వీడని సంక్షోభం : క్షీణించిన విక్రయాలు | India passenger cars sales dip 57.98 pc in June: SIAM | Sakshi
Sakshi News home page

వీడని సంక్షోభం : క్షీణించిన విక్రయాలు

Jul 14 2020 2:22 PM | Updated on Jul 14 2020 2:31 PM

India passenger cars sales dip 57.98 pc in June: SIAM - Sakshi

సాక్షి, ముంబై: కరోనా సంక్షోభం నుంచి ఆటో కంపెనీలు ఇంకా బయట పడినట్టు లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌ మాసంలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. పరిశ్రమ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. 

జూన్ 2019 తో పోల్చితే జూన్ 2020 లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 57.98 క్షీణత నమోదైందని  సియామ్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. జూన్ 2019 తో పోలిస్తే జూన్ 2020లో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 31.16 శాతం తగ్గాయని తెలిపింది. జూన్ 2019తో పోల్చితే జూన్ 2020లో వ్యాన్ల అమ్మకాలు 62.06 శాతం తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు కూడా 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్లను అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే నెలలో 5,12,626 యూనిట్లుగా ఉన్నాయి.  సియామ్ తాజా గణాంకాల ప్రకారం జూన్ 2020 లో ద్విచక్ర వాహనాలు,  త్రీ వీలర్ల అమ్మకాలు వరుసగా 38.56 శాతం, 80.15శాతం తగ్గాయి. జూన్ 2019 తో పోల్చితే ప్రయాణీకుల వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాల మొత్తం ఎగుమతులు వరుసగా 2020 జూన్‌లో 56.31 శాతం, 34.98 శాతం, 34.25 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement