డిజిటల్‌ రంగం @రూ.20,000 కోట్లు | Higher budgets not enough to meet cyber security needs: EY Survey | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ రంగం @రూ.20,000 కోట్లు

Published Fri, Jan 13 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

డిజిటల్‌ రంగం @రూ.20,000 కోట్లు

డిజిటల్‌ రంగం @రూ.20,000 కోట్లు

ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక
ముంబై: భారత డిజిటల్‌ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని ఎర్నస్ట్‌ యంగ్‌ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.8,490 కోట్లుగా ఉన్న ఈ రంగం 2020 నాటికి రూ.20,000 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. డిజిటల్‌ అడ్వర్జైజింగ్, ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ  నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...,

మొబైల్‌ ఫోన్ల వాడకం విస్తృతంగా పెరిగిపోతుండటంతో, సంప్రదాయ ఇంటర్నెట్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసులు ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, భారత డిజిటల్‌ మీడియా మార్కెట్‌లో అవకాశాలు అపారంగా ఉండనున్నాయి.
ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2020 నాటికి వీరి సంఖ్య 74.6 కోట్లకు పెరుగుతుంది.
భారీ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తారు.
ఓటీటీ, డిజిటల్‌ అడ్వర్టైజింగ్, వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, మ్యూజిక్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, గేమింగ్‌– ఈ రంగాల నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది.
2015లో 31%గా ఉన్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం 2020 కల్లా 59%కి పెరుగుతుంది.
డిజిటల్‌ ప్రకటనల వ్యయం 2020 కల్లా రూ.18,500 కోట్లకు చేరుతుంది.
భారత్‌లో 2020 కల్లా ఆన్‌లైన్‌ వీడియో వీక్షకుల సంఖ్య 45 కోట్లకు పెరుగుతుంది. ఆన్‌లైన్‌ వీడియో వీక్షకుల పరంగా రెండో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్‌ అవతరిస్తుంది. మొదటి స్థానంలో చైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement