రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా | CBDT to issue pre-filled ITR forms to ease e-filing | Sakshi
Sakshi News home page

రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా

Published Mon, Dec 7 2015 4:26 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM

రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా - Sakshi

రూ. 50 వేల లోపు ఐటీ రిఫండ్స్ ఇక జోరుగా

పెండింగ్‌లో రూ.5,400 కోట్ల రిఫండ్‌లు
న్యూఢిల్లీ: ఐటీ రిఫండ్స్ కోసం వేచిచూస్తున్న లక్షలాది పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. రూ.50,000 లోపు ఉన్న ఐటీ రిఫండ్స్‌ను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని ప్రభుత్వం ఆదాయపు పన్ను అధికార వర్గాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఈ వారం మొదట్లోనే ప్రభుత్వం జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్(సీబీడీటీ) ఉన్నతాధికారులతో రెవెన్యూ కార్యదర్శి హశ్‌ముఖ్ అధియాతో గత వారం ప్రారంభంలో జరిగిన సమావేశానంతరం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.  

పన్ను సంబంధిత ఫిర్యాదులు తగ్గేలా,  పన్ను చెల్లింపుదారుల సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సూచించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.  ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.5,400 కోట్ల విలువైన ట్యాక్స్ రిఫండ్‌లు పెండింగ్‌లు ఉన్నాయి. కాగా ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 2.07 లక్షల ఐటీ రిటర్న్‌లకు సంబంధించి రిఫండ్‌లను ఐటీ శాఖ పంపించింది. సీబీడీటీకి వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం ఐటీ రిఫండ్‌ల గురించే వస్తుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement