
హైక్ ఉచిత గ్రూప్ కాలింగ్
హైక్ మెసెంజర్ వినియోగదారులకు ఉచిత గ్రూప్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది...
న్యూఢిల్లీ: హైక్ మెసెంజర్ వినియోగదారులకు ఉచిత గ్రూప్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో 4జీ లేక వై-ఫై నెట్వర్క్ను ఉపయోగించే వారికి మాత్రమే ఈ ఉచిత గ్రూప్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఓఎస్, విండోస్ ఫోన్లకు కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఉచిత గ్రూప్ కాలింగ్లో ఒకే కాల్తో 100 మంది వరకు కనెక్ట్ కావచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో కవిన్ మిట్టల్ తెలిపారు.