ఎల్‌ఐసీ ఐపీఓ... తొలి అడుగు | DIPAM invites bids from transaction advisors for LIC IPO | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఐపీఓ... తొలి అడుగు

Published Sat, Jun 20 2020 5:44 AM | Last Updated on Sat, Jun 20 2020 5:44 AM

DIPAM invites bids from transaction advisors for LIC IPO - Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించి తొలి అడుగు పడింది. ఐపీఓ  విధి విధానాలకు సంబంధించి  సేవలందించే వివిధ  సంస్థల నుంచి  దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. దేశంలోనే అతి పెద్ద ఐపీఓ కానున్న ఈ ఎల్‌ఐసీ ఐపీఓ కసరత్తు కోసం కనీసం రెండు సలహా సంస్థలను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు/మర్చంట్‌ బ్యాంకర్లు/ఆర్థిక సంస్థలు /బ్యంక్‌ల నుంచి దరఖాస్తులను దీపమ్‌(డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌) ఆహ్వానించింది. వచ్చే నెల 13లోపు సంస్థలు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జూలై 14న బిడ్‌లు తెరుస్తారు. ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో ఉండొచ్చని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement