గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డుకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటరమణ 182 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు.
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ 31 వార్డుకు జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటరమణ 182 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థికి పట్టంకట్టారు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు వెంకటరమణ విజయం సాధించినట్లు ప్రకటించారు.