ఆ ఒక్కరోజే 41వేల బైకుల అమ్మకం! | 41,000 units sold on Akshaya Tritiya, reveals Honda Motorcycles | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కరోజే 41వేల బైకుల అమ్మకం!

Published Mon, Apr 27 2015 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

అక్షయ తృతీయ రోజున.. అంటే ఏప్రిల్ 21న హోండా మోటార్ సైకిల్స్ కంపెనీ ఏకంగా 41వేల బైకులు అమ్మింది.

అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం సర్వసాధారణం. అందుకే దాన్ని ఆడవాళ్ల పండుగ అనుకుంటారు. కానీ, బంగారమే కాదు.. వివిధ రకాల వస్తువులు, వాహనాల కొనుగోళ్లకు కూడా ఆ రోజును శుభముహర్తంగా భావిస్తారు.

అందుకే.. అక్షయ తృతీయ రోజున.. అంటే ఏప్రిల్ 21న హోండా మోటార్ సైకిల్స్ కంపెనీ ఏకంగా 41వేల బైకులు అమ్మింది. గత సంవత్సరం ఇదే రోజున జరిగిన అమ్మకాలతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరుగుదల కనిపించినట్లు హోండా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ ఎస్ గెలెరియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement