ఆ వివరాలు చెప్తే, కోటి రివార్డు | Benami property secret informers to get reward of Rs 1 crore | Sakshi
Sakshi News home page

ఆ వివరాలు చెప్తే, కోటి రివార్డు

Published Sat, Sep 23 2017 10:10 AM | Last Updated on Sat, Sep 23 2017 12:10 PM

Benami property secret informers to get reward of Rs 1 crore

సాక్షి, న్యూఢిల్లీ :
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేయబోతుంది. బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీలకు అందజేస్తే, కోటి రూపాయల వరకు నగదు రివార్డులను ఇవ్వాలని ప్లాన్‌ చేస్తోంది. వచ్చే నెలలో దీనికి సంబంధించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. వివరాలు అందజేసిన వారు రూ.15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బహుమతి అందుకునే అవకాశముందని అధికారి చెప్పారు. సమాచారం అందజేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచనున్నట్టు తెలిసింది.

గతేడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో మాత్రం ఈ నిబంధన లేదు. కానీ గోప్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు బినామీ ఆస్తుల వివరాలు అందజేసిన వారికి ఈ రివార్డులను ఇవ్వనున్నారు. 2016 నవంబర్‌ 1న బినామీ లావాదేవీల సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పలు బినామీ లావాదేవీలను ఏజెన్సీలు గుర్తించాయి. బ్యాంకు అకౌంట్‌ డిపాజిట్లు, స్థిర ఆస్తులు వంటి వాటిని బినామీ ఆస్తుల కింద అటాచ్‌ కూడా చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement