Central Board of Direct Taxes
-
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.90 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 12వ తేదీ నాటికి (2024 ఏప్రిల్ 1 నుంచి) 16 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు ఎగశాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) గణాంకాల ప్రకారం మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.74 లక్షల కోట్లు. కార్పొరేట్ వసూళ్లు రూ. 7.68 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ.44,538 కోట్లు. రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు స్థూలంగా చూస్తే, జనవరి 12 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.64 లక్షల కోట్లు. ఇందులో రిఫండ్స్ రూ.3.74 లక్షల కోట్లు. (వార్షికంగా 42.49 శాతం పెరుగుదల). వెరసి నికర వసూళ్లు రూ. 16.90 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. లక్ష్యం రూ.22.07 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లు వసూలు చేయాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల వాటా రూ.10.20 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయ, ఇతర పన్నుల ద్వారా వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు. -
నూతన విధానమే ఎంపిక
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయగా, 66 శాతం మంది నూతన విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది నూతన విధానాన్నే ఎంపిక చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పన్నుల ప్రక్రియను సులభతరం చేయడంపై ప్రభుత్వం, సీబీడీటీ దృష్టి సారించినట్టు చెప్పారు. ఎంత సులభంగా పన్ను విధానం మారితే, అంత ఎక్కువ మంది పన్ను నిబంధనలు పాటించేందుకు ముందుకు వస్తార న్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఇందుకు నిదర్శనం గతేడాది ఇదే సమయానికి దాఖలైన రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరింత పెరిగినట్టు చెప్పారు. గతేడాది జూలై 25 నాటికి 4 కోట్ల రిటర్నులు దాఖ లు కాగా, ఈ ఏడాది జూలై 22కే దీన్ని అధిగమించినట్టు తెలిపారు. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.5 కోట్ల రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. పాత పన్ను విధానం రద్దు ఎప్పుడు? మెజారిటీ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంపిక చేసుకున్నందున పాత విధానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు రవి అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఇది మార్పు దశలో ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఏ విధానానికి మెరుగైన ఆమోదం లభిస్తుందో చూసిన తర్వాత దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం’’అని చెప్పారు. ఇండెక్సేషన్ తొలగింపు రియలీ్టకి మంచిదేరియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించడమనేది మంచిదేనని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగ్రవాల్ తెలిపారు. కేవలం లెక్కల కోణంలో చూడకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గత పదేళ్లుగా పెరిగిన రియల్టీ ధరలు, ఇండెక్సేషన్ సంబంధ ప్రయోజనాలను పరిశీలిస్తే సరళతరమైన కొత్త విధానంలో పన్నులపరమైన బాదరబందీ తక్కువగా ఉంటుందని అగ్రవాల్ చెప్పారు. తాజా బడ్జెట్లో రియల్టీ రంగంలో ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగిస్తూ దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నులను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రాపర్టీ కొనుగోలు విలువను ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచుకుంటూ, అంతిమంగా విక్రయించినప్పుడు వచ్చే లాభాలపై పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఇండెక్సేషన్ ఉపయోగపడుతోంది. కొత్త మార్పులతో గృహాలను విక్రయించినప్పుడు వచ్చే రాబడిపై పన్ను భారం పెరిగిపోతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రవి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతరాయాల్లేకుండా చర్యలుఇన్ఫోసిస్, ఐబీఎం, హిటాచీ సంస్థలతో కలసి ఐటీ పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రవి అగర్వాల్ తెలిపారు. వెబ్సైట్ చక్కగా పనిచేస్తుందన్న భరోసా ఇచ్చారు. బడ్జెట్ రోజునే (23న) 22 లక్షల రిటర్నులు దాఖలైనట్టు తెలిపారు. పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రావచ్చని రవి అగర్వాల్ ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. -
భారీగా సవరణ రిటర్నులు
న్యూఢిల్లీ: సవరణ రిటర్నులు ఆదాయపన్ను శాఖకు అదనపు పన్ను ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 56 లక్షల మేర సవరించిన ఐటీ రిటర్నులు దాఖలు కాగా, వీటి ద్వారా రూ.4,600 కోట్ల పన్ను ఆదాయం సమకూరినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చీఫ్ నితిన్ గుప్తా ప్రకటించారు. తమ సేవలను మెరుగుపరుచుకుంటూ, వివాద రహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఒకసారి దాఖలు చేసిన ఐటీఆర్లకు సంబంధించి సవరణలు చేసుకునే అవకాశాన్ని 2022–23 బడ్జెట్లో ప్రకటించడం తెలిసిందే. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు ఇలా సవరణలు దాఖలు చేసుకునే వెసులుబాటు వచి్చంది. రూ.కోటికి పైగా పన్నుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారానికి వీలుగా కర్ణాటకలోని మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు గుప్తా వెల్లడించారు. 2014–15 నాటికి రూ.25వేల వరకు పెండింగ్లో ఉన్న పన్ను డిమాండ్లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించడం తెలిసిందే. ఇలాంటి 1.1 కోట్ల పన్ను డిమాండ్ల ఉపసంహరణతో కేంద్రం రూ.2,500–3,600 కోట్లను కోల్పోనుంది. కానీ, ఈ వెసులుబాటు 80 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పస్తుందని నితిన్ గుప్తా తెలిపారు. ఏటా పన్నుల ఆదాయం రూ.19.5 లక్షల కోట్లతో పోలిస్తే ఇది స్వల్ప మొత్తమేనన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం, పాన్ - ఆధార్ లింక్ చేశారా?
పాన్ - ఆధార్ కార్డ్ లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి. ఎందుకంటే? దేశంలో ఆధార్ - పాన్ లింక్ చేయలేని కారణంగా దేశంలో మొత్తం 11.5 కోట్ల పాన్కార్డ్లు డీయాక్టివేట్ అయినట్లు తేలింది. మధ్యప్రదేశ్కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం ద్వారా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ల అనుసంధానానికి సంబంధించిన వివరాల్ని కోరారు. ఆయన అభ్యర్ధనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) స్పందించింది. డెడ్లైన్ తర్వాత ఫైన్ జూలై 1, 2017 తర్వాత తీసుకున్న పాన్కార్డ్లను - ఆధార్కు ఆటోమేటిక్గా లింక్ అయ్యాయి. అయినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, ఆ తేదీకి ముందు పాన్ కార్డ్లను పొందిన వారు ఆధాన్-పాన్ను మాన్యువల్గా లింక్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి చెల్లింపులు లేకుండా ఈ ఏడాది జూన్ 30 వరకు జత చేసుకునే అవకాశం కల్పించింది. జులై 1 నుంచి ఆధార్- పాన్ను జతచేయాలంటే రూ.1000 చెల్లించి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెయ్యి ఎందుకు చెల్లించాలి రూ. 1,000 జరిమానా చెల్లించడంపై గౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త పాన్ కార్డ్ ధర రూ. 91 (జీఎస్టీ మినహాయింపు ఉంది.). ‘అప్పుడు పాన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రభుత్వం 10 రెట్ల జరిమానా ఎలా విధిస్తుంది ? అలాగే, పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయబడిన వ్యక్తులు ఆదాయపు పన్నును ఎలా ఫైల్ చేస్తారు? ప్రభుత్వం పునరాలోచించి, పాన్తో లింక్ చేయడానికి కనీసం ఒక సంవత్సరం కాలపరిమితిని పొడిగించాలి అని గౌర్ అన్నారు. దేశంలో 70.24 కోట్ల మంది పాన్కార్డ్ హోల్డర్లు మనదేశంలో 70.24 కోట్ల మంది పాన్ కార్డ్ హోల్డర్లలో 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించారు. 11.5 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానం చేయలేదు. కాబట్టే అవి డీయాక్టివేట్ అని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. పాన్-ఆధార్ లింక్ అయ్యిందా? లేదా ఇలా తెలుసుకోండి స్టెప్ 1: https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ని సందర్శించండి స్టెప్ 2: పేజీకి ఎడమ వైపున ఉన్న 'క్విక్ లింక్లు' క్లిక్ చేయండి. అనంతరం 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి. స్టెప్ 3: మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. స్టెప్ 4: తర్వాత 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి. స్టెప్ 5: ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే చూపబడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే.. మీ సేవా సెంటర్లలో వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది. -
జీడీపీలో వ్యక్తిగత ఆదాయపు పన్ను నిష్పత్తి 3% అప్
న్యూఢిల్లీ: భారత్ వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు దేశ 2021–22 స్థూల దేశీయోత్పత్తిలో 2.94 శాతానికి చేరాయి. 2014–15లో ఈ నిష్పత్తి 2.11 శాతంగా ఉంది. ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న వివిధ చర్యల ప్రభావం గురించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)తో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, 2014–15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను) రూ.2.65 లక్షల కోట్లుకాగా, ఈ పరిమాణం రూ.6.96 లక్షల కోట్లకు చేరింది. ఇక తాజాగా ‘న్యూ ట్యాక్స్ డిడక్టెడ్ యట్ సోర్స్ (టీడీఎస్) కోడ్స్ తీసుకురాడంతో ఈ లావాదేవీ సంఖ్య దాదాపు రెట్టింపై 70 కోట్ల నుంచి (2015–16 ఆర్థిక సంవత్సరంలో)144 కోట్లకు (2021–22 ఆర్థిక సంవత్సరం) ఎగసింది. సత్వర నిర్ణయాలు అవసరం: సీతారామన్ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, పెండింగులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారం, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని కొన్ని సెక్షన్ల కింద రాయితీల మంజూరు వంటి పలు అంశాలపై సీబీడీటీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం చర్చించింది. పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన అన్ని దరఖాస్తులపై సీబీడీటీ సకాలంలో తగిన చర్యలను, నిర్ణయాలను తీసుకోవాలని, ఆయా దరఖాస్తులను పరిష్కరించడానికి తగిన కాలపరిమితిని నిర్దేశించుకోవాలని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యక్ష పన్ను చట్టాలు, నియమ–నిబంధనలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో అవగాహనను పెంచడానికి ప్రయత్నాలను విస్తరించాలని కూడా సీబీడీటీకి ఆమె సూచించారు. ఆర్థిక మంత్రితో జరిగిన సీబీడీటీ సమీక్షా సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, బోర్డ్ చైర్మన్ నితిన్ గుప్తా తదితర సభ్యులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లు రూ.13..73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి. ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్తో కలిపి పర్సనల్ ఇన్కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి. -
బీబీసీలో ఆర్థిక అవకతవకలు జరిగాయ్
న్యూఢిల్లీ: బీబీసీ గ్రూప్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సర్వేలో కీలకమైన ఆధారాలు లభించాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో వారి కార్యకలాపాలకు అనుగుణంగా లేవని, దాని విదేశీ సంస్థల చెల్లింపులపై కట్టాల్సిన పన్నుల్ని ఎగవేసిందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులిచ్చిన వాంగ్మూలాలు, డిజిటల్ ప్రూఫ్లు, సేకరించిన డాక్యుమెంట్ల ద్వారా ఆ గ్రూప్లో భారీగా ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు చేసినట్టుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారని తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి ఎన్నో వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సర్వేలో తేలిందని ఆ ప్రకటన వివరించింది. పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఐటీ శాఖ సర్వే సమయంలో మందకొడిగా వ్యవహరిస్తూ ప్రతీది ఆలస్యం చేసే వ్యూహాలు రచించిందని ఆరోపించింది. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు దాదాపు 60 గంటలు ఐటీ శాఖ సర్వే నిర్వహించింది. 2002 గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బాధ్యుడిగా ఆరోపిస్తూ ‘‘ఇండియా ది మోదీ క్వశ్చన్’’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది రోజుల్లోనే ఐటీ శాఖ సర్వే జరపడం చర్చనీయాంశంగా మారింది. -
2023–24 సంవత్సరం ఐటీఆర్ల నోటిఫై
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2023–24) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్లు) ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగమైన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. వీటిల్లో తమకు వర్తించే ఐటీఆర్ను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు, నిపుణులు, వ్యాపారస్థులు ఇలా వివిధ విభాగాల్లోని వారికి మొత్తం ఆరు రకాల ఐటీఆర్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటిల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 6 వరకు, ఐటీఆర్ – వీ (వెరిఫికేషన్ ఫామ్), ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. ఈ పత్రాల ఆధారంగా రిటర్నుల దాఖలుకు సన్నద్ధమయ్యేందుకు పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఉంటుంది. ఏటా మార్చి లేదా ఏప్రిల్లో ఐటీఆర్లను నోటిఫై చేస్తుండగా, ఈ ఏడాది ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఐటీఆర్–1లో సెక్షన్ 139(1) కింద వెల్లడించాల్సి వివరాల్లో మార్పులు చేశారు. -
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్లో మొత్తం 63 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
ఆధార్తో లింకేజీ లేకుంటే పాన్కార్డు నిష్ఫలమే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్తో అనుసంధానంకాని పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్తో అనుసంధానించని పాన్ కార్డులు ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్ఆపరేటివ్గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది. పాన్ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్లో ఉన్న రీఫండ్లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్లు, ఆర్థిక సంబంధ వెబ్సైట్లలో పాన్కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది. -
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని గాంధీ డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు సీబీడీటీ గుర్తించింది. దీంతో ఆయనను 180 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఇదే ఆరోపణలపై గాంధీ సస్పెన్షన్కు గురయ్యారు. ఆయనపై గతంలో ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. -
ఐటీఆర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్ల (ఐటీఆర్) ప్రాసెసింగ్ను, రిఫండ్ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్ : ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) డైరెక్టర్ నితిన్ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్ ఈ పోర్టల్ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
కోలీవుడ్లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
డోలో ట్యాబ్లెట్ అమ్మకంలో అక్రమమార్గాలు అనుసరించిన తయారీదారు
-
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
పాన్–ఆధార్ లింక్ చేయకపోతే పెనాల్టీ
న్యూఢిల్లీ: ఆధార్తో పాన్ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్తో పాన్ లింకింగ్ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్ పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) పోతుంది. ‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్–ఆధార్ లింకింగ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు. అన్నింటికీ పాన్ అవసరమే.. ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్లు తదితర) ఇక మీదట పాన్ ను ఆధార్తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి. దీంతో పాన్ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్లు ఆధార్తో లింక్ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్లు జారీ అయ్యాయి. -
పన్ను చెల్లింపుదారులకు తీపికబురు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1.19 లక్షల కోట్ల రూపాయలను పైగా ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లుచేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 67.99 లక్షల రీఫండ్స్ ఉన్నాయి. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేసినట్లు పేర్కొంది. "సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2021 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 వరకు 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,19,093 కోట్లకు పైగా రీఫండ్ జారీ చేస్తుంది. 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల ఆదాయపు పన్ను కేసులలో రీఫండ్లు జారీ చేసింది. 1,80,407 కేసుల్లో రూ.81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు" అని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది. CBDT issues refunds of over Rs. 1,19,093 crore to more than 1.02crore taxpayers from 1st April,2021 to 15th November,2021. Income tax refunds of Rs. 38,034 crore have been issued in 1,00,42,619cases &corporate tax refunds of Rs. 81,059 crore have been issued in 1,80,407cases(1/2) — Income Tax India (@IncomeTaxIndia) November 18, 2021 (చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!) -
రాజ్యసభ సెక్రటరీ జనరల్గా పీసీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్గా 1982 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి ప్రమోద్ చంద్ర మోదీ నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మాజీ ఛైర్మన్ అయిన పీసీ మోదీ, తెలుగు వ్యక్తి అయిన పీపీకే రామాచార్యుల స్థానంలో శుక్రవారం సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులు 72 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి, సెక్రటరీ జనరల్గా స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు 1997 జూలై 25న బాధ్యతలు చేపట్టిన ఎస్ఎస్ సహోని 1997 అక్టోబర్ 2 వరకు ఆ పదవిలో ఉన్నారు. పీపీకే రామాచార్యులును రాజ్యసభ సెక్రటేరియట్ సలహాదారుగా నియమించారు. సంప్రదాయకంగా ఐఎఎస్ అధికారులు, సీనియర్ పార్లమెంట్ సెక్రటేరియట్ అధికారులకు రిజర్వ్ చేసిన సెక్రటరీ జనరల్ స్థానంలో ఐఆర్ఎస్ అధికారి పీసీ మోదీని నియమించడం గమనార్హం. వచ్చే ఏడాది ఆగస్ట్ 10 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్గా మోదీ కొనసాగనున్నారు. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, తాజా మార్పులపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘రాజ్యసభ సెక్రటరీ జనరల్ పదవికి తగిన వ్యక్తి డాక్టర్ పీపీకే రామాచార్యులు, అటువంటి అనుభవశాలి, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తిని తొలగించడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. మోదీ ప్రభుత్వం పాల్పడిన మూడు ఘోర పాపాల్లో ఇదొకటి’అని పేర్కొన్నారు. -
భారీ ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకత!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఫామ్ 26ఏఎస్లో పొందుపరచాల్సిన అంశాలను పెంచింది. ఐటీఆర్లో తెలుపుతున్న సమాచారంతోపాటు ఇకపై విదేశాల నుంచి అందిన డబ్బు (ఫారిన్ రెమిటెన్స్) మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు, వంటి అంశాలనూ ఇకపై ఫామ్ 26ఏఎస్లో తెలపాల్సి ఉంటుంది. అధిక–విలువ ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లక్ష్యంగా యాక్ట్ 285బీబీ సెక్షన్ కింద సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫామ్ 26ఏఎస్... ఒక వార్షిక ఏకీకృత పన్ను ప్రకటన. దీనిని పన్ను చెల్లింపుదారులు వారి శాశ్వత ఖాతా సంఖ్య (పీఏఎన్) ఉపయోగించి ఆదాయపు పన్ను వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. 2020–21 బడ్జెట్ ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 285బీబీని ప్రవేశపెట్టింది, ఫామ్ 26ఏఎస్ని ’వార్షిక సమాచార ప్రకటన’గా పునరుద్దరించడం దీని ఉద్దేశం. టీడీఎస్/టీసీఎస్ వివరాలతో పాటు, నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు, పన్నుల చెల్లింపు, డిమాండ్/ సమగ్ర సమాచారాన్ని ఫామ్ కలిగి ఉంటుంది. అందుబాటులో ఆడిట్ యుటిలిటీ ఫామ్ కాగా, ఆదాయపు పన్ను శాఖ 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన పోర్టల్లో పన్ను ఆడిట్ యుటిలిటీ ఫారమ్ను అందుబాటులో ఉంచింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, వ్యాపార విక్రయాలు, టర్నోవర్ లేదా స్థూల రసీదులు రూ. 10 కోట్లకు మించి ఉంటే పన్ను చెల్లింపుదారులు వారి ఖాతాలను ఆడిట్ చేయవలసి ఉంటుంది, అయితే ప్రొఫెషనల్స్ విషయంలో, 2020–21లో (అసెస్మెంట్ ఇయర్ 2021–22) ఈ పరిమితి రూ. 50 లక్షలకు మించి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను తనిఖీ నివేదికను దాఖలు చేయడానికి చివరి తేదీ 2022 జనవరి 15. రూ.లక్ష కోట్ల రిఫండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 25 మధ్య రూ. 1,02,952 కోట్ల ఐటీ రిఫండ్స్ జరిగినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. 76,21,956 కోట్ల మందికి రూ.27,965 కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్స్, 1,70,424 లావాదేవీలకు సంబంధించి రూ.74,987 కోట్ల కార్పొరేట్ పన్ను రిఫండ్స్ జరిగినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి. -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
కొత్త పోర్టల్పై 2 కోట్ల ఐటీఆర్లు దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్ పోర్టల్పై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 కోట్లకు పైగా ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్లు) దాఖలైనట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. కొత్త పోర్టల్ పనితీరు గణనీయంగా మెరుగైనట్టు తెలిపింది. ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్పై ఎన్నో సాంకేతిక సమస్యలు లోగడ దర్శనమివ్వడం తెలిసిందే. 2020–21 ఆర్థిక సంవత్సరం రిటర్నులను వీలైనంత ముందుగా నమోదు చేయాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. ఈ ఫైలింగ్కు వీలుగా అన్ని ఐటీఆర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. దాఖలైన 2 కోట్లకు పైగా ఐటీఆర్లలో 86 శాతం.. ఐటీఆర్–1, ఐటీఆర్–4 ఉన్నట్టు, 1.70 కోట్ల ఐటీఆర్లు ఈ వెరిఫై పూర్తయినట్టు తెలిపింది. ఇందులో 1.49 కోట్ల ఐటీఆర్లు ఆధార్ ఓటీపీ ఆధారంగా ధ్రువీకరించినట్టు వివరించింది. తక్షణ రిఫండ్లకు వీలు కల్పిస్తూ, మరెన్నో సదుపాయాలతో కూడిన కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ను ఆదాయపన్ను శాఖ ఈ ఏడాది జూన్ 7న ప్రారంభించింది. సమస్యలు ఎదురవుతున్నట్టు ఎంతో మంది పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేయడంతో.. వీటిని పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్ను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 74% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత, కార్పొరేట్) సెపె్టంబర్ 22వ తేదీ నాటికి (2021 ఏప్రిల్ నుంచి) నికరంగా రూ.5.70 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఇది 74 శాతం అధికం. అడ్వాన్స్ పన్నులు, మూలం వద్ద పన్ను (టీడీఎస్) భారీ వసూళ్లు దీనికి కారణం. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... ► ఏప్రిల్–1 నుంచి సెపె్టంబర్ 22 మధ్య నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,70,568 కోట్లు. గత ఏడాది ఇదే కాలం (రూ.3.27 లక్షల కోట్లు) వసూళ్లతో పోల్చి చూస్తే 74.4 శాతం పెరుగుదల. కరోనా ముందస్తు సమయం 2019–20 ఇదే కాలంతో పోలి్చనా ఈ వసూళ్లు 27 శాతం అధికం. సంబంధిత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూళ్ల పరిమాణం రూ.4.48 లక్షల కోట్లు. ► ఇక స్థూలంగా చూస్తే, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 47 శాతం పెరుగుదలతో రూ.4.39 లక్షల కోట్ల నుంచి రూ.6.45 లక్షల కోట్లకు ఎగశాయి. కరోనా కాలానికి ముందు 2019–20 ఆర్థిక సంవత్సరంతో (2019 సెపె్టంబర్ 22 వరకూ) పోలి్చతే 16.75 పెరుగుదల నమోదయ్యింది. అప్పట్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 5.53 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రిఫండ్స్ రూ.75,111 కోట్లు. -
మార్చిలోగా పాన్–ఆధార్ అనుసంధానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. పాన్ నంబర్తో అనుసంధానానికి ఆధార్ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమరి్పంచాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ ఏడాది సెపె్టంబర్ 30. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను చట్టం–1961 కింద జరిమానా విచారణలు పూర్తి చేయడానికి గడువు కూడా 2022 మార్చి 31 వరకు పొడిగించారు. -
ఎయిరిండియాకు ఐటీ సపోర్ట్
న్యూఢిల్లీ: విమానయాన పీఎస్యూ.. ఎయిరిండియా ఆస్తులను ప్రత్యేక ప్రయోజన కంపెనీ(ఎస్పీవీ)కి బదిలీ చేయడంలో ఎలాంటి పన్ను విధింపులూ ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీటీడీ) తాజాగా వెల్లడించింది. ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీకి ఆస్తుల బదలాయింపు చేపట్టిన సందర్భంలో మూలంవద్దే పన్ను విధింపు(టీడీఎస్) నుంచి ప్రభుత్వం మినహాయింపునిచి్చంది. తద్వారా ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్కు మరింత మద్దతునిస్తోంది. కంపెనీ విక్రయ ప్రక్రియకంటే ముందుగానే ప్రభుత్వం 2019లో ఎస్పీవీ ఏర్పాటుకు తెరతీసింది. దీనిలో భాగంగా ఎయిరిండియా రుణాలు, కీలకంకాని ఆస్తులను ఎస్పీవీకి బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ఎస్పీవీకి స్థిరాస్తుల బదిలీ కారణంగా ఎయిరిండియాకు చేపట్టే చెల్లింపుల విషయంలోనూ టీడీఎస్ కోత ఉండబోదని సీబీడీటీ పేర్కొంది. ఆస్తుల బదిలీ అంశంలో ఎయిరిండియాను విక్రేతగా పరిగణించలేమని తెలియజేసింది. ప్రభుత్వం ఎయిరిండియాతోపాటు అనుబంధ సంస్థ ఏఐ ఎక్స్ప్రెస్లోగల 100 శాతం వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఎయిరిండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్లోనూ 50 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు అనుగుణంగా కొనుగోలుదారులు ఈ నెల 15కల్లా ఫైనాన్షియల్ బిడ్స్ను దాఖలు చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. -
75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు
న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్ ఫారమ్ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. -
Income Tax Refund: పన్ను ఎక్కువ కట్టారు.. తీసుకోండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ శాఖ రూ. 47,318 కోట్లను ఇన్కం ట్యాక్స్ రీఫండ్ కింద చెల్లించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 9 వరకు కాల వ్యవధిని పరిగణలోకి తీసుకుని ఈ రీఫండ్ చేసింది. ఇన్కం ట్యాక్స్ రీఫండ్ కింద రూ. 47,318 కోట్లను కింద 22.61 లక్షల మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ శాఖ జమ చేసింది. ఇందులో రూ.14,241 కోట్ల రూపాయలు 21,38,375 మంది ఐటీ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ అవగా రూ.33,078 కోట్లు కార్పోరేట్ రీఫండ్ కింద 1,22,511 ఖాతాల్లో జమ అయ్యింది. ఆదాయ పన్నుకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తం కంటే అధికంగా చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి పొందే వీలుంది. దీనికి సంబంధించి అధికంగా పన్ను చెల్లించిన వారు ఈ మేరకు ఆదాయపన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ శాఖ పన్ను వివరాలను పరిశీలించి అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. CBDT issues refunds of over Rs. 47,318 crore to more than 22.61 lakh taxpayers between 1st April, 2021 to 09th August, 2021. Income tax refunds of Rs. 14,241 crore have been issued in 21,38,375 cases & corporate tax refunds of Rs. 33,078 crore have been issued in 1,22,511 cases. — Income Tax India (@IncomeTaxIndia) August 14, 2021 -
Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020 –21) సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు అదనంగా రెండు నెలల గడువు ఇస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. అదే విధంగా కంపెనీలకు సైతం అదనంగా ఒక నెల గడువు ఇస్తూ నవంబర్ 30 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. వ్యక్తులు (ఖాతా లకు ఆడిటింగ్ అవసరం లేని వారు) తమ రిటర్నులను జూలై 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఖాతాలకు ఆడిటింగ్ అవసరమైన వ్యక్తులు, కంపెనీలకు రిటర్నుల దాఖలు గడువు అక్టోబర్ 31. ఇవి సాధారణ గడువులు. అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అదనపు సమయాన్ని ఆదాయపన్ను శాఖ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. కరోనా మహమ్మారి కారణం గా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. గడువు పొడిగిం చడం వల్ల నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కినట్టేనని నాంజియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. ► సంస్థలు తమ ఉద్యోగులకు ఫామ్ 16 మంజూరుకు సైతం గడువును జూలై 15కు సీబీడీటీ పొడిగించింది. ► ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ► ఆలస్యపు, సవరించిన రిటర్నుల దాఖలుకు నూతన గడువు 2022 జనవరి 31. ► ఆర్థిక సంస్థలు ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్ఎఫ్టీ) సమర్పించేందుకు మే 31వరకు ఉన్న గడువు జూన్ 30కు పెరిగింది. ► 2020–21 ఏడాదికి సంబంధించి నూతన పన్ను విధానాన్ని (తక్కువ రేట్లతో, పెద్దగా మినహాయింపుల్లేని) ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు ఐటీ రిట ర్నుల పత్రాల్లో సీబీడీటీ మార్పులు కూడా చేసింది. 7 నుంచి ఆదాయపన్ను కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకమైన నూతన పోర్టల్ను జూన్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీబీడీటీ ప్రకటించింది. www. incometaxindiaefiling.gov.in ప్రస్తుత ఈ పోర్టల్ స్థానంలో జూన్ 7 నుంచి www. incometaxgov.in పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఏవైనా సమర్పించాల్సినవి ఉంటే, అప్లోడ్, డౌన్లోడ్ పనులను జూన్ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించింది. జూన్ 1–6 మధ్య ప్రస్తుత పోర్టల్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎటువంటి గడువులు నిర్దేశించలేదని పేర్కొంది. వేగంతోపాటు కొత్త సదుపాయాలు కొత్త పోర్టల్ ఎన్నో సదుపాయాలతో ఉంటుందని, వేగంగా రిటర్నుల దాఖలు, పన్ను రిఫండ్లకు అనుకూలంగా ఉంటుందని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి అన్ని రకాల స్పందనలు, అప్లోడ్లు, అపరిష్కృత అంశాలన్నీ ఒకే డాష్బోర్డులో దర్శనమిస్తాయని వివరించింది. వెబ్సైట్లో ఉండే అన్ని ముఖ్య సదుపాయాలు మొబైల్ యాప్పైనా లభిస్తాయని పేర్కొంది. -
ఐటీ రిటర్న్ల గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపన్ను రిటర్న్ల దాఖలు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీసీ) విడుదల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది. అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేక స్వదేశీ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపుదార్లు తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు నిర్దేశించిన గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఇతర పన్ను చెల్లింపుదారులకూ గడువును జనవరి 31వరకు పొడిగించారు. దిగువ తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లు తాము స్వయంగా మదింపు చేసిన ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేయడానికి మరోసారి వెసులుబాటు కల్పించారు. పన్ను విధింపునకు ఆస్కారం ఉన్న రూ.లక్ష వరకూ ఆదాయం ఉన్న వారు స్వయంగా మదింపు ప్రక్రియ వివరాలు సమర్పించేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించారు. -
టీడీఎస్ రేటు తగ్గింపు అమల్లోకి..
న్యూఢిల్లీ: డివిడెండ్, అద్దె, బీమా చెల్లింపులు తదితర వేతనేతర చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) రేట్లను తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీడీబీటీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు ఇవే రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. టీడీఎస్, టీసీఎస్ రేటును ప్రస్తుత రేటుపై 25 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన మరుసటి రోజే అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. ► 23 ఐటమ్స్పై టీడీఎస్ తగ్గింది. రూ.10 లక్షలు మించిన మోటారు వాహనంపై టీడీఎస్ 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింది. ► జీవిత బీమా పాలసీకి సంబంధించి పాలసీదారునికి చేసే చెల్లింపులపై టీడీఎస్ 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింది. ► డివిడెండ్, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► చరాస్తి కొనుగోలుపై 1 శాతం టీడీఎస్ 0.75 శాతానికి తగ్గింది. ► వ్యక్తులు, హెచ్యూఎఫ్లు చేసే అద్దె చెల్లింపులపై టీడీఎస్ 5% నుంచి 3.75%కి సవరించారు. ► ఈ కామర్స్ వేదికపై విక్రేతలకు వర్తించే టీడీఎస్ రేటు 1 శాతం నుంచి 0.75 శాతానికి మారింది. ► వృత్తి ఫీజు 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. ► నేషనల్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్ మొత్తాలను తిరిగి చెల్లించే సందర్భంలో వర్తించే టీడీఎస్ రేటు 10 శాతం నుంచి 7.5 శాతానికి దిగొచ్చింది. ► బీమా కమీషన్, బ్రోకరేజీపై 5 శాతం నుంచి 3.75 శాతానికి టీడీఎస్ సవరించారు. ► మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లకు చేసే డివిడెండ్ చెల్లింపులపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► టెండ్ లీవ్స్ (బీడీ ఆకులు), తుక్కు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, లిగ్నైట్, ఐరన్ ఓర్ తదితర మినరల్స్పై టీసీఎస్ తగ్గింది. ► పాన్/ఆధార్ సమర్పించని కేసుల్లో అధిక టీడీఎస్/టీసీఎస్ వసూలు చేయాల్సిన చోట ఈ తగ్గింపులు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసింది. -
ఆదాయపన్ను కేసుల పరిష్కారానికి మరో నెల గడువు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను అపరాధముల పరిష్కారానికి పన్ను చెల్లింపుదారులకు మరి కొంత సమయం లభించింది. డిసెంబర్ 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబర్లో తీసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పుల పరిష్కారానికి అవకాశం ఇవ్వడం ద్వారా.. కోర్టుల్లో అపరిష్కృత కేసుల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు సీబీడీటీ తెలిపింది. -
వెలుగులోకి రూ. 3,300 కోట్ల హవాలా రాకెట్!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్ను గుర్తించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. మౌలిక సదుపాయాల రంగంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల పాత్ర ఇందులో ఉన్నట్టు పేర్కొంది. కాకపోతే ఆయా కంపెనీల వివరాలను సీబీడీటీ గోప్యంగా ఉంచింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు ఈ రాకెట్ విస్తరించినట్టు తెఇపింది. భారీ పన్ను ఎగవేతలను గుర్తించేందుకు ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, ఈరోడ్, పుణె, ఆగ్రా, గోవాలోని 42 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. ‘‘సోదాలు ఫలితాన్నిచ్చాయి. బడా కార్పొరేట్లు, హవాలా ఆపరేటర్ల మధ్య ఉన్న బంధం తాలూకూ ఆధారాలు లభించాయి. బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ.3,300 కోట్ల మేర నిధులను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది’’అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బోగస్ కాట్రాక్టులు, బిల్లుల ద్వారా ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు నడిపించిన నగదు ప్రవాహ రాకెట్ వ్యవహారం వెలుగుచూసినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వ్యక్తికి రూ.150 కోట్ల నగదు చెల్లింపునకు సంబంధించి ఆధారాలు కూడా లభించినట్టు తెలిపింది. -
కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: తమిళనాడులోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఐటీ శాఖ రూ. 30 కోట్లు స్వాధీనం చేసుకుంది. నీట్లాంటి ప్రవేశ పరీక్షలకు ఈ ఇన్స్టిట్యూట్ శిక్షణ ఇస్తోందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. నమక్కల్ కేంద్రంగా ఉన్న ఈ గ్రూపుకి సంబంధించిన 17 ప్రాంగణాలలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపామని, ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆ గ్రూప్ ఆదాయం రూ. 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిపింది. ఈ బృందం ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం విద్యాసంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్లను నడుపుతోంది. ఈ ట్రస్ట్ నియంత్రణలో అనేక భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు ఉన్నారని తెలిపింది. సీబీడీటీ ఆదాయపన్ను శాఖ కోసం వివిధ విధానాలను రూపొందిస్తుంది. శుక్రవారం నమక్కల్, పెరుండురై, కరూర్, చెన్నైలోని గ్రూప్ ప్రమోటర్ల ఇళ్లు, ప్రాంగణాలపై దాడులు జరిగాయి. ఫీజు రశీదులను విడివిడిగా రూపొందించడం ద్వారా సంస్థ గణనీయంగా పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ఐటీ దాడులు చేశామని సీబీడీటీ వెల్లడించింది. ఫీజులో కొంత భాగాన్ని నగదు రూపంలో స్వీకరించడం, రశీదులను సైతం సాధారణ ఖాతాల పుస్తకాలలో నమోదు చేయకపోవడం లాంటి పనులకు సంస్థ పాల్పడిందని వెల్లడించింది. సోదాల సమయంలో డైరీలు, ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పరికరాల్లో లెక్కలేనన్ని ఫీజు రశీదులను గుర్తించినట్లు తెలిపింది. బినామీ ఉద్యోగుల పేర్లతో లాకర్లు తెరిచారని, ప్రధాన బ్రాంచ్లోని లాకర్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని బోర్డు తెలిపింది. ఉద్యోగులకు ఆదాయపన్నుకు అందకుండా నగదు రూపంలో జీతాలు చెల్లిస్తున్నారని తెలిపింది. -
ఎగవేతదారులను వదలొద్దు
న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు. 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు. సులభసాధ్యమైన లక్ష్యం.. 2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి.. పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. -
పన్ను రిటర్నులు : వేతన జీవులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ : వేతన జీవులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ తుది గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘ఈ విషయాన్ని పరిశీలించిన మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును 2018 జూలై 31 నుంచి 2018 ఆగస్టు 31కు పొడిగించడం జరిగింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కాగ, గత అసెస్మెంట్ ఇయర్ చివరి వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ 2018-19 అసెస్మెంట్ ఇయర్లో జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234ఎఫ్ ను జత చేర్చారు. దీంతో సెక్షన్ 139(1)లో నిర్దేశించిన తుది గడువుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటోంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరపు పన్ను రిటర్నులను 2018 జూలై 31 తర్వాత, 2018 డిసెంబర్ 31కు ముందు దాఖలు చేస్తే పన్ను చెల్లింపుదారులు కేవలం 5000 రూపాయల జరిమానా మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒకవేళ 2019 జనవరి 1 తర్వాత దాఖలు చేస్తే, ఈ జరిమానా రూ.10వేలకు పెరుగుతుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే, ఈ జరిమానా మొత్తం వెయ్యి రూపాయలను మించదని చెబుతున్నారు. -
ఆ వివరాలు చెప్తే, కోటి రివార్డు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేయబోతుంది. బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అందజేస్తే, కోటి రూపాయల వరకు నగదు రివార్డులను ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో దీనికి సంబంధించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. వివరాలు అందజేసిన వారు రూ.15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బహుమతి అందుకునే అవకాశముందని అధికారి చెప్పారు. సమాచారం అందజేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచనున్నట్టు తెలిసింది. గతేడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో మాత్రం ఈ నిబంధన లేదు. కానీ గోప్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు బినామీ ఆస్తుల వివరాలు అందజేసిన వారికి ఈ రివార్డులను ఇవ్వనున్నారు. 2016 నవంబర్ 1న బినామీ లావాదేవీల సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పలు బినామీ లావాదేవీలను ఏజెన్సీలు గుర్తించాయి. బ్యాంకు అకౌంట్ డిపాజిట్లు, స్థిర ఆస్తులు వంటి వాటిని బినామీ ఆస్తుల కింద అటాచ్ కూడా చేశాయి. -
ఇప్పుడు ఐటీ అధికారుల టార్గెట్ వారే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను కట్టకుండా.. భారీగా ఆదాయాలు ఆర్జిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్న ఐటీ అధికారుల కన్ను ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ దారులపై పడింది. ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి ఎక్కువ వడ్డీ ఆదాయాలు ఆర్జిస్తున్న వేల మంది అధికారులపై ఐటీ అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది. ఐటీ అధికారులు కన్నేసిన వారిలో రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఆదాయం ఆర్జిస్తున్న పలువురు సీనియర్ సిటిజన్లున్నారు. వీరు తమ ఆదాయాన్ని పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో చూపించడం లేదని తెలిసింది. అంతేకాక ఈ మొత్తానికి పన్ను కూడా చెల్లించడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికారులు చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా ఎక్కువ మొత్తంలో పన్ను ఎగవేతదారులపైనేనని, తక్కువ రిటర్నులు ఆర్జిస్తున్న చిన్నా చితకా వ్యక్తులను తాము ఛేజ్ చేయడం లేదని టాప్ ర్యాంకింగ్ పన్ను అధికారి చెప్పారు. అంతేకాక నగదు రూపంలో చెల్లింపులు అందుకునే ప్రొఫిషనల్స్ను కూడా ఆదాయపు పన్ను అధికారులు టార్గెట్ చేశారు. వీరు కూడా తమ అసలు ఆదాయాన్ని వార్షిక స్టేట్మెంట్లలో చూపించడం లేదని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. -
‘ పన్ను ఎగవేతదారుల్లో తెలుగువారే అధికం’
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రచురించిన 96 మంది పన్ను ఎగవేతదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 మంది ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. -
భారీగా ఎగిసిన ఆ డిపాజిట్లు ఢమాల్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లోకి వరదలా వచ్చి చేరిన డిపాజిట్లు ఒక్కసారిగా ఢమాల్ అన్నాయి. రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసిన ఈ డిపాజిట్లు ఇటీవల తగ్గడం ప్రారంభమయ్యాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు, హెచ్చరికలతో ఈ ఖాతాలోకి నగదు వెల్లువ తగ్గినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే సామాన్యుల జన్ ధన్ అకౌంట్లోకి భారీగా రద్దైన నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరాయి. నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. తాజా గణాంకాల ప్రకారం ఈ అకౌంట్లలో డిపాజిట్లు నెమ్మదించాయని తెలిసింది. రూ.74,609 కోట్లు మాత్రమే డిపాజిట్ అయినట్టు గణాంకాలు పేర్కొన్నారు. అంతేకాక ట్రెండ్ కూడా రివర్స్ అయిందట. ఈ అకౌంట్ల నుంచి నగదును బయటికి వచ్చేస్తున్నట్టు వెల్లడవుతోంది. ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైంది. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64 కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో జీరో బ్యాలెన్స్తో దేశంలోని ప్రతిఒక్కరూ బ్యాంకు అకౌంట్లను ప్రారంభించుకునే సదుపాయం కల్పించారు. కానీ బ్లాక్ మనీపై పోరాటంగా పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క రూపాయి కూడా లేని ఈ అకౌంట్లోకి భారీ మొత్తంలో నగదు వచ్చి చేరింది. సామాన్యుల ఈ ఖాతాలను అడ్డం పెట్టుకుని, బడాబాబులందరూ తమ నల్లధనాన్ని ఈ ఖాతాల్లోకి డిపాజిట్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
200 రాజకీయ పార్టీలకు షాక్?
బ్లాక్మనీ కార్యకలాపాలపై కఠినచర్యలలో భాగంగా 200 రాజకీయ పార్టీలపై వేటువేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి ఎన్నికల సంఘం త్వరలోనే లేఖ రాయనుంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఈ 200 పార్టీలను డీలిస్టు చేయాలని సీబీడీటీకి పిలుపునిచ్చింది. ఎన్నికల సీజన్లో రాజకీయ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నప్పటి నుంచి ఈ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలని సీబీడీటీని కోరింది. దీంతో బ్లాక్మనీని వైట్మనీగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీగా అవతారమెత్తాలని భావించేవారికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలిస్తూ సీబీటీడీ వాటిని గట్టిగా హెచ్చరిస్తుందని ఎన్నికల సంఘం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పార్టీలకు వెల్లువెత్తే విరాళాలు, వారు వెచ్చిస్తున్న సొమ్ముపై పారదర్శకత కోసం ప్రస్తుత చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కూడా కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి కేవలం రాజకీయ పార్టీలను నమోదు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి కల్పించిన స్వాభావిక అధికారాలతో అన్ని ఎన్నికల ప్రవర్తనలను అది నియంత్రిస్తోంది. కానీ పార్టీలను డీలిస్టు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇంకా కల్పించలేదు. సీరియస్గా లేని రాజకీయ పార్టీలను డీలిస్టు చేసే అధికారం తమకు కల్పించాలని చాలాసార్లు ఎన్నికల సంఘం గత ప్రభుత్వాలను పలుమార్లు కోరింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేదు. రూ. 20 వేల కంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందితే, అందించిన వారి వివరాలను ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కాపీని ఆదాయపు పన్ను శాఖ ప్రతియేటా ఎన్నికల సంఘానికి పంపుతుంది. అయితే చాలా పార్టీలు తమకు రూ.20వేల కంటే ఎక్కువగా అందే విరాళాల వివరాలనే అందించడం లేదు. దీంతో పార్టీ విరాళాల్లో కూడా పారదర్శకత తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీలు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి. ఏడు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టిన వారికి 15శాతం అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15శాతం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. విభజన చట్టం అమలులోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఈ రాయితీ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. -
మోసపోతే ‘రిఫండ్’ రాదు!!
ట్యాక్స్ రిఫండ్ల పేరిట ఆన్లైన్ మోసాలు - ఫోన్లు చేసి కూడా వివరాల తస్కరణ సాక్షి, బిజినెస్ విభాగం : సుధీర్కు ఓ మెయిలొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ నుంచి పంపిస్తున్నట్లుగా దాన్లో ఉంది. ‘’సీబీడీటీ మొదటి త్రైమాసిక పన్ను రిఫండ్లను ప్రాసెస్ చేయటం పూర్తయింది. మీరు రూ.22,046.23 రూపాయల పన్ను అధికంగా చెల్లించారు. దాన్ని రిఫండ్కు సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. మీ రిఫండ్ క్లెయిమ్ చేయాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి’’ అనేది దాని సారాంశం. సుధీర్ అప్పటికే గత ఏడాది రిటర్ను ఫైల్ చేసి... నిజంగానే ఐటీ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో నిజమేననుకుని లింకు క్లిక్ చేశాడు. వెంటనే మరో పేజీ ఓపెనయింది. ఇన్కమ్ట్యాక్స్ ఇండియా పేరిట ఓపెననైన ఆ పేజీలో... మీ బ్యాంకును సెలక్ట్ చేయండి... అనే పేజీ ఉంది. తనది ఎస్బీఐ కనక ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేశాడు. వెంటనే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ హోమ్పేజీ ఓపెనైపోయింది. దాన్లో తన ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవుదామనుకుంటూనే... ఒక్క క్షణం ఆలోచించాడు. ‘‘రిఫండ్ రావాలంటే నేను నా ఇంటర్నెట్ బ్యాంకులో ఎందుకు లాగిన్ అవ్వాలి?’’ అని. ఆ ఆలోచనే సుధీర్ను కాపాడింది. అందులో గనక లాగిన్ అయి ఉంటే... సుధీర్ వివరాలన్నీ మోసగాళ్లకు చేరి... తన అకౌంట్ ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోయేది. ఎందుకంటే ఆ పేజీ అచ్చం ఎస్బీఐ ఇంటర్నెట్ పేజీలానే ఉన్నా... అది మోసగాళ్లు పంపిన ఫిషింగ్ పేజీ. మోసగాళ్లు ఎంతకు తెగబడుతున్నారనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఇది రిఫండ్ల సీజన్. ఉద్యోగులంతా ఐటీ రిటర్నులు వేసే ఉంటారు. ఎంతో కొంత రిఫండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఈ రిఫండ్ల మోసాన్ని ఎంచుకున్నారు మాయగాళ్లు. అంతేకాదు!! ఇపుడు ఫోన్లు చేసి కూడా... మీకు రిఫండ్ రావాల్సి ఉంది... మీరు గనక ఎస్బీఐ కస్టమర్ అయితే 1 నొక్కండి. ఐసీఐసీఐ కస్టమర్ అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ ద్వారా వినిపిస్తున్నారు. అలా నొక్కుతూ పోతే... మన వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళతాయన్న మాట. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండని చెప్పేదే ఈ కథనం. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ల విషయంలో ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు మీ రిటర్ను వేసేటపుడే రిఫండ్ క్లెయిమ్ చేసి ఉంటారు. ఆ రిఫండ్ నేరుగా మీరిచ్చిన బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఒకవేళ ఖాతా ఇవ్వకుంటే... మీ చిరునామాకు చెక్కు వస్తుంది. అంతేతప్ప మళ్లీ మీరు ఆన్లైన్లో క్లెయిమ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్త మరి!! -
ఐటీ రీఫండ్ వ్యవధి 15 రోజులకు కుదింపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రీఫండ్లకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రీఫండ్ కేసుల ప్రాసెసింగ్ను నిర్దేశిత 30 రోజుల్లో గాకుండా 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగానికి సూచించింది. -
గతవారం బిజినెస్
నియామకం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్గా ఏజే జైన్ నియమితులయ్యారు. భారత్ రేటింగ్ యథాతథం అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, డాలర్ బలపడటం, కమోడిటీల రేట్లు తగ్గడం తదితర పరిణామాలతో ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల వృద్ధి ఒక మోస్తరుగానే ఉన్నా.. భారత అధిక వృద్ధి మాత్రం కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్కి ప్రస్తుతం స్థిరమైన అవుట్లుక్తో ఇచ్చిన బీబీబీ మైనస్ రేటింగ్ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇది పెట్టుబడులకు అత్యంత కనిష్ట స్థాయిని సూచిస్తుంది. టీమ్లీజ్ ఐపీఓకు సెబీ ఆమోదం వివిధ కంపెనీలకు అవసరమయ్యే ఉద్యోగులను అందించే సంస్థ టీమ్లీజ్ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా టీమ్లీజ్ సంస్థ రూ.450-500 కోట్ల వరకూ సమీకరిస్తుందని అంచనా. ద్రవ్యోల్బణం పైపైకి.. పప్పులు, పండ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్ధాల ధరలు ఎగియడంతో నవంబర్లో రిటైల్, టోకు రేట్ల ఆధారిత ద్రవ్యోల్బణాలు పెరిగాయి. అక్టోబర్లో 5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు గత నెలలో 5.41 శాతం మేర పెరిగింది. ఇది 14 నెలల గరిష్టం. ఆర్థిక అక్షరాస్యతలో అట్టడుగున దాదాపు 76 శాతం మంది భారతీయులకు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటి కీలకమైన ఆర్థిక అంశాలపై అవగాహన లేదని రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ పేర్కొంది. వయోజనుల్లో ఆర్థిక అక్షరాస్యత అత్యధిక శాతం ఉన్న దేశాల్లో సింగపూర్ (59%) అగ్రస్థానంలో ఉండగా, హాంకాంగ్.. జపాన్లు (రెండూ 43 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్కు ఊరట భారత మైనింగ్ దిగ్గజం అదానీ గ్రూప్కు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఆస్ట్రేలియా కోర్టు తీసుకుంది. అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన 1,650 కోట్ల డాలర్ల ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా ఒక పర్యావరణ సంస్థ దాఖలు చేసిన కేసును ఆస్ట్రేలియా కోర్ట్ కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కొన్ని షరతులతో అదానీ గ్రూప్కు మైనింగ్ లీజులను మంజూరు చేయాలని పేర్కొంది. పెరుగుతున్న మహిళా సంపన్నులు మహిళా బిలియనీర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. వీరి సంఖ్య 20 ఏళ్లలో ఏడు రెట్లు పెరిగిందని యూబీఎస్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియాలోనే మహిళా సంపన్నుల సంఖ్య వేగంగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. అలాగే ఆసియాలో పురుష సంపన్నుల కంటే మహిళ సంపన్నుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వెల్లడించింది. గత 20 ఏళ్లలో పురుష సంపన్నుల సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళ సంపన్నుల సంఖ్య 7 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కార్పొరేట్ లిటిగేషన్ కేసులు ఏపీలో అధికం దాదాపు 685 కార్పొరేట్ లిటిగేషన్ పెండింగ్ కేసులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే, దీని తర్వాతి స్థానంలో గుజరాత్ (545), పశ్చిమ బెంగాల్ (441) ఉన్నాయి. ఇక దేశంలో దాదాపు 3,507 కార్పొరేట్ లిటిగేషన్ కేసులు కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. కంపెనీ లా బోర్డు (సీఎల్బీ), బోర్డు ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ (బీఐఎఫ్ఆర్), అఫిషియల్ లిక్విడేటార్ సంబంధిత కేసులతో సహా కోర్టులలో 3,507 కార్పొరేట్ లిటిగేషన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బిల్లు రూ.50,000 దాటితే పాన్ తప్పనిసరి నల్లధనం చలామణీని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర సంబంధిత నగదు లావాదేవీలు రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు. పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా.. అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరోవైపు. గతేడాది నవంబర్లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రిలయన్స్పై తాజా విచారణకు శాట్ ఆదేశం రిలయన్స్ ఇండస్ట్రీస్పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విధించిన రూ.13 కోట్ల జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యూనల్(శాట్) రద్దు చేసింది. ఈ అంశంపై తాజాగా విచారణ జరిపించాలని సెబీని శాట్ ఆదేశించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ సెబీ గత ఏడాది ఆ కంపెనీపై రూ.13 కోట్ల జరిమానాను విధించింది. హెదరాబాద్లో గూగుల్ క్యాంపస్... భారత్లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, బిజినెస్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. వచ్చే ఏడాది(2016) చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ఇంటర్నెట్ను చౌకగా అందించేందుకు గూగుల్ తలపెట్టిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్లోనూ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్ఎస్ఈ గ్రూప్ ఇండెక్స్లు ఎన్ఎస్ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్లను ప్రారంభించింది. భారత్లో దిగ్గజ గ్రూప్లు అయిన టాటా, ఆదిత్య బిర్లా, మహీంద్రా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి ఈ మూడు గ్రూప్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని ఐఐఎస్ఎల్ పేర్కొంది. నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని పేర్కొంది. ఫెడ్ రేటు పావు శాతం పెంపు అంతా ఊహించినట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. డీల్స్.. * పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్... ఇటలీకి చెందిన ఆటోమోటివ్ డిజైనింగ్ సంస్థ పినిన్ఫారినాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 50 మిలియన్ యూరోల పైగా (సుమారు రూ. 370 కోట్లు) ఉండనుంది. * హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్రూమ్ టెక్నాలజీస్ లిమిటెడ్లో ( ఐక్లీన్) 26 శాతం వాటాను జపాన్కు చెందిన టకసాగో థర్మల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (టీటీఈ) కొనుగోలు చేసింది. * రైల్వే ప్రయాణికులు ఈ-కేటరింగ్ ద్వారా ఆర్డర్ చేసిన ఆహార పదార్ధాలకు ఇక నుంచి పేటీఎం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు పేటీఎంతో రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. -
రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా
పెండింగ్లో రూ.5,400 కోట్ల రిఫండ్లు న్యూఢిల్లీ: ఐటీ రిఫండ్స్ కోసం వేచిచూస్తున్న లక్షలాది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. రూ.50,000 లోపు ఉన్న ఐటీ రిఫండ్స్ను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని ప్రభుత్వం ఆదాయపు పన్ను అధికార వర్గాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఈ వారం మొదట్లోనే ప్రభుత్వం జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సీబీడీటీ) ఉన్నతాధికారులతో రెవెన్యూ కార్యదర్శి హశ్ముఖ్ అధియాతో గత వారం ప్రారంభంలో జరిగిన సమావేశానంతరం ఈ ఆదేశాలు వెలువడ్డాయి. పన్ను సంబంధిత ఫిర్యాదులు తగ్గేలా, పన్ను చెల్లింపుదారుల సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సూచించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.5,400 కోట్ల విలువైన ట్యాక్స్ రిఫండ్లు పెండింగ్లు ఉన్నాయి. కాగా ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 2.07 లక్షల ఐటీ రిటర్న్లకు సంబంధించి రిఫండ్లను ఐటీ శాఖ పంపించింది. సీబీడీటీకి వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం ఐటీ రిఫండ్ల గురించే వస్తుండడం విశేషం. -
ఇక 15జీ, 15హెచ్ ఫామ్స్ దాఖలు మరింత సులభం
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) 15జీ, 15హెచ్ ఫామ్స్ పూర్తిచేసే ప్రక్రియను సరళతరం చేసింది. పన్ను చెల్లింపుదారులకు ఈ ఫామ్స్ పూర్తి చేయటాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఆదాయం పన్ను పరిధి లోపు ఉండి, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పొందాలనుకునే వారు 15జీ, 15హెచ్ ఫామ్స్ను దాఖలు చేస్తారు. అలాగే డిడక్టర్స్కు సంబంధించిన ఫామ్స్ దాఖలు విధానాన్ని కూడా సరళతరం చేసింది. ఇందులో అన్ని దాఖలుకు ప్రత్యేక గుర్తింపు నెంబర్ను కేటాయిస్తోంది. అటు పన్ను చెల్లింపుదారులకు, ఇటు ట్యాక్స్ డిడక్టర్స్కు వ్యయాలను తగ్గించే లక్ష్యంగా ఈ సవరణలను చేసినట్టు సీబీడీటీ పేర్కొంది. సవరించిన విధానాలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. 15జీ ఫామ్స్ను పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు, 15హెచ్ ఫామ్స్ను వృద్ధ పౌరులు దాఖలు చేస్తారు. -
రెట్రో ట్యాక్స్ కేసులపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణ (2012 ఏప్రిల్కు ముందునాటి ఒప్పందాలపైనా పన్ను వర్తింపు) కారణంగా వెలుగులోకివచ్చే ఆదాయపు పన్ను కేసులను పరిశీలించేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియమించిన ఈ నలుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీకి చెందిన విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన యూనిట్-1 జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు. అసెసింగ్ ఆఫీసర్(ఏఓ) నుంచి వచ్చే ఇలాంటి కేసులపై 60 రోజుల్లోగా ఈ కమిటీ తగిన పరిశీలనజరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషనలో పేర్కొంది. రెట్రో ట్యాక్స్ కేసులపై కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియాలో హాంకాంగ్కు చెందిన హచిసన్ టెలికం వాటాను బ్రిటన్ సంస్థ వొడాఫోన్ కొనుగోలు చేసిన ఒప్పందానికి సంబంధించి ఆ కంపెనీకి ఐటీ శాఖ పన్ను నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై వొడాఫోన్ సుప్రీం కోర్టులో న్యాయపోరాటంచేసి విజయం సాధించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీ చట్లాల్లో ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్తో సంబంధం ఉన్న కంపెనీలకు సంబంధించి దేశీయంగా, లేదా విదేశాల్లో ఎక్కడ ఎలాంటి కొనుగోలు, అమ్మకం లావాదేవీలు జరిగినా దానిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించేలా, పాత కేసులకూ వర్తింపజేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ రూ.11,217 కోట్ల పన్నుతో పాటు దీనిపై వడ్డీని కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మొత్తం ఉదంతంపై విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో రెట్రో ట్యాక్స్ నిబంధనలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తామని జైట్లీ బడ్జెట్లో చెప్పారు. -
సీఏలు ‘ట్రూ అండ్ ఫెయిర్’గా ఉండాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనదని, సామాన్యుని దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ వరకు అందరూ ఆ సంతకం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ కె.వి.చౌదరి పేర్కొన్నారు. ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ను నిర్ధారిస్తూ ఆడిటర్లు ‘ట్రూ అండ్ ఫెయిర్’ అని సంతకం చేస్తారని, జీవితంలో కూడా సీఏలు అదే విధంగా వ్యవహరించినప్పుడే వృత్తి గౌరవం కాపాడినవారవుతారన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల మొత్తం వృత్తికే చెడ్డపేరు వస్తోందని, ఈ మధ్యకాలంలో బ్యాంకుల నుంచి నిధుల మళ్లింపుల కేసుల్లో పరోక్షంగా సీఏల పాత్ర కూడా ఉందంటూ చురకలు వేశారు. ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ ఎస్ఐఆర్సీ ప్రత్యక్ష పన్నులపై నిర్వహించిన ఒక రోజు సమావేశానికి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణల పేరుతో సామాన్యులను భయపెట్టాలన్నది ఆదాయ పన్ను శాఖ లక్ష్యం కాదని, పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న వారే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక సంస్థ టీడీఎస్ వసూలు చేసి చెల్లించకపోతే దానివల్ల మొత్తంగా రిఫండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇలాంటి సంస్థల విషయంలో చాలా కఠినంగా వ్యవ హరిస్తున్నామన్నారు. గతేడాది సంయుక్త ఆంధ్రప్రదేశ్లో టీడీఎస్ వసూలు చేసి చెల్లించని 1,000 కేసులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఒప్పందాల్లో పన్ను ఎగవేత ఎక్కువగా ఉంటోందన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అరికట్టడానికి బెంగళూరు కేంద్రంగా ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లతో పాటు, ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దేవరాజ రెడ్డి, ప్రాక్టీసింగ్ సీఏలు పాల్గొన్నారు. -
ఈ-ఫైలింగ్ ప్రక్రియ మరింత సరళతరం
న్యూఢిల్లీ: ఇన్కం ట్యాక్స్ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ఆర్కే తివారి తెలిపారు. ఆన్లైన్ పద్ధతిలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలను సరళతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చ్ 22 నాటికి 1.80 కోట్ల మేర ఈ-రిటర్నులు రాగా ఈసారి 40 శాతం పెరిగి 2.56 కోట్ల దాకా వచ్చాయని తివారీ చెప్పారు. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) నెలకు 2.80 లక్షల రిటర్నులను ప్రాసెస్ చేస్తోందని తెలిపారు. ఈ-రిటర్నుల ప్రాసెసింగ్కి పట్టే సమయం కూడా 70 రోజుల నుంచి 61 రోజులకు తగ్గిందని తివారీ చెప్పారు. మరోవైపు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ వివాదాలను నివారించడానికి మార్చ్ 31లోగా మరిన్ని బహుళ జాతి సంస్థలతో అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందాలు (ఏపీఏ) కుదుర్చుకోనున్నట్లు తివారీ తెలిపారు. భవిష్యత్లో కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి అనుసరించే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విధానం గురించి పన్నుల శాఖతో కంపెనీలు ఈ ఏపీఏ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఒకే గ్రూప్లోని రెండు సంస్థల మధ్య జరిగే లావాదేవీల విషయంలో సదరు గ్రూప్ పాటించే ధరల విధానాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్గా పరిగణిస్తారు. చాలా మటుకు బహుళ జాతి కంపెనీలు దీన్ని అడ్డం పెట్టుకుని తమ లాభాలన్నీ .. తక్కువ పన్నులు ఉండే దేశాల్లోకి మళ్లిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివాదాలను తగ్గించే ఉద్దేశంతో ఏపీఏలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తాం.. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని తివారీ వ్యక్తం చేశారు. ఇక్కడ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.6.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. మార్చి 22 వరకూ వీటిలో రూ.5.82 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు తివారీ తెలిపారు. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 13.6 శాతం అధికం. ముందస్తు పన్ను వసూళ్లు మొత్తంగా చూస్తే మార్చి 22తో ముగిసిన యేడాదికాలంలో 8.7 శాతం వృద్ధితో రూ.2,90,323 కోట్లుగా ఉన్నట్లు తివారీ వివరించారు.