత కొంతకాలంగా జగదీష్ బాబు బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్లకు సహాయపడుతున్నాడని తమకు అందిన సమాచారం మేరకు అతడిపై నిఘా పెట్టామన్నారు. విమానాశ్రయం నుంచి అక్రమ బంగారాన్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్లి సదరు గ్యాంగ్కు అందజేసినందుకుగాను బాబుకు కేజీ బంగారానికి రూ.30 వేలు కమిషన్ ముడుతుందని ఆయన చెప్పారు. గత ఐదు నెలల కాలంలో బాబు ఇలా సుమారు 8,9 సార్లు దొంగ బంగారాన్ని విమానాశ్రయం నుంచి బయటకు క్షేమంగా బయటకు తరలించాడని సూరి చెప్పారు. అలాగే మరో కేసులో దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన మహ్మద్ చెర్కల మూసా అనే ప్రయాణికుడి వద్ద శుక్రవారం రెండు కిలోల బరువైన దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సూరి వివరించారు. దాని విలువ రూ.48.5 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. మూడో కేసులో.. అబుదాబి నుంచి గురువారం ముంబై చేరుకున్న నదియా ముబిన్ బాగ్దాది నుంచి సుమారు రూ.28.5 లక్షల విలువైన 10 బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
హారికకు మూడో స్థానం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని సంపాదించింది. శనివారం ముగిసిన ఈ 11 రౌండ్ల టోర్నమెంట్లో హారిక మొత్తం ఆరున్నర పాయింట్లు సాధించింది. చివరి రౌండ్లో హారిక 83 ఎత్తుల్లో బచిమెగ్ తువ్షిన్తగ్స్ (మంగోలియా)పై గెలిచింది. హారికతోపాటు బచిమెగ్, అనా ఉషెనినా (ఉక్రెయిన్), జుయ్ జావో (చైనా) ఆరున్నర పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా... హారికకు మూడో స్థానం, జుయ్ జావోకు నాలుగో స్థానం, ఉషెనినాకు ఐదో స్థానం, బచిమెగ్కు ఆరో స్థానం దక్కాయి. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ఐదున్నర పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి రౌండ్లో హంపి 38 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది. 8.5 పాయింట్లతో జూ వెన్జున్, హూ ఇఫాన్ (చైనా) సమవుజ్జీలుగా నిలువగా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జూ వెన్జున్కు టైటిల్ లభించింది. హూ ఇఫాన్ రన్నరప్గా నిలిచింది. -
హారిక విజయం... హంపి గేమ్ డ్రా
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయం నమోదు చేయగా... కోనేరు హంపి ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. శనివారం జరిగిన పదో రౌండ్లో నల్లపావులతో ఆడిన హారిక 89 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది. వెన్జున్ జూ (చైనా)తో జరిగిన గేమ్ను హంపి 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక ఖాతాలో 5.5 పాయింట్లు; హంపి ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. శనివారం జరిగే చివరిదైన 11వ రౌండ్లో బాచిమెగ్ (మంగోలియా)తో హారిక; ఎలీనా డానిలియన్తో హంపి తలపడతారు. -
హంపికి రెండో విజయం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి రెండో విజయం సాధించింది. తాతియానా కొసింత్సెవా (రష్యా)తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్లో హంపి 60 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హంపి ఖాతాలో మూడు, హారిక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో అనా ఉషెనినాతో హంపి; చెన్ జూ (ఖతార్)తో హారిక తలపడతారు. -
షార్జాలో భారత కార్మికుడి ఆత్మహత్య
దుబాయ్: యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో పెట్రోకెమికల్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ కార్మికుడొకరు ఆత్మహత్య చేసుకున్నాడు. పనిస్థలంలోనే ఉరేసుకుని అతడు చనిపోయాడని పోలీసులు తెలిపినట్టు గల్ప్ న్యూస్ తెలిపింది. మృతుడి పేరు కేఎల్(32)గా మాత్రమే చెబుతున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో అతడు ఉరేసుకున్నాడు. అతడిని రక్షించేందుకు తోటి కార్మికుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. డిప్రెసిన్ కారణంగానే అతడు ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. -
13వ అంతస్థు నుంచి పడి ఏడేళ్ల ఎన్నారై బాలుడి మృతి
షార్జాలో విషాదకర సంఘన చోటుచేసుకుంది. అక్కడి తమ అపార్టుమెంటులోని 13వ అంతస్థు బాల్కనీ లోంచి కింద పడిపోయి ఏడేళ్ల భారత సంతతి బాలుడు మరణించాడు. దాంతో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఆడుకోవాల్సిన చిన్న పిల్లాడు బాల్కనీలోకి వెళ్లి, అంత పైకి ఎలా ఎక్కాడని, అంత జరుగుతున్న ఎందుకు గమనించలేకపోయారని పోలీసులు వాళ్లను ప్రశ్నించారు. దుబాయ్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతానికి పోలీసులకు ఓప్రత్యక్ష సాక్షి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బాలుడి మృతదేహాన్ని అల్ కువాయిట్ ఆస్పత్రికి తరలించి అక్కడినుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. షార్జా పోలీసులు ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు ఇళ్లలో తమ పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దని, కనీసం ఇంట్లో పనివాళ్లయినా వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని షార్జా పోలీసు అధికారి కల్నల్ సుల్తాన్ అల్ ఖయాల్ తెలిపారు. ఇటీవలి కాలంలో యూఏఈలో పలువురు పిల్లలు ఇలా కిందపడి మరణించారు. -
80 రోజులపాటు దుబాయ్కు విమానాల్లేవు!
న్యూఢిల్లీ: అభివద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ రోజు నుంచి 80 రోజుల పాటు దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని రెండు రన్వేలను అభివద్ధి చేసే నిమిత్తం 80 రోజుల పాటు మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా దుబాయ్కు వెళ్లే విమాన సర్వీసుల సంఖ్య 26 శాతానికి తగ్గిపోనున్నాయి.ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్, జెట్ ఎయిర్వేస్ తదితర సంస్థలు దుబాయ్కు నడిపే తమ విమాన సర్వీసులను షార్జా ఎయిర్పోర్టుకు మార్చాయి. మరికొన్ని సర్వీసుల సమయాలను మార్పు చేశాయి. ఇండిగో, దుబాయ్ ఎమీరేట్స్ సంస్థలు దుబాయ్ విమాన సర్వీసులను కుదించాయి. మరికొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేశాయి. ఎయిర్ఇండియాకు చెందిన చెన్నై-దుబాయ్, విశాఖపట్నం-హైదరాబాద్-దుబాయ్ విమానాలను షార్జాకు మార్చారు. ప్రస్తుతం నడిచే తమ విమాన సర్వీసుల సమయాల గురించి ప్రయాణికులు తమని అడిగి తెలుసుకోవాలని ఇండిగో అధికార ప్రతినిధి చెప్పారు. ఇతర విమాన సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. -
హరికృష్ణ, హారికలకు రజతాలు
షార్జా: ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక ఆకట్టుకున్నారు. శనివారం జరిగిన ఈ టోర్నీ ఓపెన్ విభాగంలో హరికృష్ణకు రజత పతకం దక్కగా... మహిళల విభాగంలో హారిక రజతం గెలుచుకుంది. మొత్తం 9 రౌండ్ల ద్వారా 7 పాయింట్లు సాధించిన హరికృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. యు యాంగ్యీ (చైనా)కి స్వర్ణం లభించింది. ఏడో రౌండ్ ముగిసే సరికి అగ్రస్థానంలో కొనసాగిన ఏడో సీడ్ హరి, ఎనిమిదో రౌండ్లో గుయెన్ సన్ (వియత్నాం) చేతిలో పరాజయం పాలై వెనుకబడ్డాడు. అయితే 9వ రౌండ్లో భారత్కే చెందిన విదిత్ గుజరాతీని ఓడించడంతో హరికి రెండో స్థానం దక్కింది. మహిళల విభాగంలో 9 రౌండ్ల అనంతరం 6.5 పాయింట్లు సాధించిన హారిక రజతం దక్కించుకుంది. ఆఖరి రౌండ్లో హోంగ్ ట్రామ్ (వియత్నాం)పై విజయం సాధించడంతో హారికకు రెండో స్థానం ఖాయమైంది. టాన్ జోంగ్యి (చైనా- 8 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, 6.5 పాయింట్లతో హారికతో సమంగా నిలిచిన అబ్దుమ్ అలిక్ (కజకిస్థాన్)కు కాంస్యం లభించింది. లలిత్కు తొలి గెలుపు మరోవైపు ఆదివారం జరిగిన క్లాసిక్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి విజయం సాధించాడు. అహ్మద్ నజర్తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన లలిత్ 40 ఎత్తుల్లో గెలిచాడు. ఈ టోర్నీలో లలిత్కిదే తొలి గెలుపు. అంతకుముందు తొలి రెండు రౌండ్లను ‘డ్రా’ చేసుకున్న అతను మూడో రౌండ్లో ఓడిపోయాడు. నాలుగో రౌండ్ తర్వాత లలిత్ రెండు పాయింట్లతో మరో 15 మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. -
భారత్కు ఐదో స్థానం
అండర్-19 ప్రపంచకప్ షార్జా : డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్-19 ప్రపంచకప్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధిం చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 8 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అంకుశ్ బైన్స్ (74), సంజూ శామ్సన్ (67), శ్రేయాస్ అయ్యర్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 294 పరుగులు మాత్రమే చేయగలిగింది.తేజ్నారాయణ్ చందర్పాల్ సెంచరీ (136 బంతుల్లో 112, 8 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించినా.. కోల్మన్ (45), పూరన్ (54) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. భారత్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఈ టోర్నీలో ఆరో స్థానంలో నిలిచింది. -
కోర్టు జోక్యంతో ఊరట
‘షార్జా’లో కంపెనీ బాధితుల క్వార్టర్స్లో సౌకర్యాల పునరుద్ధరణ బకాయిల చెల్లింపునకు గడువు కోరిన కంపెనీ పక్షం రోజుల్లో స్వగ్రామాలకు రానున్న కార్మికులు మోర్తాడ్, న్యూస్లైన్ : షార్జాలోని ఆల్ కరమ్ జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేసిన కార్మికులకు అక్కడి హైకోర్టు బాసటగా నిలిచింది. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో కార్మికుల కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్మికులు శనివారం ‘న్యూస్లైన్’కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. అసలేం జరిగింది ఆల్ కరమ్ జనరల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప నిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదు. దీంతో అక్కడ ఉండడం కష్టంగా మారడంతో చాలా మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 25 మంది కార్మికులు అక్కడే ఉండిపోయారు. కంపెనీ వైఖరిపై అక్కడి లేబర్, హైకోర్టులను ఆశ్రయించారు. కార్మికులకు అనుకూలంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. కంగుతిన్న కంపెనీ కార్మికులపై వేధింపులకు దిగింది. క్వార్టర్లకు విద్యుత్, నీరు, గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది. దీంతో కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. కార్మికులు ఇండియన్ ఎంబసీ అధికారులను కలిసి హైకోర్టు ఇచ్చిన తీర్పును కంపెనీ అమలు చేసేలా చూడాలని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో చెత్త ఏరి, విక్రయించి పొట్టపోసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మళ్లీ కోర్టుకు.. కార్మికులు వారం క్రితం మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన తీర్పును కంపెనీ అమలు చేసేలా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు నాలుగు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. కార్మికులకు వేతన బకాయిలను చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. అప్పటివరకు క్వార్టర్లలోనే ఉంటారని, వాటి కి సౌకర్యాలు పునరుద్ధరించాలని పేర్కొంది. దీంతో కంపెనీ స్పందించి క్వార్టర్లకు సౌకర్యాలను పునరుద్ధరించింది. వేతనాల బకాయి లు చెల్లించడానికి గడువు కావాలని కంపెనీ హైకోర్టును కోరింది. 10 రోజుల్లో బకాయిల ను కోర్టులో డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బకాయిలను కంపెనీ డిపాజి ట్ చేయకపోతే కంపెనీ యజమానిని అరెస్టు చేసే అవకాశం ఉంటుందని కార్మికులు తెలి పారు. అందువల్ల గడువులోగా వేతనాలు చెల్లించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వేతనాలు చేతికి అందగానే స్వదేశానికి పయనమవుతాయని తెలిపారు. భారత రాయబార కార్యాలయం అధికారులు తమపై కనికరం చూపకపోయినా అక్కడి హైకోర్టు బాసటగా నిలచిందని పేర్కొన్నారు. -
పాకిస్థాన్ సంచలనం
షార్జా: దాదాపు నెల రోజుల క్రితం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన జొహన్నెస్బర్గ్ టెస్టు అనూహ్య మలుపులతో ఉత్కంఠ రేపుతూ క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరిగిన మూడో టెస్టుకు కూడా అద్భుత ముగింపు లభించింది. గెలుపునకు ఏ మాత్రం అవకాశం లేని దశనుంచి పాకిస్థాన్ చెలరేగి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 302 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ కేవలం 57.3 ఓవర్లలోనే అందుకుంది. 5 వికెట్ల తేడాతో లంకను ఓడించి సిరీస్ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ ఐదో రోజు సాధారణంగా బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉండే పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడిన పాక్కు ఈ అనూహ్య విజయం దక్కింది. అజహర్ అలీ (137 బంతుల్లో 103; 6 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ మిస్బావుల్ హక్ (72 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (46 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచారు. ప్రపంచ క్రికెట్లో 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాల్లో... ఈ మ్యాచ్లో పాక్ నమోదు చేసిన రన్రేట్ (5.25) అన్నింటికంటే ఎక్కువగా ఉండటం విశేషం. అజహర్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఏంజెలో మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. నెమ్మదించిన లంక... మ్యాచ్ చివరి రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి ఈ టెస్టు డ్రా కావడం దాదాపు ఖాయమనే పరిస్థితి ఉంది. 