శ్రీలంక 428/9 డిక్లేర్డ్ | srilanka made 428/9 declared | Sakshi
Sakshi News home page

శ్రీలంక 428/9 డిక్లేర్డ్

Published Sat, Jan 18 2014 1:18 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

srilanka made 428/9 declared

షార్జా: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. మాథ్యూస్ (256 బంతుల్లో 91; 5 ఫోర్లు, 1 సిక్సర్), దిల్రువానా పెరీరా (247 బంతుల్లో 95; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌ను 172 ఓవర్లలో 9 వికెట్లకు 428 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
 
 తర్వాత బ్యాటింగ్ చేసిన పాక్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మన్‌జూర్ (14 బ్యాటింగ్), షెహజాద్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మిస్బాసేన ఇంకా 409 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 220/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన లంక రెండు సెషన్లపాటు అద్భుతంగా ఆడింది. మాథ్యూస్, పెరీరా ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement