Independence celebrations
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించి స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెండా ఎగురవేశారు.తూర్పు నావికా దళంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ: తూర్పు నావికా దళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేవీ మార్చ్, నేవీ బెటాలియన్ బ్యాండ్ కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను నేవీ అధికారులు స్మరించుకున్నారు. న తూర్పు నావికా దళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశం మొత్తం నావికా దళంలో తూర్పు నావికా దళం చాలా కీలకమని రాజేష్ పెందర్కర్ అన్నారు.‘‘దేశ సేవ చేసే గొప్ప అవకాసం రావటం మన అదృష్టం. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి ఉండాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు దుసుకెళ్తున్నాం. క్రమశిక్షణ, పట్టుదల, విజయం నేవీ సొంతం. దేశ ప్రగతిలో నేవీ స్థానం కీలకం’’ అని రాజేష్ పెందర్కర్ చెప్పారు. -
ఆగస్టు 15: ఆమె... దేశంలో సగం ఎప్పుడు!?
స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది. ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు? నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి. 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న. స్త్రీల త్యాగం దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా? సురక్షితం కాని దేశం ‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు. స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు? స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. -
అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువల ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ భావిస్తోంది. అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు. ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్ మరి! -
కచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం
న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు. పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు. తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు. (చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్) -
అల్లు అర్జున్కి అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్కు నాయకత్వం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన అల్లు అర్జున్కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్కు ఆయన నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.దీనికి గ్రాండ్ మార్షల్గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'యే భారత్కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్తో ఉత్సాహపరిచాడు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లురన్కి అక్కడి మేయర్ ఆమమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు సహా పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. It was a pleasure meeting the Mayor of New York City . Very Sportive Gentleman. Thank You for the Honours Mr. Eric Adams . Thaggede Le ! @ericadamsfornyc @NYCMayorsOffice pic.twitter.com/LdMsGy4IE0 — Allu Arjun (@alluarjun) August 22, 2022 -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
పథకాలను కళ్లకు కట్టిన శకటాలు
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన విద్యార్థులు, సాధారణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కేరింతలు, నినాదాలతో చేతులు ఊపుతూ విద్యార్థులు, ప్రజలు సీఎంకు ప్రతిగా అభివాదం చేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం జగన్ స్వీకరించారు. రెండో బహుమతి సాధించిన విద్యాశాఖ శకటం అబ్బురపరిచిన కవాతు ఈ వేడుకల్లో సాయుధ దళాల కవాతు చూపరులను అబ్బురపరిచింది. ఆద్యంతం నూతన ఉత్తేజాన్ని నింపింది. పల్నాడు జిల్లా అడ్మిన్ ఏఎస్పీ గరికపాటి బిందుమాధవ్ సాయుధ దళాల కవాతుకు నేతృత్వం వహించారు. ఏపీఎస్సీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 5వ బెటాలియన్ (విజయనగరం), 11వ బెటాలియన్ (కడప), 6వ బెటాలియన్ (మంగళగిరి), ఎన్సీసీ బాలబాలికలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, భారత్ స్కౌట్స్–గైడ్స్, రెడ్క్రాస్ సొసైటీ, ఏపీ సైనిక్ వెల్ఫేర్ శాఖ కంటిన్జెంట్లు కవాతులో పాల్గొన్నాయి. గురుకుల పాఠశాలలకు చెందిన బాలబాలికల కంటిన్జెంట్ల కవాతు చూపరులను ఆకట్టుకుంది. అలాగే, వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లకు చెందిన కవాతు కూడా అలరించింది. ఆర్మ్డ్ విభాగం కవాతులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏపీఎస్పీ 5వ బెటాలియన్ మొదటి బహుమతిని, 2వ బెటాలియన్ ద్వితీయ బహుమతిని దక్కించుకున్నాయి. రెడ్క్రాస్ సొసైటీ మొదటి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటిన్జెంట్ రెండో బహుమతి దక్కించుకున్నాయి. వీరికి సీఎం బహుమతులు అందజేశారు. మూడో బహుమతి పొందిన గృహనిర్మాణ శకటం సచివాలయాల శకటానికి మొదటి బహుమతి.. ఇక సీఎం వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లుగా శకటాల ప్రదర్శన సాగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధికి.. రాష్ట్ర ప్రగతికి అద్దంపట్టాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు చెందిన ‘గడప గడపకు మన ప్రభుత్వం–ఇంటింటా సంక్షేమం’ శకటం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. విద్యాశాఖకు చెందిన మనబడి నాడు–నేడు శకటానికి రెండో బహుమతి, గృహ నిర్మాణ శాఖకు చెందిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు శకటానికి మూడో బహుమతి దక్కాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శకటాల శాఖాధిపతులు, అధికారులకు సీఎం బహుమతులు అందజేశారు. ► మొదటి బహుమతి అందుకున్న సచివాలయాల శకటం గడిచిన మూడేళ్లలో సచివాలయాల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. నెలనెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల గుమ్మం వద్దనే ఠంచన్గా వలంటీర్లు పింఛన్ల పంపిణీ, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవలు కళ్లకు కట్టాయి. ► విద్యాశాఖ శకటం నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలతో కార్పొరేట్ స్థాయి హంగులతో ముస్తాబై ప్రభుత్వ పాఠశాల నమూనాతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ► ఇక తృతీయ బహుమతి అందుకున్న గృహ నిర్మాణ శాఖ శకటం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు చేస్తున్న మేలును తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్న తీరును వివరించింది. ఈ వేడుకల్లో సీఎం సతీమణి భారతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ బి. శివశంకరరావు, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్రాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రవీంద్ర భారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
-
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్తో పాటు పాక్, అఫ్గాన్కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్కి ఈ ఆపరేషన్లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్లోని డెహ్రుడూన్లోని గన్హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
7 గంటలు.. 75 సార్లు..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కృషి ఉంటే సాధించనిది ఏదీ లేదని నిరూపించింది కరీంనగర్ జిల్లాకేంద్రంలోని విద్యానగర్కు చెందిన పండుగ అర్చన. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయగీతం జనగణమన ఐదు చరణాల్లో 7 గంటల్లో 75 సార్లు పాడింది. కరీంనగర్లోని ఓ హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించిన అర్చన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించింది. నగరానికి చెందిన పండుగ కీర్తి కుమార్, దేవపాలా కూతురు అర్చన. ఐదోతరగతి నుంచే జెండా పండుగల్లో జాతీయ గీతాన్ని ఆలపించేది. నాలుగు పీజీలు పూర్తిచేసిన అర్చన నగరంలోని ఓ ప్రయివేటు కళాశాల వైస్ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తోంది. అర్చనను సన్మానిస్తున్న సీపీ సత్యనారాయణ లాక్డౌన్ తెచ్చిన ఆలోచన చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు అధికంగా ఉన్న అర్చన 2020లో వచ్చిన కరోనా లాక్డౌన్ సరికొత్త ఆలోచనను తీసుకొచి్చంది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన అర్చన జాతీయ గీతాన్ని ఆలపించే సంకల్పాన్ని పెట్టుకుంది. ఈ అంశంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాలంటే ఏం చేయాలనే పలువురి సలహాలు తీసుకుంది. ఏడాదికాలంగా సీరియస్గా సాధన చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో సంపూర్ణ జనగణమనను ఐదు చరణాల్లో 75 సార్లు 7 గంటల పాటు పాడి రికార్డుకెక్కింది. మన జాతీయగీతానికి ఉన్న పవిత్రతను ప్రపంచానికి చాటేందుకే ఈ కార్యక్రమం చేసినట్లు అర్చన తెలిపింది. మరిన్ని రికార్డులు సాధించాలి అంతకుముందు ఉదయం ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్ రవీందర్సింగ్ ప్రారంభించారు. అనంతరం అర్చనను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. పట్టుదలతో జాతీయ గీతాన్ని పాడి మన జాతీయ గీతానికి ఉన్న మహాత్యాన్ని తేలియజేసేలా ప్రయత్నం చేస్తున్న అర్చన రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ హాజరై అర్చనను అభినందించారు. చొప్పరి జయశ్రీ, గుంజపడుగు హరిప్రసాద్, సాదవేణి వినయ్, పొన్నం అనిల్గౌడ్, తిరుపతి, కుమార్, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఎస్ సీఎం చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్మహోత్సవ్ అత్యంత ప్రశంసనీయమైందన్నారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకోవడానికి, అంతేకాదు ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి అమృత్ మహోత్సవ్ వేదిక కల్పిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► స్వతంత్ర పోరాట యోధుల నిస్వార్థతను చూసి మనం అంతా గర్వించాలి. అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి, వారికి సెల్యూట్ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమర యోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగు చేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది. ► ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్య మరెంతో మంది ప్రముఖులు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం వర్చువల్, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాదు, వారి జీవితాల నుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం. ► గడిచిన కాలంలో మనదేశం నడిచిన మార్గాన్ని మరోసారి అవలోకనం చేసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది. గడిచిన 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఈ దేశం చాలా ప్రగతిని సాధించింది. రియల్ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ. 145.69 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ► ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయి, అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి రెండు ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిచేస్తున్నాను. 1. సుస్థిర ప్రగతి 2. ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్నవారు ప్రస్తుతం తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమ అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ► దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుంది. గడిచిన 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది. దీనివల్ల కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆస్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది. సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను స్టోరేజ్ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉంది. కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్ను ఉత్పత్తిచేసే విషయంలో ఒకే సూర్యుడు (ఒన్ సన్), ఒకే ప్రపంచం (ఒన్ వరల్డ్), ఒకే గ్రిడ్ (ఒన్ గ్రిడ్) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. ► భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాలమధ్య విద్యుత్ పంపిణీ ఉండాలి. ఇవ్వాళ్టికి ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవ విషయం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్నెట్ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్ గ్రిడ్ అన్నది తీరని కల కాకూడదు. ► ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారు. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధంచేశారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుదీకరించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాని ఒక సమస్య నిరంతరం మనల్ని వెంటాడుతోంది. ► ఈ దేశంలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడంలేదు. ప్రపంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57శాతం.. 10శాతం మంది చేతిలోనూ, 22 శాతం 1 శాతం చేతిలో ఉందని చెప్తోంది. ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణభారాన్ని పెంచుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనం అంతా దృష్టిసారించాల్సి ఉంది. సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలి. చదవండి: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే -
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందని అన్నారు. ఉత్పత్తుల రంగంలో ముందువరుసలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో గురువారం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. స్వచ్ఛతే లక్క్ష్యంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివెరిస్తున్నాయని తెలిపారు. వాడని బోరుబావులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని కోరారు. ఐదేళ్లుగా సుస్థిర ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. -
మోదీ మరో నినాదం : ఈజ్ ఆఫ్ లివింగ్
సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్ధేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. సులభతర వాణిజ్యమే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కాకుండా సులభతర జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) కూడా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోయేలా హైజంప్ చేయాల్సిన అవసరం నెలకొందని అన్నారు. రోజులు మారుతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం మారాలని పిలుపు ఇచ్చారు. సంపద సృష్టితోనే సమస్యలు దూరమవుతాయని స్పష్టం చేశారు. దేశ మౌలిక రంగంలో కోటి కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. -
అమెజాన్ ఫ్రీడం సేల్ ప్రారంభం, ఆఫర్ల వెల్లువ
అమెజాన్ ఇండియా తన ఫ్రీడం సేల్ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్, ఆగస్టు 12 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు అమెజాన్ ఈ సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్లో భాగంగా మొబైల్స్, నోట్బుక్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్ గాడ్జెట్లు, ఆడియో యాక్ససరీస్ ఉత్పత్తులపై డజన్ల కొద్దీ డీల్స్ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ స్కీమ్లు ఈ సేల్లో భాగం కానున్నాయి. ఈ సేల్లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. యూపీఐ, నెట్బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ పేమెంట్ విధానాల ద్వారా జరిపే అమెజాన్ పే బ్యాలెన్స్లపై 5 శాతం క్యాష్బ్యాక్ కూడా లభిస్తోంది. అమెజాన్ ఫ్రీడం సేల్లో స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు హానర్ 7ఎక్స్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరలో రూ.10,999కే లభ్యమవుతుంది. దీని ఎంఆర్పీ 16,999 రూపాయలు. పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్పై 7600 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను, అమెజాన్ తన సేల్లో రూ.55,900కు ఆఫర్ చేస్తోంది. హువావే పీ20 లైట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.16,999కు అందుబాటులో ఉంది. వన్ప్లస్ 6, రియల్మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పీసీ యాక్ససరీస్పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ అంతకముందే టీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
అసెంబ్లీలో ఘనంగా జెండావందనం
జెండా ఆవిష్కరించిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు అసెంబ్లీలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జాతి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించా రన్నారు. ఇక శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో హోంమంత్రి టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగుర వేశా రు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి సీఎం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మగ్దూం భవన్లో చాడ సీపీఐ కార్యాలయం మగ్దూం భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి జాతీయ పతా కాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. బంధుప్రీతి, అవినీతి అంతమైన రోజునే నిజమైన స్వాతంత్య్రమని ఆయన అన్నారు. -
మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తప్పుల తడక అని విమర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కీపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే సీఎం ప్రస్తావించారని, మధుయాష్కీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్, కేవీపీలు బినామీ వ్యాపారాలు చేస్తున్నారంటూ యాష్కీ వ్యాఖ్యానించడం పై మంగళవారమిక్కడ స్పందిస్తూ... ఆధారాలుంటే నిరూపించాలని, లేదంటే నోరు మూసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక శక్తిగా మారిన నయీమ్ను గత ప్రభుత్వాలే పెంచి పోషించాయని సుమన్ ఆరోపించారు. -
హెచ్ఎం భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ పూడూరు: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావతిలాంటి ఉత్తమ టీచర్ల వల్లే విద్యావ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్గ్రేషియాను అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గాయాలపాలైన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించండి: విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న లెక్కలు తేల్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలను ఆనుకొని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బావులు, విద్యుత్ తీగలు వంటి వాటి వివరాలను సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా మేడికొండ ప్రభుత్వ పాఠశాలలో జెండా రాడ్కు విద్యుత్ తీగ తగిలి ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం
* 10 శాతం మంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు * దీన్ని మార్చి.. సత్వర న్యాయం అందేలా చూడాలి * ఈ బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉంది * స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ * పలువురు సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు తమ హక్కుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఇప్పటికీ సంశయిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే వివాదాలు, సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే కాకుండా అది సత్వరమే అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందన్నారు. సోమవారం హైకోర్టు ప్రాంగణంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాన మంత్రి, హోంమంత్రి సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్, మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తదితరులు ప్రముఖ న్యాయవాదులేనని ఏసీజే గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ఆ త్యాగాలను సదా స్మరించుకోవాలన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో వారికి న్యాయం అందించడంతోపాటు దానిని వేగంగా కూడా అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఈ విషయంలో సీనియర్ న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు వారు తమ అనుభవనాలు, జ్ఞానాన్ని పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఏపీ, తెలంగాణ హైకో ర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు, జి.మోహనరావు తదితరు లు ప్రసంగించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ న్యాయవాదులకు సన్మానం... ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఘనంగా సన్మానించారు. గత 55 ఏళ్ల నుంచి సీనియర్ న్యాయవాదులుగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నందుకు హైకోర్టు వారిని సన్మానిం చింది. సన్మానం అందుకున్న వారిలో ఎ.పుల్లారెడ్డి, టి.బాల్రెడ్డి, కె.ప్రతాప్రెడ్డి, పి.బాలకృష్ణమూర్తి, బి.వి.సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఇ.మనోహర్, కోకా రాఘవరావు, కె.వి.సత్యనారాయణ, సుబ్రహ్మణ్య నరసు తదితరులున్నారు. -
రాజ్భవన్లో స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ 70 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లు రాజ్భవన్లో సోమవారం ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ కొణిజేటి రోశయ్య వివిధ రంగాల ప్రముఖులను కలుసుకున్నారు. త్రివిధ దళాధిపతులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నగరంలోని తెలుగు ప్రముఖులు సైతం రోశయ్యను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన స్థలాల్లో ఆశీనులై ఉండగా ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ రోశయ్య ప్రముఖుల ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు సైతం గవర్నర్ సరసన ఆశీనులుకాగా ప్రముఖులంతా వరుసగా వచ్చి గవర్నర్ను మర్యాదపూర్వకంగా పలకరించారు. గవర్నర్ సైతం అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం రాజ్భవన్ ప్రాగంణంలోని వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన గవర్నర్ రోశయ్య ప్రదర్శనలు చేసిన కళాకారులను సత్కరించారు. వేడుకలకు హాజరైన ప్రముఖులకు గవర్నర్ విందునిచ్చారు. రాజ్భవన్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తెలుగు ప్రముఖులు : రాజ్భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంలోని తెలుగు ప్రముఖులు హాజరై గవర్నర్ కే రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కా సంయుక్త కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, అస్కా మేనేజింగ్ ట్రస్టీ ‘అజంతా’ శంకరరావు, ట్రస్టీ కార్యదర్శి స్వర్ణలతారెడ్డి, ఆస్కా సీనియర్ సభ్యులు ఎరుకలయ్య, మదనగోపాల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్కుమార్ రెడ్డి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, దక్షిణ భారత వైశ్య సంఘం అధ్యక్షులు ఎంవీ నారాయణ గుప్తా, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, చెన్నైపురి ట్రస్ట్ అధికార ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు, ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, న్యూటెక్ కనస్ట్రక్షన్స్ అధినేత నాగిరెడ్డి, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయల్, వైశ్య ప్రముఖులు త్రినాధ్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. అమ్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం : వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కనబరిచిన, సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి జయలలిత వివిధ ప్రముఖుల పేర్లతో అవార్డులను ప్రదానం చేశారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరందరినీ ఆహ్వానించి అవార్డులను అందజేశారు. చెన్నైలోని కేంద్ర చర్మపరిశోధక సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ షణ్ముగంకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, 8 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం అందజేశారు. నామక్కల్కు చెందిన జయంతికి వ్యోమగామి దివంగత కల్పనాచావ్లా అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, రూ.5వేల విలువైన బంగారు పతకం, ప్రశంసాపత్రం బహూకరించారు. మహామహం ఉత్సవాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసగా తంజావూరు జిల్లా అప్పటి కలెక్టర్ సుబ్బయ్యన్, పోలీస్ సూపరింటెండెంట్ మయిల్వాహనన్ రూ.2లక్షల చెక్కును అందుకున్నారు. గ్రామీణ పారిశుధ్య బహుమతిగా రూ.2 లక్షల చెక్కును మంత్రి ఎస్పీ వేలుమణి, ఆ శాఖ కార్యదర్శి, డెరైక్టర్ అందుకున్నారు. ఆన్లైన్లో సేవలపై రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ అవార్డు అందుకున్నారు. దైవాంగుల సంక్షేమానికి విశేషంగా పాటుపడిన డాక్టర్ రాజా కన్నన్ రూ.10 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం పొందారు. ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపీ మహమ్మద్ రబీక్ అవార్డును పొందారు. ఉత్తమ స్థానిక సంస్థలు : రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి అ వార్డును అందుకున్నాయి. రూ.25 లక్షల చెక్కు, ప్రశంసాపత్రంతో దిండుగల్లు కార్పొరేషన్ ఉత్తమ అవార్డును అందుకుంది. మునిసిపాలిటీల్లో ప్రథమ బహుమతి పట్టుకోట్టై (రూ.15లక్షలు) రెండో బహుమతి పెరంబలూరుకు (రూ.10లక్షలు), మూడో బహుమతి రామనాధపురంకు (రూ.5లక్షలు) దక్కింది. ఉత్తమ పంచాయితీగా పరమత్తివేలూరు (రూ.10లక్షలు), ద్వితీయ బహుమతి చిన్నసేలం (రూ.5లక్షలు), మూడవ బహుమతి పెరియనాయకన్నపాళయం (రూ.3లక్షలు) అందుకున్నాయి. ఉత్తమ సహకార బ్యాంకు అవార్డును సేలం కేంద్ర స హకార బ్యాంకు సాధించుకుంది. స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా దైవాగులైన చిన్నారులకు సీఎం జయలలిత మిఠాయిలు పంచిపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, ఆర్థిక మంత్రి పన్నీర్సెల్వం సహపంక్తి భోజనం చేశారు. -
నీళ్లు.. నిధులు
మెతుకుసీమ సౌభాగ్యం జిల్లాకు 3 నీటిపారుదల ప్రాజెక్టులు రాజధాని తాగునీటికి ప్రత్యామ్నాయం సింగూరు నీరు మనమే వాడుకుందాం! ‘మెదక్’.. 3 జిల్లాలు కాబోతోంది విద్య, వైద్యం, రోడ్ల మెరుగుకు పుష్కలంగా నిధులు 60 టీఎంసీల సామర్ధ్యంతో మూడు ప్రాజెక్టులు మెదక్లోనే హైదరాబాద్ తాగునీళ్ల నీటి అవసరాలకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం సింగూరు నీళ్లు కూడా మనమే ఉపయోగించుకుందాం మెదక్ను మూడు జిల్లాలుగా పునర్విభజన 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గోదావరి పారాలి.. బీడు భూములు తడవాలి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్, 7 టీఎంసీలతో కొండ పోచమ్మ, 3 టీఎంసీలతో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సింగూరు నీళ్లు కూడా మనకే ఉపయోగపడతాయి’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు పరేడ్గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పుష్కలంగా నీళ్లు, నిధులతో మెతుకుసీమను సౌభాగ్యసీమగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కొత్తగా మూడు జిల్లాలు ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త కూడా పంచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు హరితహారంలో భాగం పంచుకోవటం సంతప్తి నిచ్చింది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్యం రావటం సంతోషకరం. జిల్లాలో ఈ ఏడాది 3.43 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యమైతే.. ఇప్పటికి 2.25 కోట్ల మొక్కలు నాటాం. నాటిన మొక్కలను సంరక్షించుకోవటమూ ముఖ్యమే. బతకటానికి మనిషికి నీళ్లెంత అవసరమో, మొక్కలకూ అంతే అవసరం. అధికారులు ఎండాకాలంలో ప్రజల గొంతు ఎండకుండా ఎలాగైతే చర్యలు తీసుకున్నారో.. మొక్కల సంరక్షణకూ అలాంటి ఏర్పాట్లే చేయాలి. రాష్ట్ర స్థాయి హరితమిత్ర అవార్డుకు ఎంపికైన సిద్దిపేట మున్సిపల్ పాలవర్గానికి అభినందనలు. విద్యుత్తు మెరుగుకు రూ.800 కోట్లు నీటిపారుదల, విద్యుత్తు రంగాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయి. సంక్షేమ రంగంలో మనం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మెదక్ జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసి విద్యుత్తు అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ములుగులో హర్టీకల్చర్ యూనివర్సిటి, ఫారెస్టు కాలేజిలకు శంకుస్థాపన చేశాం. జిల్లాలో 11 మైనాన్టీ గురుకులాలను ఏర్పాటు చేశాం. అత్యంత వెనుకబడిన ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గానికే 4 ఎస్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను, రూ.454 కోట్లతో 1,679 చెరువులను బాగు చేసుకోబోతున్నట్లు ఆయన వివరించారు. వైద్యం, రహదారుల బాగు.. ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో మన జిల్లా నెంబర్వన్గా నిలిచింది. జిల్లాలో 7 కొత్త సిమాంక్ కేం ద్రాలను, 3 రక్తనిధి కేంద్రాలను, 4 రక్త నిలువ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ.3 కోట్లతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు అందించాం. రూ 1,500 కోట్లు ఖర్చు చేసి 1,600 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్డు, రూ.611 కోట్లు ఖర్చు చేసి 2,493 కిలో మీటర్ల పంచాయితీరాజ్ రోడ్లను బాగు చేసుకున్నాం. జిల్లాలో మూడు విడతల్లో 3.96 లక్షల మంది రైతులకు రూ.1,622 కోట్ల రుణమాఫీ జరిగింది’అని హరీశ్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, భూపాల్రెడ్డి, మదన్రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్, ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తిరంగా’ ఆర్ట్..
మారేడుపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి అశ్విని నగర్లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ రాజశ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో రూపొందించిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర వేడుకలు, తివర్ణ పతాకం, మహాత్మ గాంధీతో పాటు పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు. -
మోదీ హామీల అమలు ఎంతవరకు?
గత పంద్రాగస్టున ఇచ్చిన 8 హామీలపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన * జన్ధన్ యోజన ప్రయోజనంపై అస్పష్టత * మరుగుదొడ్ల నిర్మాణం నామమాత్రమే * ఉత్తమంగా సామాజిక భద్రత కార్యక్రమాలు న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయని ‘ఫ్యాక్ట్ చెకర్’ సంస్థ పేర్కొంది. అందులోనూ కొన్ని అంశాల్లోనే మెరుగైన ప్రయోజనం కనిపించిందని.. మరిన్ని అంశాల్లో అస్పష్టత నెలకొందని తెలిపింది. ప్రధానమైన 8 అంశాల అమలుతీరుపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన జరిపింది. వివరాలు.. 1. ప్రధానమంత్రి జన్ధన్ యోజన నిరుపేదలందర్నీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. తద్వారా దేశంలో బ్యాంకు ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు 3 నాటికి 22.8 కోట్లకు చేరింది. గత ఏడాది (17.4 కోట్ల ఖాతాలు)తో పోల్చితే.. ఖాతాల సంఖ్య 31 శాతం పెరగడం గమనార్హం. ఖాతాల్లోని సొమ్ము రూ.22,033 కోట్ల నుంచి రూ.40,795 కోట్లకు.. అంటే 85 శాతం పెరిగింది. 2. స్వచ్ఛ విద్యాలయ అభియాన్.. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ‘స్వచ్ఛ విద్యాలయ అభియాన్’ను మోదీ ప్రకటించారు. కానీ ఈ లక్ష్యాన్ని ఏ మాత్రం చేరుకోలేకపోయారు.ఢిల్లీ సహా మారుమూల ప్రాంతాల వరకు కూడా స్కూళ్లలో సరైన సంఖ్యలో టాయిలెట్లు లేవని తేలింది. . 3. గివ్ ఇట్ అప్.. ధనికులు పొందుతున్న వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. 1.04 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోగా, 17.6 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 4. డీబీటీఎల్తో సబ్సిడీ భారం తగ్గింపు పక్కదారి పడుతున్న ఎల్పీజీ సబ్సిడీ అడ్డుకట్టకు ‘ఎల్పీజీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్)’ తెచ్చారు. గతేడాదిలో రూ.20 వేల కోట్లు సబ్సిడీ భారం తగ్గిందని కేంద్రం చెప్పింది. అయితే తగ్గిన భారం సుమారు 2 వేల కోట్లేనని కాగ్ పేర్కొంది. 5. అన్ని గ్రామాలకు విద్యుత్.. దేశంలో 98.1 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ జరిగిందని కేంద్రం పేర్కొనడం వాస్తవ దూరమని ‘ఫ్యాక్ట్ చెకర్’ పేర్కొంది. దేశంలోని 5,97,464 గ్రామాలకుగాను ఈ జూన్ 30 నాటికి 5,87,569 గ్రామాల్లో విద్యుత్ సరఫరా అందుతోందని కేంద్రం చెబుతోంది. అంటే కేవలం 9,895 గ్రామాలకే విద్యుత్ సరఫరా లేదు! 6. సామాజిక భద్రత.. సామాజిక భద్రత కార్యక్రమం కింద కేంద్రం ప్రధానంగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ జూన్ 14 నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 27 లక్షల మంది, ప్రధాని సురక్షా బీమా యోజన కింద 9.45 కోట్ల మంది, ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2.97 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. 7. గ్రామీణాభివృద్ధి.. 2015-16లో వ్యవసాయానికి కేటాయించిన రూ. 24,909 కోట్లతో పోల్చితే ఈసారి 44 శాతం అదనంగా రూ.35,984 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ దేశంలోని మొత్తం సాగుభూమిలో 32 % కేవలం 5 శాతం మంది పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, పట్టణీకరణ కారణంగా సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోందని పేర్కొంది. 8. వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికోద్యోగులకు ఒక ర్యాంక్ ఒకే పెన్షన్ హామీ ఇచ్చిన మోదీ దానిని అమల్లోకీ తెచ్చారు. ఏటా రూ.7,488 కోట్లు భారం పడుతుందని, బకాయిల చెల్లింపునకు రూ.10,925 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ 2016 మార్చి నాటికి రూ. 2,861 కోట్లే ఖర్చు చేశారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఎస్సారార్ ఎన్సీసీ కేడెట్లు
కరీంనగర్కల్చరల్ : సికింద్రాబాద్లోని బైసాన్ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ కేడెట్లు వి.రాజు, కె.సందీప్, టి.శివకుమార్ ఎంపికైనట్లు కళాశాల ఎన్సీసీ అధికారి ఆర్.సంజీవ్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రికి, గవర్నర్కు జరిగే గౌరవ వందన కార్యక్రమంలో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. వీరిని ప్రిన్సిపాల్ పి.నితిన్, కమాండింగ్ అధికారి దేశ్పాండే, కల్నల్ కేఆర్ కృష్ణ పాల్గొన్నారు. -
గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు
ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం కె.చంద్రశేఖర్రావు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గోల్కొండ కోటలో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా తగు బందోబస్తు, పార్కింగ్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, బారికేడ్లు, మంచినీటి సరఫరా, గోల్కొండకు వెళ్లే మార్గంలో సైన్ బోర్డులు, పరిసరాల శుభ్రత, మొబైల్ టాయిలెట్స్, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక మినీ బస్సులు, వేదిక వద్ద పుష్పాలతో అలంకరించాలని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గోల్కొండ కోటలో సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్యకార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అధర్ సిన్హా, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలి
-
సమాచార హక్కుతో సుపరిపాలన
కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ యూనివర్సిటీ: సమాచార హక్కు చట్టం దేశంలో రెండో స్వాతంత్య్ర సంగ్రామం లాంటిదని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. యూజీసీ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సమాచార హక్కు చట్టం తీరుతెన్నులు’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సుపరిపాలన అందించేందుకు ఆర్టీఐ ఎంతో దోహదపడిందన్నారు. 2005లో మొదలైన ఆర్టీఐ ద్వారా సామాన్యులు సైతం విలువైన సమాచారాన్ని పొందగలిగారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యూనెటైడ్ నేషన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఎస్.రామారావు మాట్లాడుతూ 1990లో 13 దేశాలు మాత్రమే ఆర్టీఐని అమలు చేస్తే.. ప్రస్తుతం 100 దేశాల్లో ఈ చట్టం విజయవంతంగా అమలవుతోందన్నారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో మైలు రాయి వంటిదని కొనియాడారు. స్వల్ప కాలంలో తక్కువ ఖర్చుతో ప్రజలకు అవసరమైన సమాచారం ఈ చట్టం ద్వారా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ఇన్చార్జి వీసీ ఆర్.పి శర్మ, యూజీసీ హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సెంటర్(హెచ్సీయూ) ఇన్చార్జి డెరైక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తీరంపై డేగ నిఘా
స్వాతంత్య్ర దిన వేడుకలకు భారీ భద్రత నేవీ, ఆర్మీ, ప్రత్యేక పోలీస్ దళాలు సిద్ధం ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం స్వయంగా పర్యవేక్షిస్తున్న డీజీపీ రాముడు విశాఖపట్నం : తొలిసారి నగరంలో జరగనున్న ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్ర వేడుకలపై పోలీసు శాఖ డేగ కళ్లతో నిఘా పెట్టింది. కేంద్ర హోం శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు, ఇతర అసాంఘిక శక్తుల నుంచి అవాంతరాలు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. వివిధ దళాలకు చెందిన 2500పైగా పోలీసులను వినియోగించనుంది. వీరు కాకుండా నేవీ, ఆర్మీ, ప్రతేక పోలీసు దళాలను మోహరిస్తోంది. వేడుకలను వీక్షించేందుకు 2,515 మంది ప్రముఖులు రానున్నారు. వీరి భద్రతకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇతర జిల్లాల నుంచి 1800 పోలీసులను ప్రత్యేకంగా తెప్పించారు. వీరితో పాటు 10 ప్లటూన్ల ఏపీఎస్పీ, 640 మంది ఆర్మ్డ్ పోలీసులను వినియోగిస్తున్నారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆధ్వర్యంలో ఒక ఆర్మ్డ్ రిజర్వ్ సెక్షన్ను నాలుగు ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. సిరిపురం, కలెక్టరేట్, చినవాల్తేరు, పందిమెట్ట ప్రాంతాల్లో ఉండే ఈ బృందాలు అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగుతాయి. 50 వేల మంది హాజరవుతారని అంచనా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సాములా ఉంటుంది. దీని కోసం ఒక ఏడీసీపీ, 4 ఏసీపీలు, 23 ఇన్స్పెక్టర్లు, 63మంది ఎస్సైలు, 88 మంది హెచ్సీలు, 335 మంది కానిస్టేబుల్స్, 172 మంది హోంగార్డ్స్తో కలిపి మొత్తం 700 మంది సిబ్బంది ట్రాఫిక్ విధులు నిర్వర్తించనున్నారు. 15 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని పోలీస్ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న మత్స్యకార గ్రామాలలో 16 స్పెషల్ టీమ్స్ను ఉంచారు. సముద్రం, భూ ఉపరితలం, ఆకాశంలో ఇండియన్ నావీ, కోస్ట్గార్డ్, సీఐఎస్ఎఫ్, ఒక ఆక్టోపస్, ఒక గ్రేహాండ్స్ కమాండో టీమ్, రెండు స్పెషల్ పార్టీలు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి.భద్రతా ఏర్పాట్లను డీజీపీ జాస్తి రాముడు స్వయంగా చూసుకుంటున్నారు. కోస్టల్ బాటరీ, జోడుగుళ్లపాలెం వద్ద 24 గంటలూ పనిచేసేలా స్ట్రాటజిక్ ఆర్మ్డ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ‘కోటి’కష్టాలు వేడుకలకు వేలాది మంది పోలీసు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సి బ్బందిని ఇతర జిల్లాల నుంచి వారం రోజులు ముందుగానే రప్పించారు. వారందరికీ వసతి కల్పించారు. భారీ స్కీన్లు, విద్యుత్ దీపాలు, వీధి దీపాలు, వేదికలు, శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్, పోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మొత్తం ఏర్పాట్లకు దాదాపు రూ.2 కోట్ల పైగానే ఖర్చువుతుందని అంచనా. ఇదంతా జిల్లా ఖజానా నుంచే తీసి ఖర్చు చేస్తున్నారు. ఏర్పాట్లు అదిరిపోవాలని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం నెలకు రెండుసార్లు సీఎం చంద్రబాబు నగరానికి వస్తున్నారు. సగటున రూ.30 లక్షలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రొటోకాల్ ఖర్చులకు కొంత విడుదల చేసినా ఇంకా బకాయిరూ.2కోట్లు ఉంది. ఈనేపధ్యంలో స్వాతంత్య్ర వేడుకల ఆర్ధిక భారంపై అధికారులు మల్లగులాల్ల పడుతున్నారు. బందోబస్తుకు మాత్రం డీజీపీ చొరవతో రూ.75లక్షలు గురువారం విడుదలవడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. -
బదిలీలకు కౌంట్డౌన్
జోరుగా పైరవీలు చేతులు మారుతున్న సొమ్ము {పజాప్రతినిధుల సిఫార్సులకే పెద్దపీట విశాఖపట్నం: రెండ్రోజులే గడువుండడంతో బదిలీలకు పైరవీలు జోరందుకున్నాయి. ముఖ్యంగా రెండు శాఖల్లో కీలక పోస్టుల కోసం లక్షలు కుమ్మరిస్తున్నారు. మధ్యవర్తులను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భారీగానే దండుకుంటున్నారు. అస్మదీయులు..తస్మదీయులనే తేడా లేకుండా సిఫార్సులేఖలు ఇచ్చేస్తుండడంతో ఆయాశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. బదిలీలకు ఈ నెల మొదటి వారంలో సర్కార్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. జెడ్పీ, పంచాయితీ రాజ్తో సహా పీఆర్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్శాఖల్లో బదిలీలకు శాఖలవారీగా మార్గ దర్శకాలిచ్చింది. గడువు రెండ్రోజులు ఉండడం..చివరి రోజు నగరంలో రాష్ర్ట స్థాయి స్వాతంత్య్రవేడుకలు జరుగనుండడంతో బదిలీల ప్రక్రియను శుక్రవారం సాయంత్రం కల్లా పూర్తిచేసేందుకు ఆయా శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. జెడ్పీలో 200 మందికి తప్పని స్థానచలనం జెడ్పీలో 381 మందిలో 200 మందికి బదిలీ జరిగే అవకాశాలున్నాయి. మెజార్టీ ఎంపీడీఓలు గతేడాది బదిలీల్లోనే జిల్లాకు వచ్చారు. అయినప్పటికీ కనీసం పది మందిని బదిలీ చేసే అవకాశాలున్నాయి. నగరానికి ఆనుకొని ఉన్న భీమిలి,పెందుర్తి,ఆనందపురం,పరవాడలతో పాటు అనకాపల్లి, సబ్బవరం, యలమంచలి, నక్కపల్లి మండలాల్లో ఎంపీడీఒలతో పాటు ఈఒపీఆర్డీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. జెడ్పీలోని మినిస్టీరియల్ స్టాఫ్ లో కనీసం 70 శాతం మందికి స్థానచలనం కలగనుంది. పంచాయితీరాజ్లో ఇప్పటికే డీఎల్పీలబదిలీలు కొలిక్కివచ్చాయి. డిఎల్పీఒ గా పనిచేస్తున్న మోహనరావును విజయనగరం బదిలీ చేయగా, నర్సీపట్నం, పాడేరు డీఎల్పీఒ లు సత్యనారాయణ, రాంప్రసాద్లను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసారు. విజయ నగరం నుంచి డి. మోహనరావు, డిఎం సెల్వియా, శ్రీకాకుళం నుంచి పి.శేషారాణిలు బదిలీపై రాగా, వీరికి పోస్టింగ్లు ఇవ్వలేదు. డీపీఒ కార్యాలయ ఎఓ ఆర్ నారాయణరావును శ్రీకాకుళం బదిలీ చేయగా,విజయనగరం నుంచి ఎస్ఎస్ఎస్ఎన్ మూర్తిని ఇక్కడకు బదిలీ చేశారు. 925 పంచాయితీలకు 395పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులుండగా, వారిలో మార్గదర్శకాల ప్రకారం 130 మంది కార్యదర్శులకు స్థానచలం తప్పేటట్టు కన్పించడం లేదు. పీఆర్ ఇంజనీరింగ్లో బదిలీలన్నీ ఈఎన్సీ పరిధీలో జరుగనున్నాయి. ఈ శాఖలో 294మంది ఉండగా,150మందికి పైగా బదిలీలు గురయ్యే అవకాశాలున్నాయి. మండల జేఈలు, ఏఈ ల్లో కనీసం వందమంది, డీఈల్లో 15 మందికి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ 205మంది ఉండగా, వారిలో కనీసం 60మంది బదిలీ తప్పదంటున్నారు. వారం రోజులుగా బదిలీలకు గురయ్యే వారు..కోరుకునే వారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. జెడ్పీలో రాజ్యాంగేతర శక్తితో పాటు ఓ సీనియర్ మంత్రి ఈ బదిలీల్లో చక్రం తిప్పు తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో కోరుకున్న వార్ని తెచ్చు కునేందుకు పావులు కదుపుతున్నారు. బదిలీ కోరుకునే వారి నుంచి బదిలీకి గురయ్యే వారి నుంచి వీరంతా భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తోంది.ఏఈ, జేఈ, ఎంపీడీఒ స్థాయి పోస్టులకు ఐదు నుంచి పదిలక్షలు చేతులు మారుతున్నట్టు వినికిడి. కొంత మంది ప్రజాప్రతి నిధులు అనుచరుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. -
15కు భారీ ఏర్పాట్లు
- స్వాతంత్య్ర వేడుకలకు సీఎం సహా వెయ్యి మంది వీఐపీల రాక - పోలీసు గుప్పెట్లో మహానగరం - విశాఖ అంతటా డేగకళ్లు-తీరంలో ప్రత్యేక నిఘా సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగరం మరో అరుదైన చారిత్రక వేడుకకు వేదికవుతోంది. రాష్ర్ట స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. జీఏడీ అధికారుల పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్కుమార్ మీనా, ప్రత్యేక కార్యదర్శి ఎన్.వి.రమణారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించి జిల్లా అధికారులతో చర్చించారు. స్వాతంత్య్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలున్నాయన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో తొలిసారిగా సాగరతీరంలో జరుగుతున్న ఈ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే వేడుకలు జరిగే బీచ్ రోడ్డును పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరానికి దారితీసే రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నగరానికి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్రోడ్డును పూర్తిగా పోలీసులు తమ అధీనంలో తీసుకుని అణువణువు తనిఖీలు చేస్తున్నారు. సముద్రంలో గస్తీని ముమ్మరం చేశారు. తూర్పు నౌకాదళం, కోస్ట్గార్డ్, మెరైన్ పోలీసులు తీరంలో జల్లెడపడుతున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల పని తీరును పరిశీలిస్తున్నారు. పనిచేయని వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సహా వెయ్యి మందికి పైగా వీఐపీలు పాల్గోనున్నందున ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. బీచ్రోడ్లో సుమారు పదివేల మందికిపైగా ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మద్దిలపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్సులను సైతం సమకూరుస్తున్నారు. వేదిక వద్ద వీఐపీల స్థాయిని బట్టి కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండలు పెరిగే సూచనలున్నందున వీఐపీలతో పాటు సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వేదిక వద్ద భారీ షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. టూరిజం,పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థకం, సాంఘిక సంక్షేమం, విద్య, అటవీ, నీటిపారుదల, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం తదితర శాఖలకు చెందిన 17 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ప్రతీ రోజు ఉదయం ఏడుగంటల నుంచి మార్చ్ ఫాస్ట్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి శకటాల రిహార్సల్స్ కూడా నిర్వహిస్తారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా జగదాంబ, మద్దిలపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, సత్యం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కే బీచ్ తదితర ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి వేడుకలయ్యే వరకు బీచ్రోడ్డులో సందర్శకుల రాక పోకలను నియంత్రిస్తారు. వేడుకల నిర్వహణ బాధ్యతలను ఓవరాల్గా వుడా వీసీ టి.బాబూరావు నాయుడుకు అప్పగించగా, ఏర్పాట్లకు సంబంధించి ఒక్కో టాస్క్ను ఒక్కో సీనియర్ అధికారిని ఇన్చార్జిగా నియమిస్తూ 24 టీఎంలను ఏర్పాటుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చే ఎన్సీసీ, గ్రీన్కోర్, భారతస్కౌట్, రెడ్క్రాస్, సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులకు ఏయూలో ప్రత్యేక బస ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ర్టస్థాయి అవార్డులకు ఎంపికైన వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, సంఘ సేవకులు, స్వాతంత్ర సమరయోధుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఛాలెంజ్గా తీసుకోండి: మీనా రాష్ర్ట విభజన తర్వాత తొలిసారిగా విశాఖ తీరంలో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను ఛాలెంజ్గా తీసుకోవాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్కుమార్ మీనా అధికారులకు సూచించారు. గతేడాది కర్నూల్లో నిర్వహించిన రాష్ర్ట వేడుకలను చోటు చేసుకున్న పొరపాట్లు ఈ ఏడాది ఆస్కారం లేకుండా చూడాలన్నారు. -
క్విజ్ మాస్టర్
కథ: ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు. సాయంత్రం ఏడవుతోంది. ఆడిటోరియమ్ కేకలతో హోరెత్తుతోంది. పక్కనే ఆఫీస్ రూమ్ ప్రశాంతంగా ఉంది. ఆడిటోరియమ్లో ఆనందంగా చిందులేస్తున్నారు. పక్కనే ఆఫీస్ రూమ్లో క్విజ్ మాస్టర్ మూర్తి ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎంత నియంత్రించుకుందామన్నా ఆ ఆలోచనలు ఒకదానికొకటి పెనవేసుకుంటూ అలా సాగిపోతూనే ఉన్నాయి. అంతవరకూ గంభీరమైన అలల్లా ఉన్న మానసిక స్థితిని, అరగంట క్రితం జరిగిన సంఘటన పోటెత్తిన అలలలా అతలాకుతలం చేసింది. ‘‘జర్ జర్ ర్ ర్ ర్... ర్ ్రర్ ్రర్.్ర..’’ బజర్ తన గుండెల్లో మోగినట్లయి ఉలిక్కిపడ్డాడు మూర్తి. ఇంతకుముందు క్విజ్లో జరిగిన బజర్ రౌండ్ ఇంకా తనను వెంటాడుతూనే ఉంది. తనకిక్కడ ఉండాలని లేదు. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని చూస్తున్నాడు. తనను ఇక్కడకు ఆహ్వానించిన సైన్స్ టీచర్ కనబడితే చెప్పి వెళదామని ఆగాడు. ‘‘మిత్రులారా! ఇంతకుముందే అత్యంత ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం ముగిసింది కదా, కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈలోగా మరో డ్యాన్స్ ఐటెమ్ను ప్రెజెంట్ చేయడానికి మనముందుకొస్తున్నారు...’’ ఆఫీస్ రూమ్ని ఆనుకుని ఉన్న ఆడిటోరియమ్ నుండి ప్రకటన. ‘‘ఆసక్తికరంగా సాగిన క్విజ్ కార్యక్రమం.’’ క్విజ్ మాస్టర్ మూర్తి పెదాలపైన నిరాసక్తమైన నవ్వు. తన కాలేజీ రోజుల్లో కూడా కొన్ని వందల క్విజ్లలో పాల్గొన్నాడు. ఏనాడైనా ఇలా జరిగిందా? కొత్త విషయాలు నేర్చుకోవడమనే తహతహ, అవతలవాడి కంటే తనకు ఎక్కువ తెలిసివుండాలనే తాపత్రయం ఉండేవి. పోటీ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థుల్లా ఉన్నా, ఒక్కసారి పోటీ అయిపోయాక ఛలోక్తులతో, వ్యంగ్య వ్యాఖ్యలతో చాలా సరదాగా, బాగా ఆత్మీయంగా ఉండేది వాతావరణం. అన్ని సున్నితమైన అనుభవాల మధ్య ఈ సాయంత్రం జరిగిన క్విజ్ పోటీ అతన్ని భయపడేలా చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు క్విజ్ కార్యక్రమం ప్రారంభించే ముందు చివరిసారిగా ప్రశ్నల ఆర్డర్ సరిగా ఉందో లేదో చూసుకుందామని ఫైల్ తెరిచాడు. మొదట ర్యాపిడ్ ఫైర్ రౌండ్. రెండవది జనరల్ రౌండ్. ఆడియో విజువల్ మూడవ రౌండ్. చివరిగా ఐదు ప్రశ్నలతో బజర్ రౌండ్. ఒకవేళ టై అయ్యే సందర్భం వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి మరో అయిదు ప్రశ్నలు. ప్రేక్షకుల కోసం మధ్యమధ్యలో కొన్ని ప్రశ్నలు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకుని నిర్వాహకుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు మూర్తి. మరో ఐదు నిమిషాల్లో అందరికీ స్వాగతం పలుకుతూ క్విజ్ నిర్వహించవలసిందిగా మూర్తిని, ఆరు టీమ్లను వేదిక మీదకు ఆహ్వానించాడు యాంకర్. మూర్తి అతనికి కృతజ్ఞతలు చెప్పి, ఈ క్విజ్లో మొత్తం ఎన్ని రౌండ్స్ ఉంటాయో, ఏ రౌండ్లో ఎన్ని ప్రశ్నలుంటాయో, వాటికి ఏ రౌండ్లో ఎన్ని మార్కులుంటాయో వివరించాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి, ఆల్ఫబెటికల్ ఆర్డర్లో కూర్చున్న టీముల్లో, మొదటి టీమ్కు మొదటి ప్రశ్న అంటూ తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రశ్నల తయారీకి మూర్తి చాలా కష్టపడతాడు. ఏవో తన స్టాక్లో ఉన్న ప్రశ్నలు కొన్ని రాసేస్తే అయిపోదా? అని మిత్రులెవరైనా అంటే నవ్వి వదిలేస్తాడు. తను నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఎవరి కోసం, వాళ్ల వయస్సు, వాళ్ల నేపథ్యం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, వీలైనంత సందర్భోచితమైన, విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రశ్నలనేరుకుంటాడు. అందుకే మూర్వి క్విజ్ మాస్టర్గా ఉంటే, ప్రోగ్రామ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ, నాలుగు విషయాలు తెలుస్తాయనీ నిర్వాహకుల నమ్మకం. మొదటి రౌండ్ పూర్తయింది. అందరిలోకి ‘డి’ గ్రూప్ అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పి, ఇరవై ఐదు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. మూడు టీములు ఇరవై పాయింట్లతో, మిగతా రెండు టీములు పదహైదు పాయింట్లతో ఉన్నాయి. రెండో రౌండ్ చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇందులో ప్రశ్నను పక్క టీమ్కు పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి ప్రశ్నకి వారు సరైన సమాధానం చెబితే పది పాయింట్లు, పాస్లో వచ్చిన పక్కవాళ్ల ప్రశ్నను ఆన్సర్ చేస్తే ఐదు పాయింట్లు ఉంటాయి. మరో గంట గడిచింది. ఈ రెండు గంటలు అక్కడ ఎన్నో రసవత్తరమైన ఘటనల పరామర్శలు చోటుచేసుకున్నాయి. ఆశ్చర్యమనిపించే సంగతులు, అద్భుతమనిపించే విషయాలు, నమ్మలేని నిజాలు, కష్ట సాధ్యమైన ప్రక్రియల్లో విజేతలై నిలిచినవాళ్ల సాహసాలు అన్నింటినీ పరామర్శించుకున్నారు. ఫ్రెంచ్ విప్లవంతో ప్రపంచాన్ని ఆకర్షించిన నెపోలియన్ పిల్లులకు భయపడే వ్యాధితో బాధపడేవాడని తెలిసి నవ్వుకున్నారు. మనదేశంతో పాటు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే మరో దేశం పాకిస్తాన్ అనుకుని, అది కాదు దక్షిణ కొరియా అని తెలిసి నాలిక్కరుచుకున్నారు. జపాన్వాళ్లు అరిష్టంగా భావించే 13 సంఖ్యను ఇటలీవాళ్లు అదృష్టంగా భావిస్తారనీ, ఈ భూమ్మీద బుల్ ఫ్రాగ్ అసలు నిద్రపోని జంతువనీ తెలుసుకుని ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. బహ్రైన్ దేశపు జాతీయగీతంలో కేవలం సంగీతమే తప్ప పదాలు లేవనీ, పియానోలో 88 కీస్ ఉంటాయనీ... ఇలా అనేకానేక సంగతులు. మరో అర్ధగంట గడిచింది. చివరి అంకమైన బజర్ రౌండ్ మాత్రమే మిగిలివుంది. మూర్తి స్కోర్ బోర్డ్ చూశాడు. ఇది విజేతని నిర్ణయించే రౌండ్. ఎ, ఇ జట్లు నలభై మార్కులతో, ఎఫ్ జట్టు నలభై ఐదు మార్కులతో, బి, సి జట్లు అరవై ఐదు మార్కులతో ఉండగా, డి జట్టు అందరికంటే అత్యధికంగా ఎనభై ఐదు మార్కులతో మొదటి స్థానంలో ఉంది. అందరినీ పరికించి చూస్తూ, ‘‘ఫ్రెండ్స్, ఈ రౌండ్లో కేవలం ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి మీకు 10 మార్కులు వస్తాయి. అదే మీ సమాధానం తప్పయితే మీరు 5 మార్కులు కోల్పోతారు. ప్రశ్న పాస్ చేయడం జరగదు. మీ సమాధానం చెప్పడానికి మీకు కేవలం పది సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు కాన్ఫిడెంట్గా, కరెక్టుగా సమాధానం తెలిస్తేనే బజర్ నొక్కండి. లేకపోతే అనవసరంగా మార్కులు పోగొట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్’’ అన్నాడు. మొదటి ప్రశ్న వెలువడిన వెంటనే ఎఫ్ గ్రూప్ బజర్నొక్కి సరైన సమాధానంతో 10 మార్కులు గెలుచుకుంది. రెండవ ప్రశ్నకు బి టీమ్వాళ్లకు 10 మార్కులు వచ్చాయి. మూడో ప్రశ్నకు ఎవరూ బజర్ నొక్కలేదు. క్విజ్ మాస్టరే దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది. అభ్యర్థులలో ఒత్తిడి, ఆందోళన వాళ్ల ముఖాలలో ప్రస్ఫుటమౌతోంది. మూర్తి అడిగిన నాలుగో ప్రశ్నకి సి టీమ్ బజర్ నొక్కడమూ, 10 మార్కులు వాళ్ల ఖాతాలో వేసుకోవడమూ సెకన్లలో జరిగిపోయింది. ఇప్పుడు స్కోర్ బోర్డ్లో డి గ్రూప్ 85 మార్కులతో, బి, సిలు 75 మార్కులతో ఉన్నాయి. ఎఫ్ పది పెంచుకుని యాభై ఐదుకు చేరుకోగా, ఎ, ఇలు 40 మార్కులతో పాత స్కోరునే కొనసాగిస్తున్నాయి. క్విజ్ పోటీ పరాకాష్టకు చేరుకుంది. చిట్టచివరి ప్రశ్న. ఆడిటోరియమంతా ఉద్విగ్నమయమైపోయింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా వాయిదా వేసుకుని, మూర్తి నోటి నుండి బయటకొచ్చే ప్రశ్నకోసం రెప్పలార్పకుండా కాసుక్కూర్చున్నారు. కొందరి చేతులు అప్రయత్నంగానే కుర్చీ హ్యాండిల్స్ని బలంగా నొక్కిపెడుతున్నాయి. అభ్యర్థులంతా తమ తమ టీమ్ మెంబర్లతో చిరుసవ్వడితో మాట్లాడుతూ గుసగుసలాడుకుంటున్నారు. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న ఆ సమయంలో-మూర్తి, చివరి ప్రశ్న ఉన్న కార్డ్ తీసుకుని కళ్లతో ఒకసారి ప్రశ్నను చూశాడు. అభ్యర్థుల వైపు తిరిగి ప్రశ్న చదవడానికి నోరు తెరచి ‘‘తాము...’’ అని అన్నాడో లేదో - ‘‘జర్ జర్... జర్ ర్ ర్... ర్ ర్ ర్ ర్....’’మని బజర్ సౌండ్ వినిపించింది. మూర్తి చదవడం ఆపాడు. వాళ్ల క్రమశిక్షణా రాహిత్యానికి లిప్తపాటులో వెయ్యి వోల్టుల కోపం వచ్చింది. ఎందుకింత తొందరపడతారు? ఇంకా ప్రశ్న సగమైనా పూర్తికాకముందే పూర్తి ప్రశ్న ఏమై ఉంటుందో ఎలా ఊహిస్తారు? ఏం సమాధానం చెబుతారు? అనవసరంగా మార్కులు పోగొట్టుకోవడం తప్ప - అనుకుంటూ, ఇంతకీ ఎవరు బజర్ నొక్కారో చూశాడు. అది - డి గ్రూప్. ఆశ్చర్యపోయాడు. వేరే ఎవరో అయితే, గెలవాలనే ఒత్తిడిలో నొక్కారనుకోవచ్చు. వీళ్లెందుకు చేశారీ పని? వాళ్లవైపు చూసేంతలో వెంటనే, అందులో ఒకడు ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా - ‘అమెరికా’ అన్నాడు. అలా అన్నాడో లేదో, రెండోవాడు బొటనవేలు పెకైత్తి చూపుతూ ఒక్క ఊపులో మొదటివాడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరూ రెండు చేతులతో కిందకీ పైకీ చప్పట్లు కొట్టుకుంటూ, విజయోత్సాహాన్ని పంచుకుంటున్నారు. అన్నీ సెకన్లలో జరిగిపోయాయి. జరిగినదేంటో మూర్తికర్థమైంది. జనానికంతా అర్థమయ్యేందుకుగాను స్కోర్ బోర్డ్ మార్చారు - టీమ్ డి, చివరి ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పి, ఐదు మార్కులు కోల్పోయి 80 మార్కులతో తన ఆధిక్యాన్ని నిలుపుకుని విజేతగా నిలిచింది. బి, సి టీములు 75 మార్కులతో రెండవ స్థానంలోనే ఉన్నాయి. ప్రేక్షకులలో ఒక్కసారి కలకలం, వెంటనే డి టీమ్ను అభినందిస్తున్నట్లుగా కరతాళధ్వనులు... మూర్తి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. బి, సిలలో ఎవరైనా ఎక్కడ కరెక్ట్ సమాధానం చెప్పి తమతో సమానమౌతారో, ఆ తరువాత జరిగే టై బ్రేక్లో ఒకవేళ తాము ఓడిపోతామేమోనని, కనీసం ప్రశ్న ఏంటో వినకుండా, సమాధానం ఏమిటో తెలుసుకోకుండా ఎదుటివాళ్లకి కనీసం ప్రశ్న వినే అవకాశం కూడా ఇవ్వకుండా, ఎదుటివాళ్ల విజయావకాశాల మీద దెబ్బకొట్టిన డి టీమ్ మీద చాలా కోపం వచ్చింది. మూర్తి ఏదైనా మాట్లాడదామని నోరు తెరిచేలోపే, యాంకర్ మైకు నిండా గట్టిగా అరుస్తూ - ‘‘సో లేడీస్ అండ్ జెంటిల్మన్, ఈ రోజు విజేతలు - మన డి టీమ్. చివరి నిమిషంలో వాళ్లు ప్రదర్శించిన తెలివితేటలు, సమయస్ఫూర్తి మరువలేనివి. అమోఘం, అద్భుతం’’ అన్నాడు. ఇంతలో ఎవడో మొబైల్ నుండి టపాకాయల చప్పుడు ప్లే చేయడం మొదలుపెట్టాడు. కింద నుండి డి టీమ్వాళ్ల శ్రేయోభిలాషులు బొటనవేలు పెకైత్తి విజయ సంకేతాలను వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్లో పెట్టడం కోసం కాబోలు, ఒకడు ఫోన్లోనే స్కోర్ బోర్డును, వాళ్ల మిత్రులను ఫొటో తీస్తున్నాడు. చివరి ప్రశ్న ఏమిటో తెలుసుకుందామన్న ఆసక్తి ఎవరికీ ఉన్నట్టు కనబడటం లేదు. మూర్తి అక్కడ ఉండలేకపోయాడు. మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో యాంకర్, ‘‘మిత్రులారా, మీరంతా ఒక ఉద్విగ్నభరితమైన, ఉత్సాహభరితమైన, మరిచిపోలేని అపూర్వమైన మ్యాచ్ చూశారు. ఇక కొన్ని నిమిషాల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు - ముందుగా...’’ మూర్తికి అక్కడ కూర్చోవాలనిపించలేదు. ఒక్కడే నడుచుకుంటూ ఆడిటోరియమ్ దాటి పక్కనే ఉన్న ఆఫీస్ రూమ్కి వచ్చాడు. అప్పటినుండీ సైన్స్ సార్కోసం ఎదురుచూస్తూ, ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. అతనింకా బజర్ రౌండ్కి సంబంధించిన ఆలోచనలో ఉండగానే, ఆడిటోరియమ్లో నుండి యాంకర్ గొంతు వినబడింది. ‘‘ఫ్రెండ్స్, ఇప్పుడు సభ ప్రారంభం కాబోతోంది’’ అంటూ పెద్ద పెద్ద వాళ్లందరినీ విశేషణాలతో సహా పేరు పేరునా, వేదిక మీదకు ఆహ్వానించాడు. ఆఫీస్ రూమ్కి ఆడిటోరియమ్లోని మాటలు స్పష్టంగా ప్రవహిస్తున్నాయి. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ క్విజ్తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, ఈ రోజు జరిగిన పోటీలో డి టీమ్ కనబరిచిన పరిణతి, గెలవాలన్న ఆకాంక్ష, గెలుపు మీద వారికున్న పట్టుదల బహుధా ప్రశంసనీయమని చెప్పాడు. మూర్తి మనసుని ఈ మాటలు మరింత గాయపరుస్తున్నాయి. ఆ పిల్లలు గెలుపు మీద కోరికతో ఆ పని చేశారా? ఓటమిని తట్టుకోలేని భయంతో చేశారా? అవతలవాడు గెలుస్తాడేమోననే అభద్రత, తమ స్థానాన్ని కోల్పోతామేమో అనే భయంతో ఎదుటివారి విజయావకాశాలని తుంచేయడం ఎంతవరకూ విజ్ఞతో, అలాంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమో చెప్పాల్సింది పోయి, ఆ పిల్లలని వీళ్లు గొప్ప హీరోలని చేసేస్తున్నారు. వక్త మారాడు. ఎల్సీఎస్ ఎండీ కాబోలు మాట్లాడుతున్నాడు - ‘‘మొత్తం ఎపిసోడ్లో నాకు నచ్చిన అంశం - చివర్లో ఈ పిల్లలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం. అంత తక్కువ సమయంలో, అన్ని ఒత్తిడుల మధ్య, ఏవో వందల కోట్ల వ్యాపార లావాదేవీలలో మేం అనుసరించే వ్యూహాన్ని వీళ్లు ఇంత తక్కువ వయస్సులో అమలుచేయడం చాలా గొప్ప విషయం. ఈ సంఘటన వీళ్ల భవిష్యత్తు గురించి మంచి ఆశలు కల్పిస్తోంది. మేం వ్యాపారంలో కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ అంటుంటాం. అది ఈ చిన్నారుల్లో పుష్కలంగా ఉంది...’’ మూర్తికి చికాకుగా ఉంది. భారంగా ఉంది. తల పగిలిపోయేలా ఉంది. కొంచెంసేపు బయట గాలిలో ఉంటే ఈ బరువు తగ్గుతుందని బయటకు నడిచాడు. ఎల్ సీఎస్ ఎండీ మాట్లాడుతున్న మాటలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. అదేంటి, ఇంతమందిలో ఒక్కరంటే ఒక్కరైనా ఈ పిల్లలు గెలిచిన మాట వాస్తవమే గానీ, గెలిచిన తీరు మాత్రం అభ్యంతరకరం అని చెప్పరేమిటి? పిల్లలు తెలిసో తెలియకో చేశారు. దానిని ఇంతమంది సమర్ధించడం, పెపైచ్చు పొగడటం మూర్తికి బొత్తిగా నచ్చలేదు. విజయం కంటే విలువలు గొప్పవనీ, సాధించిన విషయంతో పాటు సాధన మార్గం కూడా ముఖ్యమైనదనీ ఆ పిల్లవాళ్లకు ఎవరూ చెప్పడంలేదెందుకు? ఉన్నత స్థానానికి ఎగబాకే క్రమంలో ఉదాత్తతని విస్మరించడం తప్పని వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు? ‘‘ఇప్పుడు ఎమ్మెల్యేగారు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఆ తరువాత క్విజ్ మాస్టర్ని శాలువాతో సత్కరిస్తారు’’ స్పీకర్లో నుండి యాంకర్ మాటలు. ఎమ్మెల్యేని తలచుకోగానే అప్రయత్నంగా పిరదౌసిలోని ‘‘నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే’’ వాక్యం మనసులో మెదిలింది మూర్తికి. గెలుపు కోసం ఈ పిల్లలు చేసిన పనిని ఈయన పెద్ద మొత్తంలో చేశాడు. అవును, ఇలాంటి వాళ్లకు ఈ రోజు ఆ పిల్లలు చేసింది గొప్ప వ్యూహమనిపిస్తుంది. ఈ రోజు ఆ పిల్లలు క్విజ్లో గెలిచి ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రవర్తన వల్ల క్విజ్ ఓడిపోయింది. ఈ ఆలోచన రాగానే మూర్తి ఆడిటోరియమ్ దాటి, ఆఫీస్ బిల్డింగ్ దాటి పార్కింగ్ వైపు అడుగులేస్తున్నాడు. ఇందాకటి నుండి ఒక ప్రశ్న మనసును తొలుస్తోంది. ఇంతకీ డి టీమ్వాళ్లు చేసిన పనికి మూలకారణమేమిటి? విజయం పట్ల మనకున్న విపరీత వ్యామోహమా? విలువల పట్ల మనకున్న సర్దుబాటు ధోరణా? వేగం మీది కోరికతో వాళ్ల వివేకాన్ని హరించిన తన బజర్ రౌండా? ఎదుటివాడు ఏమైనా ఫరవాలేదు, మనం బాగుంటే చాలనే స్వార్థమా? కొన్ని వేల ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పగలిగిన మూర్తికి, ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.బండి స్టార్ట్ చేయాలని చూస్తుంటే ఇందాకటి నుండి, తన చేతిలో ఉన్న పేపర్ అడ్డొచ్చింది. తిప్పి చూశాడు. అది ఆ క్విజ్లో అడగకుండా ఆపివేయబడ్డ చిట్టచివరి ప్రశ్న -‘‘తాము ఓడిపోతామనీ, తద్వారా సెమీస్లో అర్హత కోల్పోతామనీ తెలిసినా, క్రీజు బయట నిలబడిన ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఔట్ చేయకుండా తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్న వెస్టిండీస్ క్రీడాకారుడెవరు?’’ - .జి.ఉమామహేశ్వర్ -
నేరాలపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ముప్పై మూడు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవికృష్ణ శాంతిభద్రతలపై దృష్టిపెట్టారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో మొదటిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలిలా.. సాక్షి: జిల్లా అంతటా పర్యటించినట్లున్నారు? ఎస్పీ: ఇంకా కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. సాక్షి: జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. సాక్షి: ఫ్యాక్షన్ గ్రామాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: గతంలో 81 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది. ప్రస్తుతం లేదు. అయినా గ్రామస్తులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాం. పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అదే విధంగా సీసీఎస్ను పటిష్టపరిచి నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అణచివేస్తాం. సాక్షి: బహిరంగ ప్రదేశాల్లో కొందరు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. చుట్టుపక్కల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు? ఎస్పీ: ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు స్పందించి నా దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా సీసీఎస్ను అలర్ట్ చేశాం. సాక్షి: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టాం. వాహనదారులు, ఆటోవాలాలకు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయంచాం. సాక్షి: మావోల కదలికలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: జిల్లాలో మావోల కదలికలు లేవు. అయినా ప్రత్యేక నిఘా పెట్టాం. సాక్షి: సాయిఈశ్వరుడి హత్య కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఎస్పీ: ప్రత్యేక టీ మ్ను ఏర్పాటు చేశాం. త్వరలో సాయి ఈశ్వరుడిని హత్య కేసులో నిందితులను పట్టుకుంటాం. సాక్షి: మీపై ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఎస్పీ: అలాంటివేమీ లేవు. -
సంబురాల ‘కోట’
ఖిలావరంగల్లో అంబరాన్నంటిన స్వాతంత్య్ర వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన ప్రభుత్వ శకటాల ప్రదర్శన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఖిలా వరంగల్, హన్మకొండ అర్బన్ : స్వాతంత్య్ర వేడుకలతో చారిత్రక ప్రాంతమైక ఖిలావరంగల్ కోట పులకించింది. గతంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, కళాకారులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది ఎక్కువగా ఉండేవారు. కానీ.. జిల్లా చరిత్రలో మొదటిసారిగా ఖిలావరంగల్ కోటలో శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సామాన్యులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మధ్య కోటలోని ఖుష్మహల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులర్పించారు. మామునూరు డీఎస్పీ, పరేడ్ కమాండెంట్ సురేష్కుమార్ ఆధ్వర్యంలో 53 మంది పోలీసులు చేపట్టిన గౌరవ వందనాన్ని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అందుకున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ అధికారులు, సేవా సంస్థ ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోట కళకళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల రాకపోకలతో కోట ప్రాంగణం కళకళాడింది. ఉదయం 10.05 నుంచి 11 గంటల వరకు ప్రభుత్వ శకటాల ప్రదర్శన కొనసాగింది. ఐటీడీఏ శకటం ముందు ఏర్పాటు చేసిన బంజారా నృతం, గ్రామీణాభివృద్ధి శాఖ శకటం ముందు ఏర్పా టు చేసిన బోనాల పండుగ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ సిబ్బంది వంద మీటర్ల త్రివర్ణపతాకంతో చేసిన పరేడ్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ పోలీసులకు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన వాహనాలతో ప్రత్యేక పరేడ్ చేయించారు. ఐదు ద్విచక్ర వాహనాలు, రెండు ఇన్నోవా వాహనాలతో జరిగిన పరేడ్ను ప్రజలు ఆసక్తిగా తిలకిం చారు. అయితే వేడుకల ప్రాంగణంలో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ శకటానికి ప్రథమ బహుమతి ఉత్సవాల్లో వివిధ ప్రభుత్వ శాఖలు తమతమ కార్యక్రమాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయ శాఖ, వైద్యారోగ్యం, డ్వామా, పర్యాటక, సర్వశిక్షాభియాన్, 108, ఆర్డబ్ల్యూఎస్, మైనర్ ఇరిగేషన్, బిందుసేద్యం, పశుసంవర్థక, డీఆర్డీఏ, అటవీ శాఖలు ప్రదర్శించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నారుు. వీటిలో వ్యవసాయశాఖకు ప్రథమ, ఏపీఎంఐపీకి ద్వితీయ, సర్వశిక్షాభియాన్కు తృతీయ బహుమతులు దక్కాయి. కట్టిపడేసిన సాంస్కృతిక ప్రదర్శనలు స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిద పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మొత్తం 900మంది విద్యార్థులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముందుగా ధర్మసాగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులు జయ జయహే తెలంగాణ గేయూనికి బృంద నృత్యం చేశారు. అనంతరం హన్మకొండ సెయింట్పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, వరంగల్ రిషి హైస్కూల్ విద్యార్థులు నిర్వహించిన తీజ్ సంప్రదాయ నృత్యం ఉత్సాహపరిచింది. మల్లికాంబ మనోవికాస కేంద్రం విద్యార్థుల ప్రదర్శన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మడికొండ సాంఘిక సంక్షేమ గురుకులం, వాగ్ధేవి హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శనలో భాగస్వాములయ్యూరు. వల్లంపట్ల నాగేశ్వరరావు అధ్వర్యంలో వివిధ భాషలకు చెందిన దేశభక్తిగీతాలను విద్యార్థులు ఆలపించారు. ముగ్ధుం వ్యాఖ్యానం ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. మల్లికాంబ విద్యార్థులు ప్రథమ, ఫాతిమా ప్రభుత్వ సహాయక పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ధర్మసాగర్ కస్తూర్బా విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారు. మడి కొండ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలవగా... వీరికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని పాఠశాలల విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. వేడుకలకు పటిష్ట బందోబస్తు స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఖిలావరంగల్ కోటను పోలీసుల స్వాధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నగర డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేడుకల బందోబస్తులో ముగ్గురు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 15మంది సీఐలు. 20మంది ఎస్సైలతోపాటు 500 మంది కానిస్టేబుళ్లు బం దోబస్తులో పాల్గొన్నారు. వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్బాస్కర్, అరూరి రమేష్, కలెక్టర్ జి.కిషన్, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళి దాసు, వెంకటేశ్వర్రావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు
* కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో సీఎం చంద్రబాబు * త్వరలో డీఎస్సీ.. ఇకపై ఏటా నోటిఫికేషన్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకులను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతి, విజయవాడలను మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం. 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మార్చి చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతాం. వ్యవసాయ ఉచిత విద్యుత్ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును నాలుగైదేళ్లలో పూర్తి చేస్తాం. రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్గా మారుస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం. కర్నూలుపై వరాల జల్లు... కేంద్రం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీల్లో తొలి నగరంగా కర్నూలును అభివృద్ధి చేస్తాం. నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద 30 వేల ఎకరాల భూమిలో పారిశ్రామిక నగరం ఏర్పాటు. మాన్యుఫాక్చరింగ్, హార్డ్వేర్, ఐటీ పరిశ్రమల ఏర్పాటు. అక్కడే విమానాశ్రయం నిర్మాణం. తుంగభద్ర నదిపై సి.బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద 22 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం. నంద్యాలలోని వ్యవసాయ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా మారుస్తాం. నిమ్స్ తరహాలో ‘రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ను అభివృద్ధి చేస్తాం. ఎవరూ ఊహించనిది జరిగింది:బాబు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారం చేపడుతుందని ఏవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి దానికీ ఓ టైం ఉంటుందని, ఎన్నికల్లో అలా తనకు టైం కలిసొచ్చిందని అన్నారు. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని, అప్పటివరకు హైదరాబాద్లోనే ఉంటానని చెప్పారు. స్వాతంత్య్ర దిన వేడుకల అనంతరం కర్నూలులో కొందరు విలేకరులకు ఏర్పాటు చేసిన తేనీటి విందులో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకంటే ఆంధ్రప్రదేశ్పై తనకే ఎక్కువ అవగాహన ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరు మధ్యనే రాజధాని ఉంటుందని, భూముల సేకరణ పెద్ద సమస్యకాదని చెప్పారు. -
అంతా నవాబుల స్టైల్!
సాక్షి, హైదరాబాద్: ‘చుట్టూ రాజభటులు.. మధ్యలో ముజ్రా నృత్యాలు.. ఒకవైపు నౌబత్ సంగీత వాద్యం.. మరోవైపు ఖవ్వాలీ బృందగానం.. ఇంకోవైపు షెహ్రీ బాజా.. మధ్యమధ్యలో పేరిణి శివతాండవం.. చిందు యక్షగానం.. కొమ్ము కోయ, గుస్సాడి, బంజారా, డప్పు నృత్యాలు.. ఒగ్గుడోళ్ల విన్యాసాలు.. కంచు బూరలు.. ఇంకా మంద హెచ్చుల కథలు...’.. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ఆవిష్కృతమైన దృశ్యమిది. నాటి నవాబుల దర్పానికి అద్దం పట్టేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఇలాంటి దృశ్యాలెన్నో శుక్రవారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న వారికి కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత గోల్కొండ కోటలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కొద్ది మందికే ఆహ్వానం ఉండటంతో... మిగతా వారంతా కోట బయట నిలుచుని వీక్షించేందుకు ప్రయత్నించారు. ఇక కోట లోపలికి వచ్చిన వారంతా ఉదయం నుంచే ప్రారంభమైన జానపద నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలను కళ్లార్పకుండా తిలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పరేడ్ మైదానానికి వెళ్లి సైనిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అటు నుంచి నేరుగా గోల్కొండ కోటకు బయలుదేరారు. సీఎం కాన్వాయ్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే కోట చుట్టూ రాజభటుల వేషధారణలో ఉన్న కళాకారులు తలవంచి నమస్కారం చేయగా.. డప్పులు, సంగీత వాద్యాలు, కంచు బూరలతో మరికొందరు కళాకారులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ సైతం ఉత్సాహంగా అందరికీ అభివాదం చేస్తూ రాణిమహల్ వద్దకు చేరుకున్నారు. ఆయన రాగానే అక్కడున్న విద్యార్థులంతా ‘జై తెలంగాణ, జైహింద్’ అని నినదిస్తూ త్రివర్ణాల బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం సీఎం సరిగ్గా 9.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కేసీఆర్ బయలుదేరుతుండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన కాన్వాయ్ వద్దకు వచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు అదే సమయంలో మజ్లిస్ నాయకులంతా రాణిమహల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చి ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సతీమణితోపాటు కుమార్తె, అల్లుడు కూడా హాజర య్యారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్తోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులంతా గోల్కొండ కోటకు తరలివచ్చారు. -
ముందంజ
స్వాతంత్య్ర వేడుకల్లో సంక్షేమ పథకాలపై మంత్రి ప్రత్తిపాటి కొరిటెపాడు(గుంటూరు) : సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో నిలిచిందని రాష్ట్ర వ్య వసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ప్రజల భాగ స్వామ్యంతోనే నిర్దేశించిన లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని మంత్రి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జిల్లా ప్రగతిని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. పంటల బీమా పథకాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. నాగార్జున సాగర్ జవహర్ కుడి కాలువ ఆధునికీకరణ పనులకు ప్రపంచ బ్యాంకు రూ.4,444 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఈ ఖరీఫ్ సాగుకు 132 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది. గుంటూరు చానల్ ఆధునికీకరణ కోసం రూ.300 కోట్లతోప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 286 కోట్ల అంచనా విలువతో 12 ఎత్తిపోతల పథకాల ద్వారా 29,082 ఎకరాలకు సాగు నీటి వసతి కల్పించనున్నాం. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా 8,376 మందికి రూ.63.87 కోట్లు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల లక్ష్య సాధనలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందింది. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 40 వేల కుటుంబాలకు 50 రోజుల పనిదినాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద సెప్టెంబరు 30వ తేదీలోపు లక్షా 25 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2 నుంచి ఎన్టీఆర్ సుజల పథకం మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అదనపు సంయుక్త కలెక్టర్ కె.నాగేశ్వరరావు, అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు రాజేష్కుమార్, పి.హెచ్.డి.రామకృష్ట, అన్నిశాఖల ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మీ ప్రధాన సేవకుడిని
స్వాతంత్య్ర దిన వేడుకల్లో నరేంద్రమోడీ ప్రకటన ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తాం.. సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం పేదలకు ‘జన ధన యోజన’ పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం ఎంపీల ద్వారా ‘ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పథకం’ అమలుచేస్తాం యువత నైపుణ్యాల కోసం ‘స్కిల్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం పరిశుభ్రమైన భారత్ కోసం అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకం తొలి ఏడాది పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణం మతం, కులం ప్రాతిపదికగా హింస ఇంకెన్నాళ్లు? పదేళ్ల పాటు వదిలేద్దాం ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే దాన్ని నాణ్యతకు మారుపేరుగా నిలపాలి పౌరులను సాధికారం చేయడానికి ‘డిజిటల్ ఇండియా’ను రూపొందిస్తాం ప్రభుత్వంలో శాఖల మధ్య అంతరాలనే గోడలు బద్దలుకొడుతున్నా పార్లమెంటులో సంఖ్యా బలంతో కాదు.. ఏకాభిప్రాయంతో నడిపిస్తాం జాతీయ పతాకావిష్కరణ అనంతరం మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం... - 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశ 68వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచే జాతినుద్దేశించి 65 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే.. తాను మాట్లాడే పోడియానికి బులెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని మోడీ తిరస్కరించటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి బులెట్ ప్రూఫ్ అద్దాల గది నుంచి ప్రసంగిస్తుండగా.. మోడీ తొలిసారి ఆ రక్షణ లేకుండా ప్రసంగించారు. రెండు నెలల కిందటే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ.. ఎర్రకోట నుంచి చేసిన తన తొలి ప్రసంగంలో.. దేశాభివృద్ధికి, ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తాను చేపట్టదలచుకున్న కార్యక్రమాలను, ఆలోచనలను వివరించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రణాళికా సంఘం రద్దు: అంతర్గతంగా, అంతర్జాతీయంగా మారిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను తీసుకువస్తాం. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యత గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. అతి త్వరలో ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పుతాం. కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరం. అది.. ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యాన్ని, యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సృజనాత్మకతతో పాటు.. తాజా ఆవిష్కరణలు, ఆలోచనలు, ఆశలను తీసుకొస్తుంది. పదేళ్ల పాటు హింసను వదిలేద్దాం: స్వాతంత్య్రం తరువాత కూడా మతం, కులం ప్రాతిపదికగా హింసను మనం చూస్తున్నాం. ఇలా ఎంత కాలం? ఇక గొడవలు, హత్యలు చాలు. దేశ ప్రగతి కోసం నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. హింసపై పదేళ్ల పాటు మారటోరియం ఉండాలి. కనీసం ఒక్కసారైనా. తద్వారా మనం ఈ రుగ్మతల నుంచి బయటపడతాం. మనం హింసా మార్గం వీడి.. సౌభ్రాతృత్వపు మార్గం అనుసరిస్తే.. అభివృద్ధి చెందుతాం. కొడుకులపైనా ఆంక్షలు పెట్టాలి... అత్యాచారాల సంఘటనలు తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు మన తలలు సిగ్గుతో వాలిపోతాయి. ప్రతి ఇంటిలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెలను చాలా ప్రశ్నలు అడుగుతారు. కానీ.. వారు వారి కొడుకులను ఇవే ప్రశ్నలు అడుగుతారా? అత్యాచారం చేసేవాళ్లు కూడా ఒకరికి కొడుకులే కదా? అతడికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుల మీద ఆంక్షలు పెడితే.. ఇక అత్యాచారాలకు పాల్పడేవాళ్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులు ఉండరు. సర్కారులో గోడలు బద్దలుకొడుతున్నా.. నేను ఢిల్లీకి బయటి నుంచి వచ్చాను. ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో లోపలి నుంచి చూశాను. నా వ్యాఖ్యలను రాజకీయ దృక్కోణం నుంచి చూడకూడదు. ప్రభుత్వంలో అంతర్గతంగా డజన్ల కొద్దీ ప్రభుత్వాలు చూసి దిగ్భ్రాం తికి లోనయ్యా. శాఖలను వారి వ్యక్తిగత సామంతరాజ్యాలుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఒకే విభాగంగా చేయడానికి నేను ఈ గోడలను బద్దలుకొట్టడం మొదలుపెట్టా. పరిశుభ్రమైన భారత్ కోసం పథకం... దేశాన్ని పరిశుభ్రంగా చేసే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2019 లో మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. సంసద్ ఆదర్శ గ్రామ యోజన... పార్లమెంటు సభ్యుల ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఎంపీలు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 2016 నాటికి దానిని ఆదర్శ గ్రామంగా రూపొందించాలి.’’ అది దేశ ఆర్థిక గతిని నిర్దేశించిన ‘సంఘం’ ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్లాల్నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికాసంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించటం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది.. రాజకీయ మహామహులే. ఆ పదవిలో ఉన్న వారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్నందా, వి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్సింగ్, ప్రణబ్ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్సింగ్, మధుదండావతే, మోహన్ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చివరి ఉపాధ్యక్షుడు మాంటెక్సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990 ల్లో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యత కనుమరుగైంది. ప్రధానమంత్రి జన ధన యోజన దేశంలోని కోట్లాది మందికి ఫోన్లు ఉన్నాయి కానీ బ్యాంకు ఖాతాల్లేవు. ఈ పరిస్థితి నుంచి మార్పు తేవాలి. ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పేరుతో పేద కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు, ఒక డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా వర్తింపు పథకాన్ని అమలు చేస్తాం. పేద ప్రజలు, ప్రత్యేకించి రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు వారికి బ్యాంకింగ్ సేవలు అందించాల్సిన అవసరముంది. ఆర్థికాభివృద్ధి పేదలకు ప్రయోజనం అందించటం ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ‘స్కిల్ ఇండియా’ కోసం ఉద్యమం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచే నైపుణ్యాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ‘స్కిల్ ఇండియా (నైపుణ్య భారత్)’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. యువత పరిశ్రమలను నెలకొల్పే స్ఫూర్తిని వెలికితీసి.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వివిధ వస్తువులను దేశంలోనే తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనేదాన్ని నాణ్యతకు మారుపేరుగా మార్చాలి. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడేలా భారత్లో పెట్టుబడులు పెట్టటానికి ప్రపంచవ్యాప్తంగా గల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించటానికి ‘భారత్ వచ్చి తయారు చేయండి’ అనే పిలుపునిస్తున్నాం. దేశాన్ని రైల్వే కలుపుతుందనేది ఒకప్పటి మాట. దేశ ప్రజలను కలిపే శక్తి ఐటీకి ఉందని నేను చెప్తున్నా. దేశం కోసం మా కల.. డిజిటల్ ఇండియా. పౌరులను సాధికారులను చేయడానికి సమాచార సేవలను సమయానికి, సమర్థవంతంగా అందించటానికి డిజిటల్ ఇండియాను రూపొందించే లక్ష్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు
కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయలేదు. దీంతో చాలా సమస్యలొచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విద్వేషాలు పెంచుకోవడం తెలుగు జాతికి మంచిది కాదు. హైదరాబాద్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాం.. ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తాం మెగా సిటీలుగా విశాఖ, తిరుపతి, విజయవాడ.. జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు, 14 పోర్టుల అభివృద్ధి అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాల అమలు ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా ఆరోగ్యశ్రీ.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీరు వచ్చే నెల నుంచి ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్కార్డులు.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఆర్బీఐ అడ్డంకులు సృష్టించినా రుణాలు మాఫీ చేస్తాం ఒక్కో సంఘానికి రూ. లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీ.. ఎస్సీ, ఎస్టీల ఇతర రుణాలూ మాఫీ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, గౌరు చరిత, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్య, బీసీ జనార్థన్రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు శిల్పామోహన్రెడ్డి, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొనలేదు. సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సీఎంతోపాటు వేదిక మీద ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకలను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం జిల్లాకొక పర్యాటక ప్రాజెక్టు రూపొందిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం విశాఖ, తిరుపతి, విజయవాడలను మిగతా 2వ పేజీలో ఠ మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం - 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. తద్వారా మన రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు, దిగుమతులు చేయొచ్చు - అన్ని గ్రామాలకు రోడ్లు, అన్ని ఇళ్లకు కేబుల్, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తాం. పైప్లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ ఇస్తాం - రాష్ట్రాన్ని సిలికాన్ ఆంధ్రప్రదేశ్గా మారుస్తాం. ప్రపంచంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. జిల్లాకొక హైదరాబాద్, సైబరాబాద్ను అభివృద్ధి చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం - రాజధాని పేరతో 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది - అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం - ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మారుస్తాం. చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచుతాం - ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని సరఫరా చేస్తాం - వ్యవసాయ ఉచిత విద్యుత్ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత సరఫరాను అమలు చేస్తాం - అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం - వృద్ధాప్య పింఛన్లను రూ. 1,000కు, వికలాంగుల పింఛన్లను రూ. 1,500కు పెంచి అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తాం. ఎన్టీఆర్ కేంటీన్లు కూడా అదే రోజున ప్రారంభిస్తాం. ఈ పథకం కింద రూ. 5కే భోజనం అందిస్తాం. తొలుత మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తాం - ధరలను నియంత్రిస్తాం. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశాం - ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం ద్వారా పేదలకు చౌకగా నిత్యావసర సరకులు అందిస్తాం. ధరలు పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది - ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది - రైతుల రుణాలు ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తాం. ఆర్బీఐ అడ్డంకలు సృష్టించినా రుణ మాఫీపై వెనక్కి తగ్గం. డ్వాక్రా రుణాలు సంఘానికి రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న ఇతర రుణాలనూ మాఫీ చేస్తాం. - ప్రతి ఇంట్లో కనీసం ఒక డ్వాక్రా గ్రూపు సభ్యురాలు ఉండేలా చర్యలు చేపడతాం. ఇసుక మైనింగ్ను డ్వాక్రా సంఘాలకే ఇవ్వనున్నాం - పింఛన్లు, రేషన్, స్కాలర్షిప్లు, పక్కా ఇళ్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలూ ఆన్లైన్లోనే అమలుచేస్తాం. ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా రాష్ట్రంలో దాదాపు నూరు శాతం పూర్తయింది - పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. ఒక కుటుంబం ఆనందంగా జీవించడానికి అనుకూలంగా పక్కా ఇంటిని మెరుగుపరుస్తాం - వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంవల్ల కూలీల ఖర్చు తగ్గిస్తాం. భూసార పరీక్షలు చేసి, వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగేలా చర్యలు చేపడతాం - పోలవరం ప్రాజెక్టును నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువు లేకుండా చేయవచ్చు - రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్గా మారుస్తాం. సీమలో జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించి సమీపంలోని ఓడరేవులతో అనుసంధానం చేసి 4 జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం - పరిశ్రమలు, పెట్టుబడులే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది - పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సవరించి మరింత మెరుగ్గా అమలు చేస్తాం. - త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం - బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ అమలు చేస్తాం. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలనూ ఆదుకుంటాం - శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడం. అరాచక శక్తులను, శాండ్, లాండ్, మైన్, వైన్ మాఫియాలను అణచివేస్తాం. బెల్టు షాపుల నిర్మూలనకు చర్యలు చేపట్టాం. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం - సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారి మీద పెట్టిన కేసులు దశలవారీగా ఎత్తేస్తాం - రూ. 15 వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కొత్త రాష్ట్రంలో పునాదుల నుంచి నిర్మాణం మొదలుపెట్టాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అంతకు మించిన వనరులూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. అన్ని వనరులు, అవకాశాలను వాడుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దా. ఇందులో ప్రజల సహకారం చాలా అవసరం. మీ అండదండలు నాకు ఇవ్వండి - దేశ విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులూ (ఎన్నారైలు) మాతృభూమికి రండి. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా రాష్టాన్ని నిర్మించుకుందాం -
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, కర్నూలు/అర్బన్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలతో కర్నూలు నగరం మురిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖుల రాకతో ఉత్సవం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అధికారుల ముందస్తు ప్రణాళిక.. సమష్టి సహకారంతో సంబరం అంబరాన్నంటింది. పోలీసుల పక్కా వ్యూహం ఫలించగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. రాష్ట్ర స్థాయి వేడుకలకు నగరం వేదిక కాగా.. తిలకించేందుకు ప్రతి ఒక్క హృదయం తపించింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరికీ అవకాశం దక్కకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేసినా.. ఎనిమిది ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై జెండా పండుగ వీక్షించడం ప్రజలకు సరికొత్త అనుభూతికి లోనుచేసింది. ఉదయం 7 గంటల నుంచే స్థానికులు స్క్రీన్ల వద్దకు చేరుకోవడం కనిపించింది. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో కర్నూలును రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది. కరువు రక్కసి కోరలు చాస్తున్న వేళ.. ‘అభివృద్ధి’ మాటతో.. రాజకీయ చతురతతో బాబు వరాల వర్షం కురిపించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం 8.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలు దేరింది. ఫైవ్రోడ్డు జంక్షన్, ఆనంద్ థియేటర్ సర్కిల్, కొత్త బస్టాండు మీదుగా కాన్వాయ్ పెరెడ్ మైదానానికి చేరుకుంది. రెండో బెటాలియన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. నవ్యాంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న తొలి వేడుక కావడంతో పోలీసు శాఖ ఒళ్లంతా కళ్లు చేసుకుంది. ఏపీఎస్పీ మైదానం, చుట్టుపక్క ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు.. ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. పెరేడ్ మైదానం చుట్టూ ఉన్న కాలనీలు.. బహుళ అంతస్తుల భవనాలపైనా నిఘా ఉంచడంతో అడుగడుగునా పోలీసులే కన్పించారు. ఏపీఎస్పీ మైదానంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు సహా సామాన్యులను, విద్యార్థులను ఒకటికి రెండు సార్లు తనిఖీ నిర్వహించి అనుమతించారు. ఐదు ప్రధాన ద్వారాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ బలగాలను మోహరించారు. మొత్తం వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
కోటలో తొలిసారిజెండా పండుగ
సాక్షి, హన్మకొండ : కాకతీయుల కోట వేదికగా స్వాతం త్య్ర వేడుకలు కనుల పండువగా జరగనున్నాయి. 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఖిలావరంగల్ ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 9గంటలకు కాకతీయ కీర్తితోరణాలు, ఖుష్మహల్ మధ్యన ఉన్న ఖాళీ స్థలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను డిప్యూటీ సీఎం సన్మానిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదికగా ఖిలావరంగల్ను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. పోలీసులు, సైనిక దళాల కవాతు చేసేందుకు ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీఐపీలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు ఈ వేడుకలు తిలకించేందుకు అనువుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థలాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు కళారూపాలను, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలకు ఉపముఖ్యమంత్రి ప్రశాంస పత్రాలను అందిస్తారు. ఈ వేడుల సందర్భంగా పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతా వ్యవహారాలను ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు, పది మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 20మంది ఎస్పైలతో పాటు వివిధ విభాగాలకు చెందిన కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. ఇండోర్ స్టేడియంలో అట్ హోం వేడుకలు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సాయంత్రం 5గంటలకు హన్మకొండ ఇండోర్ స్టేడియంలో అట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సెయింట్పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, అతిథి మానసిక వికలాంగుల కేంద్రం, ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల, కరీమాబాద్ సీవీ హైస్కూల్, హసన్పర్తి సూజాత విద్యానికేతన్ హైస్కూల్, మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సెయింట్ థామస్ గ్రామర్ హైస్కూల్, నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలభవన్, శ్లోకా హైస్కూల్కు చె ందిన విద్యార్థులు కళా ప్రదర్శలను ఇస్తారు. గర్వించదగ్గ రీతిలో వేడుకలు : కలెక్టర్ ఖిలావరంగల్ : కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో 68వ స్వాతంత్య్ర వేడుకలు జిల్లా ప్రజలు గర్వంచదగ్గరీతిలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ కిషన్ తెలిపారు. ఖిలావరంగల్ కోటలో పంద్రాగస్టు వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ కిషన్, నగర పాలక సంస్థ క మిషనర్ సువర్ణపాండదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక ప్రాంతాలలోనే 68వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణరుుంచిందని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేడుకలు కోటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖుష్మహల్ పక్కనే ఉన్న స్థలంలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు, సామన్య ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ ఎస్పీ యాదయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సురేంద్రక రణ్, ఆర్డీఓ మాధవరావు ఉన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
- గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబు - ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి గుంటూరు క్రైం : స్వాతంత్య్ర వేడుకలకు గుంటూరులోని పోలీస్ మైదానం ముస్తాబయింది. 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వేదికతోపాటు, పోలీస్ గౌరవ వందనం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు, అతిథులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్మించిన శకటాలను మైదానంలో సిద్ధంగా ఉంచారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ఎమ్యెల్యేలు, కలెక్టర్,ఎస్పీలు, వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చే శారు. వీఐపీల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.ఏర్పాట్లను అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట ఏఆర్ డీఎస్పీ బి.సత్యనారాయణ, తహశీల్దారు టి. మోహన్రావు వున్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొననున్న జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న స్వాతంత్య్ర దిన వేడుకలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. -
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.34.34 కోట్ల ఆస్తుల పంపిణీ
చిత్తూరు (సెంట్రల్): జిల్లా పోలీసు గ్రౌండ్లో శుక్రవారం జరగనున్న స్వా తంత్య్ర వేడుకల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల విలువైన ఆస్తుల ను పంపిణీ చేయనున్నారు. జిల్లా మం త్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 77,424 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందులో డీఆర్డీఏ ద్వారా 526 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.20 కోట్లు రుణ సా యంగా అందించనున్నారు. 77,355 మందికి బీమా, ఉపకార వేతనాలుగా రూ.9.17 కోట్లు, పట్టణ ఇందిర క్రాం తిపథంలో 141 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్లు, వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం నిర్వహణ కోసం, మిని ఎస్ఎంఎస్ ఆర్ఐ కింద రూ.2.62 లక్ష లు అందించనున్నారు. వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ట్రైసైకి ళ్లు, శ్రవణయంత్రాలు 25 మందికి రూ.1 లక్ష విలువ కలిగినవి అందించనున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా కులాంతర వివాహం చేసుకున్న 13 జంటలకు రూ.6.1 లక్షలను ప్రో త్సాహకంగా అందించనున్నారు. పట్టు పరిశ్రమశాఖ ద్వారా అధికోత్పత్తి మల్బరీ నారు, పట్టు పురుగుల పెంపకగృహ నిర్మాణం కోసం, రేరింగు పరికరాలకు ఇతరత్రా వాటి నిమిత్తం 25 మందికి 5 లక్షల రూపాయలను అం దించనున్నారు. వీటితో ఆయా శాఖలు అందించే పథకాలను తెలిపేందుకు 9 స్టాళ్లను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. -
రేపు భూపంపిణీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ చేయనున్న భూములను గుర్తించారు. లబ్ధిదారులకు ప్రాథమిక స్థాయిలో హక్కు పత్రాలు ఇచ్చి.. తర్వాత పూర్తి స్థాయి రికార్డు డాక్యుమెంట్లు ఇవ్వాలా... లేక అదే రోజు పూర్తి స్థాయిలో పత్రాలు ఇవ్వాలా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. రెవెన్యూ పరంగా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా వీటి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15న భూముల పంపిణీకి సంబంధించి జిల్లాలో 64 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో ఐదుగురు మహిళలకు హైదరాబాద్లోని గోల్కొండలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేతుల మీదుగా భూముల పత్రాలు ఇవ్వనున్నారు. మరో ఐదుగురు మహిళలకు జిల్లా కేంద్రంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, జిల్లా కలెక్టర్ అందజేయనున్నారు. మిగిలిన వారికి ఆయా నియోజకవర్గాల్లో జరగనున్న కార్యక్రమాల్లో భూముల పంపిణీ పత్రాలు ఇవ్వనున్నారు. పూర్తిగా భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాలు, ఎకరం ఉంటే రెండు ఎకరాలు, రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరం చొప్పున ప్రభుత్వం భూములు పంపిణీ చేయనుంది. నర్సంపేట నియోజకవర్గంలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. స్టేషన్ఘన్పూర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15న పంపిణీ చేయనున్న భూముల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేసింది. భూముల కొనుగోలు కోసం రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. పూర్తిగా సాగుకు యోగ్యంగా ఉండే భూములనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసే భూముల విషయంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నా యా, భూముల రకాలు వంటి అంశాలతోపాటు రెవెన్యూ పరంగా ఉండే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార వర్గాల సమచారం ప్రకారం జిల్లాలో భూములు పంపిణీ చేయనున్న పది నియోజకవర్గాల్లోని గ్రామాలు ఇవీ... స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండలం పీసర గ్రామంలో భూ పంపిణీ పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మొగుళ్లపల్లి మండలం పిడిసిల్లలో భూములు పంపిణీ చేయనున్నారు. పంపిణీకి అవసరమైన భూములను ఇక్కడ సేకరించే పక్రియ చివరి దశలో ఉంది. జనగామ నియోజకవర్గంలో నర్మెట మండలం అమ్మాపూర్లో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ అవసరమైన భూములను కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలం పొనుగోడులో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న భూములను గుర్తించి పంపిణీ అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలం బాంజిపేటలో భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. డోర్నకల్ నియోజకవర్గంలో మరిపెడ మండలం బీచరాజుపల్లిలో భూములను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో సంగెం మండలం రా మచంద్రాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. ఇక్కడే పంపిణీకి అనువుగా ఉన్న భూములను గుర్తించి సేకరిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కొడకండ్ల మండలం నర్సింగాపురంలో దళిత మహిళలకు భూములు పంపిణీ చేయనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్వతగిరి మండలం వడ్లకొండలో భూముల పంపిణీ కార్యక్రమం జరగనుంది. దీని కోసం రెవెన్యూ అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ములుగు నియోజకవర్గం ములుగు మండలం కాసిందేవిపేటలో భూములు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి భూముల విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
వెలుగు..జిలుగులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర విభజనానంతరం నిర్వహిస్తున్న మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకలకు కర్నూలు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జెండా పండుగకు వేదికైన ఏపీఎస్పీ మైదానంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదిక ఎదుట ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహం.. ఇరువైపుల తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బుధవారం నిర్వహించిన మాక్ వేడుకలో పంద్రాగస్టు కళ కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్ర డీజీపీ రాముడు, జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మొత్తం 14 కంటింజెంట్లను ప్రదర్శించారు. జెండావిష్కరణ అనంతరం అవార్డులు, గ్రూప్ ఫొటో సెషన్ సాఫీగా సాగింది. చరిత్రలో నిలిచిపోయేలా వేడుక నిర్వహణకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసి డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం వినియోగించిన భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కొండారెడ్డి బురుజు, తెలుగుతల్లి విగ్రహం, స్వామి వివేకానంద, దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్రెడ్డి, ఎన్టీఆర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి. వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం, హైకోర్టు జడ్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు ఒక రోజు ముందుగానే కర్నూలుకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి బసకు ప్రభుత్వ అతిథిగృహం సిద్ధమైంది. సుమారు రూ.30 లక్షలతో పాత భవనానికి మరమ్మతులు చేపట్టారు. ముఖ్యులకు నగరంలోని ప్రధాన హోటళ్లలో బస ఏర్పాటు చేయగా, మరికొందరికి ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతి కల్పించారు. ఇప్పటికే నగరం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అడుగడుగున గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కోర్కెల చిట్టాతో తమ్ముళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందుగానే కర్నూలుకు వస్తుండటంతో టీడీపీ నేతలు తమ కోర్కెల చిట్టాను ఆయన ముందుంచేందుకు సిద్ధమయ్యారు. నామినేటెడ్ పదవులు, పనులు, అధికారుల మార్పు తదితరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అమలులో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రజల్లో తిరిగేందుకు జంకే పరిస్థితి నెలకొంది. తాత్కాలిక రాజధానిగా విజయవాడ తెరపైకి రావడంతో కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ ఇక్కడ ఉద్ధృతమవడం నేతలను కలవరపరుస్తోంది. వీటిపై అధినేత ఎలా స్పందిస్తారోనని తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్తో ఉద్యమకారులు, విద్యార్థులు సీఎంను కలిసే అవకాశం ఉంది. -
పోలీసు గుప్పిట్లో..
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పంద్రాగస్టు వేడుకలకు కర్నూలు నగరం వేగంగా ముస్తాబవుతోంది. నవ్యాంధ్రప్రదేశ్లో మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తుండటంతో అధికార యంత్రాంగంప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే విధంగా పోలీసులకు ఈ వేడుకలు పెను సవాల్గా మారాయి. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధాని కర్నూలును చేయాలనే డిమాండ్ ఊపందుకోవటం, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు జోరందుకోవటంతో బందోబస్తు పెంచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీసు బలగాలను కర్నూలుకు రప్పించారు. మంగళవారం సాయంత్రానికి వీరు నగరానికి చేరుకుని ఏపీఎస్పీ పటాలంతో పాటు నగరాన్ని గుప్పిట్లో తీసుకున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, నల్లమల అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కర్నూలులో తిష్టవేసి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కర్నూలుకు విచ్చేస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శకటాలు సిద్ధం..: స్వాతంత్య్ర వేడుకలకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాలను ప్రదర్శించనున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జంబోషెడ్లో వీటి తయారీ ముమ్మరంగా సాగుతోంది. ప్లానింగ్, ఇరిగేషన్, పురపాలక శాఖ, ఎన్ఆర్ఈజీఎస్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమల శాఖ, సమాచార, సాంకేతిక శాఖ, వైద్యారోగ్య శాఖ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, టూరిజం, డ్వాక్రా, పోలీస్, ట్రాన్స్ కో, అటవీశాఖల శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఏపీఎస్పీ క్యాంప్లో వేదికను హైదరాబాద్కు చెందిన వారు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా వీవీఐపీలు, వీఐపీ గ్యాలరీలను నిర్మిస్తున్నారు. పరేడ్ మైదానంలోని ఏపీఎస్పీ పోర్ట్గేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ చిహ్నమైన తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూడళ్ల అలంకరణ, రహదారులకు మెరుగులు ముమ్మరంగా సాగుతున్నాయి. మైదానంలో లైటింగ్, స్టేజ్ మైక్సెట్ ఇతర అవసరాల కోసం విద్యుత్శాఖ రూ.13 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు. మూడు 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, మూడు 125 కేవీఏ జనరేటర్లు, అర కి.మీ మేర 15 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి తీగలు లాగారు. 15నే గవర్నర్, ముఖ్యమంత్రి రాక? గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 15న ఉదయం కర్నూలుకు చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు ఓ రోజు ముందుగానే కర్నూలుకు చేరుకుంటారు. వీరికి ఏపీఎస్పీ పటాలంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఏ, బీ షామీయానాల కింద కూర్చొంటారు. సీ-షామియానా కింద ఏపీఎస్పీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పోలీసు, రెవెన్యూ అధికారుల కుటుంబ సభ్యులు కూర్చొంటారు. డీ-షామియానా కింద విద్యార్థులు, ప్రజలు ఉంటారు. జెండా వందన కార్యక్రమం అనంతరం అవార్డులు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఓ పది నిమిషాలపాటు ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్సియల్ పాఠశాలల విద్యార్థులతో భారతీయం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 కంటింజెంట్లు పాల్గొంటాయి. వాటిలో ఎనిమిది ఆర్మ్, మరో ఆరు నాన్ ఆర్మ్ కంటింజెంట్లు ఉంటారు. ఒక్కో కంటింజెంట్లో 36 మంది ఉంటారు. అదే విధంగా 1953-56 మధ్య కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని చారిత్రిక ఘటనలు, వివిధ అంశాలను అందరూ తెలుసుకునేలా ఓ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. బందో‘మస్తు’: స్వాతంత్య్ర దినోత్సవం ముందు రోజు ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంతంలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు సందర్శకులుగా వచ్చి వెళ్లేవారిపై పోలీసులు డేగకన్ను సారించారు. ఏపీఎస్పీ బెటాలియన్లో ప్రధాన ద్వారం వద్దే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పటాలంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలపై నిఘా పెట్టారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో స్కాన్ చేస్తున్నారు. కర్నూలు నగరంలో వాహనాల రాకపోకలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి.. పటిష్ట భద్రత ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి బుధవారం నుంచి రిహార్సల్స్ నిర్వహించనున్నారు. వేడుకలను కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, జేసీ కన్నబాబు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
కాకతీయుల కోటలో మువ్వన్నెల జెండా
ఖిలా వరంగల్లో పంద్రాగస్టు వేడుకలు సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్లో ఖుష్మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. -
గోల్కొండ కోట ఓకే అంటూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పంద్రాగస్టు వేడుకలు పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండ కోటకు మార్పు ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. రుణమాఫీ, దళితులకు భూ పంపిణీ, గవర్నర్కు ప్రత్యేక అధికారాలు, గవర్నర్ల అడ్వైజర్ల నియామకం, ఎంసెట్పై సుప్రీం తీర్పుపై కేబినెట్ చర్చించింది. రుణమాఫీపై రిజర్వు బ్యాంక్ అధికారుల దగ్గరికి ప్రభుత్వాధికారుల బృందాన్ని పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో ఆయా జిల్లాల మంత్రులు జెండా ఎగురవేయనున్నారు. ప్రాతినిధ్యం లేని మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్, ఖమ్మంలో మంత్రి పద్మారావు జెండా ఎగురవేయనున్నారు. -
'గోల్కొండ కోటపైనే పంద్రాగష్టు వేడుకలు'
హైదరాబాద్: పంద్రాగష్టు వేడుకలు గోల్కొండ కోటపైనే జరుగుతాయని తెలంగాణ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్మిశ్రా స్పష్టం చేశారు. రాణీమహల్ను ఆగష్ట్ 15 వేడుకల ప్రదేశంగా గుర్తించామని ఆయన మీడియాకు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ, ఆర్మీకి లేఖలు రాసిందని అజయ్ మిశ్రా తెలిపారు. వేడుకల కోసం వారి నుంచి అనుమతి పొందడం లాంఛనప్రాయమేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఏపీ స్వాతంత్య్ర దినోత్సవాల ఖర్చు రూ. 5 కోట్లు
కొత్త రాజధాని ఏర్పడే వరకు కర్నూలులోనే స్వాతంత్య్ర, రిపబ్లిక్డే వేడుకలు కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు నగరంలో తొలిసారిగా ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏర్పాట్లు స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (ఎస్ఏపీ) క్యాంప్ మైదానంలో చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను ఆగస్టు 5వ తేదీలోగా పూర్తి చేయాలనే పట్టుదలతో అధికార యంత్రాంగం ఉంది. రోడ్లు, భవనాల శాఖ, మున్సిపాలిటీ, సమాచార, తదితర శాఖల ద్వారా చేపట్టనున్న ఏర్పాట్లకు రూ. 3.50 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోలీసు, ఇతర శాఖల ద్వారా మరో రూ. 1.50 కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు సీనియర్ అధికారులు రానున్నారు. 13 జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పడేంత వరకు కర్నూలులోనే స్వాతంత్య్ర, రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
శరవేగంగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో నిర్వహిస్తున్న మొదటి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా అధికారులకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబు ఆదేశించారు. బుధవారం ఎస్ఏపీ క్యాంపు సమావేశ భవనంలో ఆయన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు అధికారులు ఎస్ఏపీ క్యాంపు మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవే క్షించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కన్నా ఎస్ఏపీ క్యాంపస్ చిన్నదిగా ఉందని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రౌండ్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ మూర్తిని ఆదేశించారు. వీవీఐపీలకు టాయిలెట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదుపాయాలన్నీ ఈ నెల 31 లోపు పూర్తి చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ బసవయ్యను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ఎంకు, పెరేడ్ గ్రౌండ్లో అంబులెన్స్ ఉండాలని జిల్లా వైద్యాశాఖ అధికారికి ఆదేశించారు. వీవీఐపీలకు సంబంధించిన బ్లడ్గ్రూపులను అందజేస్తామని, అందుకనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చుదిద్దుతున్నామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి వివరించారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని, వీవీఐపీలకు ప్రభుత్వ, ఎస్ఏపీ క్యాంపు అతిథి గృహాలు, సస్య, ఎస్వీ రెసిడెన్సీ, డీవీఆర్ హోటళ్లలో విడిది కల్పించనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు దానకిషోర్ మాట్లాడుతూ గ్రౌండ్ను బట్టి శకటాలను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చదివే ప్రసంగ పాఠాన్ని తయారు చేస్తామని చెప్పారు. సమావేశంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి రాజేశ్వరి తివారీ, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, కమాండెంట్ విజయకుమార్, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో పోలీస్బాస్
కర్నూలు: రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు సీమ ముఖద్వారంలో నిర్వహించాలని తలపెట్టడంతో రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ జాస్తి వెంకట్రాముడు బుధవారం కర్నూలుకు వచ్చారు. ఇంటలిజెన్స్ అడిషినల్ డీజీపీ అనురాధ, ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషినల్ డీజీపీ గౌతమ్ సవాంగ్, రాయలసీమ ఇన్చార్జి ఐజీ వివి.గోపాలక్రిష్ణ తదితరులతో కలిసి ఏపీఎస్పీ రెండో పటాలాన్ని పరిశీలించారు. పటాలంలోని మైదానమంతా కలియదిరిగి ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించినందున ఏర్పాట్లకోసం నిధులు ఎంత అవసరమవుతాయో అంచనాలు సిద్ధం చేసి పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. మునిసిపల్, రోడ్ల భవనాలు, ఎలక్ట్రికల్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో స్వాతంత్య్ర వేడుకలను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సభావేదిక, జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన దిమ్మె ఏర్పాట్లు ఎలా ఉండాలనే దానిపై అధికారులతో చర్చించారు. స్వాతంత్య్ర వేడుకలకు బెటాలియన్లో ట్రైనింగ్ సెంటర్ మైదానాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆమోదానికి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శకటాల ప్రవేశం, పెరేడ్ నిర్వహణ, హెలిపాడ్ నిర్మాణం తదితర వివరాలను ఏపీఎస్పీ డీఐజీ ప్రసాద్బాబు వివరించారు. అనంతరం జిల్లా యంత్రాంగం రూపొందించి న రూట్ మ్యాప్ను పరిశీలించారు. వీఐపీల గ్యాలరీ, వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే షామియానాలు తదితర వాటిని కూడా ఎక్కడెక్కడ ఉండాలనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలించారు. పటాలానికి రెండు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలని, ఒకవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్, మరో వైపు వీఐపీల ప్రవేశం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీఐపీలు, వీవీఐపీల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై కూడా ఇంటలిజెన్స్ అధికారులతో చర్చించారు. డీజీపీ పర్యటన సాగిందిలా... డీజీపీ హైదరాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు కర్నూలుకు చేరుకున్నారు. 6.30 గంటల వరకు ఏపీఎస్పీ మైదానంలోనే గడిపారు. హైదరాబాద్ నుంచి బాంబ్ డిస్పోజల్ టీమ్ డీఎస్పీ భద్రయ్య నాయకత్వంలో కర్నూలుకు చేరుకుంది. వారితో కూడా భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. స్వాతంత్య్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని బెటాలియన్స్కు సంబంధించిన సాయుధ బలగాలు జిల్లాకు వస్తున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించారు. బెటాలియన్ కమాండెంట్ విజ య్కుమార్ కార్యాలయంలో కూడా అరగంట పాటు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కర్నూలు డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, ఎస్ఐబీ డీఐజీ పీవిఎస్.రామక్రిష్ణ, కలెక్టర్ సుదర్శన్రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వివిఎస్.మూర్తి, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, నంద్యాల ఏఎస్పీ సుప్రత్ సింగ్, కర్నూలు డీఎస్పీ మనోహర్రావు, హోంగార్డ్స్ డీఎస్పీ కృష్ణమోహన్ సమావేశంలో పాల్గొన్నారు.