
డీసీసీబీ చైర్మన్ పీఠం మాదే:అమర్నాథ్ రెడ్డి
కడప : ఎర్రచందనం కేసులు పెడతామంటూ డీసీసీబీ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లను టీడీపీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న సొసైటీలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా డీసీసీబీ చైర్మన్ పీఠం తామే దక్కించుకుంటామని అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. కాగా కోరం లేక డీసీసీబీ అధ్యక్ష ఎన్నిక ఆదివారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.