LIC
-
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆరోగ్య బీమాలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. చర్చలు తుది దశకు చేరడంతో మార్చి 31కల్లా వివరాలు వెల్లడికానున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ ప్రవేశించడం సాధారణ అంశమేనని ఇక్కడ జరిగిన జీసీఏ25 వేడుక సందర్భంగా పేర్కొన్నారు. అయితే లక్షిత కంపెనీలో నియంత్రిత లేదా 51 శాతం లేదా అంతకుమించిన వాటా కొనుగోలు చేయబోమన్నారు.ఎంత వాటా సొంతం చేసుకునేదీ టార్గెట్ కంపెనీ విలువ, ఎల్ఐసీ బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు అనుమతించని కారణంగా ఎల్ఐసీ వాటా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్ను జారీ చేయాలన్న ప్రతిపాదనలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాని సంగతి తెలిసిందే. మణిపాల్సిగ్నా కొనుగోలు?హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్సిగ్నాలో వాటా కొనుగోలుకి ఎల్ఐసీ చర్చలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 4,000 కోట్ల విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ స్టాండెలోన్ ఆరోగ్య బీమా కంపెనీలో ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చలు చేపట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకు బోర్డు నిర్ణయాలుసహా వివిధ అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. 100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు కావాలి..దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల(జీసెక్లు) జారీకి అనుమతించమంటూ జీవిత బీమా పీఎస్యూ ఎల్ఐసీ ఆర్బీఐని కోరింది. 100 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల జారీకి విజ్ఞప్తి చేసింది. తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి అవకాశాలకు వీలుంటుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. 20–30 ఏళ్ల బాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్బీఐ 40 ఏళ్ల కాలపరిమితికీ అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 50 ఏళ్లు, 100 ఏళ్ల బాండ్లనూ అంచనా వేస్తున్నట్లు చెప్పారు.ఈ అంశంపై ఆర్బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లలో పలు దేశాలు 100 ఏళ్ల గడువుతో బాండ్ల జారీని చేపడుతున్నట్లు ప్రస్తావించారు. సెకండరీ మార్కెట్లో పరిమిత డిమాండ్, తక్కువ లిక్విడిటీ కారణంగా భారత్సైతం ఈ తరహా బాండ్లకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జీసెక్లలో ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఎల్ఐసీ.. రూ.480 కోట్లు కట్టు!
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కి భారీ మొత్తంలో జీఎస్టీ (GST) చెల్లించాలని నోటీసు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ముంబైలోని స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నుంచి జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ అందుకున్నట్లు ఎల్ఐసీ తెలిపింది. జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీతో కలిపి మొత్తం రూ.479.88 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో ఉంది.ఈ రూ.479.88 కోట్ల మొత్తంలో జీఎస్టీ రూపంలో రూ.242.23 కోట్లు, వడ్డీ కింద రూ.213.43 కోట్లు, పెనాల్టీ రూపంలో రూ.24.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తప్పుగా పొందడం, షార్ట్ రివర్స్ చేయడం, ఆలస్య చెల్లింపులపై వడ్డీ, తక్కువ పన్ను చెల్లించడం వంటి కారణాలతో ఈ నోటీసు జారీ చేసినట్లుగా ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.ఈ ఆర్డర్ను ముంబైలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ (అప్పీల్స్) ముందు అప్పీల్ చేసే అవకాశం ఉందని ఎల్ఐసి పేర్కొంది. కాగా ఈ డిమాండ్ నోటీసు తమ ఆర్థికాంశాలు లేదా కార్యకలాపాలపై నేరుగా ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. ‘ఈ డిమాండ్ ఆర్థిక ప్రభావం జీఎస్టీ, వడ్డీ, పెనాల్టీల వరకే ఉంటుంది. కార్పొరేషన్ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి భౌతిక ప్రభావం ఉండదు" అని ఎల్ఐసీ తెలిపింది.మెరుగైన లాభాలుఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో ఎల్ఐసీ బలమైన పనితీరును ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో మెరుగైన పెట్టుబడి ఆదాయం, అధిక ప్రీమియం వసూళ్లతో లాభంలో 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కార్యకలాపాల నుండి కూడా ఆదాయం గణనీయంగా పెరిగింది. లాభాల వృద్ధితో పాటు ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్కు.. మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025 -
ఎల్ఐసీకి మంచి లాభాలు.. ఎగిసిన రాబడి
బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(Q3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం ఎగసి రూ. 11,056 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ. 9,444 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1,17,017 కోట్ల నుంచి రూ. 1,06,891 కోట్లకు క్షీణించింది.ఈ బాటలో మొత్తం ఆదాయం సైతం రూ. 2,12,447 కోట్ల నుంచి రూ. 2,01,994 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణా వ్యయాలు రూ. 18,194 కోట్ల నుంచి రూ. 14,416 కోట్లకు తగ్గాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 డిసెంబర్కల్లా 10 శాతం బలపడి రూ. 54,77,651 కోట్లను తాకాయి. బీమా సఖి యోజన పథకంలో భాగంగా ఇప్పటివరకూ 1.25 లక్షల మంది మహిళలు రిజిస్టరైనట్లు ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. బీమా సఖిగా 70,000 మంది ఎంపికైనట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 811 వద్ద ముగిసింది. ఫోర్టిస్ హెల్త్కేర్ లాభం జూమ్దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్న ఫోర్టిస్ హెల్త్కేర్ (Fortis Healthcare) డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 89 శాతం పెరిగి రూ.254 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.134 కోట్లుగా ఉండడం గమనార్హం. బెంగళూరులోని రిచ్మండ్ రోడ్ హాస్పిటల్ను విక్రయించడం రూపంలో వచ్చిన రూ.23.5 కోట్లు కూడా లాభాల్లో కలసి ఉన్నట్టు సంస్థ తెలిపింది.ఆదాయం ఇదే కాలంలో రూ.1,680 కోట్ల నుంచి రూ.1,928 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,515 కోట్ల నుంచి రూ.1,696 కోట్లకు పెరిగిపోయాయి. ‘‘క్యూ3లోనూ సానుకూల పనితీరును కొనసాగించాం. మా కన్సాలిడేటెడ్ ఆదాయంలో ఆస్పత్రుల వ్యాపారం 84 శాతం సమకూర్చింది’’అని ఫోర్టిస్ హెల్త్కేర్ ఎండీ, సీఈవో అశుతోష్ రఘువంశీ తెలిపారు. ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, కార్డియాక్ సైన్సెస్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, రీనల్సైన్సెస్తో కూడిన స్పెషాలిటీ విభాగం నుంచే 62 శాతం ఆదాయం వచ్చినట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్సీలో ఈ షేరు 0.8% నష్టపోయి రూ.646 వద్ద ముగిసింది. -
పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఫేక్ యాప్స్, ఫేక్ మెసేజ్లతో ప్రజలను దోచేస్తున్నారు. ఇలాంటి మోసాల భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే మొబైల్ ఫోన్లలో కాలర్ ట్యూన్ ద్వారా హెచ్చరిస్తోంది. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు, కస్టమర్లకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది.''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే.. మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం.. ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది.పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్సైట్ లేదా డిజిటల్ యాప్ వంటి వాటితో పాటు వారి వెబ్సైట్లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.1956లో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రభుత్వ మద్దతుతో కూడిన కార్పొరేషన్ సంస్థ. ఇది రక్షణ, పొదుపు, పెట్టుబడి కోసం అందించే పాలసీలతో సహా విస్తృత శ్రేణి జీవిత బీమా అందిస్తుంది. అకాల మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు వ్యక్తులు & కుటుంబాలకు ఆర్థిక భద్రత, మద్దతును అందించడం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా పొదుపు, సంపద సృష్టిని ప్రోత్సహించడం ఎల్ఐసీ ప్రధాన ఉద్దేశ్యం.ఇదీ చదవండి: మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..ప్రస్తుతం ఎల్ఐసీ.. ఏజెంట్లు, శాఖలు, డిజిటల్ ప్లాట్ఫామ్లతో పెద్ద నెట్వర్క్ కలిగి ఉంది. ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన.. విస్తృతంగా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇందులో చాలామంది పెట్టుబడులు లేదా ఇన్సూరెన్స్ వంటివి చేశారు.Public caution notice for our policyholders and customers#LIC #CautionNotice pic.twitter.com/GEyLcxdGGK— LIC India Forever (@LICIndiaForever) February 4, 2025 -
ఇన్ఫీలో మూర్తి కుటుంబం కంటే రెట్టింపు వాటా
ఇన్ఫోసిస్లో నారాయణమూర్తి కుటుంబానికి ఉన్న సమష్టి హోల్డింగ్స్ వారి శాశ్వత వారసత్వాన్ని, కంపెనీ పథంలో గణనీయమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఆ కుటుంబానికి మొత్తంగా కంపెనీలో ఉన్న వాటా దాదాపు 4-5 శాతం మాత్రమే. ప్రపంచ ఐటీ రంగం భవిష్యత్తులో భారీగా దూసుకుపోతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. కేవలం రిటైలర్లే కాకుండా ఇన్వెసింగ్ సంస్థలు చాలాకాలం నుంచే ఈ రంగంలో వాటా కొనుగోలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్లో మూర్తి కుటుంబానికి ఉన్న వాటా కంటే కూడా రెట్టింపు వాటాను హోల్డ్ చేస్తున్న సంస్థలున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.మూర్తి కుటుంబం వాటాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి కంపెనీలో గణనీయమైన వాటా ఉంది. తాజా నివేదికల ప్రకారం తన కుటుంబం మొత్తం హోల్డింగ్స్ సుమారు 4.02% ఉన్నాయి. నారాయణమూర్తికి 0.36%, ఆయన భార్య సుధామూర్తికి 0.93%, వారి పిల్లలు అక్షత మూర్తికి 1.05%, రోహన్ మూర్తికి 1.465% వాటా ఉంది. నారాయణమూర్తి మనవడు నాలుగేళ్ల ఏకగ్రహ్ మూర్తికి కూడా తన తాత ఇటీవల షేర్లను బహుమతిగా ఇవ్వడంతో 0.04% వాటా ఉంది.ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులువ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఇన్ఫోసిస్లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఇన్ఫోసిస్లో ఏకంగా 9.531 శాతం వాటాను ఎల్ఐసీ హోల్డ్ చేస్తోంది. దీని విలువ సుమారు రూ.8,694 కోట్లు. ఈ పెట్టుబడి ద్వారా ఎల్ఐసీ భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో కంపెనీ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమాఇన్ఫోసిస్తో సహకారం..ఇన్ఫోసిస్తో ఎల్ఐసీ భాగస్వామ్యం కేవలం ఆర్థిక పెట్టుబడులకు పరిమితం కాలేదు. సంస్థ అందించే సేవల్లోనూ ఇరు కంపెనీల సహకారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసుల్లో ఇన్ఫోసిస్ నైపుణ్యం ద్వారా ఎల్ఐసీ నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్) అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్పై ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేశాయి. ఈ సహకారం ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు అంతరాయంలేని సర్వీసులు అందిస్తుందని భావిస్తున్నారు. -
ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లు
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఇటీవల ప్రారంభించిన బీమా సఖి యోజనలో నెలలోపే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పథకంలో నమోదైన 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టారని పేర్కొంది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం లక్ష్యంగా ఎల్ఐసీ గతంలో తెలిపింది.ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకందేశవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో బీమా సఖీలుగా పిలువబడే ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణ ఇస్తారు. దాంతో వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.లక్ష్యాలు, ప్రయోజనాలుగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను పెంపొందించడం బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana) ప్రాథమిక లక్ష్యం. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను, వచ్చే మూడేళ్లలో 2,00,000 మంది మహిళలను ఈ పథకంలో భాగం చేయడం దీని లక్ష్యం. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి బీమాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.ఈ పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. దాంతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్లు అందిస్తారు. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందకుండా మహిళలు తమ శిక్షణపై దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక వెసులుబాటు సహాయపడుతుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితాఅర్హతలు ఇవే..కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎల్ఐసీ ఏజెంట్లుగా మారి వారు విక్రయించే పాలసీల ఆధారంగా కమీషన్లు(Commissions) పొందవచ్చు. బీమా సఖి యోజన ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నెలలోనే 50,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరిలో 27,695 మంది మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయగా, 14,583 మంది ఇప్పటికే పాలసీలను విక్రయించడం ప్రారంభించారు. ఏడాదిలోగా దేశంలోని ప్రతి పంచాయతీకి కనీసం ఒక బీమా సఖిని అందించాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామ్లో చేరిన గ్రాడ్యుయేట్ మహిళలను భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ల భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. -
క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కాలపరిమితి గడువు పూర్తయ్యాక (మెచ్యూర్టీ) ఎవరూ క్లెయిమ్ చేసుకోని (అన్క్లెయిమ్డ్) బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ లెక్కల ప్రకారం గడువు తీరినా బీమా ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోని పాలసీదార్లు 3,72,282 మంది ఉన్నట్లు మంత్రి లోక్సభలో పేర్కొన్నారు. 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు చెందిన రూ.815.04 కోట్ల నిధులు అన్క్లెయిమ్డ్గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఅన్క్లెయిమ్డ్, అవుట్స్టాండింగ్ క్లెయిమ్లను తగ్గించుకునేందుకు ఎల్ఐసీ ఎలాంటి ప్రయాత్నాలు చేస్తుందో మంత్రి తెలియజేశారు.పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడండిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంరేడియో ద్వారా సమాచారం ఇవ్వడంబీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాలని సాధారణ/ స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సమాచారాన్ని పంపిస్తున్నారు.ఇ-మెయిల్ చిరునామా ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా సమాచారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.బీమాను క్లెయిమ్ చేసుకోవాలని ఏజెంట్ల ద్వారా పాలసీదార్లకు సమాచారం ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
జీవిత బీమా అనగానే.. డబ్బు వృథా, అనవసరంగా ప్రీమియం చెల్లించాలనే ధోరణి ఉంది. దీన్ని గ్రహించిన కంపెనీలు వినియోగదారులు చెల్లించే ప్రీమియంపై రాబడి వచ్చేలా ఎండోమెంట్ పాలసీలను తీసుకొచ్చారు. అయితే ఇందుకు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఒకవైపు బీమా కవరేజీ.. మరోవైపు రాబడి ఉంటుంది. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా సరైంది కాదని, కొన్నిసార్లు సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా ఎండోమెంట్ పాలసీల్లో వచ్చే రాబడి తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. బీమా సంస్థలు, ఏజెంట్లు మార్కెటింగ్లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని చేస్తుంటారు. కానీ, బీమా రక్షణా? లేక రాబడా? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ అంశాలను వివరించే కథనం ఇది..బీమా, పొదుపుతో కూడిన ప్లాన్లుసంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రముఖ సంస్థకు చెందిన ఓ ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుంది.ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తున్నాయా..?55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై సుమారు రూ.50 చొప్పున వస్తుంది. మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు.. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి.మరణిస్తే చెల్లింపులు ఇలా..ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది.ప్రత్యామ్నాయం..బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైన బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా ప్యూర్ లైప్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పైఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం.35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేలు అనుకుందాం. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. పైన చెప్పుకున్న ప్లాన్లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పైప్లాన్లో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈఉదాహరణ తెలియజేస్తోంది.కాంపౌండింగ్ ఉండదు..విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది.ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్ను కొనుగోలు చేసుకోవచ్చు.గ్యారంటీడ్.. పార్టిసిపేటింగ్బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ అనే వాటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో వీటిని చెల్లిస్తారు.ఇదీ చదవండి: ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రాఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమియంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం అధికంగా ఉంటుంది. -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
ఫ్రీగా నటిస్తున్నారా? ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలి?: నిర్మాత
మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.మరి నీ భర్త చేసిందేంటి?ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్ఐసీ సినిమా టైటిల్ను అప్పనంగా వాడేశాడు. నా నిర్ణయాన్ని గౌరవించలేదుఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్ఐసీ టైటిల్తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్ఐసీ టైటిల్కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?ఎంత కుంగిపోయానో?ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: బిగ్బాస్ షోలో పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్ -
ఎల్ఐసీ లాభం తగ్గింది.. వాటి ప్రభావమే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెలువరించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 4% క్షీణించి రూ. 7,621 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం తగ్గడం, కుటుంబ పెన్షన్లో రూ. 464 కోట్ల పెరుగుదల ప్రభావం చూపాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 7,925 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు ఎగసింది. అయితే ఇతర ఆదాయం రూ. 248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ. 145 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,94,335 కోట్ల నుంచి రూ. 2,22,366 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.43 శాతం నుంచి 1.72 శాతానికి దిగివచ్చాయి.హెల్త్ ఇన్సూరెన్స్పై కన్ను ఈ ఆర్థిక సంవత్సరంలోగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. ఇప్పటికే పనులు మొదలుకాగా.. సరైన సంస్థ కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. మార్చిలోగా వాటా కొనుగోలుకు తుది రూపునివ్వనున్నట్లు వెల్లడించారు. టార్గెట్ సంస్థ విలువనుబట్టి ఎంత వాటా కొనుగోలు చేసేదీ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 1.6% నష్టంతో రూ. 915 వద్ద ముగిసింది. -
బీమా విస్తరణకు టెల్కోల సాయం
ముంబై: దేశంలో బీమాను అందరికీ చేర్చేందుకు టెలికం, ఈ–కామర్స్, ఫిన్టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సీఈవో, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘ఏజెంట్లు, బ్రోకర్లు, బ్యాంక్–ఇన్సూరెన్స్తో సహా ప్రస్తుత ఛానెల్లు ప్రభావవంతంగా ఉన్నాయి. విస్తారమైన, మారుమూల గ్రామీణ మార్కెట్కు బీమాను విస్తరించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో పరిమితులు ఉన్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విధానాలను అమలు పర్చాల్సిందే. అందరికీ బీమాను చేర్చాలంటే పంపిణీ, మార్కెటింగ్ అంశాలను పునరాలోచించాలి. టెలికం, ఈ–కామర్స్, ఫిన్టెక్ వంటి సంప్రదాయేతర కంపెనీల సహకారంతోనే బీమా పాలసీలను పెద్ద ఎత్తున జారీ చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. వీటితో భాగస్వామ్యం చేయడం ద్వారా సరసమైన, అందుబాటులో ఉండే కవరేజ్ అందరికీ లభిస్తుంది. కొత్త విధానాన్ని అనుసరించడం వల్ల వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి బీమా సంస్థలు పెద్ద ఎత్తున ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాయి. 100 కోట్ల మందికిపైగా బీమా చేర్చడం అంత సులువు కాదు. గ్రామీణ, తక్కువ–ఆదాయ వర్గాలను చేరుకోవడానికి డిజిటల్ టెక్నాలజీ కీలకం. ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెరి్నంగ్, ఆటోమేషన్ వంటి సాంకేతికతలు, ప్లాట్ఫామ్లు మొత్తం బీమా రంగాన్ని విప్లవాత్మకంగా, మరింత కస్టమర్–ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి’ అని సీఐఐ సదస్సులో వివరించారు. -
ఎల్ఐసీ రూపురేఖలు మార్చేపనిలో ఇన్ఫోసిస్
కాలంతో పాటు టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే దిగ్గజ కంపెనీలైన కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్'తో చేతులు కలిపింది.ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చొరవకు నాయకత్వం వహించడానికి భారతదేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీకు తన సహకారాన్ని ప్రకటించింది. కంపెనీ త్వరలోనే నెక్స్ట్జెన్ డిజిటల్ ప్లాట్ఫారమ్ను రూపొందించడాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్నిచానెల్ ఎంగేజ్మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందించడంపై దృష్టి పెడుతుంది.భారీ స్థాయి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్లను అమలు చేయడంలో దాని విస్తృత అనుభవం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్.. ఇన్సూరెన్స్ రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకోవడానికి ఎల్ఐసీ కంపెనీ ఇన్ఫోసిస్ను ఎంపిక చేసింది. కాబట్టి త్వరలోనే ఎల్ఐసీ రూపురేఖలు మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్), క్లౌడ్ నైపుణ్యాలను ఇన్ఫోసిస్ ఎల్ఐసీలో కూడా ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇది తప్పకుండా ఎల్ఐసీ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇన్ఫోసిస్ సహకారం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరివర్తనను మరింత మెరుగుపరుస్తుందని.. కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులు అందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనుభవాలను పొందవచ్చని ఎల్ఐసి సీఈఓ అండ్ ఎండీ సిద్దార్థ మొహంతి అన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్
దేశీయ బీమా రంగంలో ఎన్ని కంపెనీలున్నా ప్రభుత్వ అధీనంలోని జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ది ప్రత్యేక స్థానం. ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 68వ బీమా వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.నాలుగు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సమకూరుస్తున్న ఈ సంస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎల్ఐసీ సుమారు 15 లక్షల మంది నిరుద్యోగులకు బీమా సలహాదారులుగా ఉపాధి కల్పిస్తోంది.దేశవ్యాప్తంగా 688 జిల్లాస్థాయి జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) కార్యాలయాలున్నాయి.ప్రైవేటు కంపెనీలకు గ్రామీణ ప్రాంతాల్లో 176 శాఖలుంటే, ఎల్ఐసీకి 1,224 బ్రాంచీలున్నాయి.ఎల్ఐసీ 1956 నుంచి ఇప్పటివరకు రూ.53లక్షల కోట్ల ఆస్తులను సంపాదించింది.దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.43లక్షల కోట్ల మేర పెట్టుబడులు అందించింది.సుమారు 27 కోట్ల మంది వ్యక్తిగత పాలసీదారులున్నారు.13 కోట్ల గ్రూప్ పాలసీదారులకు ఎల్ఐసీ సేవలందిస్తోంది.రూ.51.21 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణ(ఏయూఎమ్)తో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తోంది.గడచిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.6,104 కోట్ల డివిడెండ్ అందించింది.బ్రాండ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ రిపోర్ట్-2024 ప్రకారం ఎల్ఐసీ ప్రపంచంలోనే ‘అత్యంత బలమైన బ్రాండ్’గా నిలిచింది.‘ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్’ నివేదిక ప్రకారం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ.గత సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్లను క్లెయిమ్ల రూపంలో పాలసీదారులకు చెల్లించింది.ఇటీవలి కేరళ తుపానులో మరణించిన 36 మంది పాలసీదారుల కుటుంబాలకు ఎలాంటి కాగితాలు అడగకుండానే రూ.11 కోట్ల మేర బీమా సొమ్మును అందజేసింది.ఇదీ చదవండి: సెబీ చీఫ్పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?కేంద్ర ప్రభుత్వం 2022లో ఎల్ఐసీలోని మూడున్నర శాతం వాటాను ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో విక్రయించింది. ఇందులో భాగంగా సుమారు 40 లక్షల షేర్లు విక్రయించి రూ.21వేల కోట్లను సమకూర్చుకుంది. -
దేశ ప్రగతిలో తనదైన ముద్రవేస్తూ...
‘బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్– 2024’ వారి తాజా నివేదిక ప్రకారం భారత జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ, బలమైన బ్రాండ్గా ప్రపంచంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఫార్చ్యూన్ ప్రపంచ సూచీ– 2023లో 107వ ర్యాంక్ పొంద డమే గాక, మొత్తం ప్రీమియం ఆదాయంలో ప్రపంచంలో 10వ అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇప్పటికే క్లెయిమ్ల చెల్లింపు తదితర విషయాలలో ప్రపంచ నంబర్ 1గా ఇది ఉండటం గమనార్హం. 2024 సెప్టెంబర్ 1 నాటికి భారతీయ జీవిత బీమా సంస్థ 68 ఏళ్ళు పూర్తిచేసుకుని, 69వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇటువంటి ఫలితాలు ప్రభుత్వ బీమా రంగానికి మరింత ఊతం ఇస్తాయి.జీవిత బీమా రంగంలో పట్టాదారుల సొమ్ము, భద్రత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సురక్షితం కాదని, వారి సొమ్ముకు పూర్తి రక్షణ కావాలంటే జాతీయం చేయడం ఒక్కటే పరిష్కారమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 1951 నుంచి 1956 వరకు ఉద్య మాలు నడిచాయి. ఫలితంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరి 19న జీవిత బీమా రంగాన్ని జాతీయీకరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకువచ్చింది.అయిదు కోట్ల రూపాయల ప్రభుత్వ మూలధనంతో 1956 సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఎల్ఐసీ నేడు రూ. 53 లక్షల కోట్ల మేర ఆస్తులు సమకూర్చుకున్నది. ఇప్పుడు ఏడాదికి 3.5 లక్షల కోట్ల నుండి 4 లక్షల కోట్ల వరకు దేశా భివృద్ధికి పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి ఈ సంస్థ పని తీరుకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వనరుల సేకరణ పేరుతో ఎల్ఐసీలో 25 శాతం వాటాలు అమ్మి, రెవెన్యూ లోటును పూడ్చుకునే ఉద్దేశంతో ఉన్నది. దేశ అంతర్గత వనరుల సమీకరణలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! ఏదైనా బీమా కంపెనీ పనితీరుకు దాని క్లెయిమ్ల పరిష్కార శాతమే కొలబద్ద. ఆ విషయంలో 99 శాతంతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల క్లెయిమ్స్ చెల్లించి ప్రపంచంలోనే అత్యుత్తమ బీమా సంస్థగా ఘనత సాధించింది. ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 37 ప్రకారం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఎల్ఐసీ జాతీయీకరణ ముందు ప్రైవేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోన స్లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. కానీ ఇంతవరకూ ఎల్ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకో లేదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ధాటికి ఏఐజీ వంటి బీమా కంపెనీలను అమెరికా ప్రభుత్వం ఆదుకోక తప్ప లేదంటే మన ఎల్ఐసీ ఎంత పటిష్ఠమైనదో తెలుస్తోంది. గత 24 ఏళ్ళుగా 23 ప్రైవేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ నేటికీ దాదాపు 70 శాతానికి పైగా మార్కెట్ షేర్తో మార్కెట్ లీడర్గా కొనసాగుతున్నది. ఎల్ఐసీ సంస్థలో పనిచేసే 14 లక్షల ఏజెంట్లలో 48 శాతం పైబడి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందు తున్నారు. 2024 మార్చి నాటికి మహిళా ఏజెంట్ల సంఖ్య మూడు లక్షల పైమాటే. ఈ విధంగా మహిళా ఉపాధికి సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1960లలో పేద భారత దేశంలో తాను అందించే పాలసీలలో కేవలం బీమాపై మాత్రమే కాకుండా, సేవింగ్స్ అంశంపై కూడా ఎల్ఐసీ దృష్టి పెట్టింది. పిల్లల చదువులకూ, యువతుల పెళ్లిళ్లకూ అందివచ్చేలా మధ్యంతర, తుది చెల్లింపులు, బీమా రక్షణ ఉండే పాలసీలను రూపొందించింది. గత బడ్జెట్ సెషన్లో అనేకమంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో బీమాపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని అభ్యర్థించినా, జయంత్ సిన్హా నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బీమా ప్రీమియంపై జీఎస్టీ భారం తగ్గించమని సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అయితే, దేశవ్యాప్తంగా ఈ విషయంపై వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారు. బీమా ప్రీమియ మ్లపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తే సంస్థ పాలసీదారులకు ఇంకా మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు అందించగలదు. ఎల్ఐసీని ఆర్థికంగా బలోపేతం చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చి, అంతిమంగా దేశానికీ, పాలసీ దారులకూ ఎంతో ప్రయోజనకరం అవుతుంది. పి. సతీష్ వ్యాసకర్త ఎల్ఐసీ ఉద్యోగుల సంఘ నాయకులుమొబైల్: 94417 97900 (నేడు ఎల్ఐసీ ఆవిర్భావ దినోత్సవం) -
భారీ పెట్టుబడులకు ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024 –25) దేశీ స్టాక్ మార్కెట్లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రూ. 1.3 లక్షల కోట్లను స్టాక్స్లో సరికొత్తగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 38,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23,300 కోట్ల విలువైన పెట్టుబడులు చేపట్టింది. కాగా.. ఈ క్యూ1లో ఎల్ఐసీ ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులపై రూ. 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గతేడాది క్యూ4(జనవరి–మార్చి)తో పోలిస్తే 13.5 శాతం అధికంకావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ కదలికలు, ధరల్లో మార్పులను నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలను వినియోగించుకుంటామని మొహంతీ తెలియజేశారు. కనీసం గతేడాది(రూ. 1.32 లక్షల కోట్లు) స్థాయిలో ఈ ఏడాది పెట్టుబడులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. ఏఎంసీ జూమ్: జూన్కల్లా ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 16 శాతంపైగా ఎగసి రూ. 53,58,781 కోట్లను తాకాయి. గత క్యూ1కు ఇవి రూ. 46,11,067 కోట్లు. క్యూ1 తీరిలా: క్యూ1లో ఎల్ఐసీ లాభం 10% వృద్ధితో రూ. 10,461 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1,88,749 కోట్ల నుంచి రూ. 2,10,910 కోట్లకు పెరిగింది. -
యూత్ కోసం ఎల్ఐసీ కొత్త టర్మ్ ప్లాన్లు..
భారత జీవిత బీమా సంస్థ (LIC) యువతను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ప్రారంభించింది. ఇవి నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, రిస్క్ ప్లాన్లు. లోన్ రీపేమెంట్ రిస్క్ల నుంచి రక్షణ కల్పించేలా ఈ ప్లాన్లను రూపొందించారు. వీటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఎల్ఐసీ కొత్త ప్లాన్లు ఇవే..ఎల్ఐసీ తీసుకొచ్చిన కొత్త టర్మ్ ప్లాన్ల పేర్లు ఒకటి ఎల్ఐసీ యువ టర్మ్/డిజి టర్మ్, మరొకటి ఎల్ఐసీ యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్. వీటిని ఎల్ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ప్రారంభించారు.యువ టర్మ్/డిజి టర్మ్పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.గ్యారెంటీడ్ డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది.ఎల్ఐసీ యువ టర్మ్ మధ్యవర్తుల ద్వారా అందుబాటులో ఉంటుంది.ఎల్ఐసీ డిజి టర్మ్ ఎల్ఐసీ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ప్రవేశ వయసు కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 45 సంవత్సరాలు.మెచ్యూరిటీ వయసు 33- 75 సంవత్సరాల మధ్య.హామీ మొత్తం రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య.డెత్ బెనిఫిట్స్ రెగులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు: వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% లేదా నిర్ణీత మొత్తం.సింగిల్ ప్రీమియం చెల్లింపు: సింగిల్ ప్రీమియంలో 125% లేదా హామీ మొత్తం.యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్యువ క్రెడిట్ లైఫ్/డిజి క్రెడిట్ లైఫ్ ప్లాన్లు రుణ బాధ్యతలకు కవరేజీని అందిస్తాయి. గృహ, విద్య లేదా వెహికల్ లోన్ వంటి వాటి రీ పేమెంట్ అవసరాలకు రక్షణ కల్పిస్తాయి. ఈ ప్లాన్లు ఆఫ్లైన్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.హామీ మొత్తం: రూ. 50 లక్షల నుంచి రూ. 5 కోట్లు.డెత్ బెనిఫిట్స్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, లోన్ బ్యాలెన్స్ ప్రకారం డెత్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఈ కొత్త ప్లాన్లు యువ వినియోగదారులకు వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, లోన్ రిస్క్ల నుంచి రక్షణ పొందడానికి మెరుగైన అవకాశాన్ని అందిస్తాయి. -
భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్పోర్ట్స్ -
రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్ఏఆర్సీఎల్తోపాటు బిడ్డింగ్లో పాల్గొన్న ఓంకార ఏఆర్సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. -
ఎల్ఐసీ పెట్టుబడులపై లాభాల పంట
కొంతమేర పెట్టుబడుల విక్రయం ∙అయినప్పటికీ పెరిగిన విలువ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో పలు దిగ్గజ కంపెనీలలో గల వాటాలను కొంతమేర విక్రయించింది. ఇందుకు స్టాక్ మార్కెట్లు బుల్ వేవ్లో పరుగు తీస్తుండటం ప్రభావం చూపింది. అయినప్పటికీ గతేడాది ఎల్ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా 37 శాతంపైగా జంప్చేయడం విశేషం! వివరాలు చూద్దాంస్టాక్ ఎక్సే్ఛంజీలకు దాఖలైన సమాచారం ప్రకారం ఎల్ఐసీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలలో అత్యధిక పెట్టుబడులను కలిగి ఉంది. ఈ బాటలో టాటా, అదానీ గ్రూప్లలోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. గత వారాంతానికల్లా దిగ్గజ కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.39 లక్షల కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన విలువతో పోలిస్తే ఇది 37.5 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లో పెట్టుబడులు 34 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో పెట్టుబడులను గతేడాది 6.37 శాతం నుంచి 6.17 శాతానికి తగ్గించుకుంది. ఇదేకాలంలో టాటా గ్రూప్ కంపెనీలలో వాటా 4.22 శాతం నుంచి 4.05 శాతానికి నీరసించింది. వీటి విలువ రూ. 1.29 లక్షల కోట్లు. ఇక అదానీ గ్రూప్లో ఎల్ఐసీ వాటా 4.27 శాతం నుంచి 3.76 శాతానికి దిగివచి్చంది. వీటి విలువ 49 శాతం దూసుకెళ్లి రూ. 64,414 కోట్లను తాకింది. ఎన్ఎస్ఈలో బుధవారం ఎల్ఐసీ షేరు 1.5% బలపడి రూ. 1,048 వద్ద ముగిసింది. ఈ ధరలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 6.62 లక్షల కోట్లను అధిగమించింది.ప్రభుత్వం సైతం నిజానికి పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. రూ. 1,050 సమీపంలో కదులుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. దీంతో ఎల్ఐసీలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంది. వీటిని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో సరికొత్త గరిష్టాన్ని అందుకుంటూ జోరు చూపుతున్నాయి. దీనికితోడు ఏడాది కాలంలో పలు ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు వేలంవెర్రిగా లాభాల పరుగు తీస్తున్నాయి. వెరసి ప్రభుత్వం వీటిలో కొంతమేర వాటాల విక్రయాన్ని చేపడితే.. సులభంగా బడ్జెట్ ప్రతిపాదిత డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలను చేరుకోవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీడీఎస్ విధించకూడదంటే ఏం చేయాలో తెలుసా..
పన్నుదారులకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించకుండా పాన్ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్ఐసీ రూ.6 డివిడెండ్ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్-పాన్ అనుసంధానం అవ్వకపోతే పాన్ చెల్లదు) డివిడెండ్పై 20 శాతం టీడీఎస్ కట్ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.డివిడెండ్ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్లో ఎల్ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్డేట్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బడ్జెట్లో రైతన్న కోరుకుంటున్నవి.. -
భారత్లోనే విలువైన బ్రాండ్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్ ర్యాంకింగ్స్ టైటిల్ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్కు దక్కించుకున్న టాటా గ్రూప్ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూప్, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్లోనే అత్యంత విలువైన బ్రాండ్గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో వెస్ట్సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ వృద్దిని విత్డ్రా చేసుకుంటున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.ఈ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్ను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.ఈతరుణంలో ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల • సింగిల్ ప్రీమియం ప్లాన్• పాలసీ టర్మ్, డెత్ కవర్ని ఎంపిక చేసుకోవచ్చు. • పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. •ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. • మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్• మెచ్యూరిటీపై ఇన్స్టాల్మెంట్, సెటిల్మెంట్లో డెత్ బెనిఫిట్స్ను ఎంపిక చేసుకోవచ్చు.• పాలసీకి లోన్ అందుబాటులో ఉందిఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్• ఎల్ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. • ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. • జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి. -
ఒక్కనెలలోనే రూ.12వేలకోట్ల ప్రీమియం వసూలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఒక్కనెలలోనే రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. 2014 తర్వాత నెలవారీ అధిక ప్రీమియం వసూలైనట్లు తెలిసింది.2024 ఏప్రిల్ నెలకుగాను ఎల్ఐసీ సంస్థ రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో వసూలైన రూ.5,810.10 కోట్ల ప్రీమియంతో పోలిస్తే ఇది 113.14% అధికంగా నమోదైంది. ఎల్ఐసీ వ్యక్తిగత ప్రీమియం విభాగంలో రూ.3,175.47 కోట్లను వసూలు చేసినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. 2023 ఇదే కాలంలోని రూ.2,537.02 కోట్లతో పోలిస్తే ఇది 25.17% ఎక్కువ. గ్రూప్ పాలసీల ప్రీమియం వసూళ్లు రూ.9,141.34 కోట్లుగా ఉన్నాయి. గత ఏప్రిల్లో రూ.3,239.72 కోట్లతో పోలిస్తే ఇది 182.16% అధికంగా ఉంది. ఎల్ఐసీ పాలసీదారుల నమ్మకాన్ని సంపాదించిందని అందువల్లే ఇలా పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలైనట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. -
మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్ఐసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చ రించింది.‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్ఎల్ లింక్లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్ఐసీ కోరింది. -
శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం..
ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు సందర్భంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు గడువు ముగియనుంది. దాంతో కొన్ని సంస్థలు సెలవుదినాల్లోనూ తమ వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధపడుతున్నాయి. అందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కార్యాలయాలు శని, ఆదివారాలు (మార్చి 30, 31 తేదీల్లో) పని చేస్తాయని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే.. ఈ నేపథ్యంలోనే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సూచనల మేరకు.. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్ఐసీ చెప్పింది. పన్ను శాఖ సంబంధిత కార్యకలాపాల కోసం, పెండింగ్లో ఉన్న డిపార్ట్మెంటల్ పనిని పూర్తి చేయడానికి దేశం అంతటా ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 30, 31 తేదీల్లో తెరిచే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. Press Release: Special Measures for extending services to Policy Holders of LIC of India#LIC pic.twitter.com/qH4oNVe7Gi — LIC India Forever (@LICIndiaForever) March 28, 2024 -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్ఐసీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతోపాటు అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇదీ చదవండి: 180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎల్ఐసీకి వార్షికంగా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనున్నట్లు అంచనా. పెంపు తర్వాత ఎల్ఐసీ వేతన బిల్లు రూ.29,000 కోట్లకు చేరుతుందని తెలిసింది. 2010 ఏప్రిల్ తర్వాత సంస్థలో చేరిన దాదాపు 24,000 మంది ఉద్యోగుల ఎన్పీఎస్ వాటాను 10% నుంచి 14 శాతానికి పెంచారు. -
పిల్లల కోసం ‘ఎల్ఐసీ అమృత్బాల్’.. ప్రత్యేకతలివే..
గతంతో పోలిస్తే ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. చిరుద్యోగులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లైనా, ప్రభుత్వోద్యోగులైనా, వ్యాపారులైనా తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. మున్ముందు ఉన్నత విద్యాభ్యాసం కోసం భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయాలని భావించే వారి కోసం ‘అమృత్ బాల్’ అనే పాలసీ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్, సేవింగ్స్ జీవిత బీమా పథకం. మెచ్చూరిటీ కాలం.. ఇటీవలే ప్రారంభమైన ఈ బీమా పాలసీని పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేసే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారు. ఇందులో అతి తక్కువ బీమా చెల్లింపు గడువు ఉంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది. పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం 18-25 ఏళ్ల వయసు మధ్య బీమా పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా ఈ పాలసీ అప్లయ్ చేయొచ్చు. గరిష్టంగా 13 ఏండ్ల వయసు గల పిల్లల పేరిట తీసుకోవచ్చు. పాలసీ కనిష్ట మెచ్యూరిటీ 18 ఏళ్లు, గరిష్ట వయసు 25 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉంటుంది. ప్రతి రూ.1000కి ఏటా జమ అయ్యే సొమ్ము.. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉన్నది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం కనీస పాలసీ టర్మ్ ఐదేండ్లు, గరిష్ట పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది. కనీస సమ్ హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితుల్లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాలను పరిగణనలోకి తీసుకుని, వారి ప్రీమియం చెల్లింపు ఆధారంగా పాలసీ తీసుకొవచ్చు. బీమా పాలసీపై ప్రతి రూ.1000 లకు ఏటా రూ.80 చొప్పున పాలసీ ఉన్నంత కాలం కలుస్తుంది. పాలసీ చెల్లింపు సమయంలో పాలసీదారుడికి ఏదేనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్లు అందిస్తారు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. చెల్లింపుల వివరాలు.. ఈ పాలసీ కింద రుణం కూడా తీసుకోవచ్చు. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ -1లో ఏడు రెట్లు, ఆప్షన్-2లో పది రెట్ల రిటర్న్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్-3లో 1.25 రెట్లు, ఆప్షన్-4 ప్రకారం 10 రెట్లు బెనిఫిట్ ఉంటుంది. ఐదేళ్ల ప్రీమియం ఆప్షన్-1 కింద రూ.99,625, ఆప్షన్ 2 కింద రూ.1,00,100, ఆరేళ్లు ప్రీమియం ఆప్షన్ -1 కింద రూ.84,275, ఆప్షన్ -2లో రూ.84,625, ఏడేళ్లు ప్రీమియం టర్మ్ ఆప్షన్ -1 కింద రూ.73,625, ఆప్షన్ -2లో రూ.73,900 చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పాలసీలో ఆప్షన్-3 కింద రూ.3,89,225, ఆప్షన్ -4 కింద రూ.4,12,600 చెల్లించాల్సి ఉంటుంది. -
పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్.. ఎన్నో బెనిఫిట్స్
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పిల్లల కోసం అమృత్ బాల్ పేరిట ఓ కొత్త పాలసీని పరిచయం చేసింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ అధికారికంగా వెల్లడించింది. ఈ పాలసీ మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు. షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు. కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు. మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు. షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు. మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. -
ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్ రిఫండ్!
ఫిబ్రవరి 14, 2024న ఆదాయపు పన్ను శాఖ నుంచి సుమారు రూ.21,740 కోట్ల మొత్తాన్ని రిఫండ్ పొందినట్లు ఎల్ఐసీ తెలిపింది. 2012-13, 2013-14, 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఎల్ఐసీ రీఫండ్ ఆర్డర్లను పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రీఫండ్ మొత్తం విలువ రూ.25,464.46 కోట్లు. దీనికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నిన్న రూ.21,740.77 కోట్లను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం నుంచి మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తెలిపింది. -
దేశంలో అత్యంత విలువైన సంస్థగా ఎల్ఐసీ
ప్రముఖ జీవిత బీమా ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. ఎల్ఐసీ డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఇక మార్కెట్ క్యాప్ చార్ట్లో అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత విలువైన కంపెనీగా ఐసీఐసీఐ బ్యాంక్ను ఎల్ఐసి అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంది. -
ఎల్ఐసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది. -
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..హెచ్డీఎఫ్సీలో వాటా కొనుగోలుకు ఎల్ఐసీ రెడీ!
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీలో మరికొంత వాటాను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆర్బీఐ నుంచి అనుమతి పొందింది. జనవరి 24, 2025 నాటికి ఎల్ఐసీ తన మొత్తం వాటాను మొత్తం వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు హెచ్డీఎఫ్సీలో అదనంగా 4.8శాతం వాటాను పొందేలా ఎల్ఐసీకి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. 2023 డిసెంబర్ నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఎల్ఐసీ 5.19 శాతం వాటాను కలిగి ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన నోటిఫికేషన్లో జనవరి 25, 2025 నాటికి బ్యాంక్లో 9.99శాతం వరకు కొనుగోలు చేయడానికి ఎల్ఐసీ.. ఆర్బీఐ నుంచి ఆమోదం పొందిందని తెలిపింది. అయితే నిబంధనలకు అనుగుణంగా ఏడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వాటాను ఎల్ఐసీ 9.99 శాతానికి పెంచుకోవచ్చు. అయితే ఆ పరిమితిని దాటకూడదు. -
నయనతార భర్తకు 'ఎల్ఐసీ' నోటీసులు..!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్ఐసీ అనేది భారత్లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్ఐసీ అనే టైటిల్ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
LIC Jeevan Dhara II Policy: ఎల్ఐసీ 'జీవన్ ధార 2' పాలసీ లాంఛ్..అదిరిపోయే బెన్ఫిట్స్!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవన్ ధార 2 పేరుతో యాన్యుటీ ప్లాన్ను లాంఛ్ చేసింది. జనవరి 22, 2024 నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. ఇక పాలసీని పొందేందుకు కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. వ్యవధిని బట్టి పాలసీలోకి ప్రవేశించే గరిష్ట వయస్సు (65/70/80 సంవత్సరాలు) మారుతుంటుంది. అధికారిక ప్రకటన ప్రకారం.. యాన్యుటీ ప్రారంభం నుండి రెగ్యులర్ ఇన్ కమ్ పొందవచ్చు. జీవన్ ధార 2 పథకం వివరాలు ►పాలసీ కట్టే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. ►ఒకేసారి డిపాజిట్ చేసి (యాన్యుటీని) ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆదాయం రూపంలో పొందవచ్చు. దీనిని మూడు, ఆరు నెలలు, ఏడాదికి ఇలా చెల్లించుకోవచ్చు. ►యాన్యుటైజేషన్ లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో డెత్ క్లెయిమ్ రాబడిని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ► తీసుకునే ప్రీమియంను బట్టి పాలసీ దారులకు ప్రయోజనాలు అదే స్థాయిలో ఉంటాయి. ► రెగ్యులర్ ప్రీమియం- వాయిదా కాలం 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు, ► సింగిల్ ప్రీమియం- వాయిదా కాలం 1 సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు, ►యాన్యుటీ టాప్-అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ►ఈ ఎల్ఐసీ జీవన్ ధార 2 పాలసీపై లోన్ తీసుకోవచ్చు. ►పాలసీదారుడు మరణిస్తే ఏకమొత్తంగా పరిహారం పొందవచ్చు. లేదా వాయిదా పద్ధతుల్లోనూ పరిహారం తీసుకోవచ్చు. -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!
ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఒక్క పేరు వల్ల రెండు వివాదాలు ఇతడిని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ పెద్ద సంస్థ.. విఘ్నేశ్కి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? గొడవేంటి? తమిళంలో పేరున్న దర్శకుల్లో విఘ్నేశ్ శివన్ ఒకడు. 'నా పేరు రౌడీ' లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా 'ఎల్ఐసీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టైటిల్పై రోజుల వ్యవధిలో రెండు కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజస్టర్ చేయించుకున్నానని చెప్పారు. ఈ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ వివాదం అలా ఉండగానే ఇప్పుడు మరొకటి వచ్చింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్కి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, సినిమా కోసం ఈ టైటిల్ని ఉపయోగిస్తే.. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోపు పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై చిత్రబృందం, విఘ్నేశ్ స్పందించాల్సి ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
ఎల్ఐసీకి రూ.806 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీఎస్టీ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసును అందుకున్నట్లు సంస్థ రిగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఇందులో రూ.365 కోట్లు జీఎస్టీ చెల్లింపులుకాగా, రూ.405 కోట్లు జరిమానా, రూ.36 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ.806 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి జనవరి 1న నోటీసు అందినట్లు సంస్థ చెప్పింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నోటీసులు అందినట్లు సమాచారం. నిర్దేశించిన గడువులోగా ఆర్డర్కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన నోటీసులతో ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ అధికారులు తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఇన్సూరెన్స్ నుంచి పొందిన ఐటీసీ రివర్సల్, జీఎస్టీఆర్కు చెల్లించిన ఆలస్య రుసుంపై వడ్డీ, అడ్వాన్స్పై వడ్డీ కలిపి సంస్థకు రూ.806 కోట్లకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. -
ఎల్ఐసీకి ప్రభుత్వ మినహాయింపు
న్యూఢిల్లీ: పబ్లిక్కు కనీస వాటా విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ వెల్లడించింది. దీంతో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కల్పించే అంశంలో పదేళ్ల గడువు లభించినట్లు తెలియజేసింది. 2022 మే నెలలో ఐపీవో ద్వారా ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు)ను విక్రయించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 96.5 శాతంగా కొనసాగుతోంది. నిజానికి ఐపీవో తదుపరి నిర్ధారిత గడువులోగా లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు 25 శాతం వాటాను కల్పించవలసి ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకేసారి పదేళ్లవరకూ మినహాయింపునిచ్చినట్లు ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వెరసి 2032 మే వరకూ పబ్లిక్కు 25 శాతం వాటా కల్పించే అంశంలో వెసులుబాటు లభించినట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది(2023) మొదట్లో ప్రభుత్వం బ్యాంకులుసహా లిస్టెడ్ పీఎస్యూలు పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో నిబంధనల్లో సవరణలు చేపట్టింది. తద్వారా ప్రైవేటైజేషన్ తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంపీఎస్ను అమలు చేయవలసిన అవసరాన్ని తప్పించింది. తొలుత పీఎస్యూలకు మాత్రమే ఇందుకు వీలుండగా.. ప్రభుత్వ వాటా విక్రయం తదుపరి సైతం వర్తించేలా ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపేందుకు వీలు చిక్కింది. 2021 జూలైలోనే ప్రభుత్వం అన్ని పీఎస్యూలకూ ఎంపీఎస్ వర్తించేలా నోటిఫికేషన్ను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Insurance: బీమా కూడా లేకుండా కోట్ల మంది!
ముంబై: బీమా విస్తరణకు ప్రభుత్వం, బీమా రంగ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, దేశ జనాభాలో 95 శాతం మందికి బీమా రక్షణ లేదని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఓ నివేదికలో తెలిపింది. ఈ నివేదికను ఐఆర్డీఏఐ చైర్మన్ దేవాశిష్ పాండా ఆవిష్కరించారు. యూపీఐ, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ల విస్తరణకు దోహదపడిన చర్యలను అనుసరించాలని బీమా పరిశ్రమకు ఆయన సూచించారు. ఈ నివేదికలో పేర్కొన్నట్టు అధిక రిస్క్ ఉన్న ప్రాంతాల్లో విపత్తుల ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నూరేళ్లు పూర్తి చేసుకునే నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఇది అవసరమన్నారు. దేశ జనాభా 144 కోట్లలో 95 శాతం మందికి బీమా కవరేజీ లేని విషయాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రకృతి విప్తతులు పెరిగిపోయిన క్రమంలో బీమా కవరేజీ ప్రాధాన్యాన్ని ఈ నివేదిక ఎత్తి చూపించింది. రుణానికి బీమా లింక్ దిగువ, మధ్యాదాయ వర్గాల్లో 84 శాతం మంది, తీర ప్రాంతాలు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 77 శాతం మందికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదని ఈ నివేదిక తెలిపింది. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని తన నివేదికలో నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ సూచించింది. నిజానికి బీమా తీసుకున్న వారిలోనూ కవరేజీ సమగ్రంగా లేని అంశాన్ని ప్రస్తావించింది. ఇదీ చదవండి: LIC Credit Card: ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్! జీవిత బీమా రక్షణలో 87 శాతం అంతరం (వాస్తవ కవరేజీ–తీసుకున్న దానికి మధ్య) ఉందని, ఇది గణనీయమైన వ్యాపార అవకాశాలు వీలు కల్పిస్తుందని తెలిపింది. అలాగే, 73 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేదని వెల్లడించింది. ప్రభుత్వం, ఎన్జీవోలు, పరిశ్రమ కలసి సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యాన్యుటీ, పెన్షన్ ప్లాన్లలో కవరేజీ అంతరం 93 శాతంగా ఉందని తెలిపింది. -
2047 నాటికి భారతీయులందరికీ జీవిత బీమా.. త్వరలో ప్లాన్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలో 2047 నాటికి ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేయాలన్న లక్ష్యం సాధనలో ఎల్ఐసీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్థార్థ మహంతి ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను గ్రామీణ ప్రాంతాల వారి కోసం రూపొందించిన ప్లాన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఎలా కలి్పంచాలన్న దానిపై మా దృష్టి ఉంటుంది. రానున్న రోజుల్లో మా మొత్తం వ్యాపారంలో గ్రామీణ ప్రాంతాల వాటా పెరగనుంది’’అని మహంతి పేర్కొన్నారు. జీవిత, ఆరోగ్య, ఆస్తుల బీమాతో కూడిన బీమా విస్తార్ ఉత్పత్తిని ప్రతిపాదించినందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ సగటుతో చూస్తే మన దేశంలో బీమా కవరేజీ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు డిజిటల్గా మారే ‘డైవ్’ ప్రాజెక్ట్ను ఎల్ఐసీ చేపట్టింది. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కన్సల్టెంట్ను కూడా నియమించుకుంది. మా భాగస్వాములు, కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ చేసే వారికి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలన్నదే డైవ్ ప్రాజెక్ట్ ధ్యేయమని మహంతి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత కస్టమర్లను డిజిటల్ మార్గాల ద్వారా సొంతం చేసుకోవడంపై ఎల్ఐసీ దృష్టి సారించనుంది. అనంతరం ఇతర విభాగాల్లో డిజిటల్ పరివర్తనం ఉంటుందని మహంతి చెప్పారు. ‘‘కస్టమర్లు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే మొబైల్ ద్వారా కావాల్సిన సేవలను పొందొచ్చు’’అని ప్రకటించారు. -
ఎల్ఐసీ నుంచి క్రెడిట్ కార్డు.. భలే బెనిఫిట్స్!
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతోపాటు ఇతర ఫైనాన్స్ సంస్థలు సైతం క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. దీనిపై ప్రమాద బీమాతో పాటు ఆకర్షణీయమైన ప్రయోజనాలను ఎన్నింటినో అందిస్తోంది. ఎల్ఐసీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్ కార్డులు కలిసి సంయుక్తంగా ఈ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి. ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ సెలక్ట్ పేరుతో రెండు క్రెడిట్ కార్డులు లాంచ్ అయ్యాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. వీటి ద్వారా బీమా ప్రీమియం చెల్లిచిందనందుకు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. రూ. 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది. వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ కూడా ఎల్ఐసీ తక్కువగానే వసూలు చేస్తోంది. బెనిఫిట్స్లో కొన్ని.. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజు ఉండవు. 48 రోజుల వరకు అన్ని ఏటీఎంలలో క్యాష్ విత్డ్రాయల్పై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ క్రెడిట్ కార్డుతో తొలి ఈఎమ్ఐపైన 5 శాతం క్యాష్బ్యాక్. రూ. 399 విలువైన 6 నెలల ఫార్మ్ఈజీ ప్లస్ మెంబర్ షిప్. ట్రావెల్లో డొమెస్టిక్ ఫైట్లను బుక్ చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్. లెన్స్కార్ట్ గోల్డ్ సభ్యత్వం ఉచితంగా పొందొచ్చు. భారతదేశంలోని అన్ని ఇంధన స్టేషన్స్లో ప్రతి నెల రూ. 300 ఇంధన సర్ఛార్జ్పై 1 శాతం రాయితీ. ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుకు కూడా ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవు. ప్రతి మూడు నెలలకు రెండుసార్లు కాంప్లమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డుపై రూ. 5 లక్షల ప్రమాద బీమా. -
ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంపు.. ఎంతంటే..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) తన ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) రెగ్యులేషన్స్, 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. ఈ నియంత్రణలను ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) అమెండ్మెంట్ రెగ్యులేషన్స్, 2023గా పరిగణిస్తామని ఎల్ఐసీ తెలిపింది. అధికారిక పత్రాన్ని (అఫిషియల్ గెజిట్) ప్రచురించిన డిసెంబరు 6 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని శుక్రవారం సంస్థ పేర్కొంది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పెంపు, కుటుంబ పింఛను తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ సెప్టెంబరులో అనుమతి ఇచ్చింది. తిరిగి నియమితులైన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్కు అర్హత ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్ కమీషన్కు ఎల్ఐసీ ఏజెంట్లకు అర్హత లేదు. ఇదీ చదవండి: ‘ఈవీ’ ఇళ్లు..! ప్రస్తుతం ఎల్ఐసీలో 25 కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు. దాదాపు 12 లక్షల ఏజెంట్లు పని చేస్తున్నారు. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.1 లక్షల కోట్లుగా ఉంది. -
ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
గడచిన వారంలో స్టాక్మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్లోని ఏడు షేర్లలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే.. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. -
ఐదేళ్లు ప్రీమియం.. జీవితాంతం ఆదాయం
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ఆవిష్కరింంది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీయేతర), నాన్ పార్టిసిపేటింగ్, మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. ఈ ప్లాన్లో నిర్ణీత కాలం తర్వాత నుం ఏటా 10 శాతం చొప్పున (సమ్ అష్యూర్డ్లో) వెనక్కి వస్తుంది. కనీస బీమా ర.5,00,000. గరిష్ట బీవ కవరేజీకి పరిమితి లేదు. 5–16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లింపుల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా 65 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రెగ్యులర్ ఇన్కమ్ లేదా ఫ్లెక్సీ ఇన్కమ్లో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ చెల్లింపుల కాలంలో మరణింనట్టయితే సమ్ అష్యూర్డ్కు తోడు, గ్యారంటీడ్ అడిషన్స్ కలిపి చెల్లిస్తారు. ప్రతి వెయ్యి రపాయలకు ఏటా ర.40 చొప్పున గ్యారంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఇలా ప్రీమియం చెల్లింపుల కాలం వరకు ఏటా జమ అవుతుంది. ప్రీమియంను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే గ్యారంటీడ్ అడిషన్స్ను దాని కింద సర్దుబాటు చేస్తారు. రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్లో ప్రీమియం చెల్లింపుల కాల వ్యవధి ముగిసిన మూడేళ్లు లేదా ఆరేళ్ల తర్వాత నుం ఏటా 10% ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు 5 ఏళ్లు ఎంపిక చేసుకుంటే 8 ఏళ్లు లేదా 11వ ఏట నుంచి ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. పదేళ్ల ప్రీమియం చెల్లింపుల కాలం ఎంపిక చేసుకుంటే 13వ ఏట నుంచి ఆదాయం వస్తుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్లోనూ ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. -
ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఎల్ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్ అష్యూర్డ్లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు. ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు. హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
LIC Q2 Results: ఎల్ఐసీ లాభం 7,925 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ ఇండియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 7,925 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 15,952 కోట్లు ఆర్జించింది. నికర ప్రీమియం ఆదాయం సైతం రూ. 1,32,632 కోట్ల నుంచి రూ. 1,07,397 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే తొలి ఏడాది ప్రీమియం రూ. 9,125 కోట్ల నుంచి రూ. 9,988 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం రూ. 2,22,215 కోట్ల నుంచి రూ. 2,01,587 కోట్లకు నీరసించింది. పెట్టుబడుల నుంచి మాత్రం ఆదాయం రూ. 93,942 కోట్లకు ఎగసింది. గత క్యూ2లో రూ. 84,104 కోట్లు లభించింది. స్థూల మొండిబకాయిలు 5.6 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 610 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక!
క్యాలెండర్లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. మరికొన్ని ఊరట కల్పిస్తాయి. అలా నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. దీపావళికి ముందే వచ్చే కొన్ని మార్పులు సామాన్యుడికి తీపిని పంచేనా..? చేదు గుళికను అందిస్తాయా? చూసేయండి. గ్యాస్ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరల పెంపు, తగ్గుదలపై ప్రకటన చేస్తాయి. ఈ-చలాన్ : నేషనల్ ఇన్ఫ్రమెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రకారం.. వ్యాపార లావాదేవీల విలువ రూ.100 కోట్లుంటే తప్పని సరిగా ఈ-పోర్టల్లో రానున్న 30 రోజుల్లోపు జీఎస్టీ చలాన్ను అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ల్యాప్ట్యాప్లపై ఆంక్షలు : ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే 7 రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆంక్షలు విధించింది. హెచ్ఎస్ఎన్ 8741 విభాగం కింద ల్యాప్ట్యాప్, పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్స్లు ఉన్నాయి. కేంద్రం విధించిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పైన పేర్కొన్న 7 రకాల ఉత్పత్తులపై వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికే పరిమిత సంఖ్యలో దిగుమతులు ఉంటాయని పేర్కొంది ల్యాప్స్డ్ ఎల్ఐసీ పాలసీలు : ఎల్ఐసీ 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్డ్) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎవరైతే ఏళ్ల కేళ్లు ప్రీమియం చెల్లించకుండా వదిలేస్తారో.. వాళ్లు ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని అక్టోబర్ 31వరకు కల్పిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనున్న తరుణంలో ఖాతా దారులు తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు. లావాదేవీలపై అదనపు ఛార్జీలు: అక్టోబర్ 20న బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది.స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ డెరివేటివ్లపై నిర్వహించే లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త!
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది. పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్ఐసీ రీవైవల్ క్యాంపెయిన్ని అందుబాటులోకి తెచ్చింది. LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies. To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD — LIC India Forever (@LICIndiaForever) September 26, 2023 ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు ఈ క్యాంపెయిన్లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్సెషన్తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే? ♦ ఎల్ఐసీ పోర్ట్ల్ను ఓపెన్ చేయాలి ♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి ♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు -
గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ
ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కీలక సింగిల్ ప్రీమియం పాలసీ ‘ధన వృద్థి’ (LIC Dhan Vriddhi) గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆసక్తిఉన్నవారు గడువు లోపు దీన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. గత జూన్లో ప్రారంభించిన ఈ ప్లాన్ పరిమిత ఆఫర్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని వెల్లడించింది. మెరుగైన పొదుపుతో పాటు బీమా కవరేజీ కూడా కావాలనుకునే వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ధన వృద్థి పాలసీ ఆన్లైన్లోనూ లభ్యం అవుతుందని ఎల్ఐసీ పేర్కొంది. ఈ పాలసీ టెన్యూర్లో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం అందిస్తుంది. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ అందజేస్తుంది. 32 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. -
ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం సంక్షేమ చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఎల్ఐసీ ఏజెంట్ల (LIC agents) గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం రూ. 3,000 నుంచి రూ.10,000 స్థాయిలో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ను రూ. 25,000 నుంచి రూ.150,000 స్థాయికి పెంచేందుకు అంగీకరిచింది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) టర్మ్ ఇన్సూరెన్స్లో ఈ పెంపుదలతో మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అలాగే ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. దేశంలో ఎల్ఐసీ వృద్ధి, బీమా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న 13 లక్షలకు పైగా ఏజెంట్లు, లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంక్షేమ చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. (EPFO:వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!) -
కేంద్రానికి ఎల్ఐసీ రూ.1,831 కోట్ల డివిడెండ్
LIC rs1 831 Crore dividend లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గురువారం రూ. 1,831.09 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్రానికి అందజేసింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి ఈ డివిడెండ్ చెక్కును అందజేశారు. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల తదితర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 22న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో డివిడెండ్ను షేర్హోల్డర్లు ఆమోదించినట్లు ఒక ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) రూ.5 కోట్ల తొలి మూలధన పెట్టుబడితో 1956లో ఎల్ఐసీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేటుపెట్టుబడులకు ద్వారాలు తెరచి రెండు దశాబ్దాలు గడిచినప్పటికీ, భారత్ జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ మార్కెట్ లీడర్గా కొనసాగుతోందని ఎల్ఐసీ ప్రకటన పేర్కొంది. (దిగొచ్చిన చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం) -
కేంద్రం కీలక నిర్ణయం.. మేనేజింగ్ డైరెక్టర్ల రీటైర్మెంట్ వయస్సును
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు, బ్యాంకుల్లో మేనేజింగ్ డైరక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ, ఎస్బీఐ చైర్మన్ల రీటైర్మెంట్ వయస్సును 65కి పొడిగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం సంబంధిత శాఖలతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చీఫ్ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఎస్బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దినేష్ ఖారా రీటైర్మెంట్ పొడిగింపు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రస్తుత 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2020 నుంచి దినేష్ ఖారా ఎస్బీఐ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నిబందనల ప్రకారం.. ఖరా వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 63 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆయన ఎస్బీఐ చైర్మన్గా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇతర సంస్థల్లో డైరెక్టర్లగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు పొడిగింపుపై ప్రణాళికలు, చర్చలు మినహా, మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్రానిదే. ఎల్ఐసీ చైర్పర్సన్ జూన్ 29, 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్పర్సన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత, జూన్ 7, నుంచి 2025 వరకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తన పదవిలో కొనసాగనున్నారు. ఎల్ఐసీకి ఎం జగన్నాథ్, టేబల్ష్ పాండే, మినీ ఐపీ అనే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎండీల పదవీ విరమణ వయస్సు పొడిగింపు వారి పదవీకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. -
అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు
LICacquires6.66pcJFS: లయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయిన ఫైనాన్షియల్ ఎంటిటీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ సంస్థలో 6.66 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ మంగళవారం ప్రకటించింది. ఇదీ చదవండి:ఎస్బీఐ లైఫ్: కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) షేర్లు సోమవారం లిస్టింగ్ తర్వాత దాని తొలి ట్రేడింగ్ సెషన్లో లోయర్ సర్క్యూట్ను తాకాయి. ఈ షేరు ఒక్కో షేరుకు రూ. 265గా లిస్ట్ అయింది. చివరికి 5 శాతం నష్టంతో ముగిసిన సంగతి తెలిసిందే. కంపెనీ విభజన తేదీ అయిన జూలై 20న దాని ఉత్పన్నమైన ధర రూ. 261.85 కంటే 1 శాతానికి పైగా మార్జినల్ ప్రీమియం. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.68 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు వరుసగా రెండో సెషన్లో మంగళవారం కూడా జేఎఫ్ఎస్ షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. -
ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి
LIC appointed MD R Doraiswamy ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామి నియమితులయ్యారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామిని నియమించినట్లు ప్రకటించింది.సెప్టెంబర్ 1, 2023 నుండి అమలులోకి రానున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. 2026 ఆగస్టు చివరివరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామిని ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవీ విరమణ తేదీ వరకు (అంటే 31.08.2026) వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వస్తుందని అని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. గతంలో ఎల్ఐసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా సత్పాల్ భానూను నియమించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB), ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్ పాల్ భానూ పేరును సిఫార్సు చేసింది. కాగా జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ భారీ లాభాలను ఆర్జించింది. గత ఏడాదితో ఇదే క్వార్టర్ రూ. 602.79 కోట్లతో పోలిస్తే ఈ కాలంలో లాభం 1498.4 శాతం పెరిగి రూ. 9634.98 కోట్ల లాభాలునమోదు చేసింది. అయితే నికర ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 98,755 కోట్లుగా ఉంది. త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్పిఎ) 2.48 శాతంగా ఉంది, ఇది క్రితం సంవత్సరం కాలంలో 5.84 శాతంగా ఉంది. -
ఎల్ఐసీకి లాభాల పంట..14 రెట్లు పెరిగి ఏకంగా..
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజ సంస్థ ఎల్ఐసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 రెట్లు పెరిగి రూ.9,544 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.683 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.1,68,881 కోట్ల నుంచి రూ.1,88,749 కోట్లకు వృద్ధి చెందింది. కొత్త పాలసీలపై వచ్చే తొలి ఏడాది ప్రీమియం ఆదాయం తగ్గింది. ఈ రూపంలో జూన్ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.6,811 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కొత్త పాలసీల ప్రీమియం ఆదాయం రూ.7,429 కోట్లతో పోలిస్తే సుమారు 9 శాతం క్షీణించింది. పెట్టుబడుల రూపంలో వచ్చిన నికర ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.69,571 కోట్ల నుంచి రూ.90,309 కోట్లకు పెరిగింది. సాల్వెన్సీ రేషియో 1.88 శాతం నుంచి 1.89 శాతానికి పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. వసూలు కాని నిరర్థక ఆస్తులు 5.84 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయి. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు ఫ్లాట్గా రూ.642 వద్ద క్లోజయింది. ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. -
బ్యాంకుల్లో ఊహించని మార్పులు.. వారానికి 5 రోజులే పని..ఇంకా
గత కొంత కాలంగా వారంలో ‘ఐదురోజులే పనిదినాల’పై ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ డిమాండ్లు, ప్రతిపాదనలు చివరి దశకు వచ్చాయి. ఐదు రోజుల పనిదినాలపై మరో ఐదు రోజుల్లో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగుల భవితవ్యం తేలనుంది. జులై 28న కేంద్రం సైతం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఈ సంస్కృతి ప్రైవేట్ రంగ సంస్థల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్క్ కల్చర్ ప్రభుత్వ కార్యాలయాలకు పాకింది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలు వారానికి ఐదు రోజుల పనిదినాల్ని కొనసాగిస్తుండగా.. తమకు వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతిని కొనసాగించాలని ప్రభుత్వ బ్యాంక్ రంగ సంస్థలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం ( ఏప్రిల్28న).. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ)లు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో ఐదు రోజుల పని, వేతన పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చించనున్నాయి. వీటన్నింటికంటే వారానికి ఐదురోజుల పనిదినాలపై ప్రధానంగా దృష్టిసారించనున్నాయి. ప్రస్తుతం, బ్యాంకుల్లో మొదటి, మూడవ శనివారం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎఫ్బీయూ బ్యాంక్ ఉద్యోగులు వారినికి రెండురోజుల సెలవులిస్తూ వారానికి ఐదు రోజులు పనిచేసే వెసలు కల్పించాలని కోరుతుంది. వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న యూఎఫ్బీయూ డిమాండ్పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, వారంలో ఒకరోజు పని తగ్గుతున్నందున, దీనికి బదులుగా 5 రోజుల పాటు, సిబ్బంది పనివేళలను రోజూ మరో 40 నిమిషాల పాటు పెంచాలని ఐబీఏ భావిస్తోంది. దీంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి రూ.2లక్షల వరకు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి యూబీఎఫ్యూ అంగీకరించింది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10లక్షల వరకు తీసుకునేందుకు ఆప్షనల్ విధానంలో అనుమతించాలని కోరుతోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే..బ్యాంక్ ఉద్యోగులు ఇకపై ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. చదవండి👉 భారత్లో టెస్లా కార్ల తయారీ.. ఎలాన్ మస్క్కు మెలిక పెట్టిన కేంద్రం! -
ఎల్ఐసీ ఎండీగా సత్పాల్ భాను
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా సత్పాల్ భానూను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్లో ఎల్ఐసీ చైర్మన్గా నియమితులైన సిద్ధార్థ మొహంతి స్థానంలో సత్పాల్ భాను నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన నాటి నుంచీ ఈ నియామకం వర్తిస్తుంది. 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ వరకూ లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది) భాను బాధ్యతల్లో కొనసాగుతారని ఎల్ఐసీ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
ముంబై: బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది. గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
ఎస్సీఐఎల్ఏఎల్ లిస్టింగ్ ఈ నెలలోనే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్సీఐ నుంచి విడదీసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్సీఐఎల్ఏఎల్) సంస్థ ఈ నెలలో స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్ట్ కానుంది. విభజన ప్రక్రియ కింద ఎస్సీఐ (షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) షేర్హోల్డర్లకు ఎస్సీఐఎల్ఏఎల్ షేర్లు లభించనున్నాయి. సంస్థ లిస్టింగ్ తర్వాత ఎస్సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, అటుపైన ఫైనాన్షియల్ బిడ్లను ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2020 నవంబర్లో షిప్పింగ్ కార్పొరేషన్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రధాన వ్యాపారయేతర అసెట్స్ను ఎస్సీఐఎల్ఏఎల్ కింద విడగొట్టారు. గతేడాది మార్చి 31 నాటికి దీని విలువ రూ. 2,392 కోట్లు. ప్రస్తుతం ఎస్సీఐలో కేంద్రానికి 63.75 శాతం వాటాలు ఉన్నాయి. -
రోడ్షోలు నిర్వహించున్న ఎల్ఐసీ.. ఎక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ నెలలో అంతర్జాతీయంగా రోడ్షోలు నిర్వహించనుంది. హాంకాంగ్, బ్రిటన్ దేశాల్లో జూన్ 25 నుంచి 29 మధ్యలో వీటిని చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు వీటిని ఉద్దేశించినట్లు వివరించాయి. ఈ సందర్భంగా ఎల్ఐసీ టాప్ మేనేజ్మెంట్.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. (ఇదీ చదవండి: 2025లో జాగ్వార్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్) సంస్థ వృద్ధి అవకాశాలను వివరించి, షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు వివరించాయి. ఎల్ఐసీ షేర్లు లిస్ట్ అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఐపీవో కింద ఎల్ఐసీలో 3.5 శాతం వాటాల విక్రయం ద్వా రా కేంద్రం గతేడాది రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి రూ. 949 కాగా మే 17న సుమారు 9 శాతం డిస్కౌంటుకు రూ. 867 వద్ద కంపెనీ షేర్లు లిస్టయ్యా యి. ఐపీవో ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం తక్కువగా రూ. 602 వద్ద ట్రేడవుతున్నాయి. -
మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది. -
ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తుందని చైర్పర్సన్ వివరించారు. ఎల్ఐసీ పాలసీల క్లయిమ్దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. -
ఎల్ఐసి సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా.. ఇలా ప్రారంభించండి!
LIC WhatsApp Service: ఆధునిక కాలంలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు ఉంటాయి. అయితే మనకు ఇందులో ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చిన నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎల్ఐసి కంపెనీ ప్రవేశపెట్టిన వాట్సాప్ సర్వీసు ద్వారా లోన్ ఎలిజిబిలిటీ, రీపేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ వంటి వాటితో పాటు బోనస్ ఇన్ఫర్మషన్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ఉపయోగించుకోవడమెలా? మీ స్మార్ట్ఫోన్లో 8976862090 అనే నెంబర్కి 'హాయ్' అని మెసేజ్ చేయాలి. తరువాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి రిప్లై వస్తుంది. వాట్సాప్ చాట్లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి షేర్ చేస్తుంది -
ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్లో పెట్టుబడులకు పెరిగిన విలువ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ).. అదానీ గ్రూప్ స్టాక్స్లో చేపట్టిన పెట్టుబడుల విలువ పుంజుకుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్నకు చెందిన ఏడు స్టాక్స్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ తాజాగా రూ. 44,670 కోట్లను తాకింది. ఏప్రిల్ నుంచి చూస్తే రూ. 5,500 కోట్ల విలువ జత కలిసింది. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నివేదిక తదుపరి పతన బాట పట్టిన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు నియమిత నిపుణుల కమిటీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిన దాఖలాలు లేవంటూ స్పష్టం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అదానీ షేర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో గత మూడు రోజుల్లో 10 కంపెనీలతో కూడిన అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1,77,927 కోట్లమేర ఎగసి రూ. 10,79,498 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. అదానీ పోర్ట్స్ జూమ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో ఎల్ఐసీకి అత్యధికంగా 9.12 శాతం వాటా ఉంది. బుధవారం షేరు ధర రూ. 718తో చూస్తే వీటి విలువ రూ. 14,145 కోట్లు. ఇక అదానీ ఎంటర్ప్రైజెస్లో గల 4.25 శాతం వాటా విలువ రూ. 12,017 కోట్లకు చేరింది. షేరు రూ. 2,477 వద్ద ముగిసింది. ఎల్ఐసీకి అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్లో కలిపి రూ. 10,500 కోట్ల విలువైన పెట్టుబడులున్నాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీలలోనూ ఎల్ఐసీ వాటాలను కలిగి ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్లో రూ. 30,127 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఈ ఏడాది జనవరి 30న ఎల్ఐసీ వెల్లడించింది. జనవరి 27కల్లా ఈ పెట్టుబడుల విలువ రూ. 56,142 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. అయితే తదుపరి హిండెన్బర్గ్ నివేదిక తదుపరి అదానీ స్టాక్స్ పతన బాట పట్టడంతో ఫిబ్రవరి 23కల్లా ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 27,000 కోట్లకు పడిపోయింది. వాటాల వివరాలిలా 2023 మార్చి చివరికల్లా ఎల్ఐసీకి అదానీ పోర్ట్స్లో 9.12 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్లో 4.26 శాతం, ఏసీసీలో 6.41 శాతం, అంబుజా సిమెంట్స్లో 6.3 శాతం, అదానీ టోటల్ గ్యాస్లో 6.02 శాతం, అదానీ ట్రాన్స్మిషన్లో 3.68 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.36 శాతం చొప్పున వాటాలున్నాయి. -
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
LIC నూతన చైర్మన్ గా సిద్ధార్థ మొహంతి నియామకం
-
ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతి
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం 2024 జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు. ఇప్పటివరకు ఆయన తాత్కాలిక ఛైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) సిద్ధార్థ మొహంతి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కి సీఎండీగా ఉన్నారు. అయితే 2021 ఫిబ్రవరిలో ఎల్ఐసీ ఎండీగా నియమితులయ్యారు. ఇక్కడ చేరడానికి ముందు, ఎల్ఐసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-లీగల్గా ఉన్నారు. 1985లో ఎల్ఐసీ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్గా తన కెరీర్ని ప్రారంభించిన మొహంతి ఆ తరువాత ఉన్నత స్థాయికి ఎదిగారు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో, మార్కెటింగ్, హెచ్ఆర్, ఇన్వెస్ట్మెంట్స్, లీగల్ రంగాలలో మొహంతి తనదైన ముద్ర వేశారు. (ఇదీ చదవండి: Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!) మొహంతి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. అలాగే న్యాయశాస్త్రంలో పట్టాతోపాటు, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి లైసెన్షియేట్ కూడా. మార్చి 11న కేంద్రం మొహంతిని మూడు నెలల పాటు తాత్కాలిక చైర్పర్సన్గా నియమించింది. మినీ ఐపే ,బి సి పట్నాయక్ సహా ఎల్ఐసీ ముగ్గురు డైరెక్టర్లలో ఒకరైన మొహంతీని చైర్మన్ పదవికి షార్ట్లిస్ట్ చేసింది. కంపెనీకి చెందిన నలుగురు మేనేజింగ్ డైరెక్టర్ల నుండి ఛైర్మన్ను ఎంపిక చేస్తారు.ఇందులో తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది. సాధారణంగా ఎల్ఐసీలో ఒక చైర్పర్సన్ , నలుగురు ఎండీలు ముఖ్య నిర్వాహక సిబ్బందిగా ఉంటారు. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
ఎల్ఐసి కొత్త చైర్మన్గా సిద్ధార్థ మహంతి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన సారథిగా సిద్ధార్థ మహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) గురువారం ఎంపిక చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్లు, సారథుల ఎంపికను ఎఫ్ఎస్ఐబీ చూస్తుంటుంది. నిబంధనల ప్రకారం నలుగు మేనేజింగ్ డైరెక్టర్ల నుంచి చైర్మన్ను ఎంపిక చేస్తారు. మొత్తం మీద అనుభవం, ఇతర అంశాల ఆధారంగా ఎల్ఐసీ చైర్పర్సన్ పదవికి సిద్ధార్థ మహంతిని సిఫారసు చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ ప్రకటన విడుదల చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫారసుపై తుది నిర్ణయాన్ని ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తీసుకుంటుంది. ఒకవేళ మహంతి నియామకం ఖరారు కాకపోతే ఆయన ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసీ చైర్మన్గా ఎంపికైతే 62 ఏళ్లు వచ్చే వరకు కొనసాగొచ్చు. ఇతర ఉన్నత ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం!
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) విభాగం అధికారిక ప్రకటన చేసింది. ఐడీఐబీ బ్యాంక్ను వ్యూహాత్మక అమ్మక ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ( Expression of Interest (EOI)దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై దీపం సెక్రటరీ తుహిన్కాంత పాండే ట్వీట్లు చేశారు. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈఏఐలు దాఖలయ్యాయని, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్రం, ఆర్బీఐ ఐడీబీఐ కొనుగోలు చేసేందుకు దాఖలైన బిడ్లను పరిశీలిస్తుంది. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి భద్రతాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే రెండో దశ బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తుహిన్కాంత పాండే పేర్కొన్నారు. ఐడీబీఐలో కేంద్రం,ఎల్ఐసీ వాటా ఎంతంటే కేంద్రం, ఎల్ఐసీ ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. విక్రయంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
ఎన్ఎండీసీలో ఎల్ఐసీ వాటా విక్రయం
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా ఎన్ఎండీసీలో 2 శాతం వాటాను విక్రయించింది. దీంతో ఈ కంపెనీలో ఎల్ఐసీ వాటా మార్చి 14 నాటికి 11.69 శాతానికి వచ్చి చేరింది. తద్వారా రూ.700 కోట్లు సమకూరింది. బహిరంగ మార్కెట్లో 2022 డిసెంబర్ 29 నుంచి 2023 మార్చి 14 మధ్య 5.88 కోట్ల షేర్లను ఒక్కొక్కటి సగటున రూ.119.37కు ఎల్ఐసీ విక్రయించింది. ఈ విక్రయం ఫలితంగా ఎల్ఐసీ హోల్డింగ్ 13.699 శాతంనుంచి 11.69శాతానికి దిగి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియజేసింది. దీంతో షేర్ల పరంగా ఎన్ఎండిసిలో ఎల్ఐసీ హోల్డింగ్ 40,14,72,157 నుండి 34,25,97,574 ఈక్విటీ షేర్లకు తగ్గింది. ఇది కూడా చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు! 250 కోట్ల బిగ్గెస్ట్ ప్రాపర్టీ డీల్: మాజీ ఛాంపియన్, బజాజ్ ఆటో చైర్మన్ రికార్డు -
ఎల్ఐసీ ఎండీగా తబ్లేష్ పాండేకు పదోన్నతి
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) తబ్లేష్ పాండే మేనేజింగ్ డైరెక్టర్గా (ఎండీ) పదోన్నతి పొందారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఎండీ బీసీ పట్నాయక్ స్థానంలో పాండే నియమకం జరిగింది. ఎల్ఐసీలో ప్రస్తుతం నలుగురు ఎండీలు ఉన్నారు. ఇదీ చదవండి:రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు -
అదానీలో ఎల్ఐసీ పెట్టుబడులు లాభాల్లోకి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ స్టాక్స్లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పెట్టుబడుల విలువ మెరుగుపడింది. తాజాగా (శుక్రవారం ధరలతో చూస్తే) రూ. 8,900 కోట్లకుపైగా విలువకు జమ అయ్యింది. గ్రూప్ లో 10 లిస్టెడ్ కంపెనీలుండగా.. 7 కంపెనీలలో ఎల్ఐసీ గతంలో ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీలో కనిష్టంగా 1.28 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో గరిష్టంగా 9.14 శాతం వాటాలు సొంతం చేసుకుంది. వీటి కొనుగోలు ధరల ప్రకారం ఎల్ఐసీ పెట్టుబడులు రూ. 30,127 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 24కల్లా వీటి విలువ రూ. 29,893 కోట్లకు క్షీణించింది. అయితే తాజాగా ఈ విలువ రూ. 39,068 కోట్లను దాటింది. వెరసి అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులు రూ. 8,941 కోట్లమేర లాభపడినట్లయ్యింది. కాగా.. యూఎస్ షార్ట్సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీలలో కొద్ది రోజులుగా అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు నష్టాలతో డీలా పడ్డాయి. అయితే రెండు రోజులుగా తిరిగి అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ పెరగడంతో లాభాల బాటలో సాగుతున్నాయి. ఫలి తంగా ఎల్ఐసీ పెట్టుబడులు సైతం బలపడ్డా యి. అదానీ గ్రూప్ ఈక్విటీ, రుణ సెక్యూరిటీల లో 2022 డిసెంబర్31కల్లా మొత్తం రూ. 35, 917 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు జనవరి 30న ఎల్ఐసీ వెల్లడించింది. ఆపై 2023 జనవరి 27కల్లా వీటి మొత్తం విలువ రూ. 56,142 కోట్లను తాకడం గమనార్హం! -
తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభం
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పడిపోయి రూ.480 కోట్లకు వచ్చి చేరింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఉన్నప్పటికీ ఆశించిన క్రెడిట్ నష్టానికి అదనపు కేటాయింపులు చేయడం ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ ప్రకటించింది. రాని బాకీల కోసం చేసిన అదనపు కేటాయింపులు డిసెంబర్ త్రైమాసికంలో రూ.7,285 కోట్లుగా ఉన్నాయి. 2021 అక్టోబర్–డిసెంబర్లో ఇది రూ.5,716 కోట్లు. స్థూల నిరర్ధక ఆస్తులు 5.04 నుంచి 4.75 శాతానికి వచ్చి చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు 3.2 నుంచి 2.4 శాతంగా ఉన్నాయి. ఆదాయం 16 శాతం దూసుకెళ్లి రూ.5,871 కోట్లు, నికర వడ్డీ ఆదాయం 10 శాతం ఎగసి రూ.1,606 కోట్లుగా ఉంది. జారీ చేసిన రుణాలు రూ.17,770 కోట్ల నుంచి రూ.16,100 కోట్లకు వచ్చి చేరాయి. -
అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన
సాక్షి, ముంబై: హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్తో ఇబ్బందుల్లో పడిన అదానీ గ్రూపునకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకల తీవ్ర ఆరోపణలపై సెబీ రంగంలోకి దిగింది. అదానీ డీల్స్ను సెబీ నిశితంగా స్టడీ చేస్తోందట. ఈ అంశంపై భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారించనుంది. గత సంవత్సరంలో అదానీ గ్రూప్ డీల్స్ను పరిశీలిస్తోంది. అంతేకాదు కరీబియన్ దేశాలు మొదలు, యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు అవినీతి పాల్పడ్డాయన్న ఆరోపణలతో అదానీ విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులపై సొంత ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించ నుందట. దీనికి సంబంధించి అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని రాయిటర్స్ నివేదించింది. లిస్టెడ్ స్పేస్లో అదానీ గ్రూప్ చేస్తున్న అన్ని లావాదేవీలను సెబీ ఎక్కువగా పరిశీలిస్తోందంటూ విశ్వసనీయ సోర్సెస్ను ఉటంకిస్తూ రాయిట్సర్ తెలిపింది. మరోవైపు అదానీ గ్రూప్లో ఎక్కువ పెట్టుబడులుపెట్టిన ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తీవ్రంగా ప్రభావితయ్యే అవకాశం ఉందని, ప్రజాధనం, ఖాతాదారుల ఆస్తుల సంరక్షణ నిమిత్తం ఆర్బీఐ, సెబీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. అయితే ఆందోళన అవసరం లేదని ఎస్బీఐ ప్రకటించింది. -
అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి
సాక్షి, ముంబై: అదానీ గ్రూపు-హిండెన్బర్గ్ వివాదం అదానీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, బ్యాంకులు, ఇతర పెట్టుబడిదారులను చుట్టుకుంది. గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ క్రాష్ కావడంతో దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీగా ప్రభావితమైంది. ఎల్ఐసీ కేవలం 2 రోజుల్లోనే రూ.18,000 కోట్లు నష్టాన్ని మూటగట్టకుంది. అటు అదానీ షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్మార్కెట్ శుక్రవారం భారీ పతనాన్ని నమోదు చేసింది. తాజా డేటా ప్రకారం అదానీ గ్రూప్ స్టాక్స్లో ఎల్ఐసీ సంయుక్త పెట్టుబడి జనవరి 24, 2023న రూ.81,268 కోట్లగా ఉండగా, జనవరి 27, 2023న రూ.62,621 కోట్లకు పడిపోయింది. అంటే రూ.18,647 కోట్ల మేర ఎల్ఐసీ నష్టపోయింది. కాగా అదానీ గ్రూపు కంపెనీల ఆర్థిక వ్యవహారాల్లో దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ హిండెన్ బర్గ్ నివేదికను విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. గడిచిన మూడేళ్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఏడు లిస్టెడ్ కంపెనీలు, 85 శాతం నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై చట్టపరమైన చర్య తీసుకోనున్నట్టు అదానీ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ను దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో తమప్రతిష్టను దెబ్బతీయాలనే ఈ కుట్రపన్నారని పేర్కొంది. దీనిపై హిండెన్బర్గ్ కూడా స్పందించింది. తన నివేదికలోని అంశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. -
నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి!
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇన్సూరెన్స్ కవర్తో పాటు,భారీ రాబడితో కస్టమర్ల ఆదరణతో మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. వినియోగదారులు ఒకసారి పెట్టుబడి పెట్టి నెలకు 11వేలు ఆర్జించే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ద్వారా నెలకు రూ.11000 ఎలా? ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం రూ. 1.5 లక్షలు. ఈ పథకం ద్వారా 12వేల కనీస రాబడి లభిస్తుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు.. ఎంతయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే నెలకు రూ. 11,000 కంటే ఎక్కువ సంపాదించాలంటే మాత్రం కనీసం రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్లాన్ ద్వారా నెలవారీ పెన్షన్ రూ. 11,192 పొందవచ్చు. అలాగే జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ విషయంలో, నెలవారీపెన్షన్ రూ. 10,576. మరింత సమాచారం కోసం LIC ఎల్ఐసీ వెబ్సైట్ను సందర్శించవచ్చు. -
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్సైట్కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్లో వినియోగదారు ID, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్య గమనిక
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండియా కార్పొరేషన్ (ఎల్ఐసీ) జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ 2019 ఆగస్ట్లో జీవన్ అమర్ ప్లాన్ను, అదే ఏడాది సెప్టెంబర్లో ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.అయితే తాజాగా ఆ ప్లాన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. అందుకు కారణం రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడమే కారణమని తెలుస్తోంది. కాగా, త్వరలో ఆ రెండు పాలసీలను మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తెస్తామని సంస్థ చెబుతోంది. అర్హతలు 10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో పాలసీ దారుడు ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్ను కనీసం రూ.25 లక్షలు, ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి అందుతుంది. ప్లాన్ తీసుకొని ఉంటే పాలసీదారులు ఇప్పటికే ఈ రెండు ప్లాన్లను కొనుగోలు చేస్తే.. ఆ పాలసీలు అలాగే కొనసాగుతాయని ఎల్ఐసీ ప్రతనిధులు తెలిపారు. కొత్తగా పాలసీ తీసుకునేవారికి మాత్రం అందుబాటులో ఉండవు. -
ఎల్ఐసీ.. ఆదాయం అదరహో
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 రెట్లు దూసుకెళ్లి రూ. 15,952 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,434 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీగా పెరిగిన పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదం చేశాయి. ఈ కాలంలో మొత్తం ప్రీమియం ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,32,632 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,04,914 కోట్లు మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,72,044 కోట్ల నుంచి రూ. 22,29,489 కోట్లకు జంప్చేసింది. వ్యాపార వృద్ధిని ప్రతిఫలించే తొలి ఏడాది ప్రీమియం రూ. 8,198 కోట్ల నుంచి రూ. 9,125 కోట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం స్వల్ప వృద్ధితో రూ. 56,156 కోట్లకు చేరగా.. సింగిల్ ప్రీమియం 62 శాతం అధికమై రూ. 66,901 కోట్లను తాకింది.ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 627 వద్ద ముగిసింది. -
దివిస్లో 5 శాతం దాటిన ఎల్ఐసీ వాటా
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబరేటరీస్లో జీవిత బీమా దిగ్గజమైన ఎల్ఐసీ తన వాటాలను పెంచుకుంది. రూ.35.82 కోట్లు పెట్టి అదనపు వాటాలను కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.3,379 వెచ్చించింది. దీంతో దివిస్ ల్యాబ్లో ఎల్ఐసీ వాటాలు 1,32,54,663 నుంచి 1,33,60,663కు పెరిగాయి. నవంబర్ 7న తన వాటా 5 శాతాన్ని మించినట్టు ఎల్ఐసీ స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం ఇచ్చింది. లిస్టెడ్ కంపెనీలో ఏదైనా కంపెనీకి వాటా 5 శాతం దాటితే దాన్ని ప్రత్యేకంగా తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఫార్మా ఇంటర్ మీడియట్స్, ఏపీఐలు, న్యూట్రాస్యూటికల్స్లో దివిస్ దిగ్గజ సంస్థ కావడం గమనార్హం. బుధవారం బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు రూ.631 వద్ద ముగియగా, దివిస్ ల్యాబ్ 3.38 శాతం నష్టపోయి రూ.3,298 వద్ద ముగిసింది. -
వోల్టాస్లో అదనపు వాటా కొనుగోలు చేసిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తాజాగా వోల్టాస్లో 2 శాతం వాటా పెంచుకుంది. బహిరంగ మార్కెట్ ద్వారా రూ.634.5 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ తదనంతరం వోల్టాస్లో ఎల్ఐసీ వాటా 8.884 శాతానికి ఎగసింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్ ప్రాజెక్టుల రంగంలో వోల్టాస్ నిమగ్నమైంది. సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, వోల్టాస్లో తన వాటాను 2,27,04,306 షేర్ల (6.862 శాతానికి సమానం)నుండి 2,93,95,224 (8.884 శాతం)కిపెంచుకుంది. దీంతో ఎల్ఐసీ 0.84 శాతం లాభంతో రూ.633 వద్ద, వోల్టాస్ 1.24 శాతం క్షీణించి రూ.834 వద్ద ముగిసింది. -
టాటా మోటర్స్లో ఎల్ఐసీకి 5 శాతం వాటా
న్యూఢిల్లీ: గడిచిన పది నెలల్లో వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్లో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటాలు 5 శాతానికి పెరిగాయి. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సమాచారం ప్రకారం గతేడాది డిసెంబర్ 3 నుండి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో ఎల్ఐసీ తన షేర్లను 16.59 కోట్ల నుంచి 16.62 కోట్లకు (వాటాలు 4.997 శాతం నుంచి 5.004 శాతానికి) పెంచుకుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి సగటున రూ. 455.69 చొప్పున రూ. 11.39 కోట్లు వెచ్చించింది. టాటా మోటర్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో తమ వాటాలు 5 శాతం దాటితే లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయాలి. మంగళవారం ఎల్ఐసీ షేర్లు స్వల్పంగా పెరిగి రూ. 605 వద్ద, టాటా మోటర్స్ షేర్లు 2 శాతం పెరిగి రూ. 421.50 వద్ద ముగిశాయి. -
టాటా మోటర్స్లో ఎల్ఐసీకి 5 శాతం వాటా
గడిచిన పది నెలల్లో వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్లో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటాలు 5 శాతానికి పెరిగాయి. స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సమాచారం ప్రకారం గతేడాది డిసెంబర్ 3 నుండి ఈ ఏడాది అక్టోబర్ మధ్య కాలంలో ఎల్ఐసీ తన షేర్లను 16.59 కోట్ల నుంచి 16.62 కోట్లకు (వాటాలు 4.997 శాతం నుంచి 5.004 శాతానికి) పెంచుకుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి సగటున రూ. 455.69 చొప్పున రూ. 11.39 కోట్లు వెచ్చించింది. టాటా మోటర్స్ మార్కెట్ క్యాప్ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థలో తమ వాటాలు 5 శాతం దాటితే లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. మంగళవారం ఎల్ఐసీ షేర్లు స్వల్పంగా పెరిగి రూ. 605 వద్ద, టాటా మోటర్స్ షేర్లు 2 శాతం పెరిగి రూ. 421.50 వద్ద ముగిశాయి. -
కారణం తెలియదు, ఫర్వాలేదనిపించిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్!
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి ఫలితాల పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.305 కోట్లుగా నమోదైంది. కానీ, కీలకమైన వడ్డీ ఆదా యం స్వల్పంగా తగ్గి (0.80 శాతం) రూ.1,163 కోట్లకు పరిమితమైంది. ఇందుకు కారణం ఏంటన్నది సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత విభాగంలో రుణాల మంజూరు స్వల్పంగా తగ్గి రూ.14,300 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల వితరణ 4 శాతం పెరిగి రూ.16,110 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని మొత్తం రుణాల్లో వ్యక్తులకు ఇచ్చినవి రూ.2,16,771 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 2 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. కేటాయింపులు రూ.6,552 కోట్లకు పెరిగాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ఐడీబీఐ వివరాలకు మరింత గడువు
న్యూఢిల్లీ: పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రాసెస్కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్కు అక్టోబర్ 28వరకూ గడువు ప్రకటించింది. అయితే దీపమ్ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్ బిడ్స్కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు బీఎస్ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది. చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే? -
ఇన్వెస్టర్లకు రాబడులు: ఎల్ఐసీకి కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పనితీరును మార్చడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసి అధిక లాభాలు ఆర్జించడంపైనా, ఇన్వెస్టర్లకు మరింత రాబడులు అందించడంపైనా దృష్టి సారించాలని ఒత్తిడి పెంచుతోంది. (Jay Y Lee శాంసంగ్కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు) ఇందులో భాగంగా కొత్త తరాన్ని కూడా ఆకర్షించేలా పథకాల వ్యూహాలను మార్చుకోవాలని, లాభ దాయకతను పెంచేలా మరిన్ని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టడాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సమీక్షలో సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా 65 ఏళ్ల సంస్థను ఆధునీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్) అలాగే పథకాలను కూడా ఆధునీకరించేలా మేనేజ్మెంట్తో కలిసి పని చేస్తు న్నట్లు అధికారి వివరించారు. రూ. 902-949 ధర శ్రేణితో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీని ద్వా రా ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్లు వచ్చాయి. (Hero MotoCorp ఫిలిప్పైన్స్లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ ) అయితే, మే 17న లిస్టింగ్ తొలి రోజే ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 872 వద్ద లిస్టయిన ఎల్ ఐసీ షేరు అప్పటి నుంచి కోలుకోలేదు. ప్రస్తు తం రూ. 595 దగ్గర ట్రేడవుతోంది. కానీ వచ్చే ఏడా ది వ్యవధిలో ఎల్ఐసీ షేరు బాగా రాణిస్తుందని కొన్ని బ్రోకరేజీలు బులిష్గా ఉన్నాయి. రేటు రూ. 1,000 స్థాయికి చేరవచ్చని సిటీ అంచనా వేసింది. -
బోలెడు బెనిఫిట్స్తో ఎల్ఐసీ కొత్త పాలసీ!
హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్పాలసీ అని ఎల్ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ప్రైవేట్పరం కానున్న ఐడీబీఐ బ్యాంక్, ఎప్పటికంటే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీ వాటాల విక్రయ ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మార్చి నాటికల్లా ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ 30.24 శాతం .. వెరసి 60.72 శాతం వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గత వారమే ఇందుకోసం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించారు. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డిసెంబర్ 16 ఆఖరు తేదీ. రిజర్వ్ బ్యాంక్ అసెస్మెంటు పూర్తి చేసుకుని, హోమ్ శాఖ నుంచి భద్రతా క్లియరెన్సులు పొందిన బిడ్డర్లకు బ్యాంకు డేటా రూమ్ అందుబాటులోకి వస్తుంది. వివిధ అంశాలన్నింటిని మదింపు చేసుకున్న తర్వాత బిడ్డర్లు ఆర్థిక బిడ్లు దాఖలు చేస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకును ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరిస్తున్నప్పటికీ అందులో కేంద్రం, ఎల్ఐసీకి ఏకంగా 95 శాతం వాటా ఉన్నందున ప్రభుత్వ రంగ సంస్థగానే పరిగణిస్తున్నారు. ప్రత్యేక కేసు కావడంతో వాటాల అమ్మకానికి సంబంధించి సాంకేతిక కారణాల వల్ల ప్రైవేటీకరణ పదం వాడకుండా వ్యూహాత్మక విక్రయం అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం, సాధారణ షేర్హోల్డర్లకు 5.2 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీల వాటా 94.72 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుంది. -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయం షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఎల్ఐసీతో కలసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికింది. ఆసక్తి గల సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 16 వరకూ గడువును ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులో బీమా రంగ పీఎస్యూ ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం 45.48 శాతం వాటాను కలిగి ఉంది. వెరసి సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. వాటాలతోపాటు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు బిడ్స్కు ఆహ్వానం పలికిన దీపమ్ వెల్లడించింది. ఇందుకు పలు నిబంధనలు వెల్లడించింది. డీల్ తదుపరి సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. నిబంధనలివీ..: ఐడీబీఐ కొనుగోలుకి ఈవోఐ దాఖలు చేసే కంపెనీలు కనీసం రూ. 22,500 కోట్ల నెట్వర్త్ను కలిగి ఉండాలి. అంతేకాకుండా గత ఐదేళ్లలో మూడేళ్లపాటు లాభాలు ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్కు అర్హత లభిస్తుంది. కన్సార్షియంగా ఏర్పాటైతే నాలుగు కంపెనీలను మించడానికి అనుమతించరు. విజయవంతమైన బిడ్డర్ కనీసం ఐదేళ్లపాటు బ్యాంకులో 40% వాటాను తప్పనిసరిగా లాకిన్ చేయాలి. భారీ పారిశ్రామిక, కార్పొరేట్ హౌస్లు, వ్యక్తులను బిడ్డింగ్కు అనుమతించరు. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం బలపడి రూ. 43 వద్ద ముగిసింది. ఈ ధరలో 60.72 శాతం వాటాకు రూ. 27,800 కోట్లు లభించే వీలుంది. -
ఐపీవో నిధుల సమీకరణ వీక్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో పబ్లిక్ ఇష్యూల వేగం తగ్గింది. దీంతో 14 కంపెనీలు మాత్రమే లిస్టింగ్కురాగా.. కేవలం రూ. 35,456 కోట్లు సమీకరించాయి. గతేడాది తొలి అర్ధభాగంలో 25 ఇష్యూల ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న రూ. 51,979 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు 32 శాతం క్షీణించాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాలివి. నిజానికి మొత్తం నిధుల సమీకరణలో 58 శాతం వాటాను ఆక్రమించిన ఎల్ఐసీ ఇష్యూ(రూ. 20,557 కోట్లు)లేకుంటే ఈ సంఖ్య మరింత నిరుత్సాహకరంగా కనిపించేదని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ ఎండీ ప్రణవ్ హాల్దియా పేర్కొన్నారు. అయితే ప్రైమ్ గణాంకాల ప్రకారం ఇకపై ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇప్పటికే 71 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు అనుమతులు పొందాయి. తద్వారా రూ. 1,05,000 కోట్లు సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. ఇవికాకుండా మరో 43 కంపెనీలు రూ. 70,000 కోట్ల పెట్టుబడుల కోసం సెబీని ఆశ్రయించాయి. అనుమతులు వెలువడవలసి ఉంది. మొత్తం ఈ జాబితాలో 10 న్యూఏజ్ టెక్నాలజీ కంపెనీలుకాగా.. రూ. 35,000 కోట్ల సమీకరణకు వేచి చూస్తున్నాయి. ఈక్విటీ నిధులు సైతం డీలా తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఈక్విటీ నిధుల సమీకరణ సైతం 55 శాతం క్షీణించింది. రూ. 41,919 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో ఈక్విటీ మార్గంలో రూ. 92,191 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఎల్ఐసీని మినహాయిస్తే డెల్హివరి రూ. 5,235 కోట్లు, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రూ. 1,581 కోట్లు సమకూర్చుకున్నాయి. 14 కంపెనీలలో డెల్హివరీ మాత్రమే న్యూఏజ్ టెక్ కంపెనీ కావడం గమనార్హం! పేటీఎమ్సహా కొన్ని ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచడం ప్రభావం చూపింది. దీంతో 14 ఐపీవోలలో 4 కంపెనీలకు మాత్రమే 10 రెట్లు, అంతకుమించిన స్పందన లభించింది. ఈ కాలంలో కేవలం 41 కంపెనీలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. గతేడాది ఇదే సమయంలో 87 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. మరో 2 కంపెనీలు రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు వీలుగా రెండు కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. జాబితాలో ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్, ఉదయ్శివ్కుమార్ ఇన్ఫ్రా ఉన్నాయి. దీంతో ఈ నెల(సెప్టెంబర్)లో ఇప్పటివరకూ కొత్తగా 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టినట్లయ్యింది. కాగా.. ఐపీవోలో భాగంగా ఎన్విరో ఇన్ఫ్రా 95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇక ఉదయ్శివకుమార్ ఇన్ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రెండు సంస్థలూ వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వినియోగించనున్నాయి. ప్రభుత్వం తదితర సంస్థలకు చెందిన నీటిపారుదల పథకాలు, వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ సేవలు ఎన్విరో అందిస్తోంది. ఉదయ్శివకుమార్ రహదారుల నిర్మాణంలో కార్యకలాపాలు కలిగి ఉంది. తదితరాల నిర్మాణం, నిర్వహణలను ఎన్విరో చేపడుతోంది. రోడ్లు, బ్రిడ్జిలు, ఇరిగేషన్, కాలువలు, పారిశ్రామిక ప్రాంతాల నిర్మాణం తదితరాలను చేపడుతోంది. -
మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్
జీవిత బీమాలో అగ్రస్థాయి కంపెనీ అయిన ఎల్ఐసీ.. కొత్త పెన్షన్ ప్లాన్ను (ప్లాన్ నంబర్ 867) విడుదల చేసింది. ఇది నాన్ పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్ ప్లాన్. రెగ్యులర్గా ఈ ప్లాన్లో పొదుపు చేసుకుంటూ.. కాల వ్యవధి తర్వాత యాన్యుటీ ప్లాన్ తీసుకుని పెన్షన్ పొందొచ్చని ఎల్ఐసీ తెలిపింది. ఒకేసారి చెల్లించే సింగిల్ ప్రీమియం ప్లాన్ లేదంటే రెగ్యులర్గా పాలసీ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లించే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కనిష్ట, గరిష్ట ప్రీమియం పరిమితుల మధ్య పాలసీదారు తనకు అనుకూలమైన మొత్తాన్ని ప్రీమియంగా ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం రూపంలో చేసిన చెల్లింపులను నాలుగు ఫండ్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది పాలసీదారు అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రీమియం అలోకేషన్ తదితర చార్జీలను ప్రీమియం నుంచి మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఆయా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పాలసీలో 5–15 శాతం మధ్య గ్యారంటీడ్ అడిషన్ కూడా చెల్లిస్తారు. -
బంగారు బాతును కాపాడుకోవాలి!
ఎల్ఐసీ దేశానికి ఎంతో ఇచ్చింది. ఇంకెంతో ఇవ్వనుంది. మరి ప్రభుత్వం దానికి తిరిగి ఏమిస్తోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ, కార్పొరేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం ఒక విధానంగా పెట్టుకున్న కేంద్రం... అక్షయ పాత్రలాంటి ఎల్ఐసీనీ ప్రైవేటీకరించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1956లో ప్రభుత్వం సమకూర్చిన ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 66 ఏళ్లలో రూ. 31 వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చింది ఎల్ఐసీ. 2022 మార్చి 31 నాటికి రూ. 40,84,826 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా బీమా సౌకర్యాన్నీ కల్పిస్తూ వచ్చింది. అయినా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను ప్రభుత్వం అమ్మివేసింది. ఈ మధ్య ఎన్టీఆర్ఐను ప్రారంభిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లేకుండా దేశ ప్రగతిని ఊహించుకోలేమనీ, ఎల్ఐసీ గత 66 ఏళ్లలో అద్భుతంగా రాణిస్తోందనీ కితాబు ఇచ్చారు. అటువంటి అద్భుత సంస్థ ‘యోగక్షేమం వహామ్యహం’ (ప్రజల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను) అనే నినాదంతో మొదలై 2022 సెప్టెంబర్ 1 నాటికి 66 ఏళ్ళు పూర్తి చేసుకుని 67వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1956లో ఎల్ఐసీ ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత లక్ష్యాలతో పనిచేయబట్టే... నేడు ప్రజల, పాలసీ దారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. అడుగడుగునా తనను నమ్మి తన మీద భరోసా పెట్టుకున్న ఖాతాదారులకు అభయం ఇచ్చి, ఎల్ఐసీ దేశీయ జీవిత బీమా రంగంలో మార్కెట్ మేకర్గా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఎల్ఐసీ రూ. 40,84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టింది. ఇందులో రూ. 28,85,569 కోట్ల నిధులను హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పనకూ; కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలకూ కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ. 14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ సమకూర్చింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! 2021–22 ఆర్థిక సంవత్సరంలో క్లెయిముల చెల్లింపుల రూపేణా దాదాపు లక్ష కోట్ల మేరకు పాలసీ దారులకు చెల్లించింది. 99 శాతం క్లెయిముల పరిష్కారం రేటుతో క్లెయిముల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరెన్నికగన్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (ఏప్రిల్ నుండి జూన్ లోపల) 85,298 కోవిడ్ డెత్ క్లెయిములను పరిష్కరించి, రూ. 2,334 కోట్లు పాలసీదారుల వారసులకు చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 614 శాతం ఎక్కువ. నిమిషానికి 41 పాలసీలను విక్రయిస్తూ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 17 లక్షల పాలసీలను ఎల్ఐసీ సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం నికర ప్రీమియం ఆదాయం పెరిగింది. 22 సంవత్సరాల పోటీ తర్వాత కూడా ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అంశంలో మార్కెట్ వాటాలో 65 శాతం కలిగి ఉంది. పాలసీల సంఖ్యలో దాదాపు 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది అపూర్వమైన ఘనత. ఏ దేశంలో లేని విధంగా... ఒకే కంపెనీ, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీ, మార్కెట్ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఒక్క ఎల్ఐసీ విషయంలో మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రూ. 36,000 కోట్లు లాభం ఆర్జించిన ఎల్ఐసీ సంస్థ, ఈ ఏడాదిలో రూ. 42,000 కోట్లు లాభాలు ఆర్జించింది.గత ఏడాది జూన్ నాటికి ఎల్ఐసీ ఆస్తులు రూ. 38.13 లక్షల కోట్లు కాగా, ఇప్పుడవి రూ. 42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 23 ప్రయివేటు బీమా కంపెనీల మొత్తం ఆస్తుల కన్నా 3 రెట్లు ఆస్తులు, ఎల్ఐసీ సంస్థ కలిగి ఉంది. రెండో అతిపెద్ద ప్రయివేటు జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్తో పోలిస్తే, ఎల్ఐసీ ఆస్తులు 16 రెట్లు ఎక్కువ. దేశంలో మొత్తం మ్యూచ్యువల్ ఫండ్ల ఆస్తుల కన్నా, ఎక్కువ ఆస్తులను ఎల్ఐసీ కలిగి ఉంది. 2021–22లో పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 98 శాతం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి అత్యుత్తమ పారదర్శక సంస్థగా నిలిచింది. ‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ అనేక అవార్డులు, రివార్డులు పొందింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎల్ఐసీనే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్’. ‘బెస్ట్ బ్రాండ్ అవార్డ్’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు ‘బంగారు నెమలి‘ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలై ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల నడుమ ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేశారు. దాంతో తర్వాత కాలంలో ఎల్ఐసీ షేర్ విలువ దాదాపు 28 శాతం తగ్గిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఎల్ఐసీ సంస్థ ఏనుగు వలే శక్తి మంతమైనది అయినప్పటికీ, అది నాట్యం చేయలేదని కొందరు మార్కెట్ పండితులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అయితే, జేపీ మోర్గాన్ సంస్ధ తన తాజా నివేదికలో, ఎల్ఐసీ నిజ విలువను, శక్తిని గుర్తించడంలో మార్కెట్ విఫలమైందని వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఎల్ఐసీ నూతన వ్యాపార వృద్ధి రేటు 95 శాతంగా ఉంది. కాగా, ప్రయివేటు బీమా కంపెనీల వృద్ధి దాదాపు 48 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎల్ఐసీ వృద్ధి రేటు 63 శాతం కాగా, ప్రయివేటు కంపెనీల వృద్ధి రేటు 38 శాతంగా ఉంది. తాజాగా ఎల్ఐసీ ఫార్ట్యూన్ గ్లోబల్ –500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి లిస్ట్ అయిన కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో లిస్టింగ్ అయిన రెండు నెలల లోపలే ఎల్ఐసీ 98వ స్థానం పొందింది. ఎల్ఐసీ వ్యాపారాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఎల్ఐసీ షేర్ విలువ కూడా పెరుగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోన్న పరిస్థితుల్లో సైతం ఎల్ఐసీ చక్కని ప్రదర్శన చేస్తోంది. ప్రయివేటు బీమా సంస్థలు మెట్రోలు, మహానగరాలకే పరిమితమయినా... ఎల్ఐసీ గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విశేషంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్ఐసీకి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్ఐసీకి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్ఐసీ వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ. లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీ లలో ఇది రూ 1,06,000 గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్ఐసీ సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బీమా రక్షణ కలిగిస్తోందని స్పష్టమవుతోంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటి గనుక, ఎల్ఐసీలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ పరుగులు పెట్టవలసి వస్తే అది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల ప్రయోజనాలకు భంగకరం అవుతుంది. 40 లక్షల మంది ఎల్ఐసీ షేర్ హోల్డర్ల ప్రయోజనాల కన్నా, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలూ, విశాల దేశ ప్రయోజనాలే పరమావధిగా ఎల్ఐసీ బోర్డు అడుగులు వేయాలి. ప్రజల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత నడుమ ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలు మాత్రమే ప్రస్తుతానికి అమ్మడం జరిగింది. ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి అక్షయ పాత్ర లాంటిది. 1956లో ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించి... ఇప్పటివరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెంట్ చెల్లించింది. నిరంతరం, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నిధులు అందిస్తూనే ఉంది. అటువంటి బంగారు బాతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి తెగనమ్మే ప్రయత్నాలు చేయడం సరికాదు. ప్రభుత్వం తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటుందని ఆశిద్దాం. పి. సతీష్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు ‘ 94417 97900 -
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
పాలసీదారులకు ఎల్ఐసీ బంపరాఫర్!
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ రద్దయిన పాలసీల (ల్యాప్స్డ్) పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ 17న ఇది మొదలవుతుందని.. అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని తెలిపింది. యూలిప్ పాలసీలు కాకుండా, ఇతర అన్ని జీవిత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని.. ఆలస్యపు రుసుంలో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరిగా ప్రీమియం చెల్లించి మానేసిన నాటి నుంచి ఐదేళ్లు దాటకపోతే వాటిని పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. సూక్ష్మ బీమా పాలసీల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంను నూరు శాతం మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. ఊహించని పరిస్థితుల వల్ల పాలసీల ప్రీమియం చెల్లించలేకపోయిన వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఎల్ఐసీ తెలిపింది. -
మెడిక్లెయిమ్ సెగ్మెంట్పై మళ్లీ ఎల్ఐసీ చూపు!
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. మెడిక్లెయిమ్ పాలసీ అంటే... మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది. నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్మెంట్ను క్లెయిమ్ చేసే వీలుండేది. మళ్లీ మార్పు ఎందుకు? 2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. -
నాలుగేళ్లు.. రూ. 4,344 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబీమాకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బీమా పరిధిలోని రైతులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలకు (నామినీ) ఎల్ఐసీ సంస్థ పరిహారం కింద రూ. 5 లక్షల చొప్పున అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 40.07 లక్షల మంది రైతుబీమా కింద నమోదయ్యారు. నాలుగేళ్లలో వారి పేర్లతో ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 4,367 కోట్లు ప్రీమియంకింద చెల్లించింది. ఈ కాలంలో 85,804 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబాలకు బీమా పరిహారంగా రూ.4,344 కోట్లు అందజేశారు. దేశంలో ఇటువంటి పథకం ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఆయా రైతు కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. 90 శాతం సన్నచిన్నకారు రైతులే.. రైతుబీమా పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపున్న పట్టాదారులందరూ అర్హులే. ప్రతినెలా అర్హులైన వారి వివరాలను రెవెన్యూశాఖ నుంచి వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. పథకం ప్రారంభమైన మొదటి ఏడాది 2018–19లో 31.27 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ ఏడాది 17,666 మంది రైతులు మరణించగా, పరిహారం కింద వారి కుటుంబాలకు రూ.883 కోట్లు చెల్లించారు. ఏటా పేర్లు నమోదు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతం వరకు సన్నచిన్నకారు రైతులే ఉన్నారని వ్యవసాయశాఖ గతంలో అంచనా వేసింది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు 83 శాతం మంది ఉన్నారని లెక్కలు వేశారు. కాగా, ఈ నాలుగేళ్ల కాలంలో అత్యధింగా 2020–21లో 28,989 మంది రైతులు చనిపోయారు. మిగతా సంవత్సరాలతో పోలిస్తే ఆ ఒక్క ఏడాదే వేలాది మంది అధికంగా మరణించారు. కరోనా వీరవిహారం చేసిన సంవత్సరం కాబట్టి చాలామంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయ వర్గాలు విశ్లేషించాయి. ఆ రైతుల కుటుంబాలకు అత్యధికంగా రూ. 1,449 కోట్లు చెల్లించారు. కాగా, ఒక దశలో ప్రీమియం కంటే క్లెయిమ్స్ చెల్లింపులు అధికంగా ఉండటం గమనార్హం. ఇక 2022–23 ఏడాది బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ఈ నెలలో చెల్లించనుంది. ఈ నేపథ్యంలో కొత్త వారిని బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది. -
అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!
Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.98 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్ఐసీ మాత్రమే. ఫార్చూన్ 500లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్ 370, టాటా స్టీల్ 435, రాజేశ్ ఎక్స్పోర్ట్స్ 437 ర్యాంకుల్లో నిల్చాయి. (ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్, ఐటీ జోరు) మరిన్ని విశేషాలు.. ► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సైనోపెక్ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ► తొలిసారిగా గ్రేటర్ చైనా (తైవాన్తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్ కంపెనీలను మించాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! -
రూ. 5.41 లక్షల కోట్లకు..ఎల్ఐసీ ఇండియన్ ఎంబెడెడ్ విలువ!
ముంబై: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) 2022 మార్చికల్లా ఇండియన్ ఎంబెడెడ్ విలువ(ఐఈవీ)ను రూ. 5,41,492 కోట్లుగా మదింపు చేసింది. గతేడాది(2021) ఇదే కాలానికి కంపెనీ ఐఈవీ రూ. 95,605 కోట్లుగా నమోదైంది. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో వాటాదారుల కన్సాలిడేటెడ్ విలువను ఎంబెడెడ్ విలువ(ఈవీ)గా పేర్కొంటారు. ఐఈవీ మదింపును మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ పూర్తి చేసినట్లు ఎల్ఐసీ ఎండీ రాజ్ కుమార్ వెల్లడించారు. ఇకపై ఐఈవీని ఆరు నెలలకోసారి వెల్లడించనున్నట్లు తెలియజేశారు. కాగా.. 2021 సెప్టెంబర్ చివరికి ఐఈవీ రూ. 5,39,686 కోట్లకు చేరినట్లు ఎల్ఐసీ తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కొత్త బిజినెస్ విలువ(వీఎన్బీ) రూ. 7,6019 కోట్లు చేరింది. 2020–21 మార్చికల్లా వీఎన్బీ రూ. 4,167 కోట్లుగా నమోదైంది. గతేడాది వీఎన్బీ మార్జిన్ 9.9 శాతం నుంచి 15.1 శాతానికి బలపడింది. ఇక వార్షిక ప్రీమియం(ఏపీఈ) రూ. 45,588 కోట్ల నుంచి రూ. 50,390 కోట్లకు బలపడింది. కాగా, ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు 0.5 శాతం నీరసించి రూ. 715 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీ విషయంలో అలా జరగడం తాత్కాలికమే
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ షేరు తగ్గుదల ఆందోళనకరంగా అనిపిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలికమైనదేనని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. సంస్థ ఫండమెంటల్స్ గురించి షేర్హోల్డర్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ఎల్ఐసీ పరిశీలించి, వాటాదారులకు మరింత విలువను చేకూర్చేందుకు తగు చర్యలు తీసుకుంటుందని పాండే వివరించారు. గత నెలలో నిర్వహించిన ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా కేంద్రం రూ. 20,500 కోట్లు సమీకరించింది. అయితే మే 17న లిస్టయిన దగ్గర్నుంచి ఎల్ఐసీ షేరు క్షీణిస్తూనే ఉంది. ఇష్యూ ధర రూ. 949 కాగా గరిష్టంగా రూ. 920 స్థాయిని మాత్రమే తాకగలిగింది. అప్పట్నుంచి పతనబాటలోనే ఉన్న షేరు శుక్రవారం బీఎస్ఈలో రూ. 709.70 వద్ద క్లోజయ్యింది. చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి! -
ఇన్వెస్టర్లకు షాక్..నాలుగోవంతు సంపద మటాష్!
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్ టైం లో రూ.720 టచ్ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. -
హిమ్మత్ రఖనా అంటూ కన్నుమూసిన అమ్మానాన్న, ఎల్ఐసీ నోటీసులు, నెటిజనుల స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీమా సంస్థ ఎల్ఐసీ లోన్ రికవరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్కు దృష్టికి చేరింది. వెంటనే దీనిపై జోక్యం చేసుకున్న ఆమె ఈ విషయాన్ని పరిశీలించి తనకు వివరాలు అందించాల్సిందిగా ఎల్ఐసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని భోపాల్కు చెందిన జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ టీచరు. ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. అయితే గత ఏడాది జితేంద్ర, ఆయన భార్య డా. సీమా పాథక్ను కూడా కరోనా పొట్టన పెట్టుకుంది. అప్పటికి వనిషా వయసు 17 సంవత్సరాలు. ఈమెకు పదకొండేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే 29 లక్షల రూపాయల లోన్ తీర్చాలంటూ వనిషా పాఠక్కు నోటీసులు పంపింది ఎల్ఐసీ. తక్షణమే లోన్ చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జూన్ 5న ఎల్ఐసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పిల్లల బంధువులు తమ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలియజేశారని ఎల్ఐసీ తెలిపింది. ఇకపై ఎలాంటి నోటీసులు అందవని హామీ ఇస్తూ ఏప్రిల్లో లేఖ పంపినట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బాధితుల స్పందన భిన్నంగా ఉంది. ఇదే నిజమైతే మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని వనిషా ప్రశ్నించింది. కాగా వనిషా పాఠక్, ఆమె సోదరుడిని ప్రస్తుతం మేనమామ సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి వనిషా 10వతరగతి సీబీఎస్ఈ పరీక్షలలో ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్లో 100 మార్క్లు, గణితంలో 97 స్కోర్ చేయడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వనిషా పాఠక్ ఐఐటీ లేదా యూపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని భావిస్తోందట. దేశానికి సేవ చేయాలని తండ్రి కోరిక అని.. ఇపుడు అది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే అద్భుతమైన కవిత్వంతో అమ్మ నాన్నాలకు ఘనమైన నివాళి అర్పించడమే కాదు ఆ దుఃఖాన్ని, కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజనులు వనిషాకు, ఆమె తమ్ముడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్ఐసీ రుణాన్ని తీర్చి, ఆమె చదువు కయ్యే ఖర్చును భరించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారని పిల్లల మేనమామ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ ఫోన్లు వస్తూనే ఉన్నాయనీ ఆయన తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్లో ఎల్ఐసీ నుంచి కొంత సడలింపు లభిస్తే.. అదే పెద్ద సహాయం అవుతుందన్నారు. -
ఎల్ఐసీ ఫలితాలు.. ప్చ్!
న్యూఢిల్లీ: ఇటీవలే ఐపీవోకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ జనవరి– మార్చిలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో స్టాండెలోన్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,372 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,893 కోట్లు ఆర్జించింది. అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1.22 లక్షల కోట్ల నుంచి రూ. 1.44 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 18 శాతం వృద్ధికాగా.. తొలిసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 1.50 చొప్పున చెల్లించనుంది. కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 17 శాతం నీరసించి రూ. 2,409 కోట్లకు చేరింది. 2020–21 క్యూ4లో రూ. 2,917 కోట్లు ఆర్జించింది. మార్చికల్లా కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.76 శాతం నుంచి 1.85 శాతానికి మెరుగుపడింది. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తదుపరి తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు 2 శాతం బలపడి రూ. 837 వద్ద ముగిసింది. -
ఐపీవో తర్వాత,తొలిసారి ఎల్ఐసీ కొత్త ప్లాన్..అదేంటో తెలుసా?
హైదరాబాద్: జీవిత బీమా పరిశ్రమలో అదిపెద్ద కంపెనీ అయిన ఎల్ఐసీ కొత్తగా బీమా రత్న పేరుతో ఒక ప్లాన్ను తీసుకొచ్చింది. మే 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీలతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమాతో కూడిన ప్లాన్ అని ఎల్ఐసీ తెలిపింది. ఇందులో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించడం, మనీ బ్యాక్ ప్లాన్, గ్యారంటీడ్ అడిషన్ సదుపాయాలు ఉన్నాయి. 15, 20, 25 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎంపిక చేసుకున్న ప్లాన్ కాల వ్యవధికి నాలుగేళ్లు ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి ప్లాన్ తీసుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లింపుల టర్మ్ ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే పాలసీ ప్లాన్ గడువు ముగిసే చివరి రెండు సంవత్సరాల్లో ఏటా 25 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్ వెనక్కి వస్తుంది. గడువు తీరిన తర్వాత మిగిలిన 50 శాతం సమ్ అష్యూర్డ్ (బీమా)తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ను ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఈ ప్లాన్ను కనీసం రూ.5 లక్షల కవరేజీ, అంతకంటే ఎక్కువకు తీసుకోవచ్చు. పాలసీపై రుణం తీసుకోవచ్చు. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత కాకుండా ఐదేళ్లపాటు తీసుకునే సదుపాయం కూడా ఉంది. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్!
ముంబై: స్టాక్ మార్కెట్లు దూకుడు చూపినప్పటికీ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్లో ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 949కాగా.. బీఎస్ఈలో 9 శాతం(రూ. 82) నష్టంతో రూ. 867 వద్ద లిస్టయ్యింది. ఎన్ఎస్ఈలోనూ రూ. 77 తక్కువగా రూ. 872 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. పాలసీదారులతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఐపీవో ధరలో డిస్కౌంట్ ఇవ్వడంతో రూ. 889, రూ. 904 చొప్పున షేర్లు లభించాయి. ఈ ధరలతో పోల్చినా ఎల్ఐసీ నీరసంగానే లిస్టయ్యింది. కాగా.. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు తొలుత రూ. 920 వద్ద గరిష్టాన్ని తాకగా, తదుపరి రూ. 860 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ ఇంట్రాడేలో రూ. 919–860 మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. చివరికి బీఎస్ఈలో రూ. 875.5 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 873 వద్ద ముగిసింది. వెరసి రోజంతా ఇష్యూ ధర కంటే దిగువనే కదిలింది. ఎన్ఎస్ఈలో 4.87 కోట్లు, బీఎస్ఈలో 27.52 లక్షలు చొప్పున షేర్లు చేతులు మారాయి. ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. టాప్–5లో చోటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఎల్ఐసీ రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పొందింది. దీంతో మార్కెట్ విలువలో టాప్–5 ర్యాంకులో చోటు సాధించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం రూ. 17.12 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రూ. 12.67 లక్షల కోట్లతో టీసీఎస్, రూ. 7.29 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. తదుపరి ఇన్ఫోసిస్ రూ. 6.38 లక్షల కోట్లతో నాలుగో స్థానాన్ని పొందగా.. రూ. 50,000 కోట్లు కోల్పోయిన ఎల్ఐసీ ఐదో ర్యాంకులో నిలిచింది. వెరసి మార్కెట్ విలువలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యూఎల్(రూ. 5.27 లక్షల కోట్లు), ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ(రూ. 4.94 లక్షల కోట్లు), పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(రూ. 4.17 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ(రూ. 3.97 లక్షల కోట్లు)లను ఎల్ఐసీ వెనక్కి నెట్టింది. కొత్త ప్రొడక్టులు జనవరి–మార్చిలో నాన్పార్టిసిపేటింగ్, గ్యారంటీ ప్రొడక్టులను ప్రవేశపెట్టిన ఎల్ఐసీ ఇకపై వీటిని మరింత అధికంగా విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు కుమార్ చెప్పారు. కొన్ని కొత్త ప్రొడక్టులను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రత్యేకంగా డిజిటల్ మార్కెటింగ్ చానల్ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. పాలసీల పంపిణీ కోసం బ్యాంకెస్యూరెన్స్ చానల్పై సైతం దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఎల్ఐసీ 63 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. కొనుగోలు చేయండి... అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగానే ఎల్ఐసీ బలహీనంగా లిస్టయినట్లు దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. మార్కెట్లను ఎవరూ అంచనా వేయలేరని, తగిన విలువ కోసం దీర్ఘకాలం వేచిచూడవలసిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు. డిస్కౌంట్ ద్వారా పాలసీదారులకు, ఇన్వెస్టర్లకు కొంత రక్షణ కల్పించినట్లు తెలియజేశారు. కాగా.. మార్కెట్లు కోలుకుంటే షేరు ధర పుంజుకుంటుందని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐపీవోలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంపాటు షేరు తక్కువ స్థాయిలో నిలిచేందుకు ఎలాంటి కారణమూ కనిపించడంలేదన్నారు. మార్కెట్ విశ్లేషకులు సైతం దీర్ఘకాలానికి ఎల్ఐసీ షేర్లను హోల్డ్ చేయవచ్చని సూచిస్తున్నారు. -
ఐపీవోలో ఎల్ఐసీ రికార్డు!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేర్ల కేటాయింపును చేపట్టింది. ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించగా.. ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. ఈ నెల 17న(మంగళవారం) ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్కానుంది. దీంతో దేశీ క్యాపిటల్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఎల్ఐసీ రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించడం ద్వారా రికార్డు నెలకొల్పిన పేటీఎమ్ రెండో ర్యాంకుకు చేరింది. ఇక 2010లో రూ. 15,500 కోట్ల విలువైన ఐపీవో చేపట్టిన కోల్ ఇండియా, 2008లో రూ. 11,700 కోట్ల ఇష్యూకి వచ్చిన రిలయన్స్ పవర్ తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. చదవండి: ఎల్ఐసీ.. షేర్ల అలాట్మెంట్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం -
ఎల్ఐసీ.. షేర్ల అలాట్మెంట్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పాలసీదారులకు మధ్యంతర ఆర్థిక ప్రయోజనాన్ని అందించాలని, జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ షేర్ల అలాట్మెంట్పై స్టే ఇవ్వాలని కొందరు పిటిషనర్లు చేసిన వాదనలను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపీఓ విషయాలలో ఏటువంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తొలుత పిటిషనర్ పాలసీహోల్డర్ల తరఫు సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ తన వాదనలు వినిపిస్తూ, ఎల్ఐసీ చట్ట సవరణ అమలు పక్రియ మొత్తం ఫైనాన్స్ యాక్ట్– మనీ బిల్ అనే ప్రాతిపదికన జరిగిందని తెలిపారు. ఈ అంశాన్ని 2020లో విస్తృత ధర్మాసనానికి నివేదించడం జరిగిందని తెలిపారు. ఎల్ఐసీ చట్టం, 1956లోని సెక్షన్ 28కి సవరణ ఫలితంగా ‘పరస్పర ప్రయోజన సొసైటీ తరహాలో ఉన్న ఎల్ఐసీ సహజ లక్షణం’ జాయింట్–స్టాక్ కంపెనీగా మారిందని అన్నారు. అంతకుముందు సంస్థలో 95 శాతం మిగులు పాలసీదారులకు వెళ్లగా, ఎల్ఐసీకి ట్రస్టీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఐదు శాతాన్ని తన వద్దే ఉంచుకుందని జైసింగ్ చెప్పారు. ఈ ప్రాతిపదికన తాజా ఐపీఓ వల్ల పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆమె వాదించారు. అంతకుముందు 95 శాతం మిగులు పాలసీదారులకు వెళ్లగా, ఐదు శాతం ఎల్ఐసీకి ట్రస్టీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకుందని జైసింగ్ చెప్పారు. ఎల్ఐసీ చట్టంలోని నిబంధనలకు ఫైనాన్స్ యాక్ట్, 2021 ద్వారా తీసుకువచ్చిన సవరణ ద్వారా ఐపీఓలో పాల్గొనే పాలసీదారుల అర్హత మార్చడం జరిగిందని పేర్కొన్న ఆమె, ఇది రాజ్యాంగ నిబంధనల కిందకు వస్తుందని తెలిపారు. అయితే ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. చదవండి: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్..! -
లైఫ్కి ఇన్సురెన్స్ ఉండాలంతే! గణాంకాలు అదిరిపోతున్నాయ్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలకు కొత్త పాలసీల రూపంలో వచ్చిన ప్రీమియం ఆదాయం (నూతన వ్యాపార ఆదాయం) ఏప్రిల్లో మంచి వృద్ధిని చూసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.17,940 కోట్లకు చేరింది. 24 జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా 2021 ఏప్రిల్లో వసూలు చేసిన నూతన పాలసీల ప్రీమియం రూ.9,739 కోట్లుగా ఉంది. అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీకి నూతన పాలసీల రూపంలో ఏప్రిల్లో రూ.11,716 కోట్లు ప్రీమియం ఆదాయం కింద వచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ.4,857 కోట్లతో పోలిస్తే 141 శాతం వృద్ధి చెందింది. ఈ వివరాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) విడుదల చేసింది. జీవిత బీమా మార్కెట్లో 65.31 శాతం వాటా ఎల్ఐసీ చేతుల్లోనే ఉంది. మిగిలిన 23 ప్రైవేటు బీమా సంస్థల పరిధిలో ఉన్న వాటా 34.69 శాతంగా ఉంది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన జీవిత బీమా కంపెనీలకు ఏప్రిల్ నెలలో కొత్త పాలసీల జారీ ద్వారా వచ్చిన ప్రీమియం ఆదాయం 27% పెరిగి రూ.6,223 కోట్లుగా నమోదైంది. ఎల్ఐసీ తర్వాత ప్రీమియం ఆదాయంలో స్టార్ యూనియన్ దైచీ లైఫ్ 122 శాతం, టాటా ఏఐఏ లైఫ్ 107 శాతం వృద్ధి చూపించాయి. ఏప్రిల్ చివరికి 24 జీవిత బీమా సంస్థల పరిధిలోని మొత్తం పాలసీల సంఖ్య 13,21,098కు చేరింది. ఇందులో ఎల్ఐసీ పాలసీలు 9,13,141గా ఉన్నాయి. చదవండి: ఎల్ఐసీ ఐపీవో సక్సెస్ -
ఎల్ఐసీ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది. ఇతర హైలైట్స్ ► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది. ► బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్కానుంది. ► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్(2021), రూ. 15,500 కోట్లతో కోల్ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్ పవర్(2008) నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఆఫర్ను సక్సెస్ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. -
నేటితో ఎల్ఐసీ ఐపీవో ముగింపు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్ఇన్స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. క్విబ్ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది. 5 కోట్ల మార్క్ తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్ఐసీ నిలిచినట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్ఎన్ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. -
LIC IPO: ఆదివారం బ్రాంచ్లను తెరవడం ఏమిటండీ..!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం ఆదివారం బ్రాంచ్లను తెరవడంపై బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్– ఏఐబీఓసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు సబ్స్క్రిప్షన్ను సులభతరం చేయడానికి ఏఎస్బీఏ (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) అధీకృత శాఖలను ఆదివారం తెరిచివుంచాలనే ఆర్బీఐ నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బ్యాంక్ పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. చాలా దరఖాస్తులు డిజిటల్గా దాఖలవుతాయని పేర్కొంటూ, ఆర్బీఐ నిర్ణయం ఎటువంటి ప్రయోజనాన్ని అందించదని విశ్లేషించింది. ‘‘ఇన్వెస్టర్లు ఐపీఓ సబ్స్క్రిప్షన్కు సంబంధించి విస్తృత స్థాయిలోఆన్లైన్ సౌలభ్యతనే ఎంచుకుంటారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా (ఏఎస్బీఏ) శాఖలు ఫిజికల్గా ఐపీఓకు సంబంధించి ఆదివారం ఒక్క దరఖాస్తును కూడా పొందలేవని మేము భావిస్తున్నాము. అటువంటి పరిస్థితులలో, అన్ని సంబంధిత బ్రాంచీలను తెరిచి ఉంచాలని నిర్ణయం సమంజసం కాదు. ఇది ఒక ప్రహసనం. బ్యాంకులు ఈ తరహా భారీ వ్యయాన్ని భరించలేవు‘ అని ఏఐబీఓసీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.100 కోట్ల వ్యయం! ఇలాంటి నిర్ణయాలు సహజంగానే పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచే బ్యాంకుల అధికారులకు అసంతృప్తిని కలిగిస్తాయని ఏఐబీఓసీ వివరించింది. బ్యాంక్ శాఖలను సెలవు దినాల్లో పని చేయమని కోరడానికి దీపమ్ (పెట్టుబడి మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం) చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, దీనివల్ల ఒనగూడే ప్రయోజనాలపై ఆర్బీఐ తగిన విధంగా అంచనా వేయలేకపోయిందని విమర్శించింది. ఈ నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోదని పేర్కొన బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్, దీనివల్ల బ్యాంకింగ్పై వ్యయ భారం (సెలవు రోజున ఉద్యోగులకు పరిహారం, ఇతర నిర్వహణా వ్యయలుసహా) రూ.100 కోట్ల వరకూ ఉంటుందని విశ్లేషించింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఆర్బీఐ ఈ అంశంపై సమీక్షించాలని, ఆదివారం బ్రాంచ్లను ప్రారంభించాలనే నిర్ణయాన్ని రీకాల్ చేయాలని యూనియన్ పేర్కొంది. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఏఎస్బీఏ అధీకృత అన్ని శాఖలు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్బీఐ బ్యాంకులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ఐపీఓ బిడ్డింగ్ 4న ప్రారంభమైంది. 9న ముగుస్తుంది. శని (మే 7), ఆది వారాల్లో (మే 8) కూడా బిడ్డింగ్కు అవకాశం ఉంది. చదవండి: ఎల్ఐసీ ఐపీవో.. వీకెండ్లోనూ ఛాన్స్! -
ఎల్ఐసీలో షేర్లు కావాలా? అయితే త్వరపడండి
న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఐపీవోకి వస్తున్న స్పందనను చూసి శని, ఆదివారాలు సైతం రిటైలర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సేంజీలు, ఆర్బీఐ అనుమతించాయి. ఐపీవో దరఖాస్తుకు వీలుగా బ్యాంకుల అస్బా (ఏఎస్బీఏ) బ్రాంచీలు పనిచేయనున్నాయి. ఐపీవో ధరలో ఎల్ఐసీ పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైలర్లకు రూ. 45 చొప్పున రాయితీని ప్రకటించిన విషయం విదితమే. ఇష్యూ ద్వారా 3.5 శాతం వాటాను విక్రయిస్తున్న ప్రభుత్వం రూ. 20,600 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. 1:4 నిష్పత్తిలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మూడో రోజు శుక్రవారాని(6)కల్లా పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ దాదాపు 16.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 22.37 కోట్ల షేర్లవరకూ బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.4 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 902–949 ధరలో చేపట్టిన ఇష్యూ సోమవారం(9న) ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.23 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. అంటే 6.9 కోట్ల షేర్లకుగాను 8.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక పాలసీదారుల నుంచి 4 రెట్లు, ఉద్యోగుల నుంచి 3 రెట్లు అధికంగా స్పందన లభించింది. అయితే క్విబ్ విభాగంలో 76 శాతం, నాన్ఇన్స్టిట్యూషనల్ కోటాలో 56% చొప్పున మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. చదవండి: ఐపీవో.. సరికొత్త రికార్డ్కు తెరతీయనున్న ఎల్ఐసీ! -
ఐపీవో.. సరికొత్త రికార్డ్కు తెరతీయనున్న ఎల్ఐసీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి పాలసీదారులు మద్దతిస్తున్నారు. ఇష్యూ తొలి రోజు(బుధవారం) పాలసీదారుల విభాగంలో 1.9 రెట్లు అధిక స్పందన లభించింది. ఇక ఉద్యోగుల కోటా సైతం పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినట్లు బీఎస్ఈ గణాంకాలు పేర్కొన్నాయి. క్విబ్ విభాగంలో 27 శాతం, నాన్ఇన్స్టిట్యూషనల్ కోటాలో 33 శాతం చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 60 శాతం దరఖాస్తులు లభించినట్లు తెలుస్తోంది. యాంకర్ విభాగాన్ని మినహాయించి దాదాపు 16.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 10.86 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి తొలి రోజు మొత్తం 67 శాతం బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్ఛేంజీల గణాంకాలు వెల్లడించాయి. రాయితీ ధరలో.. ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా షేరుకి రూ. 902–949 ధరలో ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ నెల 9న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60 డిస్కౌంట్ ప్రకటించగా.. ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,627 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపగా.. రూ. 949 ధరలో దాదాపు 5.93 కోట్ల షేర్లను జారీ చేయనుంది. ఇష్యూ తదుపరి ఎల్ఐసీ 17న స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్కానుంది. ఇప్పటివరకూ రూ. 18,300 కోట్ల ఇష్యూ(2021)తో పేటీఎమ్, రూ. 15,500 కోట్ల సమీకరణ(2010)తో కోల్ ఇండియా, రూ. 11,700 కోట్ల(2008)తో రిలయన్స్ పవర్.. అతిపెద్ద ఐపీవోలుగా తొలి మూడు ర్యాంకుల్లో నిలుస్తున్నాయి. తాజా ఇష్యూ ద్వారా ఎల్ఐసీ సరికొత్త రికార్డుకు తెరతీయనుంది. ఆదివారం సైతం బుధవారం(4న) ప్రారంభమైన ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ తాజా చర్యలు తీసుకుంది. వారాంతాన అంటే ఆదివారం(8న) ఏఎస్బీఏ సంబంధిత బ్యాంకు బ్రాంచీలు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. దీంతో పబ్లిక్కు 8న సైతం బిడ్డింగ్కు వీలు కల్పించింది. చదవండి👉ఎల్ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్ ఇన్వెస్టర్లు! -
నేడే ఎల్ఐసీ ఐపీవో ..స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 56946 పాయింట్లు, నిఫ్టీ 14పాయింట్లు నష్టపోయి 17054 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక బ్రిటానియా,ఎన్టీపీసీ,ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, ఇన్ఫోసిస్,టాటా స్టీల్, బీపీసీఎల్, విప్రో, టాటామోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, కిప్లా, ఎంఅండ్ ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీవో రానే వచ్చింది. నేటి నుంచే ఐపీఓకు ధరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుండగా.. పాలసీ దార్లు, ఇన్వెస్టర్లు ఐపీవో ధరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు. -
ఐడీబీఐలో కొంత వాటాకు ఓకే..బ్యాంకెస్యూరెన్స్ కోసం ఎల్ఐసీ యోచన!
న్యూఢిల్లీ: బ్యాంకెస్యూరెన్స్ చానల్తో లబ్ది పొందేందుకు వీలుగా ఐడీబీఐ బ్యాంకులో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా బ్యాంకులో ప్రభుత్వంసహా ఎల్ఐసీ వాటా విక్రయించే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ ఈ నెల 4న ప్రారంభంకానున్న సొంత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన రోడ్షోల నిర్వహణలో ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బ్యాంకులోగల 45 శాతం వాటా విక్రయ ప్రణాళికల్లో ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, ఎంతమేర వాటాను విక్రయించేదీ ఎల్ఐసీ రోడ్షోల తదుపరి నిర్ణయించనున్నట్లు గత వారం దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. కాగా.. 2019 జనవరి 21నుంచి ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థగా మారిన విషయం విదితమే. ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. బ్యాంక్ బ్రాంచీల నెట్వర్క్, కస్టమర్ల ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్టుల విక్రయానికి బ్యాంకెస్యూరెన్స్ దోహదపడుతుంది. దీంతో ఎల్ఐసీ బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు కుమార్ తెలియజేశారు. -
ఎల్ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్ ఇన్వెస్టర్లు!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. తద్వారా రూ. 21,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 5.92 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటి విలువ రూ. 5,620 కోట్లు కాగా.. సోమవారం(2న) ఈ విభాగంలో రూ. 7,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా సావరిన్ వెల్త్ఫండ్స్, దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 20 యాంకర్ సంస్థలు ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. షేరుకి రూ.902–949 ధరలో చేపట్టిన ఇష్యూ బుధవారం(4న) ప్రారంభమై సోమవారం(9న) ముగియనుంది. అతిపెద్ద ఇష్యూ..: రూ. 21,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీయంగా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఇప్పటివరకూ భారీ ఐపీవోగా నిలుస్తోంది. 2010లో రూ. 15,200 కోట్ల సమీకరణతో లిస్టింగ్ సాధించిన పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి ర్యాంకును సాధించింది. కాగా.. తాజా ఐపీవోలో ఎల్ఐసీ పాలసీదారులకు 2,21,37,492 షేర్లు, ఉద్యోగులకు 15,81,249 షేర్లు విక్రయించనుంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఈ నెల 17న ఎల్ఐసీ లిస్ట్కానుంది. చదవండి👉ఎల్ఐసీ షేరు ధర ఆకర్షణీయం... -
ఎల్ఐసీ షేరు ధర ఆకర్షణీయం...
న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఐపీవో ధర ఎంతో ఆక్షణీయంగా ఉన్నట్టు ఆ సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ అన్నారు. కంపెనీ వృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇన్వెస్టర్లు రానున్న సంవత్సరాల్లో రాబడులను ఆశించొచ్చని అభిప్రాయపడ్డారు. ఎంబెడెడ్ వ్యాల్యూ కంటే.. నూతన వ్యాపార విలువ (వీఎన్బీ) రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూడాలని సూచించారు. భవిష్యత్తులో ఇది 12–13 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇది 9 శాతంగా ఉంది. ఐపీవోలో ఇన్వెస్టర్లు పాల్గొనడం ద్వారా లాభాలకు ఏమైనా అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కుమార్ స్పందించారు. ‘‘ఇది మార్కెట్ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఎల్ఐసీ తక్కువ వీఎన్బీతో ఆరంభమవుతోంది. కనుక వృద్ధికి అవకాశాలున్నాయి’’అని చెప్పారు. కొత్త పాలసీలపై భవిష్యత్తులో ఆర్జించే రాబడులకు సంబంధించి ప్రస్తుత విలువే వీఎన్బీగా పేర్కొంటారు. ఎల్ఐసీ 1.11 రెట్ల ఎంబెడెడ్ వ్యాల్యూతో ఐపీవోకు వస్తోంది. గతంలో ప్రభుత్వరంగ బీమా సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ ఆర్ఈ ఇన్వెస్టర్లకు రాబడులు ఇవ్వని అంశాన్ని ప్రస్తావించగా.. అవి భిన్నమైన వ్యాపారంలో ఉన్నాయని, అక్కడ లాభాల మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని కుమార్ బదులిచ్చారు. మే 17న లిస్టింగ్ ఎల్ఐసీ ఐపీవో ధరను ఒక్కో షేరుకు రూ.902–949గా నిర్ణయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటాను (22.13 కోట్ల షేర్లను) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయిస్తోంది. మే 4న ఐపీవో ప్రారంభమై 9న ముగియనుంది. మే 17న స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ కానుంది. ఐపీవో రూపంలో కేంద్రానికి రూ.21,000 కోట్లు సమకూరనున్నాయి. రూ.40 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో (ఏయూఎం) ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా కొనసాగుతోంది. 25 యాంకర్ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు 25 మంది యాంకర్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఇందులో దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నట్టు లీడ్ మేనేజర్ వర్గాలు తెలిపాయి. మే 2న యాంకర్ బుక్ ప్రారంభం కానుంది. మొత్తం ఇష్యూలో క్యూఐపీలకు 50 శాతం కోటా కేటాయించగా.. ఇందులో 30 శాతాన్ని యాంకర్ ఇన్వెస్టర్లకు పక్కన పెట్టనున్నారు. ప్రభుత్వ హామీ కొనసాగుతుంది ఐపీవో తర్వాత కూడా ఎల్ఐసీ పాలసీలకు సంబంధించి ప్రభుత్వ హామీ సెక్షన్ 37 కింద కొనసాగుతుందని సంస్థ ఎండీ సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా 51 శాతానికంటే దిగువకు పడిపోదని చెప్పారు. కనీస పబ్లిక్ వాటా నిబంధన సడలింపు కనీస ప్రజల వాటా నిబంధన నుంచి ఎల్ఐసీ ఐపీవోకు సడలింపు ఇవ్వాలని సెబీతో ఆర్థిక శాఖ చర్చలు నిర్వహిస్తోందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ఈ సమయంలో ఎల్ఐసీలో 5 శాతం వాటాలను కూడా మార్కెట్ సర్దుబాటు చేసుకునే పరిస్థితిలో లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. లిస్ట్ అయిన ఏడాదిలోపు ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను తగ్గించుకోబోదని పాండే స్పష్టం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కంపెనీలు ఐపీవోలో కనీసం 5 శాతానికి తక్కువ కాకుండా విక్రయించడానికి లేదు. అలాగే, లిస్ట్ అయిన ఐదేళ్లలోపు కంపెనీలో ప్రజల వాటా కనీసం 25 శాతానికి తక్కువ ఉండకూడదు. ఐపీవోలో రూ.5లక్షలకు పేటీఎం అనుమతి పేటీఎం మనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీవోలో యూపీ ఐ ద్వారా రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ తెలిపారు. ఇన్వెస్టర్లు పేటీఎం మనీ యాప్ హోమ్ పేజీలో ఐపీవో సెక్షన్కు వెళ్లాలి. అక్కడ ఇన్వెస్టర్ కేటగిరీని ఎంచుకుని బిడ్ను దాఖలు చేసుకోవచ్చు. రూ.5లక్షల వరకు బిడ్ వేయాలనుకుంటే హెచ్ఎన్ఐ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. చదవండి: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్..! -
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. -
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్..!
ఎట్టకేలకు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే నెల(మే) 4న ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేరు ధరలో డిస్కౌంట్ ప్రకటించింది. న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎల్ఐసీ లిస్టింగ్ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా తొలుత అనుకున్న 5 శాతం వాటాస్థానే 3.5 శాతాన్నే విక్రయించేందుకు నిర్ణయించింది. వెరసి 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 21,000 కోట్లు లభించగలవని ఆశిస్తోంది. కాగా.. ఎల్ఐసీ పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటిని రూ. 60 డిస్కౌంట్ ధరలో విక్రయించనుంది. 15 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటితోపాటు రిటైలర్లకు రూ. 40 డిస్కౌంట్ ధరలో షేర్లను జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2న షేర్ల జారీ ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం మే 2న షేర్ల జారీని చేపట్టనుంది. పాలసీదారులు, వాటాదారులకు రిజర్వ్ చేయగా మిగిలిన వాటాలో 50 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనుంది. క్విబ్లో 60 శాతం వరకూ యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం తొలుత 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగానే సెబీ నుంచి ఆమోదముద్ర పొందింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఫలితంగా 3.5 శాతం వాటా విక్రయానికే ఆఫర్ను పరిమితం చేస్తూ తాజా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కనీసం 5 శాతం ఎల్ఐసీ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ప్రభుత్వం మదింపు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం రూ. లక్ష కోట్ల విలువగల కంపెనీ ఐపీవోకు వస్తే కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వం 5 శాతం వాటా ఆఫర్ నిబంధనల నుంచి ఎల్ఐసీకి మినహాయింపులను కోరింది. చదవండి: ఎల్ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు! -
ఎల్ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల(మే) 4న ప్రారంభమయ్యే అవకాశముంది. ముందుగా వేసిన ప్రణాళికలు సవరిస్తూ తాజాగా దాఖలు చేసిన 3.5 శాతం ప్రభుత్వ వాటా విక్రయ ప్రాస్పెక్టస్కు సెబీ ఆమోదముద్ర వేసింది. దీంతో యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ప్రభుత్వం 5 శాతం వాటాను ఆఫర్ చేయాలని భావించిన సంగతి తెలిసిందే. వెరసి 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 6 లక్షల కోట్ల విలువను ఆశిస్తోంది. ఇష్యూ మే 9న ముగియనున్నట్లు అంచనా. చదవండి: చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్మస్క్ - నితిన్ గడ్కారీ -
కేంద్రం కీలక నిర్ణయం, అప్పుడే ఎల్ఐసీ ఐపీవో!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల(మే) 4న ప్రారంభమయ్యే అవకాశముంది. ముందుగా వేసిన ప్రణాళికలు సవరిస్తూ తాజాగా దాఖలు చేసిన 3.5 శాతం ప్రభుత్వ వాటా విక్రయ ప్రాస్పెక్టస్కు సెబీ ఆమోదముద్ర వేసింది. దీంతో యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ప్రభుత్వం 5 శాతం వాటాను ఆఫర్ చేయాలని భావించిన సంగతి తెలిసిందే. వెరసి 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ప్రభుత్వం ఎల్ఐసీకి రూ. 6 లక్షల కోట్ల విలువను ఆశిస్తోంది. ఇష్యూ మే 9న ముగియనున్నట్లు అంచనా. -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్మెంబర్మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్మెంబర్మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
ఎల్ఐసీ ఐపీవో.. ఈ వారంలో కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే అంశంపై ఈ వారంలో ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే వీలున్నట్లు తెలుస్తోంది. మార్చి ముగిసేలోగా ఐపీవో పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో వాయిదా పడింది. ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే యోచనలో ఉంది. తద్వారా బీమా దిగ్గజాన్ని స్టాక్ ఎక్ఛేంజీలో లిస్ట్ చేయాలని ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇష్యూకి మే 12వరకూ గడువు ఉంది. దీంతో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేయవలసిన అవసరంలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇష్యూని చేపట్టే అంశం క్లిష్టంగా మారినట్లు తెలియజేశారు. రిటైల్, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల డిమాండు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎఫ్పీఐలు తిరిగి పెట్టుబడుల బాటలోకి మళ్లేవరకూ వేచిచూసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
నూతన ప్రీమియం ఆదాయం రూ.3.14 లక్షల కోట్లు ..ఎల్ఐసీ ఆదాయం ఎంతంటే..?
న్యూఢిల్లీ: అన్ని జీవిత బీమా సంస్థలకు సంబంధించి నూతన ప్రీమియం ఆదాయం 2021–22లో 13 శాతం వృద్ధితో రూ.3,14,263 కోట్లకు దూసుకుపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 24 జీవిత బీమా కంపెనీల ఉమ్మడి ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో) ఆదాయం రూ.2,78,278 కోట్లుగా ఉన్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎల్ఐసీ నూతన బిజినెస్ ప్రీమియం 8 శాతం వృద్ధితో రూ.1,98,760 కోట్లుగా నమోదైంది. అంతకుందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,84,174 కోట్లుగా ఉండడం గమనార్హం. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.1,15,503 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.94,103 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగింది. చదవండి: 2021–22లో 1.67 లక్షల కొత్త కంపెనీలు...ఆ రాష్టంలోనే అధికం..! -
ఎల్ఐసీలో ఎఫ్డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! ఇదే చివరి అవకాశం..!
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! కోవిడ్తో పాటు ఆర్ధిక కారణాలతో కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) పాలసీదారులకు కల్పించిన విషయం తెలిసిందే. మార్చి 25, 2022తో పాలసీల పునరుద్దరణ గడువు ముగియనుంది. కొంత ఆలస్య రుసుము చెల్లించడంతో ఆగిపోయిన పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పించింది. పాలసీ రివైవల్ క్యాంపెయిన్లో భాగంగా.. నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్, పాలసీ టర్మ్ పూర్తికాని పాలసీలను పునరుద్ధరించవచ్చును.వీటికి కొత్త ఆలస్య రుసుములో కూడా రాయితీను అందిస్తోంది ఎల్ఐసీ. అర్హతగల పాలసీలకు ఆలస్య రుసుములో రాయితీలు ఇలా ఉన్నాయి. రూ. 1,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ- 20%, గరిష్ట రాయితీ- రూ. 2000. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 వరకు- ఆలస్య రుసుములో రాయితీ 25%, గరిష్ట రాయితీ- రూ.2,500. రూ. 3,00,001 అంతకంటే ఎక్కువ పాలసీలపై- ఆలస్య రుసుములో రాయితీ 30%, గరిష్ట రాయితీ రూ. 3000. చదవండి: ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
ఎల్ఐసీ ప్రాస్పెక్టస్లో క్యూ3 ఫలితాలు అప్డేట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను తాజా క్యూ3 ఫలితాలతో అప్డేట్ చేసింది. సదరు పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నిబంధనల ప్రకారం డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో అప్డేట్ చేసిన ప్రాస్పెక్టస్ను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ. 235 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో నమోదైన రూ. 7.08 కోట్లతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో లాభం రూ. 1,672 కోట్లకు పెరిగింది. ప్రతిపాదిత ఐపీవో కింద 5 శాతం వాటాల (31.6 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా సుమారు రూ. 60,000 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 78,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మిగతా మొత్తాన్ని ఎల్ఐసీ ఐపీవో ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం మార్చిలోనే పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేసుకున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెబీకి కొత్తగా మరోసారి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకున్న అనుమతులతో పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ప్రభుత్వానికి మే 12 వరకూ గడువు ఉంది. అతి పెద్ద ఐపీవో..: అంతా సజావుగా జరిగితే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే ఎల్ఐసీ మార్కెట్ విలువ.. రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలను కూడా మించిపోనుంది. ఇప్పటిదాకా అత్యంత భారీ ఐపీవో రికార్డు.. పేటీఎం పేరిట ఉంది. 2021లో పేటీఎం రూ. 18,300 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి. -
ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
పాలసీ దారులకు ఎల్ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసీ కోరింది. కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి. Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD — LIC India Forever (@LICIndiaForever) February 7, 2022 నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది. రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం ఎల్ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
నోటిఫికేషన్ కూడా వచ్చేసింది..ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తాజాగా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకూ ఎల్ఐసీలో ఎఫ్డీఐలను అనుమతిస్తూ నోటిఫై చేసింది. గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఎల్ఐసీ డిజిన్వెస్ట్మెంట్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
మే 12వరకూ ఎల్ఐసీకి గడువు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మే 12వరకూ గడువున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఆలోగా కంపెనీ ఐపీవోకు మరోసారి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందవలసిన అవసరంలేదని తెలియజేశారు. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. ఇందుకు అనుగుణంగా ధరల శ్రేణి, ఆఫర్ చేయనున్న ఈక్విటీ వివరాలు తదితరాలతో ఆర్హెచ్పీని దాఖలు చేయవలసి ఉంది. నిజానికి మార్చిలోగా ఎల్ఐసీని లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం తొలుత ప్రణాళికలు వేసింది. అయితే రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇటీవల స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. -
ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్హెచ్పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి. 5 శాతం వాటా: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్(డీఆర్హెచ్పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో ఆర్హెచ్పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. -
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పూర్తి వాటా... ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి. -
మోదీ సర్కార్ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి పెట్టుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం విఫలమయ్యే అవకాశముంది. వెరసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 తదుపరి రెండోసారి టార్గెట్ను అందుకోవడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.60,000 కోట్లకుపైగా సమకూర్చుకోవాలని తొలుత భావించింది. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ పెంపు ఆందోళనలు మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఈ మార్చిలోగా ఎల్ఐసీ లిస్టింగ్ సాధ్యపడకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ.75,000 కోట్లను అందుకోవడంలో ప్రభుత్వం మళ్లీ మిస్ అయ్యే అవకాశముంది. ఇంతక్రితం 2019–20లో సీపీఎస్ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం రూ.65,000 కోట్ల సమీకరణను ఆశించగా.. రూ.50,304 కోట్లతో సరిపుచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.12,400 కోట్లు మాత్రమే సమీకరించింది. దీంతో ఈసారి డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం భారీగా వెనకబడే అవకాశముంది. ఇక 2015–16లో సవరించిన అంచనాలు రూ.25,313 కోట్లుకాగా.. రూ.42,132 కోట్లను సమకూర్చుకుంది. ఇదేవిధంగా 2017–18లోనూ ప్రభుత్వం రూ. లక్ష కోట్లను సాధించడం ద్వారా సవరించిన అంచనాలను దాదాపు అందుకోవడం గమనార్హం! చదవండి: ఎల్ఐసీ ఐపీవో వాయిదా! -
ఎల్ఐసీ ఐపీవో వాయిదా!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఎల్ఐసీ వాటా విక్రయ అంశాన్ని పునఃపరిశీలించే వీలున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనే చేపట్టేందుకు కట్టుబడితే.. ఇది ప్రగతిశీల విషయమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ‘2022 ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా’పై నిర్వహించిన ఏడో జాతీయ సదస్సులో భాగంగా పాండే ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాదికి సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించే బాటలో ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
ఎల్ఐసీ ఐపీవోపై యుద్ధం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: వారం రోజులుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ముడిచమురు, బంగారం ధరలకు రెక్కలురాగా.. డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల బాటలో దేశీయంగానూ ఇండెక్సులు భారీ ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్ను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి గరిష్ట విలువ లభించేందుకు అనువైన పరిస్థితులున్నప్పుడు మాత్రమే ఐపీవోకు వెళ్లడం ఉచితమని భావిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎల్ఐసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీవో దిశగా దూసుకెళ్తున్న బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీలో ఆటోమేటిక్ రూట్లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లకు కేంద్ర మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపిందని సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ బీమా సంస్థలో వాటాను పాక్షికంగా విక్రయించడం, తాజా ఈక్విటీ మూలధనాన్ని పెంచడం ద్వారా ఐపీవోతో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లను లిస్టింగ్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్కు వేదికగా నిలిచిన ఎల్ఐసీ 5 శాతం వాటాను (31.6 కోట్లకుపైగా షేర్లు) రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో మార్చిలో ప్రారంభం కానుంది. సంస్థ ఉద్యోగులు, పాలసీదార్లకు ఫ్లోర్ ప్రైస్పై తగ్గింపు లభిస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అతి పెద్దదిగా నిలవనుంది. లిస్టింగ్ పూర్తి అయితే సంస్థ మార్కెట్ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్ర శ్రేణి కంపెనీలతో పోల్చవచ్చు. చదవండి: చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!
దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది. అయితే, ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ గతంలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. (చదవండి: అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్తో అమెజాన్ సేల్!) -
ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టండి
ముంబై: దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో పలు సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ భేటీలో ఆర్థిక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ‘ఎఫ్ఎస్డీసీ లక్ష్యాలు, దేశ విదేశ పరిణామాలతో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై కౌన్సిల్ చర్చించింది. అలాగే ఎకానమీలో పరిస్థితులు, కీలక ఆర్థిక సంస్థల పనితీరుపై అన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ (సెబీ) చైర్మన్ అజయ్ త్యాగి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్, ఆర్థిక విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2022–23 బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అత్యున్నత స్థాయి మండలి సమావేశం కావడం ఇదే ప్రథమం. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఇది భేటీ అయ్యింది. ఆర్థిక స్థిరత్వ నిర్వహణకు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం.. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్.. విలేకరులకు తెలిపారు. దీని గురించి పూర్తిగా సమాచారం తనకు వచ్చే వరకూ, ఈ విషయంలో విధించిన జరిమానాలు, తీసుకున్న దిద్దుబాటు చర్యలు మొదలైనవి సరైన స్థాయిలోనే ఉన్నాయా అన్న అంశంపై తాను స్పందించలేనన్నారు. ఎల్ఐసీ ఇష్యూపై మార్కెట్లో ఆసక్తి.. ప్రతిపాదిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూపై మార్కెట్ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో పూర్తి కాగలదని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. మార్చిలోనే లిస్ట్ చేయాలని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పిన నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మార్చిలో లిస్టింగ్కు సన్నాహాలు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మార్చిలో లిస్టింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ తాజాగా పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆరి్థక సంవత్సరం(2021–22) ముగిసేలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్పై రష్యా దాడిచేయనున్న అంచనాలతో అమెరికా అప్రమత్తమైన నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశి్చత పరిస్థితులు తలెత్తడంతో స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. మరోపక్క యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపులో సాగనున్న సంకేతాలు ఇస్తోంది. దీంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–18 మధ్య నికరంగా రూ. 18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి వరుసగా ఐదో నెలలోనూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న ట్లు కుమార్ తాజాగా పేర్కొన్నారు. కాగా.. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 63,000 కోట్ల సమీకరణతో సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. వీళ్లకూ డిస్కౌంట్..: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన(పీఎంజేజేబీవై) సబ్్రస్కయిబర్లకు సైతం ఎల్ఐసీ ఐపీవో ధరలో డిస్కౌంటును అందించనున్నట్లు కుమార్ వెల్లడించారు. పాలసీదారులకు ఇస్తున్నట్లే వీరికీ తగ్గింపును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన పీఎంజేజేబీవై పొదుపు ఖాతా కలిగిన 18–50 ఏళ్ల వయసులోపు వారికి రూ. 330 వార్షిక ప్రీమి యంతో రూ. 2 లక్షల బీమా కవరేజీ అందిస్తోంది. ఎల్ఐసీ.. ద లీడర్ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ ప్రభుత్వ రుణ సాధనాలలో అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా నిలుస్తున్నట్లు స్వీస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ తాజాగా పేర్కొంది. మొత్తం జీసెక్యూరిటీస్లో 19 శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీలలోనూ అతిపెద్ద వాటాదారు, ఫండ్ మేనేజర్గానూ నిలుస్తున్నట్లు తెలియజేసింది. 520 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదికలో యూబీఎస్ పేర్కొంది. మొత్తం ఈక్విటీలలో 4 శాతం వాటాతో ప్రభుత్వం(ప్రమోటర్) తదుపరి ఒకేఒక అతిపెద్ద వాటాదారుగా రికార్డును నెలకొలి్పనట్లు వివరించింది. 2021 డిసెంబర్కల్లా బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్లో 10 శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీలలో 5 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంది. వీటితోపాటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్బీఐలో 4 శాతం వాటా ఉంది. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీలోనూ 4 శాతం వాటాను పొందింది. ప్రతిఏటా కుటుంబ పొదుపు రూ. 100లో రూ. 10 వరకూ ఎల్ఐసీకి చేరుతున్నట్లు తెలియజేసింది. -
ఐడీబీఐ బ్యాంక్లో కొనసాగుతాం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా అనుబంధ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమంటూ స్పష్టం చేసింది. బ్యాంక్ఎస్యూరెన్స్ చానల్ ద్వారా లబ్ది పొందేందుకు వీలుగా కొంతమేర వాటాతో కొనసాగనున్నట్లు తెలియజేసింది. అదనపు వాటాను కొనుగోలు చేయడంతో ఎల్ఐసీకి 2019 జనవరి 21 నుంచి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా ఎల్ఐసీ 49.24 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో 2020 డిసెంబర్ 19న బ్యాంకు సహచర సంస్థగా వ్యవహరిస్తోంది. కాగా.. బ్యాంక్ఎస్యూరెన్స్లో భాగంగా ఎల్ఐసీ బ్యాంకు కస్టమర్లకు సంస్థ బ్రాంచీల ద్వారా బీమా ప్రొడక్టులను విక్రయించగలుగుతోంది. ఇది కంపెనీకి దన్నునిస్తుండటంతో ఐపీవో తదుపరి కూడా బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. నిజానికి వ్యూహాత్మకంగానే బ్యాంకులో వాటాను చేజిక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రెండు సంస్థలకూ ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు. బ్యాంక్ఎస్యూరెన్స్లో భాగంగా కంపెనీ విభిన్న బ్యాంకులకు చెందిన 58,000 బ్రాంచీలతో పంపిణీ ఒప్పందాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దారిలో మరింత భారీ వృద్ధికి అవకాశమున్నట్లు వివరించారు. ఎన్ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంకు షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 46 వద్ద ముగిసింది. -
LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!
LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. (చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!) -
చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విద్యా, ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలను మనలో చాలా మంది తీసుకుంటుంటాం. సమయానికి ఆయా పాలసీ ప్రీమియం చెల్లిస్తే ఫైన్ల నుంచీ తప్పించుకొనే అవకాశం ఉంది. ఒక వేళ సదరు పాలసీ ప్రీమియంను చేతిలో డబ్బులు లేక చెల్లించకపోతే ఆ పాలసీకి కాస్త బ్రేక్స్ పడే అకాశాలున్నాయి. ఐతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) పాలసీని కలిగి ఉన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ జీవిత బీమా పాలసీ ప్రీమియంను చెల్లించడానికి తమ ఈపీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. టాక్స్, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఈపీఎఫ్ఓ సభ్యుడు కనీసం రెండు సంవత్సరాల LIC పాలసీ ప్రీమియం వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే, LIC ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాలోని తన డబ్బును ఉపయోగించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆర్థిక ఒత్తిడిలో ఉన్న ఈపీఎఫ్ఓ చందాదారులు ఈపీఎఫ్ ఖాతా నుంచి పాలసీ పునరుద్ధరణ చెల్లింపుతో వారి LIC పాలసీని కొనసాగించవచ్చును. ఈపీఎఫ్ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించడానికి, సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ వద్ద ఫారమ్ 14ను సమర్పించాలి. అయితే, దీన్ని సమర్పించేటప్పుడు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఫారమ్ 14, సమర్పణ సమయంలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ కనీసం రెండు సంవత్సరాల LIC ప్రీమియం మొత్తంలో ఉండేలా చూసుకోవాలి ఎల్ఐసీ ప్రీమియం పునరుద్ధరణ నిబంధనల ప్రకారం, ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన కూడా ఆయా పాలసీని పునరుద్ధరించడానికి LIC అనుమతిస్తుంది. పాలసీ పునరుద్ధరణ తేదీ నుంచి 6 నెలల తర్వాత పాలసీ పునరుద్ధరణపై ఎటువంటి ఆలస్య రుసుము విధించబడదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పాలసీ పునరుద్ధరణ తేదీ తర్వాత LIC పాలసీని పునరుద్ధరించినప్పుడు, పాలసీ ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. కాగా ప్రీమియం చెల్లింపు కోసం ఈపీఎఫ్ డబ్బును కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి.