
స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న స్వాతంత్య్ర దిన వేడుకలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.