
సాక్షి, ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన ప్రజాసంకల్పయాత్రను పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామాపురం మీదుగా గుదేవారిపాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడి నుంచి పాదయాత్ర హజీస్పురం వరకు కొనసాగుతుంది. హజీస్పురంలో వైఎస్ జగన్ జనంతో మమేకం కానున్నారు. ఇప్పటివరకు వైఎస్ జగన్ 1275.9కిలో మీటర్లు నడిచారు. రాజన్న బిడ్డతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment