అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రసాద్రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రసాద్రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్లను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ జిల్లా ఎస్పీ రాజేశేఖరబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రసాద్రెడ్డి హత్య నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)ని బుధవారం రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపిన విషయం తెలిసిందే.