133/5 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలు పెట్టిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. ప్రసన్న జయవర్ధనే (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. రెహమాన్కు 4 వికెట్లు దక్కగా, అజ్మల్, తల్హా చెరో 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 87 పరుగుల ఆధిక్యం సాధించిన లంక పాక్ ముందు మిగిలిన 59 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. -
‘డ్రా’ దిశగా శ్రీలంక, పాక్ మూడో టెస్టు
షార్జా: పాకిస్థాన్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆదివారం నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 5 వికెట్లకు 133 పరుగులు చేసింది. మాథ్యూస్ (14 బ్యాటింగ్), ప్రసన్న జయవర్ధనే (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంక 220 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 291/6 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 109.1 ఓవర్లలో 341 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో జయవర్ధనే టెస్టుల్లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్గా అతను నిలిచాడు. -
పాక్ ఎదురీత
షార్జా: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ ఎదురీదుతోంది. అహ్మద్ షెహజాద్ (275 బంతుల్లో 147; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నా... మిగతా బ్యాట్స్మెన్ సహకారం అందించలేకపోయారు. దీంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్లో 95.3 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. మిస్బా (36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం పాక్ ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 19/0 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన పాక్ ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మన్జూర్ (125 బంతుల్లో 52; 4 ఫోర్లు), షెహజాద్ నిలకడగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్కు 114 పరుగులు జోడించారు. అయితే మన్జూర్, అజహర్ అలీ (8), యూనిస్ ఖాన్ (17) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పాక్ 189 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా, షెహజాద్ నాలుగో వికెట్కు 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో షెహజాద్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. హెరాత్ 3, ఎరంగా 2, పెరీరా ఒక్క వికెట్ తీశాడు. -
శ్రీలంక 428/9 డిక్లేర్డ్
షార్జా: పాకిస్థాన్తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. మాథ్యూస్ (256 బంతుల్లో 91; 5 ఫోర్లు, 1 సిక్సర్), దిల్రువానా పెరీరా (247 బంతుల్లో 95; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్ను 172 ఓవర్లలో 9 వికెట్లకు 428 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మన్జూర్ (14 బ్యాటింగ్), షెహజాద్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మిస్బాసేన ఇంకా 409 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 220/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన లంక రెండు సెషన్లపాటు అద్భుతంగా ఆడింది. మాథ్యూస్, పెరీరా ఏడో వికెట్కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. -
శ్రీలంక 220/5
షార్జా: శ్రీలంకతో గత టెస్టు పరాజయంనుంచి పాకిస్థాన్ కొంత మేరకు కోలుకుంది. జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను తొలి రోజు నిలువరించగలిగారు. ఫలితంగా ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో గురువారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి లంక తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. బ్యాటింగ్కు చాలా కష్టంగా మారిన నెమ్మదైన పిచ్పై సంగక్కర (52), మహేల జయవర్ధనే (47) మూడో వికెట్కు 60 పరుగులు జోడించి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ప్రస్తుతం ప్రసన్న జయవర్ధనే (28 బ్యాటింగ్), మాథ్యూస్ (24 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అజ్మల్కు 2 వికెట్లు దక్కాయి. పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్లో మూడు క్యాచ్లు జారవిడవడంతో పాటు అంపైర్ల సమీక్షా నిర్ణయాలు కూడా ఆ జట్టుకు వ్యతిరేకంగా రావడంతో లంక ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. మూడు టెస్టుల ఈ సిరీస్లో తొలి టెస్టు డ్రా కాగా, రెండో మ్యాచ్ నెగ్గిన లంక 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా...1999-2000 తర్వాత (బంగ్లా, జింబాబ్వేలను మినహాయిస్తే) విదేశాల్లో శ్రీలంకకు ఇదే తొలి సిరీస్ విజయమవుతుంది. -
‘ఆసియా’ గెలిచాం
స్థాయి ఏదైనా భారత యువ క్రికెటర్లు అద్బుత ప్రదర్శనతో దూసుకుపోతూ భవిష్యత్పై ఎలాంటి బెంగా వద్దంటూ భరోసా ఇస్తున్నారు. తాజాగా భారత యువ జట్టు (అండర్-19) ఆసియా కప్ గెలిచింది. రెండేళ్లక్రితం ఇదే టోర్నీలో పాకిస్థాన్తో ఫైనల్ను టై చేసుకుని సంయుక్త విజేతగా నిలిచిన భారత్... ఈ సారి మాత్రం స్ఫూర్తిదాయక ఆటతీరుతో దాయాదిని చిత్తు చేసి సింగిల్గా టైటిల్ గెలిచింది. త్వరలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. షార్జా: సీనియర్లకు సాధ్యం కానిది కుర్రాళ్లు చేసి చూపించారు...అవును, షార్జా మైదానంలో భారత సీనియర్ జట్టు నాలుగు ఫైనల్స్లో పాకిస్థాన్తో తలపడగా, ఒక్క సారి కూడా గెలుపు రుచి చూడలేకపోయింది. కానీ అండర్-19 జట్టు పాక్ను ఓడించి ఆసియా కప్ టైటిల్ నెగ్గింది. శనివారం ఇక్కడి షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత అండర్-19 జట్టు 40 పరుగుల తేడాతో పాకిస్థాన్ అండర్-19 టీమ్పై విజయం సాధించింది. అండర్-19 స్థాయిలో ఇది ఏడో ఆసియా కప్ కాగా, భారత్ విజేతగా నిలవడం రెండో సారి. 2012లో భారత్, పాక్ సంయుక్త విజేతలుగా నిలవగా... భారత్ సింగిల్గా టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. శనివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. సంజు సామ్సన్ (87 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ విజయ్ జోల్ (120 బంతుల్లో 100; 7 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్కు 180 పరుగులు జోడించడం విశేషం. అనంతరం పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 274 పరుగులు మాత్రమే చేయగలిగింది. కమ్రాన్ గులామ్ (89 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. కెప్టెన్ సమీ అస్లామ్ (96 బంతుల్లో 87; 10 ఫోర్లు) కూడా రాణించారు. హైదరాబాద్ బౌలర్ సీవీ మిలింద్, దీపక్ హుడా చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ హేర్వాడ్కర్ (12) తొందరగానే అవుటైనా, అంకుశ్ బైన్స్ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆ తర్వాత జోల్, సామ్సన్ కలిసి నిలకడగా ఆడారు. జోల్ జాగ్రత్తగా ఆడగా... సామ్సన్ భారీ షాట్లతో చెలరేగాడు. ముఖ్యంగా కరామత్ బౌలింగ్లోనే అతను మూడు సిక్సర్లు కొట్టగా, జోల్ మరో సిక్స్ బాదాడు. ఈ క్రమంలో 118 బంతుల్లో జోల్, 86 బంతుల్లో సామ్సన్ శతకాలు పూర్తి చేసుకున్నారు. అయితే తక్కువ వ్యవధిలోనే వీరిద్దరు వెనుదిరిగారు. తర్వాతి బ్యాట్స్మెన్ విఫలమవడంతో భారత్ 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. కమ్రాన్ సెంచరీ... ఓపెనర్ ఉమర్ (17)ను ఆరంభంలోనే అవుట్ చేసి మిలింద్ భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. గత రెండు మ్యాచుల్లో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన పాక్ కెప్టెన్ సమీ అస్లమ్ తన జోరును కొనసాగించాడు. 11 పరుగుల తేడాతో పాక్ 3 వికెట్లు కోల్పోయిన దశలో కమ్రాన్తో కలిసి ఐదో వికెట్కు 93 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. అయితే సమీని ఆమిర్ గనీ అవుట్ చేయడంతో మ్యాచ్పై భారత్కు పట్టు చిక్కింది. ఒంటరి పోరాటం చేసిన కమ్రాన్ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నా జట్టును గెలుపు దిశగా తీసుకు వెళ్లలేకపోయాడు. స్కోరు వివరాలు: భారత్ అండర్-19 ఇన్నింగ్స్: బైన్స్ (స్టంప్డ్) సైఫుల్లా (బి) కరామత్ 47; హేర్వాడ్కర్ (సి) ఉమేర్ (బి) జియావుల్ హఖ్ 12; జోల్ (సి) జఫర్ (బి) కరామత్ 100; సామ్సన్ (సి) ఉమేర్ (బి) జఫర్ 100; సర్ఫరాజ్ (రనౌట్) 5; హుడా (సి) సబ్-నిసార్ (బి) 13; భుయ్ (సి) సబ్-నిసార్ (బి) జఫర్ 6; గనీ (సి) జఫర్ (బి) జియావుల్ హఖ్ 5; కుల్దీప్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 23; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1-65; 2-85; 3-265; 4-286; 5-286; 6-297; 7-309; 8-311. బౌలింగ్: జియావుల్ హఖ్ 10-0-56-2; సల్మాన్ 5.5-0-49-0; జఫర్ 10-0-52-2; కరామత్ అలీ 10-0-78-2; కమ్రాన్ గులామ్ 10-0-46-1; ఉమేర్ 4-0-29-0; ఇమాముల్ హఖ్ 0.1-0-0-0. పాకిస్థాన్ అండర్-19 ఇన్నింగ్స్: సమీ అస్లమ్ (సి) అండ్ (బి) గనీ 87; ఉమేర్ (సి) అండ్ (బి) మిలింద్ 17; ఇమాముల్ హఖ్ (సి) ఖాన్ (బి) కుల్దీప్ 18; హసన్ రజా (స్టంప్డ్) బైన్స్ (బి) గనీ 1; సైఫుల్లా (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; కమ్రాన్ (నాటౌట్) 102; షకీల్ (సి) హేర్వాడ్కర్ (బి) కుల్దీప్ 8; జఫర్ (బి) మిలింద్ 18; కరామత్ (సి) ఖాన్ (బి) హుడా 2; జియావుల్ హఖ్ (సి) గనీ (బి) హుడా 5; సల్మాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1-39; 2-77; 3-84; 4-88; 5-181; 6-211; 7-246; 8-249; 9-269. బౌలింగ్: మిలింద్ 10-0-44-2; అవేశ్ ఖాన్ 10-1-55-0; హుడా 10-0-37-2; కుల్దీప్ 10-0-72-3; గనీ 7-0-39-2; సర్ఫరాజ్ ఖాన్ 3-0-24-0. ఈ విజయంలో మనోళ్లకూ భాగం ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు తమ ఆటతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్, ఆంధ్ర బ్యాట్స్మన్ రికీ భుయ్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. గత కొంత కాలంగా టీమిండియా అండర్-19 జట్టులో వీరిద్దరు సభ్యులుగా నిలకడగా రాణిస్తున్నారు. ఈ టోర్నీలో 4 వికెట్లు పడగొట్టిన మిలింద్, కీలకమైన ఫైనల్లో తొలి వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. టోర్నమెంట్లో రెండు అర్ధ సెంచరీలతో రికీ భుయ్ సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన సెమీస్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు ఇదే జట్టు రాబోయే అండర్-19 ప్రపంచకప్ కూడా ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14నుంచి మార్చి 1 వరకు యూఏఈలోనే ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై 2012లో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన హనుమ విహారి సభ్యుడిగా ఉన్నాడు. ఈ సారి మిలింద్, భుయ్ ఉంటారేమో! -
తొలి వన్డే దక్షిణాఫ్రికాదే
షార్జా: లక్ష్యం 184 పరుగులు... ఓ దశలో పాక్ స్కోరు 165/4... గెలవడానికి మరో 19 పరుగులు అవసరం... చేతిలో దాదాపు 9 ఓవర్లు ఉన్నాయి. ఇంకేముంది అందరూ మిస్బాసేన విజయం ఖాయమనుకున్నారు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. 17 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. దీంతో బుధవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో పాక్పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు 49.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. పార్నెల్ (56), మిల్లర్ (37) రాణించగా, స్మిత్ (20), డుమిని (20) ఓ మోస్తరుగా ఆడారు. అజ్మల్ 4, ఆఫ్రిది 3, తన్వీర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాక్ 46.3 ఓవర్లలో 182 పరుగులు చేసి ఓడింది. అహ్మద్ షెహజాద్ (58) టాప్ స్కోరర్. మిస్బా (31), హఫీజ్ (28) ఫర్వాలేదనిపించారు. షెహజాద్, మిస్బా రెండో వికెట్కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో ఏ ఒక్కరు క్రీజులో నిలబడలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్నెల్, తాహిర్ చెరో మూడు, మోర్నీ మోర్కెల్, సొట్సోబ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే నేడు (శుక్రవారం) జరుగుతుంది. -
వన్డే ప్రపంచకప్కు అఫ్ఘాన్
షార్జా: నిత్యం ఏదో ఒక చోట బాంబు దాడులు.. దీనికి తోడు తాలిబాన్ మత చాందసవాదుల దురాగతాలు.. ఇన్ని అడ్డంకుల మధ్య అఫ్ఘానిస్థాన్ దేశ క్రికెట్ జట్టు నిజంగా అద్భుతాన్నే సాధించింది. ప్రపంచ క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న ఈ జట్టు పట్టుదలతో పోరాడి ఏకంగా 2015 వన్డే ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండో ప్రపంచ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్లో శుక్రవారం కెన్యాతో జరిగిన మ్యాచ్లో అఫ్ఘాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత కెన్యా 43.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్ఘాన్ 20.5 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసి నెగ్గింది. దీంతో మొత్తం 14 మ్యాచ్ల్లో తొమ్మిది విజయాల ద్వారా 19 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 24 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన ఐర్లండ్.. ప్రపంచకప్కు ఇప్పటికే అర్హత సాధించింది. వడివడిగా ప్రయాణం కింది స్థాయి నుంచి అగ్రభాగానికి చేరుకునే క్రమంలో అఫ్ఘాన్ జట్టు పోరాట పటిమ అద్భుతం. 2008లో ఐసీసీ ప్రపంచ క్రికెట్ లీగ్లో అతి తక్కువ స్థాయి అయిన ఐదో డివిజన్లో పోటీ పడి నెగ్గింది. దీంతో 2011 ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీకి అర్హత సాధించింది. 2009లో తొలిసారిగా జట్టుకు వన్డే హోదా మంజూరైంది. 2010లో ఈ జట్టు చెప్పుకోదగ్గ ఫలితం సాధించింది. ప్రపంచ టి20 క్వాలిఫైలో ఐర్లాండ్ను ఓడించి విండీస్లో జరిగిన టి20 ప్రపంచకప్కు అర్హత సాధించింది. అక్కడ విఫలమైనా తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలిగింది. 2012 టి20 ప్రపంచకప్కూ అర్హత సాధించింది. ఈ జూన్లో అఫ్ఘానిస్థాన్ ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయ్యింది. -
షార్జాలో భారత యువతి అరెస్టు
* తల్లికి చెందిన రూ.5 కోట్ల బంగారంతో పారిపోవడానికి యత్నం * యువతితోపాటు పాక్కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసిన పోలీసులు దుబాయ్: తల్లికి చెందిన 20 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ భారత యువతిని, పాకిస్తాన్కు చెందిన ఆమె స్నేహితుడిని షార్జా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ కలిసి మరో దేశంలో స్థిరపడేందుకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో తేలింది. భారత్కు చెందిన ఓ మహిళ తన బంగారు ఆభరణాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అనుమతి పొందేందుకు షార్జా కస్టమ్స్ డిపార్ట్మెంట్కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె కుమార్తె (20) కారులోనే ఉంది. ఆ మహిళ తిరిగొచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో తన కుమార్తె కనిపించడంలేదని ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ యువతి కిడ్నాప్ కాలేదని, దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు నగలు తీసుకుని స్నేహితుడైన పాక్ జాతీయుడు మామ్ దగ్గరకు వెళ్లిపోయినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇద్దరూ కలిసి మరో దేశానికి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. విచారణలో ఇరువురూ నేరం అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.