
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్గాష్టమి, విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే ఈ పండుగ తెలుగు రాష్ట్రాల ప్రజందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తివంతమైనదైనా అంతిమ విజయం మంచినే వర్తిస్తుందని తెలిపారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత.. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సుఖ శాంతులు, సిరి సంపదలు ప్రసాదించాలని ఆయన అభిలషించారు.
Comments
Please login to add a commentAdd a comment