ఇడుపులపాయలో వైఎస్కు ఘనంగా నివాళులు | YS Jagan mohan reddy pays homage to ysr on his birth anniversary | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయలో వైఎస్కు ఘనంగా నివాళులు

Published Tue, Jul 8 2014 8:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ఇడుపులపాయలో వైఎస్కు ఘనంగా నివాళులు - Sakshi

ఇడుపులపాయలో వైఎస్కు ఘనంగా నివాళులు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి, మహానేత సతీమణి వైఎస్ విజయమ్మ, రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సమీప బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్ స్మృతివనానికి చేరుకున్నారు. చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అక్కడకు వస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృత్యర్థం పార్టీ కార్యకర్తలు జిల్లాలోను, రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు చేపట్టారు. రోగులకు పండ్లు పంచిపెడుతున్నారు. పార్టీ కార్యాలయాల్లోనూ వైఎస్ జయంతి ఘనంగా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement