SIAM
-
వాహన జోరుకు యూవీల తోడు
తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా జనవరిలో 1.6 శాతం పెరిగి 3,99,386 యూనిట్లకు చేరుకున్నాయి. జనవరి నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి కారణం అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.‘2024 జనవరితో పోలిస్తే హోల్సేల్గా యూవీ(యుటిలిటీ వాహనాలు)ల విక్రయాలు గత నెలలో 6 శాతం అధికమై 2,12,995 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ కార్స్ అమ్మకాలు స్థిరంగా 1,27,065 యూనిట్లు నమోదయ్యాయి. వ్యాన్స్ 6.4 శాతం క్షీణించి 11,250 యూనిట్లకు పడిపోయాయి. మారుతీ సుజుకీ 4 శాతం వృద్ధితో 1,73,599 యూనిట్లు, హ్యుండై మోటార్ 5 శాతం తగ్గి 54,003, మహీంద్రా 17.6 శాతం దూసుకెళ్లి 50,659 యూనిట్లు దక్కించుకున్నాయి. ద్విచక్ర వాహనాల హోల్సేల్ అమ్మకాలు 2.1 శాతం పెరిగి 15,26,218 యూనిట్లుగా ఉంది. మోటార్సైకిళ్లు 3.1 శాతం తగ్గి 9,36,145, స్కూటర్స్ 12.4 శాతం పెరిగి 5,48,201, మోపెడ్స్ స్వల్పంగా తగ్గి 41,872 యూనిట్లకు చేరుకున్నాయి. త్రిచక్ర వాహనాలు 7.7 శాతం ఎగిసి 58,167 యూనిట్లను తాకాయి’ అని వివరించింది. ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బైటికిటీవీఎస్ సప్లై చైన్లో మరింత వాటాద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్లో అదనపు వాటా కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం 1.52 శాతం వాటాకు సమానమైన 67.10 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 107 కోట్లు వెచి్చంచింది. ఒక్కో షేరుకీ రూ. 159.42 సగటు ధరలో వీటిని కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ తదుపరి టీవీఎస్ సప్లై చైన్లో టీవీఎస్ మోటార్ వాటా 2.39 శాతం నుంచి 3.91 శాతానికి బలపడింది. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్: సియామ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన (హోల్సేల్) వాహనాల సంఖ్య 2024లో 11.6 శాతం పెరిగి 2,54,98,763 యూనిట్లకు చేరుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు బలమైన డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని సియామ్ తెలిపింది.2023లో హోల్సేల్గా అమ్ముడైన మొత్తం వాహనాల సంఖ్య 2,28,39,130 యూనిట్లు. ‘2024 ఆటో పరిశ్రమకు సహేతుకంగా మంచిదే. వినియోగదారుల సానుకూల సెంటిమెంట్, దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం అన్ని వాహన విభాగాలలో వృద్ధిని అందించడంలో సహాయపడింది. భారత ప్రభుత్వ స్థిర విధాన పర్యావరణ వ్యవస్థ కొన్నేళ్లుగా కొనసాగడం 2024లో పరిశ్రమకు కలిసి వచ్చింది.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ద్వారా సానుకూల సెంటిమెంట్తో కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఊపు 2025లో వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.విభాగాలవారీగా ఇలా.. ద్విచక్ర వాహన విభాగం హోల్సేల్లో గత ఏడాది 14.5 శాతం దూసుకెళ్లి 1,95,43,093 యూనిట్లు నమోదైంది. స్కూటర్స్ విక్రయాలు 20 శాతం అధికమై 66,75,231 యూనిట్లు, మోటార్సైకిల్స్ 12 శాతం ఎగసి 1,23,52,712 యూనిట్లకు చేరుకున్నాయి.ప్యాసింజర్ వెహికిల్స్ 4 శాతం ఎగసి 43 లక్షల యూనిట్లు, త్రీవీలర్స్ 7 శాతం పెరిగి 7.3 లక్షల యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్, త్రీవీలర్స్ ఒక ఏడాదిలో ఈ స్థాయిలో హోల్సేల్ అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య వాహనాల విక్రయాలు 3 శాతం క్షీణించి 9.5 లక్షల యూనిట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇల్లుగా మారిన ఇన్నోవా.. ఇదో డబుల్ డెక్కర్!: వైరల్ వీడియో -
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్షిప్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్సేల్స్ 2023 నవంబర్లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
కాంపాక్ట్ ఎస్యూవీలు.. టాప్గేర్లో అమ్మకాలు..
ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి చాయిస్గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్ ఎస్యూవీలు కేక పుట్టిస్తున్నాయి!! దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్బ్యాక్స్, సెడాన్ల (కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు) హవాకు బ్రేక్లు పడుతున్నాయి. ఎస్యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్లేపిన ఈ సెగ్మెంట్ను తొలిసారిగా కాంపాక్ట్ ఎస్యూవీలు ఓవర్టేక్ చేశాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్–సెప్టెంబర్)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల సేల్స్ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు రివర్స్ కావడం విశేషం. రివర్స్ గేర్...గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్ ర్యాంక్. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్ ఎస్యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్ ఎస్యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు 3 హాట్ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్ లవర్స్ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటోందనేది నిపుణుల మాట. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్ సీ3, ఎయిర్క్రాస్ వంటివి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, డిజైర్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. హ్యాచ్బ్యాక్, సెడాన్ మోడల్స్ డౌన్... కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్ పాసింజర్ కారు మోడల్స్ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్ మోటార్స్ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్ మోడల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్ నిర్ణయంతో హాట్ ఫేవరెట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం మార్కెట్కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్బ్యాక్ల అమ్మకాలను అపేసింది. హోండా సిటీ సేల్స్ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్ కూడా 2022లో గుడ్బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్వ్యాగన్ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్ కారు మోడల్స్ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లకు గండికొడుతోంది!!ఆకట్టుకుంటున్న ఫీచర్లు... కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్ ఎస్యూవీలకు అప్గ్రేడ్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘ఎస్యూవీల సీటింగ్ పొజిషన్ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్: ఎస్ఐఏఎమ్ రిపోర్ట్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సెప్టెంబర్ 2024లో ఆటో పరిశ్రమ విక్రయాల సంఖ్యను విడుదల చేసింది. గత నెలలో వెహికల్ సేల్స్ 24,62,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు సెప్టెంబర్ 2023 కంటే 12.6 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,56,752 యూనిట్లు. 2023లో ఇదే నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3,61,717 యూనిట్లు. 2023 సెప్టెంబర్ నెల కంటే కూడా 2024 సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొంత మందగించాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20,25,993 యూనిట్లు. కాగా ఇదే నెల 2023లో టూ వీలర్ సేల్స్ 17,49,794 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో టూ వీలర్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్వాహనాల అమ్మకాలను గురించి ఎస్ఐఏఎమ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొంత ఊపందుకుంది. టూ వీలర్, త్రీ వీలర్ సేల్స్ వరుసగా 12.6 శాతం, 6.6 శాతం వృద్ధి చెందాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం కొంత క్షీణతను నమోదు చేశాయని పేర్కొన్నారు. -
ఆగస్టులో నెమ్మదించిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి. → ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి. → త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి. ‘‘ఈ పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
వాహన ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం వాహనాల ఎగుమతులు మందగించాయి. 2022–23తో పోలిస్తే 2023–24లో 5.5 శాతం తగ్గాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ ఎగుమతులు 47,61,299 యూనిట్లుగా ఉండగా గత ఆర్థిక సంవత్సరం 45,00,492 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు నెలకొనడమే ఎగుమతులు నెమ్మదించడానికి కారణమని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ‘మన వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల ఎగుమతులకు మంచి డిమాండ్ ఉన్న కొన్ని దేశాలు.. విదేశీ మారకం సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆశిస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర..త్రిచక్ర వాహనాలు మాత్రం గణనీయంగా తగ్గాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి తొలి త్రైమాసికంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో రికవరీ కనిపించిందని, మిగతా ఏడాదంతా కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలివీ.. ► ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6,62,703 యూనిట్ల నుంచి 6,72,105 యూనిట్లకు పెరిగాయి. మారుతీ సుజుకీ అత్యధికంగా 2,80,712 యూనిట్లు, హ్యుందాయ్ 1,63,155, కియా మోటర్స్ 52,105, ఫోక్స్వ్యాగన్ ఇండియా 44,180 యూనిట్లు ఎగుమతి చేశాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు 5.3 శాతం క్షీణించి 36,52,122 యూనిట్ల నుంచి 34,58,416 యూనిట్లకు తగ్గాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు 16 శాతం తగ్గి 78,645 యూనిట్ల నుంచి 65,816 వాహనాలకు పరిమితమయ్యాయి. త్రిచక్ర వాహనాలు 18 శాతం క్షీణించి 3,65,549 యూనిట్ల నుంచి 2,99,977 యూనిట్లకు నెమ్మదించాయి. -
విపరీతంగా వాహన విక్రయాలు.. ఇంతలా కొనేశారేంటి?
న్యూఢిల్లీ: యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో జనవరిలో ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హోల్సేల్ స్థాయిలో గత ఏడాది జనవరితో పోలిస్తే 14 శాతం పెరిగి 3,93,074 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలలో పీవీల విక్రయాలకు సంబంధించి ఇవి అత్యుత్తమ గణాంకాలు. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం టూ–వీలర్ల హోల్సేల్ విక్రయాలు 26 శాతం పెరిగి 14,95,183 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో వీటి సంఖ్య 11,84,376 యూనిట్లుగా ఉంది. వినియోగదారుల సెంటిమెంట్లు సానుకూలంగా ఉండటంతో ప్యాసింజర్ వాహన అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటూ ఉండటంతో టూ–వీలర్ల విభాగం కూడా జనవరిలో వృద్ధి నమోదు చేసిందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అంత మెరుగ్గా లేనప్పటికీ వచ్చే రెండు నెలల్లో అమ్మకాలు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 9 శాతం వృద్ధి చెందాయి. 48,903 యూనిట్ల నుంచి 53,537 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేయడంపై, ముఖ్యంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలు..ప్రజా రవాణాపై ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టడమనేది ఆటో రంగం వృద్ధి గతి కొనసాగేందుకు దోహదపడగలదని అగర్వాల్ పేర్కొన్నారు. జనవరిలో అమ్మకాలు ఇలా.. మార్కెట్ లీడరు మారుతీ సుజుకీ హోల్సేల్ అమ్మకాలు 1,47,348 యూనిట్ల నుంచి 1,66,802 యూనిట్లకు చేరాయి. పోటీ సంస్థ హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 50,106 యూనిట్ల నుంచి 57,115కి పెరిగాయి. అటు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) హోల్సేల్ అమ్మకాలు 33,040 వాహనాల నుంచి 43,068కి చేరాయి. మోటర్సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ గతేడాది జనవరిలో 3,26,467 వాహనాలను విక్రయించగా ఈసారి 3,83,752 యూనిట్లు విక్రయించింది. అటు హోండా మోటర్సైకిల్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1,27,912 యూనిట్ల నుంచి 1,83,638 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు 1,38,860 యూనిట్ల నుంచి 1,78,056 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటర్ అమ్మకాలు 1,24,664 యూనిట్లుగా (గత జనవరిలో 1,00,354), సుజుకీ మోటర్సైకిల్ విక్రయాలు 78,477 యూనిట్లుగా (గత జనవరిలో 65,991) నమోదయ్యాయి. స్కూటర్లకు సంబంధించి హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 1,50,243 యూనిట్ల నుంచి 1,98,874 యూనిట్లకు చేరాయి. -
SIAM Report: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు
భారతదేశంలో కార్లను వినియోగించేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, ఈ కారణంగా రోడ్డుపైన తిరిగే కార్ల సంఖ్య కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే సొంతంగా కార్లను కలిగి ఉన్న వారు ఇప్పుడు చాలానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన నివేదికల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో మాత్రం సుమారు 2.92 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్యాసింజర్ వాహనాలకున్న డిమాండ్ ఇట్టే అర్దమైపోతోంది. నిజానికి గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,91,928 యూనిట్లు. 2022లో విక్రయించబడ్డ 2,62,984 యూనిట్లతో పోలిస్తే ఈ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇందులో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) కూడా ఉన్నాయి. వ్యాన్ల అమ్మకాలు గత ఫిబ్రవరిలో 11,489 యూనిట్లు. మొత్తం అమ్మకాలలో మారుతి సుజుకి సేల్స్ 1,02,565 యూనిట్లు. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 99,398 యూనిట్లను విక్రయించి, 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ 24,493 యూనిట్లను విక్రయించి భారీ వృద్ధిని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫీట్స్) ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2022లో 10,50,079 యూనిట్లు, కాగా 2023 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 8 శాతం పెరిగి 11,29,661 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 86 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: సుమారు వారం రోజులు సాగిన ఆటో ఎక్స్పో బుధవారంతో ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 6,36,743 మంది షోను సందర్శించినట్లు దేశీ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. రెండేళ్లకోసారి జరిగే ఆటో షోను వాస్తవానికి 2022లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 కారణంగా 2023కి వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమై 18తో ముగిసింది. తొలి రెండు రోజులు (11,12) మీడియా కోసం కేటాయించగా, 13–18 వరకు సందర్శకులను అనుమతించారు. ఆటో కంపెనీలు ఇందులో 75 పైచిలుకు వాహనాలను ఆవిష్కరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా వంటివి పాల్గొనగా మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు దూరంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ అయిదు డోర్ల జిమ్నీ వెర్షన్ను, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా అయానిక్ 5ని, కియా ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీ9 మొదలైన వాహనాలను ఆవిష్కరించాయి. గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా బుధవారం టయోటా పెవీలియన్లో సందర్శకులు -
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్ఝున్వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
ఫెస్టివ్ సీజన్: దూసుకెళ్లిన ప్యాసింజర్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ డిమాండ్తో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 3,07,389 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 92 శాతం అధికం కావడం గమనార్హం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2021 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 13 శాతం అధికమై 17,35,199 యూనిట్లు నమోదైంది. వీటిలో మోటార్సైకిల్స్ 18 శాతం ఎగసి 11,14,667 యూనిట్లు, స్కూటర్స్ 9 శాతం పెరిగి 5,72,919 యూనిట్లు ఉన్నాయి. జూలై–సెప్టెంబర్ కాలంలో అన్ని విభాగాల్లో కలిపి అమ్మకాలు 51,15,112 నుంచి 60,52,628 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ వాహనాలు 38 శాతం అధికమై 10,26,309 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 13 శాతం పెరిగి 46,73,931 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 39 శాతం దూసుకెళ్లి 2,31,880 యూనిట్లు సాధించాయి. -
రయ్మంటూ.. దూసుకెళ్తున్న ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహనాల హోల్సేల్ అమ్మకాలు ఆగస్ట్లో 18,77,072 యూనిట్లు నమోదయ్యాయి. 2021 ఆగస్ట్తో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల. సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, పండుగల సీజన్ కోసం డీలర్లు సిద్ధమవడం కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధ్యపడిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు 21 శాతం దూసుకెళ్లి 2,81,210 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 16 శాతం ఎగసి 15,57,429 యూనిట్లకు చేరాయి. ఇందులో మోటార్సైకిల్స్ 23 శాతం పెరిగి 10,16,794 యూనిట్లు, స్కూటర్స్ 10 శాతం అధికమై 5,04,146 యూనిట్లకు ఎగశాయి. త్రిచక్ర వాహనాలు 63 శాతం దూసుకెళ్లి 38,369 యూనిట్లకు పెరిగాయి. రుతుపవనాలు మెరుగ్గా ఉండడం, రాబోయే పండుగల సీజన్తో వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. పరిశ్రమకు సీఎన్జీ ధర సవాల్గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. -
భద్రతా లోపాలతో 13 లక్షల వాహనాలు వెనక్కి
న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు. -
పెరిగిన వెహికల్స్ ఎక్స్పోర్ట్..అగ్రస్థానంలో మారుతీ సుజికీ!
న్యూఢిల్లీ: లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్ల ఊతంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 26 శాతం ఎగిశాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1,27,083 యూనిట్లతో పోలిస్తే 1,60,263 యూనిట్లకు పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 88 శాతం పెరిగి 1,04,400 యూనిట్లుగాను, యుటిలిటీ వాహనాలు 18 శాతం పెరిగి 55,547 యూనిట్లుగాను నమోదయ్యాయి. వ్యాన్ల ఎగుమతులు 588 యూనిట్ల నుంచి 316 యూనిట్లకు తగ్గాయి. ‘లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లు కోలుకుంటున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో, మన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో భారతీయ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తుండటం, ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మారుతీ టాప్.. తొలి త్రైమాసికంలో 68,987 ప్యాసింజర్ వాహనాలను (53 శాతం అధికం) ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిల్చింది. ఎక్కువగా లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసింది. బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్–ప్రెసో, బ్రెజా మోడల్స్ టాప్లో ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎగుమతులు 34,520 యూనిట్లుగా (15 శాతం వృద్ధి) నమోదయ్యాయి. కియా ఇండియా 21,459 వాహనాలను (గత క్యూ1లో 12,448) ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటర్ ఇండియా 11,419 యూనిట్లు, ఫోక్స్వ్యాగన్ 7,146 యూనిట్లు, రెనో 6,658 వాహనాలు, హోండా కార్స్ 6,533 యూనిట్లను ఎగుమతి చేశాయి. వాహన రంగంలో కోటి ఉద్యోగాలు దేశీ ఆటోమొబైల్ రంగంలో వచ్చే 5–6 ఏళ్లలో యువతకు 1 కోటి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు సంబంధించి 40 శాతం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు దేశీయంగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగానికి భారత్ కీలక కేంద్రంగా మారనుంది. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మంత్రి -
సీఎన్జీ ధరలు తగ్గించాలి, కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: సీఎన్జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు. ‘‘సీఎన్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్జీ వాహన ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్దీప్సింగ్ పూరి 166 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
సీఎన్జీ ధరలను తగ్గించండి
న్యూఢిల్లీ: స్టీల్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి వినియోగించే పలు మడి పదార్థాల దిగుమతులపై సుంకాలు తగ్గించాలని, సీఎన్జీ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆటోమొబైల్ తయారీ సంస్థల సంఘం సియామ్ కోరింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపును ఆహ్వానించింది. ఈ నిర్ణయం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుందని, అంతిమంగా సామాన్యుడికి ప్రయోజనం కలిగిస్తుందని సియామ్ తన ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. స్టీల్, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలు తగ్గించడంతోపాటు.. స్టీల్ ఇంటర్ మీడియట్స్పై సుంకాలు పెంచడం వల్ల దేశీ మార్కెట్లో స్టీల్ ధరలు మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని పేర్కొంది. గత ఏడు నెలల కాలంలో సీఎన్జీ ధరలు గణనీయంగా పెరిగినందున దీనిపైనా ఉపశమనం కల్పించాలని పరిశ్రమ కోరింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలు.. డీఆర్డీవో రిపోర్ట్లో షాకింగ్ విషయాలు -
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
ముంబై: యుటిలిటీ వాహనాలకు (యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా అమ్ముడయ్యే కార్లలో ఇవి అధిక వాటా దక్కించుకునే ధోరణి కొనసాగవచ్చని ఫిచ్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. అధిక మార్జిన్లు ఉండే యూవీల విక్రయాలపై మరింత దృష్టి పెట్టడం ద్వారా కమోడిటీల ధరల పెరుగుదల, అదనపు భద్రత ప్రమాణాలపరమైన వ్యయాల భారాన్ని ఆటోమొబైల్ సంస్థలు కొంత మేర ఎదుర్కొనేందుకు వీలుంటుందని పేర్కొంది. మరోవైపు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతుండటంతో కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించుకుంటున్నట్లు వివరించింది. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాల్లో యూవీల పరిమాణం 49 శాతం పెరిగినట్లు (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతం) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. హ్యాచ్బ్యాక్లు, సెడాన్ల సంయుక్త వాటా 66 శాతం నుండి 48 శాతానికి పడిపోయింది. యూవీలకు ఆదరణ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. ఇక యూవీ కేటగిరీలో అంతర్గతంగా ఎంట్రీ, మధ్య స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 38 శాతానికి చేరింది. విశిష్టమైన సామర్థ్యాలతో పనిచేసే విశాలమైన యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని ఫిచ్ పేర్కొంది. కొత్త మోడల్స్తో వృద్ధికి ఊతం.. గత కొన్నేళ్లుగా హ్యాచ్బ్యాక్లతో పోలిస్తే ఆటోమొబైల్ సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్త యూవీ మోడల్స్ను ప్రవేశపెడుతున్నాయి. ఎంట్రీ కార్ల కొనుగోలుదారులతో పోల్చినప్పుడు ధరను పెద్దగా పట్టించుకోకుండా కొత్త కార్లకు అప్గ్రేడ్ అయ్యేవారు, అధికాదాయ వర్గాల వారు ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ, మధ్య స్థాయి యూవీల అమ్మకాలు 21 శాతం పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం మేర పెరిగాయి. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ యూవీలకు డిమాండ్ తగ్గలేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తగ్గుతున్న హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు.. సెడాన్లు, హ్యాచ్బ్యాక్ కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతూ ఉండటం వల్ల డిమాండ్, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కమోడిటీల రేట్లు పెరిగిపోవడం, వాహన భద్రత ప్రమాణాలు కఠినతరం చేయడంతో 2018 నుంచి చూస్తే ఎంట్రీ స్థాయి కార్ల ధరలు 20–30 శాతం పెరిగాయని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగంలో అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలిపింది. కార్లలో అదనంగా ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేసే నిబంధన ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తే తయారీ వ్యయాలు మరో 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొంది. దీంతో ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కొత్త కార్ల ఆవిష్కరణలు తగ్గవచ్చని, కొన్ని మోడల్స్ను నిలిపివేసే అవకాశాలున్నాయని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. దీని ఫలితంగా ఈ విభాగం వృద్ధి అవకాశాలు మరింతగా మందగిస్తాయని పేర్కొంది. ఖర్చులు పెరుగుతున్నా యూవీల అమ్మకాలు పెరుగుతుండటమనేది దేశీ కార్ల తయారీ సంస్థల లాభదాయకతకు తోడ్పాటుగా ఉండగలదని ఫిచ్ రేటింగ్స్ వివరించింది. సియామ్ గణాంకాల ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలు 6 శాతం క్షీణించగా యూవీల అమ్మకాలు 40 శాతం పెరిగి ఆ మేరకు వ్యత్యాసాన్ని భర్తీ చేశాయని, పరిశ్రమ 13 శాతం వృద్ధి నమోదు చేయడంలో తోడ్పడ్డాయని పేర్కొంది. -
కార్ల ధరలు పైపైకి..తగ్గిన అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ కేంద్రాల నుంచి డీలర్షిప్స్కు గత నెలలో వాహనాల సరఫరా 23 శాతం తగ్గింది. 2021 ఫిబ్రవరిలో అన్ని రకాల వాహనాలు కలిపి 17,35,909 యూనిట్లు డీలర్షిప్ కేంద్రాలకు చేరాయి. గత నెలలో ఈ సంఖ్య 13,28,027 మాత్రమే. సెమికండక్టర్ల కొరత, సరఫరా సమస్యలకుతోడు వాహనాల ధరల పెరుగుదల ఇందుకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. విడిభాగాలు ప్రియం కావడం, రవాణా ఖర్చులు భారమవడంతో పరిశ్రమలో మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపిందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున రష్యా–ఉక్రెయిన్ వివాదం ప్రభావాన్ని పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
వాహనాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాల తయారీకి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదకత మరింతగా పెరగడం, నిలకడగా వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా పంపిన సందేశంలో ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ సందేశాన్ని చదివి వినిపించారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ, దేశ పురోగతిలోనూ వాహన పరిశ్రమ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. ఎగుమతులకు ఊతమిచ్చేలా తయారీ కార్యకలాపాలు మొదలుకుని అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తోంది. దేశ అభివృద్ధి సాధనలో భాగస్వామిగా ఉంటోంది’’ అని ప్రధాని ప్రశంసించారు. ‘‘స్వచ్ఛమైన, ఆధునిక రవాణా వ్యవస్థ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడానికి భారత్ కట్టుబడి ఉంది. ఆటో రంగం ఉత్పాదకత పెరిగేందుకు, పరిశ్రమ నిలకడగా ఎదిగేందుకు.. వాహనాల తయారీకి సంబంధించిన వివిధ విభాగాలకు తోడ్పాటునిచ్చేందుకు సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ వివరించారు. భారత్ను అంతర్జాతీయ తయారీ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో ఆటో పరిశ్రమ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికత, జీవన విధానాలు, ఆర్థిక వ్యవస్థలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరం మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ స్థాయి తయారీ, ఆధునిక టెక్నాలజీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీడీపీలో 12 శాతానికి ఆటో వాటా: గడ్కరీ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఆటోమొబైల్ పరిశ్రమ వాటాను 12 శాతానికి పెంచాలని, కొత్తగా 5 కోట్ల కొలువులు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో ఆటో పరిశ్రమ వాటా 7.1 శాతంగా ఉంది. మరోవైపు, కాలుష్యకారకమైన డీజిల్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను తగ్గించుకోవడంపై ఆటోమొబైల్ కంపెనీలు కసరత్తు చేయాలని, ప్రత్యామ్నాయ టెక్నాలజీల వైపు మొగ్గు చూపాలని గడ్కరీ సూచించారు. 100% పెట్రోల్ లేదా 100% బయో–ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఇంజిన్ల ఆధారిత వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాలతో పాటు భారత్లోనూ ఇలాంటి బ్రాండ్లు కొన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై పరిశోధన, అభివృద్ధి కోసం పరిశ్రమ నిధులు వెచ్చించాలని తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాలపై కసరత్తు: కేంద్ర మంత్రి పాండే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. జాతీయ రహదారులు, నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడంపై వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటు పన్నుల చెల్లింపుల్లోనూ, అటు మూడు కోట్ల మందికి పైగా జనాభాకు ఉపాధి కల్పించడంలో వాహన రంగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. ఆటో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వాహన రంగానికి అవసరమైన తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పాండే తెలిపారు. మరోవైపు, ఆటోమొబైల్ పరిశ్రమ తోడ్పాటు లేకుండా భారత్ సుదీర్ఘకాలం అధిక వృద్ధి రేటుతో పురోగమించడం సాధ్యపడేది కాదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. విద్యుత్ వాహనాల వైపు మళ్లడం ఎప్పటికైనా తప్పదని, ఈ రంగంలో భారత్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఆటో పరిశ్రమ కృషి చేయాలని సూచించారు. మాటలు కాదు.. చేతలు కావాలి: పరిశ్రమ దిగ్గజాలు ఆటో పరిశ్రమ వృద్ధికి చర్యల విషయంలో ప్రభుత్వ అధికారుల ధోరణులను సియామ్ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఆక్షేపించారు. నానాటికీ క్షీణిస్తున్న ఆటోమొబైల్ రంగం పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమని, కేవలం మాటల వల్ల ఉపయోగం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ మోటార్ చీఫ్ వేణు శ్రీనివాసన్ తదితరులు వ్యాఖ్యానించారు. అసలు దేశాభివృద్ధిలో ఆటోపరిశ్రమ పోషిస్తున్న పాత్రకు కనీసం గుర్తింపైనా ఉంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఆటో పరిశ్రమ చాలాకాలంగా క్షీణ బాటలో కొనసాగుతోంది. పరిశ్రమ ప్రాధాన్యతపై ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కానీ, క్షీణతను అడ్డుకునే నిర్మాణాత్మక చర్యల విషయానికొస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు. కొత్త కాలుష్య ప్రమాణాలను, భద్రతా ప్రమాణాలను పాటించేందుకు కంపెనీలు గణనీయంగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం, భారీ పన్నుల భారం వల్ల వాహనాల ఖరీదు పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అంటూ ఏది చేసినా కార్ల పరిశ్రమ కోలుకుంటుందని అనుకోవడం లేదు’’ అని భార్గవ పేర్కొన్నారు. మరోవైపు, దేశంలో ప్రాథమిక రవాణా సాధనంగా ఉంటున్న ద్విచక్ర వాహనాలపై సైతం విలాస ఉత్పత్తులకు సరిసమానంగా ఏకంగా 28 శాతం వస్తు, సేవల పన్ను విధించడం సరికాదని వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని దేశీయంగానే తయారీ, డిజైనింగ్ కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆయన చెప్పారు. ఇంత చేస్తున్నా తమకు గుర్తింపనేది లభిస్తోందా అన్న సందేహం కలుగుతోందన్నారు. -
వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విక్రయాలు తిరిగి గాడినపడుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. జూన్ నెల దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ కలిపి 12,96,807 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14.7 శాతం వృద్ధి. ప్యాసింజర్ వెహికిల్స్ 1,05,617 నుంచి 2,31,633 యూనిట్లకు ఎగిశాయి. ద్విచక్ర వాహనాలు 10,14,827 నుంచి 10,55,777 యూనిట్లకు చేరాయి. గత నెలలో త్రీ వీలర్లు 9,397 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జూన్లో ఈ సంఖ్య 10,300 యూనిట్లు నమోదైంది. తొలి త్రైమాసికంలో ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో వాహన అమ్మకాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా నమోదయ్యాయి. ఈ కాలంలో భారత్లో అన్ని విభాగాల్లో కలిపి 31,80,039 వెహికిల్స్ విక్రయమయ్యాయి. కోవిడ్–19 దెబ్బతో 2020–21 తొలి త్రైమాసికంలో ఈ సంఖ్య 14,92,612 యూనిట్లకు పరిమితమైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 1,53,734 నుంచి 6,46,272 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 24 లక్షల యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వెహికిల్స్ మూడు రెట్లు అధికమై 1,05,800 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు రెండింతలై 24,376 యూనిట్లకు చేరుకున్నాయి. చదవండి: ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు -
కొత్త పెట్టుబడులు కష్టమే..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, కొత్తగా అమల్లోకి రాబోయే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా వ్యాఖ్యానించారు. భారత్ అమలు చేస్తున్న ఉద్గార ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటికి సరిసమాన స్థాయిలోనే ఉంటున్నాయని.. నిబంధనల డోసేజీని అతిగా పెంచేయరాదని సియామ్ 60వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నుంచి అమల్లోకి వచ్చే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (సీఏఎఫ్ఈ) మొదలైన నిబంధనలకు అనుగుణంగా తయారీ చేసేందుకు కావాల్సిన పెట్టుబడులు పెట్టే స్తోమత పరిశ్రమకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి.. ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 (ఏఎంపీ)లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని వధేరా చెప్పారు. ఆటోమోటివ్, ఆటో పరికరాల పరిశ్రమ 2026 నాటికి ఏ స్థాయిలో ఉండాలి, దేశ ఆర్థిక వృద్ధిలో ఏ స్థాయిలో తమ వంతు పాత్ర పోషించాలి తదితర అంశాలపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి రూపొందించుకున్న ప్రణాళిక ఏఎంపీ 2026. దీని ప్రకారం ప్రస్తుతం జీడీపీ 7%గా ఉన్న ఆటో పరిశ్రమ వాటాను 12%కి పెంచుకోవాలని, ఇప్పటికే ఉన్న 3.7 కోట్ల ఉద్యోగాలకు అదనంగా 6.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని నిర్దేశించుకున్నారు. అలాగే, 2026 నాటికి వాహన ఉత్పత్తిని 6.6 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్టీ రేట్ల కోత సంకేతాలు: సియామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా భారీ పరిశ్రమల మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంకేత మిచ్చారు. ఆటోమోటివ్ పరిశ్రమ త్వరలోనే ’శుభ వార్త’ వింటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమకు కావల్సిన పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి నితిని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్లను భారత్లో తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కాగా, భారత ఆటో పరిశ్రమ చరిత్రలోనే అత్యంత కష్టకాలం ఎదుర్కొంటోందని మారుతీ ఎండీ కెనిచి అయుకవ పేర్నొన్నారు. జీఎస్టీని తగ్గించడం, ప్రోత్సాహకాల ఆధారిత స్క్రాపేజీ విధానం తదితర మార్గాల్లో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. సియామ్ కొత్త అధ్యక్షుడిగా మారుతీ సీఈఓ మారుతీ సుజుకీ కంపెనీ సీఈవో కెనిచి ఆయుకవ సియామ్ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అశోక్ లేలాండ్ ఎండీ, సీవోఓ విపిన్ సోంధి ఎన్నికయ్యారని, ట్రెజరర్గా ఐషర్ మోటర్ ఎండీ వినోద్ అగర్వాల్ కొనసాగుతారని సియామ్ పేర్కొంది. -
వీడని సంక్షోభం : క్షీణించిన విక్రయాలు
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభం నుంచి ఆటో కంపెనీలు ఇంకా బయట పడినట్టు లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. పరిశ్రమ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. జూన్ 2019 తో పోల్చితే జూన్ 2020 లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 57.98 క్షీణత నమోదైందని సియామ్ వర్చువల్ కాన్ఫరెన్స్లో తెలిపింది. జూన్ 2019 తో పోలిస్తే జూన్ 2020లో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 31.16 శాతం తగ్గాయని తెలిపింది. జూన్ 2019తో పోల్చితే జూన్ 2020లో వ్యాన్ల అమ్మకాలు 62.06 శాతం తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు కూడా 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్లను అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే నెలలో 5,12,626 యూనిట్లుగా ఉన్నాయి. సియామ్ తాజా గణాంకాల ప్రకారం జూన్ 2020 లో ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్ల అమ్మకాలు వరుసగా 38.56 శాతం, 80.15శాతం తగ్గాయి. జూన్ 2019 తో పోల్చితే ప్రయాణీకుల వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాల మొత్తం ఎగుమతులు వరుసగా 2020 జూన్లో 56.31 శాతం, 34.98 శాతం, 34.25 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
సేల్స్ మరోసారి ఢమాల్ , ఆందోళనలో పరిశ్రమ
సాక్షి, ముంబై: దేశీయంగా ఆటో మొబైల్ పరిశ్రమకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే దశాబ్దం కనిష్టానికి పడిపోయిన వాహనాలు అమ్మకాలు కొత్త ఏడాదిలో కూడా అదే ధోరణిని కొనసాగించాయి. 2020 జనవరిలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం క్షీణించాయి. వరుసగా మూడవ నెల క్షీణత. 2019 సెప్టెంబర్ అమ్మకాలు దాదాపు 24 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమేపీ క్షీణతను నమోదు చేయడం మరింత ఆందోళనకు రేపుతోంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి నెలలో కారు సేల్స్ కూడా 8.1 శాతం తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో ఈ సేల్స్ 1,79,324 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 1,64,793 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ల అమ్మకం 28 శాతం క్షీణించి 12,992 వద్ద ఉంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం తగ్గి 75,289 యూనిట్లకు చేరుకోగా, గ్రామీణ వినియోగ ధోరణిని సూచించే ద్విచక్ర వాహనాలు 16 శాతం తగ్గి 13,41,005 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ నెలలో మొత్తం ఆటో మొబైల్స్ అమ్మకాలు 14 శాతం తగ్గి 17,39,975 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.04 శాతం మేర తగ్గి 87,591నుండి 75,289కు పడిపోయాయి. ఆటోఎక్స్పో కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నామని, తద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఓనర్షిప్ వ్యయం పెరగడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు మందగింపు లాంటివి అమ్మకాలు పతనానికి కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియామ్ సోమవారం వెల్లడించింది. దీనికితోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనలకనుగుణంగా మారాల్సిన నేపథ్యం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా తెలిపారు. ఈ పరివర్తనం చెందడానికి పరిశ్రమకున్న సమయం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వాహనా అమ్మకాల క్షీణత రేటు గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ముదురుతున్న ఆర్థిక మందగమనానికి ఇది నిదర్శనమని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష మీనన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఇతరకారణాల రీత్యా ఉద్గార నిబంధనల అమలు గడువును మరింత కాలం పొడిగించాలని కూడా కోరుతున్నాయి. -
వాహనాల విక్రయాలు మరోసారి ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లో మరోసారి వాహనాల విక్రయాలు మందగించాయి. ఇప్పటికే వరుస త్రైమాసికాల్లో భారీగా పడిపోతున్న వాహన విక్రయాలు డిసెంబరుమాసంలో క్షీణతను నమోదు చేసాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1.24 శాతంక్షీణించి 2,35,786 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,38,753 యూనిట్లుగా వుంది. దేశీయ కార్ల అమ్మకాలు 8.4 శాతం తగ్గి 1,42,126 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 డిసెంబర్లో 1,55,159 యూనిట్లు. గత నెలలో మోటార్సైకిల్ అమ్మకాలు 12.01 శాతం క్షీణించి 6,97,819 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 7,93,042 యూనిట్లు.డిసెంబరులో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.6 శాతం క్షీణించి 10,50,038 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది 12,59,007 యూనిట్లు. వాణిజ్య వాహనాల అమ్మకాలు 12.32 శాతం తగ్గి డిసెంబర్లో 66,622 యూనిట్లకు చేరుకున్నాయని సియామ్ తెలిపింది. 2018 డిసెంబర్లో 16,17,398 యూనిట్ల నుంచి వాహనాల అమ్మకాలు 13.08 శాతం క్షీణించి 14,05,776 యూనిట్లకు చేరుకున్నాయి. 2018 లో 33,94,790 యూనిట్లతో పోలిస్తే 2019 లో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 12.75 శాతం తగ్గి 29,62,052 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం వాహనాల అమ్మకాలు 2019 జనవరి-డిసెంబర్లో 13.77 శాతం తగ్గి 2,30,73,438 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది 2018 లో 2,67,58,787 యూనిట్లుగా ఉన్నాయి. కాగా టాటా మోటార్స్ చైనా మార్కెట్లో మాత్రం వరసగా ఆరు నెలలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ను సాధించింది. దీంతో మార్కెట్లో టాటా మోటార్స్ షేరు నష్టాలనుంచి లాభాల్లోకి మళ్లింది. మారుతి సుజుకి కూడా లాభపడుతోంది. -
బిగ్ రిలీఫ్ : ఊపందుకున్న వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో ఆటోమొబైల్ రంగం కుదేలైన క్రమంలో పండుగ సేల్స్ ఊరట కల్పించాయి. అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల వాహన విక్రయాలు 0.28 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ సొసైటీ (ఎస్ఐఏఎం) గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్లో 2.84,223 వాహనాలు విక్రయించగా, ఈ అక్టోబర్లో 2,85,027 వాహనాలు అమ్ముడయ్యాయి. ఉద్యోగుల తొలగింపు, డిమాండ్ లేమితో సతమతమవుతున్న ఆటోమొబైల్ పరిశ్రమ వాహన విక్రయాలు స్వల్పంగా పెరగడంతో కోలుకుంటోందనే సంకేతాలు పంపింది. మరోవైపు ఆటోసేల్స్ గత కొన్ని నెలలుగా గణనీయంగా పడిపోతున్న క్రమంలో గత నెలలో ఉత్పత్తిని ఆయా కంపెనీలు 21.14 శాతం మేర తగ్గించాయి. ఎగుమతులు 2.18 శాతం పడిపోయాయని ఎస్ఐఏఎం నివేదిక పేర్కొంది. -
రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..!
న్యూఢిల్లీ: వాహనాల నెలవారీ అమ్మకాల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల ఆధారంగా రూపొందించాలని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్)ను కోరింది. ఇందుకోసం హోల్సేల్స్ను కాకుండా, రహదారి మంత్రిత్వ శాఖకు వాహన్ ప్లాట్ఫాం సమాచారాన్ని వినియోగించుకోవాలని సియామ్కు లేఖరాసింది. ఈ విధానం ద్వారా మెరుగైన సమాచారం అందుతుందని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే అన్నారు. ఇక తాజాగా సియామ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆటో పరిశ్రమ అమ్మకాలు కనిష్ట స్థాయిలను నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు 31.57 శాతం క్షీణించాయని వెల్లడించింది. -
దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం
సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమ మరింత కుదేలవుతోంది. వరుసగా పదవ నెలలో కూడా అమ్మకాలు భారీగా పడిపోయాయి. నెలవారీ ప్యాసింజర్ వాహనాలు,ఇతర కార్ల అమ్మకాలు ఆగస్టులో దారుణంగా పడిపోయాయి. భారతీయ ఆటోమొటైల్ ఉత్పత్తుల అసోసియేన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత మాసంలో రికార్డు క్షీణతను నమోదు చేశాయి. 1997-98 సంవత్సం నుంచి డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద క్షీణత అని సియామ్ వెల్లడించింది. దీంతో భారత ఆటో రంగ సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 31.57 శాతం పడిపోయి ఆగస్టులో 196,524 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సమవారం విడుదల చేసిన గణాంకాలు ప్రకారం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఎగుమతులు 14.73 శాతం పుంజుకున్నాయి. కాగా ఆటో అమ్మకాల క్షీణత ఈ రంగంలో భారీగా ఉద్యోగ నష్టానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. వాహన కంపెనీలు ఇప్పటికే 15 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్షిప్లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు. మాంద్యం కొనసాగితే మరో పది లక్షల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. అటు భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత వారం హర్యానాలోని తన గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజులు నిలిపివేసినట్లు తెలిపింది. గత వారం జరిగిన ఒక సమావేశంలో లక్షలాది మంది ఉద్యోగాల కోతలకు కారణమైన మందగమనం ఇలాగే కొనసాగితే మరింత సంక్షోభం తప్పదని పరిశ్రమ వర్గాలు ఆందోళనపడుతున్నాయి. మరోవైపు అశోక్ లేలాండ్ తాజా గణాంకాల నేపథ్యంలో మరో 16 రోజుల పనిదినాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
పెట్రోల్, డీజిల్ కార్ల నిషేధంపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో డీజిల్, పెట్రోల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఎగుమతులు, ఉపాధి రంగంలో ఆటోమొబైల్ రంగం పాత్రను ప్రభుత్వం గుర్తెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతుల్లో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పెద్దసంఖ్యలో వాహనాలున్న దేశం ముడిచమురు దిగుమతుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోందని, ఇక కాలుష్యం, రహదారుల భద్రతలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో రూ 4.50 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్ రంగం పరిశుభ్ర ఇంధనం వైపు మళ్లాలని పిలుపుఇచ్చారు. కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం ప్రజల్లో అనారోగ్య సమస్యలను వ్యాప్తి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం
న్యూఢిల్లీ: బీఎస్–6 ప్రమాణాల వాహనాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం స్పష్టత నేపథ్యంలో 2020 ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–6 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగేలా పూర్తి స్థాయి లో కృషి చేస్తామని వివరించింది. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బీఎస్–6యేతర వాహనాలను నిర్దిష్ట గడువు తర్వాత కూడా విక్రయించుకునేలా కొంత వ్యవధి ఇవ్వాలన్న వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. -
టాప్10లో ఏడు ‘మారుతీ’ కార్లు
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) టాప్ గేర్లో దూసుకుపోతోంది. పీవీ విభాగంలో మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఈ సంస్థ.. సెప్టెంబరు అమ్మకాల్లో మరో రికార్డును సొంతం చేసుకుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. గత నెల పీవీ విక్రయాల టాప్ 10 జాబితాలో ఏకంగా 7 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు వెల్లడైంది. ప్రీమియం హచ్బ్యాక్ స్విఫ్ట్ అమ్మకాలు 22,228 యూనిట్లు కాగా, సెప్టెంబర్లో అత్యధికంగా అమ్ముడైన పీవీలలో ఈ కారు నెంబర్ వన్ స్థానాన్ని సొంతంచేసుకుంది. గతేడాది విక్రయాలు 13,193 యూనిట్లుగా నమోదైయ్యాయి. ఆ తరువాత స్థానంలో నిలిచిన హచ్బ్యాక్ ఆల్టో అమ్మకాలు 21,719 యూనిట్లుగా నమోదుకాగా, అంతకుముందు ఏడాది సేల్స్ 23,830 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మూడవ స్థానంలో నిలిచిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ అమ్మకాలు 21,296 యూనిట్లుగా నమోదయ్యాయి. 18,631 యూనిట్ల విక్రయాలతో బాలెనో 4వ స్థానంలో ఉండగా.. కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజ్జా 14,425 యూనిట్లతో 5వ స్థానంలో నిలిచింది. 13,252 యూనిట్ల విక్రయాలతో వాగన్ ఆర్ 6వ స్థానంలో, 9,208 యూనిట్ల విక్రయాలతో సెలెరియో 10వ స్థానంలో నిలిచాయి. ఏడవ స్థానంలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ హచ్బ్యాక్ గ్రాండ్ ఐ20 నిలిచింది. సెప్టెంబర్లో 12,380 యూనిట్లు అమ్ముడయ్యాయి. 11,224 యూనిట్లతో గ్రాండ్ ఐ10 ఎనిమిదవ స్థానానికి చేరింది. 11,000 యూనిట్ల విక్రయాలతో క్రెటా 9వ స్థానంలో నిలవడం ద్వారా, టాప్ 10లో హ్యుందాయ్ కార్ల జాబితా మూడుకు చేరింది. -
అమ్మకాల్లో ఆల్టోను దాటిన డిజైర్
న్యూఢిల్లీ: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా కాంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ అగ్రస్థానంలో నిల్చింది. ఈ క్రమంలో మారుతీకే చెందిన ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఆల్టోను అధిగమించింది. సియామ్ గణాంకాల ప్రకారం జులైలో డిజైర్ అమ్మకాలు 25,647గా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో డిజైర్ విక్రయాలు 14,703 కాగా, అప్పట్లో అయిదో బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిల్చింది. మరోవైపు, గత జూలైలో 26,009 విక్రయాలతో నంబర్వన్ స్థానంలో నిల్చిన ఆల్టో అమ్మకాలు తాజాగా 23,371కు తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక మారుతీకే చెందిన స్విఫ్ట్ మూడో బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిల్చింది. విక్రయాలు 13,738 యూనిట్ల నుంచి 19,993 యూనిట్లకు పెరిగాయి. అటు 17,960 యూనిట్లతో బాలెనో నాలుగో స్థానంలో, వాగన్ఆర్ అయిదో స్థానంలో (14,339 వాహనాలు), ఎస్యూవీ విటారా బ్రెజా ఆరో స్థానంలో (14,181 యూనిట్లు) ఉన్నాయి. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా మూడు మోడల్స్తో రెండో స్థానంలో ఉంది. ఎలీట్ఐ20 మోడల్ (10,822 యూనిట్లు), గ్రాండ్ఐ10 (10,775 యూనిట్లు), ఎస్యూవీ క్రెటా (10,423 కార్లు) వరుసగా 7,8,9 స్థానాల్లో ఉన్నాయి. కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్తో హోండా కార్స్ ఇండియా తొలిసారిగా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. -
ప్యాసింజర్ విభాగంలో మారుతీ ఆధిపత్యం
న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’.. దేశీ ప్యాసింజర్ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 52.54 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్ మార్కెట్ వాటా పరంగా హోండా కార్స్ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) ప్రకారం.. ఏప్రిల్– జూన్ మధ్యకాలంలో మొత్తం దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 19.91 శాతం వృద్ధితో 7,28,483 యూనిట్ల నుంచి 8,73,501 యూనిట్లకు పెరిగాయి. మారుతీ విక్రయాలు 24.93 శాతం వృద్ధితో 4,58,967 యూనిట్లకు ఎగశాయి. మార్కెట్ వాటా 50.43 శాతం నుంచి 52.54 శాతానికి చేరింది. దీంతో ఇది అగ్రస్థానంలో నిలిచింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 10.28 శాతం వృద్ధితో 1,37,114 యూనిట్లకు పెరిగినా.. మార్కెట్ వాటా మాత్రం 17 శాతం నుంచి 15.69 శాతానికి తగ్గింది. దీంతో ఇది రెండో స్థానంలోనే ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 60,539 యూనిట్లుగా నమోదయ్యాయి. విక్రయాల్లో 8.52 శాతం వృద్ధి కనిపించినా.. మార్కెట్ వాటా మాత్రం 7.65 శాతం నుంచి 6.93 శాతానికి క్షీణించింది. దీంతో ఇది మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ విక్రయాల్లో ఏకంగా 48.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అమ్మకాలు 39,708 యూనిట్ల నుంచి 58,969 యూనిట్లకు పెరిగాయి. సంస్థ మార్కెట్ వాటా 5.45 శాతం నుంచి 6.75 శాతానికి ఎగసింది. -
కారు.. బైక్ రయ్రయ్
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరు మీదుంది. భారత్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు మే నెలలో దాదాపు ఏకంగా 20 శాతంమేర ఎగశాయి. యుటిలిటీ వెహికల్స్, కార్లు, వ్యాన్ల విభాగాల్లోని బలమైన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో నెలలోనూ వాహన అమ్మకాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య ‘సియామ్’ తాజా గణాంకాల ప్రకారం. ⇒ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు మే నెలలో 19.65% వృద్ధితో 2,51,764 యూనిట్ల నుంచి 3,01,238 యూనిట్లకు ఎగశాయి. దేశీ కార్ల విక్రయాలు కూడా 19.64% పెరిగాయి. ఇవి 1,66,732 యూనిట్ల నుంచి 1,99,479 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వాహన (యూవీ) అమ్మకాలు 17.53 శాతం వృద్ధితో 82,086 యూనిట్లకు, వ్యాన్ల విక్రయాలు 29.54 శాతం వృద్ధితో 19,673 యూనిట్లకు పెరిగాయి. పీవీ వాహన ఎగుమతులు కూడా 3.45% వృద్ధితో 59,648 యూనిట్లకు చేరాయి. ⇒ ‘విక్రయాల కోణంలో చూస్తే పరిశ్రమ సరైన దారిలో వెళ్తుంది. అన్ని విభాగాల్లోనూ బలమైన విక్రయాలు నమోదయ్యాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ సహా చాలా అంశాలు పీవీ విభాగంలో విక్రయాల వృద్ధికి కారణంగా నిలిచాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు వల్ల ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది ‘ఏప్రిల్–మే’లో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని గుర్తుచేశారు. మారుతీ @ 1,61,497 యూనిట్లు మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 23.99% వృద్ధితో 1,61,497 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాల్లో 7.14% వృద్ధి నమోదయ్యింది. 45,008 యూనిట్లకు చేరాయి. మహీంద్రా విక్రయాలు 1.63% వృద్ధితో 20,621 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ విక్రయాలు 53.63% వృద్ధితో 19,202 యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ అమ్మకాలు 9 శాతం అప్ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 9.19 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 16,94,323 యూనిట్ల నుంచి 18,50,093 యూనిట్లకు పెరిగాయి. మోటార్సైకిల్ అమ్మకాలు 15.16 శాతం వృద్ధితో 12,21,559 యూనిట్లకు చేరాయి. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ దేశీ మోటార్సైకిల్ విక్రయాల్లో 17.46 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 6,37,203 యూనిట్లకు పెరిగాయి. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అమ్మకాలు 8.91 శాతం వృద్ధితో 1,91,920 యూనిట్లకు, బజాజ్ ఆటో మోటార్సైకిల్ విక్రయాలు 23.01 శాతం వృద్ధితో 1,92,543 యూనిట్లకు ఎగిశాయి. స్కూటర్ డీలా... స్కూటర్ విక్రయాలు 1.4 శాతం క్షీణతతో 5,63,326 యూనిట్ల నుంచి 5,55,467 యూనిట్లకు తగ్గాయి. గత 15 నెలల కాలంలో స్కూటర్ విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరిగా 2017 జనవరిలో స్కూటర్ అమ్మకాల్లో 14.5 శాతం క్షీణత నమోదయ్యింది. మార్కెట్ లీడర్ హెచ్ఎంఎస్ఐ దేశీ స్కూటర్ విక్రయాలు 2.09 శాతం క్షీణతతో 3,27,167 యూనిట్లకు తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 8.87 శాతం వృద్ధితో 90,737 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ విక్రయాలు ఏకంగా 21.49 శాతం క్షీణతతో 55,398 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు వాణిజ్య వాహన అమ్మకాలు 43.06 శాతం వృద్ధితో 76,478 యూనిట్లకు ఎగశాయి. -
పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికిల్స్కు ఇంకెన్నేళ్లు?
న్యూఢిల్లీ : కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పెట్రోల్, డీజిల్ కార్ల వాడుకం నిషేధం దిశగా ప్రపంచం కదులుతోంది. పెట్రోల్, డీజిల్ వాడుకాన్ని పూర్తిగా నిరోధించి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. భారత్లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలంటే ఇంకా 30 ఏళ్లు పట్టేలా కనిపిస్తోంది. భారత్లో పూర్తిగా ఎలక్ట్రిక్తో రూపొందే కొత్త వాహనాల విక్రయాలకు 2047 ఏడాది వరకు సమయం పడుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రి బాడీ సియామ్ ప్రతిపాదించింది. అదేవిధంగా ఇంట్రా-సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లీట్ను 2030 వరకు సాధించవచ్చని వెల్లడించింది. 2030 వరకు 40 శాతం కొత్త వాహనాల విక్రయాలు పూర్తిగా ఎలక్ట్రిక్తో రూపొందేవిగా ఉండాలని సియామ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి ఓ పత్రం కూడా నివేదించినట్టు పేర్కొంది. పబ్లిక్ మొబిలిటీ కోసం 100 శాతం ఎలక్ట్రిక్ అందించేలా ప్రభుత్వ విజన్కు అనుకూలంగా పనిచేస్తున్నామని, 2030 వరకు వ్యక్తిగత అవసరాల కోసం వాడే మొబిలిటీలో 40 శాతం ఎలక్ట్రిక్వే ఉండబోతున్నట్టు సియామ్ తెలిపింది. 2030 వరకు ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారును దేశంలో విక్రయించబోమని ఈ ఏడాది ఏఫ్రిల్లో విద్యుత్ శాఖ మాజీ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే భారత్ స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించే రోడ్మ్యాప్ను సియామ్ ప్రతిపాదించింది. ప్రభుత్వం, ఇండస్ట్రి, వివిధ వాటాదారులు కలిసి పనిచేయాలని, 100 శాతం అంకితభావంతో పెట్టుబడులు పెట్టాలని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోడియా తెలిపారు. -
వాహన విక్రయాలు వెలవెల
జూన్లో 11 శాతం డౌన్ న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు జూన్ నెలలో 11 శాతం తగ్గాయి. గత ఆరు నెలల కాలంలో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. జీఎస్టీ అమలుకు ముందు డీలర్లు.. కంపెనీల నుంచి కొత్త స్టాక్ను తీసుకోకపోవడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ట్రాన్సిషనల్ నష్టాలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో డీలర్లు కొత్త స్టాక్కు దూరంగా ఉన్నారు. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు జూన్లో 11.21 శాతం క్షీణతతో 1,98,399 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వాహన అమ్మకాలు 2,23,454 యూనిట్లుగా ఉన్నాయి. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ నుంచి కోలుకొని జనవరి నుంచి పెరుగుతూ వస్తున్న ప్యాసింజర్ వాహన విక్రయాలు తాజా నెలలో ఒక్కసారిగా తగ్గాయి. 2013 మార్చి (–13.01 శాతం) నుంచి ఇదే అతిపెద్ద క్షీణత. ⇔ కార్ల విక్రయాలు 11.24 శాతం క్షీణించాయి. ఇవి 1,54,237 యూనిట్ల నుంచి 1,36,895 యూనిట్లకు తగ్గాయి. 2013 మే తరువాత ఇదే అతిపెద్ద క్షీణత. ⇔ మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1 శాతం వృద్ధితో 93,057 యూనిట్లకు పెరిగాయి. ⇔ హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 5.64 శాతం క్షీణతతో 37,562 యూనిట్లకు, మహీంద్రా విక్రయాలు 5.27 శాతం క్షీణతతో 16,169 యూనిట్లకు తగ్గాయి. ⇔ టాటా మోటార్స్ అమ్మకాలు 12.19 శాతం క్షీణతతో 13,148 యూనిట్లకు పరిమితమయ్యాయి. -
వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.63 శాతం వృద్ధితో 2,31,640 యూనిట్ల నుంచి 2,51,642 యూనిట్లకు పెరిగాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఉండటం వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక దేశీ కార్ల విక్రయాలు కూడా 4.8 శాతం వృద్ధితో 1,58,996 యూనిట్ల నుంచి 1,66,630 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 69,845 యూనిట్లకు ఎగశాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం.. ⇔ మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 1,30,238 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ హ్యుందాయ్ అమ్మకాలు 1.59 శాతం వృద్ధితో 42,007 యూనిట్లకు పెరిగాయి. ⇔ మహీంద్రా వాహన విక్రయాలు 3.23 శాతం వృద్ధి చెందాయి. ఇవి 20,270 యూనిట్లుగా నమోదయ్యాయి. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించండి కేంద్రానికి వాహన కంపెనీల విజ్ఞప్తి హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించాలని వాహన కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. వీటికి 18% జీఎస్టీ పన్ను రేటు వర్తింపజేయాలని అభ్యర్థించాయి. పర్యావరణ వాహనాలను, లగ్జరీ మోడళ్లలను ఒకే విధంగా పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదని తెలియజేశాయి. జులై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను జీఎస్టీలో హైబ్రిడ్ వాహనాలపై కూడా 28% పన్ను విధించారు. దీనికి 15% సెస్సు అదనం. ప్రస్తుతం హైబ్రిడ్ వాహనాలపై పన్ను రేటు 30.3%. -
జీఎస్టీ: ఆటోఇండస్ట్రీకి మేలు చేస్తుందా?
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నుల రేటుపై ఆటోమొబైల్ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు 18శాతం పన్నురేటుపై టెలికాం పరిశ్రమ నిరాశను ప్రకటించగా, ఆటోఇండస్ట్రీ మాత్రంహర్హం వ్యక్తం చేసింది. జీఎస్టీ తాజా పన్ను రేట్లు పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని ఆటో మొబైల్ పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ రేట్లు ఊహించిన రీతిలో ఉన్నాయని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. పన్నుల విషయంలో స్థిరత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. దేశంలో ఆటోమోటివ్ మార్కెట్ను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2016-26విజన్ సాధనకు మార్గాన్ని సుగమం చేస్తుదని సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. పర్యావరణ హితమైన ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీకి ప్రభుత్వం ప్రోత్సాహిన్నిస్తోందన్నారు. ఇలాంటి వాహనాలపై తక్కువ పన్నురేటువిధానాలు గ్రీన్హౌస్ వాయువుల ఉద్గా రాలను,కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయం చేస్తాయన్నారు. అయితే లగ్జరీ వాహనాలపైనా, ప్రజా రవాణాకుపయోగపడే 10-13 సీటర్ వాహనాలపై 15శాతం సెస్ ఊహించలేదన్నారు. దీన్ని సమీక్షించాల్సి ఉందన్నారు. -
కార్ల అమ్మకాలు పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోందని, కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని సియామ్ తెలిపింది. గత నెలలో ప్రయాణికుల వాహన విక్రయాలు 14 శాతం పుంజుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)పేర్కొంది. వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలదన్న అంచనాలు పెరిగాయని వివరించింది. అయితే టూ–వీలర్ల అమ్మకాలు తగ్గడం కొనసాగుతోందని పేర్కొంది. 2015, జనవరిలో 1,68,303గా ఉన్న దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో 11 శాతం వృద్ధితో 1,86,523కు పెరిగాయని తెలిపింది. -
వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్
• స్వల్పంగా పెరిగిన ప్యాసెంజర్ వాహన అమ్మకాలు • ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట వృద్ధి • సియామ్ గణాంకాలు న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వాహన విక్రయాలకు కరెన్సీ నోట్ల రద్దు సెగ తగిలింది. ఇవి నవంబర్ నెలలో స్వల్పంగా పెరిగి, 1.82 శాతం వృద్ధితో 2,40,979 యూనిట్లకు ఎగశారుు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థారుు వృద్ధి. గతేడాది ఇదే నెలలో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 2,36,664 యూని ట్లుగా నమోదయ్యారుు. ఇక టూవీలర్ విక్రయాలు దాదాపు 6% క్షీణించారుు. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ దేశీ కార్ల విక్రయాలు 1,73,111 యూనిట్ల నుంచి 1,73,606 యూనిట్లకు పెరిగారుు. వాణిజ్య వాహన అమ్మకాలు 12 శాతం క్షీణతతో 45,773 యూనిట్లకు తగ్గారుు. ఇక మొత్తం వాహన విక్రయాలు 5.48 శాతం క్షీణతతో 16,54,407 యూనిట్ల నుంచి 15,63,665 యూనిట్లకు పడ్డారుు. గత 43 నెలల నుంచి చూస్తే ఈ స్థారుులో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరగా 2013 మార్చిలో మొత్తం వాహన విక్రయాల్లో 8 శాతం క్షీణత నమోదరుు్యంది. ⇔ మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 8 శాతం వృద్ధితో 89,479 యూనిట్ల నుంచి 96,767 యూనిట్లకు పెరిగారుు. ⇔ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ కార్ల అమ్మకాలు 13 శాతం క్షీణతతో 37,771 యూనిట్ల నుంచి 32,923 యూనిట్లకు తగ్గారుు. ⇔ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 34 శాతం క్షీణతతో 12,410 యూనిట్లకు పడ్డారుు. ⇔ మొత్తం టూవీలర్ అమ్మకాలు 6 శాతం తగ్గుదలతో 13,20,552 యూనిట్ల నుంచి 12,43,251 యూనిట్లకు క్షీణించారుు. ⇔ మోటార్సైకిల్ విక్రయాలు 10 శాతం క్షీణతతో 8,66,696 యూనిట్ల నుంచి 7,78,178 యూనిట్లకు పడ్డారుు. హీరో మోటోకార్ప్ విక్రయాలు 12 శాతంమేర, బజాజ్ అమ్మకాలు 8 శాతం మేర, హోండా విక్రయాలు 7% మేర క్షీణించారుు. ⇔ స్కూటర్ అమ్మకాలు 2 శాతం క్షీణతతో 3,96,024 యూనిట్ల నుంచి 3,88,692 యూనిట్లకు తగ్గారుు. హోండా విక్రయాలు 2 శాతంమేర, హీరో అమ్మకాలు 19 శాతంమేర, టీవీఎస్ విక్రయాలు 3 శాతంమేర క్షీణించారుు. -
2020కి బీఎస్-6 నిబంధనల అమలుకు సిద్ధం: సియామ్
న్యూఢిల్లీ: దేశీ వాహన పరిశ్రమ 2020 నాటికి బీఎస్-6 ఉద్గార నిబంధనల అమలుకు సిద్ధంగా ఉందని సియామ్ తెలిపింది. ఇక బీఎస్-4 నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావొచ్చని అభిప్రాయపడి ంది. దీనికోసం బీఎస్-4 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపింది. వాహన కంపెనీలు ఈ కొత్త ఇంధన లభ్యతకు సంబంధించి ఆయిల్ కంపెనీలపై పూర్తి విశ్వాసంతో ఉన్నాయని పేర్కొంది. ఒకసారి నిబంధనల అమలుకు అంగీకరించిన తర్వాత వాటిల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు, వాయిదాలు ఉండబోవని సియామ్.. వాహన కంపెనీలను హెచ్చరించింది. కేంద్రం బీఎస్-4/6 ఇంధనానికి సంబంధించి ఆయిల్ కంపెనీలకు ఇచ్చిన పలు మినహాయింపుల వల్ల వాహన కంపెనీలకు సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. కంపెనీలు తయారు చేసే వాహనాల ఇంధన సామర్థ్యంపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. భద్రత, ఉద్గారాలకు సంబంధించిన కొత్త నిబంధనల అమలు దిశగా భారత్ చాలా వేగంగా కదులుతోందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి తెలిపారు. 2020కి బీఎస్-6 నిబంధలను తక్కువ కాలంలో అమల్లోకి తీసుకురావడం కష్టసాధ్యమైనా.. వాహన పరిశ్రమ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వాహన కంపెనీలు వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీఎస్-6 నిబంధల అమలు సవాల్ను స్వీకరించాయని చెప్పారు. -
‘ఫేమ్’ దేశవ్యాప్తం చేయాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకాన్ని మరిన్ని పట్టణాలకు విస్తరించాలని, అప్పుడే వాటి వినియోగం ఊపందుకుంటుందని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కేంద్రానికి సూచిం చింది. ఆటోమొబైల్ రంగంలోకి దీర్ఘకాలం పాటు పెట్టబడులు రావడానికి, వృద్ధిని సాధించడానికి స్థిరమైన, అర్థవంతమైన నియంత్రణ విధానం కీలకమని జనరల్మోటార్స్ పేర్కొంది. 56వ సియామ్ వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగం ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. రోడ్ మ్యాప్ కావాలి దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచాలంటే మిగిలిన పట్టణాలను కూడా ఫేమ్ పథకం పరిధిలోకి తీసుకురావాలని సియామ్ సూచించింది. ప్రస్తుతం కొన్ని పట్టణాలకే పరిమితమైన దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సియామ్ ప్రెసిడెంట్, అశోక్లేలాండ్ ఎండీ వినోద్దాసరి కోరారు. రెండేళ్ల ప్రయోగాత్మక పథకంలో ఇది రెండో సంవత్సరమని, 80వేలకు పైగా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలను విక్రయించగా వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేదిలా ఉందన్నారు. ఈ పథకం కింద బైక్కు రూ.29వేల వరకు, కారుకు రూ.1.38 లక్షల వరకు రాయితీలు అందుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, భద్రతను పెంచుతూ, ఇంధన సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం వెంటనే ఓ రోడ్మ్యాప్ తీసుకురావాలని దాసరి కోరారు. మమ్మల్నీ గుర్తించండి... ‘ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో పరిశ్రమనూ భాగస్వామిని చేయాలి. కేవలం ఎన్జీవోలు, సామాజిక ఉద్యమకర్తలతోనే విధానాలను నిర్ణయించరాదు. తగినంత విజ్ఞానం, అనుభవం ఆధారంగా విధానాలను రూపొందించాలి’ అని టాటా మోటార్స్ సీఈవో గుంటెర్ బట్స్చెక్ అన్నారు.. వాహనాలను బలవంతంగా తొలగించాలా, లేక స్వచ్చందంగానా అన్నది వేచి చూడాలని అభిప్రాయపడ్డారు. 2020 నాటికి మూడో అతిపెద్ద మార్కెట్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ 2020 నాటికి ప్ర పంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తుం దని అంచనా వేస్తున్నట్టు జనరల్ మోటార్స్ ఎండీ కహేర్కజీమ్ తెలిపారు. అర్థవంతమైన నియంత్రిత కార్యాచరణ విధానం దీర్ఘకాలంలో పెట్టుబడులు రాబట్టడానికి, వృద్ధి చెందడానికి కీలకమన్నారు. వాహనాల తొలగింపుపై త్వరలో ఉత్తర్వులు వాణిజ్య వాహనాల తొలగింపు విధానానికి త్వరలోనే కేబినెట్ అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలసి ముందుకు సాగితే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఈ మేరకు ఆయన సియామ్ సమావేశంలో వీడియో సందేశం వినిపించారు. ఆటోమొబైల్ రంగం ఎక్కువ మంది కార్మికులతో కూడుకున్నందున ఈ రంగానికి ప్రోత్సాహకాలతోపాటు ఎగుమతుల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. 2020 ఏప్రిల్ 1 నుంచి యూరో 6 ప్రమాణాలను అమలు చేస్తామన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గీతే మాట్లాడుతూ... కాలుష్యం పెరిగిపోతున్నందున పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకే ఫేమ్ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. -
ప్రయాణికుల వాహనాల్లో ‘మారుతీ’నే టాప్
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల్లో మారుతీ సుజుకి తన అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై నెలకు సంబంధించి అధికంగా అమ్ముడు పోయిన మొదటి పది ప్యాసింజర్ కార్లలో ఏడు మోడల్స్ మారుతీవే ఉన్నాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) గణాంకాల ప్రకారం... జూలైలో విక్రయాల పరంగా మారుతి ఆల్టో మొదటి స్థానంలో నిలిచింది. 19,844 కార్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 11,961 యూనిట్లతో ఐదో స్థానం దక్కించుకుంది. విటారా బ్రెజా 10,232 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. -
వరుసగా 12వ నెలా రయ్.. రయ్..
పాసింజర్ వాహనాలు వరుసగా 12వ నెల కూడా అమ్మకాల్లో దూసుకెళ్లాయి. కార్లు, యుటిలిటీ వెహికిల్స్, వ్యాన్ల అమ్మకాలు జూన్ నెలలో 2.68శాతం పెరిగి 2,23,454 యూనిట్లగా నమోదయ్యాయి. ఇండస్ట్రి బాడీ భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ(సియామ్) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. అయితే కారు విభాగంలో అమ్మకాలు క్షీణించాయి. గత ఏడాది కంటే 5.18శాతం పడిపోయి, 12,54,237 యూనిట్లగా నమోదయ్యాయి. గతేడాది జూన్ లో కార్ల అమ్మకాలు 1,62,655 యూనిట్లగా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఇండియా అతిపెద్ద వెండర్స్ లో ఒకటైన సుబ్రోష్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం, మారుతీ ఉత్పత్తులపై ప్రభావం చూపినట్టు సియామ్ నివేదిక పేర్కొంది. ప్రముఖ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్(ఎస్ యూవీ) ఆరు నెలలో ఐదు నెలలూ పడిపోయి, కార్ల అమ్మకాలపై ప్రబావం చూపాయి. అయితే యుటిలిటీ వాహన అమ్మకాల వృద్ధిని కొనసాగించినట్టు సియామ్ వెల్లడించింది. యుటిలిటీ వాహన అమ్మకాలు 35.24శాతం పెరిగి 55,825 యూనిట్లను నమోదుచేశాయి. గత నెల వాణిజ్య వాహన అమ్మకాలు 5.63శాతం ఎగిసి 56,032 యూనిట్లగా.. టూవీలర్ వాహనాలు 12.26శాతం పెరిగి 14,68,035 యూనిట్లగా రికార్డు అయినట్టు సియామ్ తెలిపింది. స్కూటర్ల అమ్మకాలు 21.32శాతం బలమైన వృద్ధితో 21.32శాతం పెరిగి, 4,49,756 యూనిట్లుగా ఉన్నాయి. అదేవిధంగా మోటార్ సైకిల్స్ 7.52శాతం వృద్ధితో 9,43,680 యూనిట్లుగా నమోదయ్యాయి. -
టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే!
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) విటారా బ్రీజా రయ్యిమని దూసుకుపోతోంది. ఈ మోడల్స్ అమ్మకాల్లో అదుర్స్ మనిపిస్తూ టాప్-10 ప్యాసెంజర్ వెహికిల్ జాబితాలో చోటు సాధించింది. టాప్-10 అమ్మకాల జాబితాలో ఆరు మోడల్స్ మారుతీ సుజుకీవే ఉన్నాయి. మే నెలలో 7,193 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ విటారా బ్రీజ్ 10వ స్థానంలో నిలవగా.. ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో 19,874 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందని భారత ఆటోమొబైల్ తయారీ సంఘ సొసైటీ(సియామ్) గణాంకాల్లో తెలిపింది. 14,413 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రెండో స్థానంలో ఉంది. మారుతీ సుజుకీ బ్రాండ్లు వాగన్ ఆర్ మూడో స్థానం, స్విప్ట్ నాలుగోస్థానం, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఏడో స్థానం, సెలిరియో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 12,005 యూనిట్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానానికి ఎగబాకగా, 10,472 యూనిట్ల అమ్మకాలతో ప్రీమియం కాంపాక్ట్ ఎలైట్ ఐ20 ఆరో స్థానానికి ఎగిసిందని సియామ్ తెలిపింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బహుళ ప్రయోజన వాహనం ఇన్నోవా క్రిస్టా కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. 7,259 యూనిట్లతో టయోటా ఇన్నోవా తొమ్మిదో స్థానంలో నిలిచింది. -
ఏప్రిల్లో కార్ల అమ్మకాలు రయ్!
కొత్త మోడళ్లతో పెరిగిన విక్రయాలు ♦ పెళ్లిళ్ల సీజన్తో పెరిగిన బైక్ల అమ్మకాలు ♦ సియామ్ వెల్లడి న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల అమ్మకాలు మూడు నెలల క్షీణత తర్వాత ఏప్రిల్లో పుంజుకున్నాయి. మారుతీ బాలెనో, రెనో క్విడ్ వంటి కొత్త మోడళ్ల కారణంగా ఏప్రిల్లో కార్ల విక్రయాలు 1.87 శాతం పెరిగాయని సియామ్ పేర్కొంది. అయితే గ్రామీణ మార్కెట్లో విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఇంకా పుంజుకోలేదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సియామ్) డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. ఏప్రిల్లో అన్ని సెగ్మెంట్లలో వాహన విక్రయాలు పుంజుకోవడం భారత వాహన పరిశ్రమకు సానుకూలమని ప్రైస్ వాటర్హౌస్ భాగస్వామి అబ్దుల్ మాజీద్ పేర్కొన్నారు. డీజిల్ వాహనాలకు సంబంధించిన అనిశ్చితి త్వరలోనే తొలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాత వాహనాల మార్పిడికి ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ఇస్తే డిమాండ్ మరింతగా పుంజుకుంటుందని సూచించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోయినా, డీజిల్ వాహనాలపై అనిశ్చితి కొనసాగినా వాహన పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఏప్రిల్ వాహన విక్రయాలపై సియామ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., ♦ గత ఏడాది ఏప్రిల్లో 1,59,588గా ఉన్న ప్రయాణికుల కార్ల అమ్మకాలు(దేశీయ) ఈ ఏడాది ఏప్రిల్లో 1,62,566కు పెరిగాయి. ♦ మొత్తం ప్రయాణికుల వాహనాల సెగ్మెంట్ 11 శాతం వృద్ధి చెందింది. హ్యుందాయ్ క్రెటా, మారుతీ విటారా బ్రెజా, మహీంద్రా కేయూవీ100 వంటి వాహనాలు మంచి అమ్మకాలు సాధించాయి. గత ఏడాది ఏప్రిల్లో 2,17,989గా ఉన్న ప్రయాణికుల వాహనాల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్లో 2,42,060కు పెరిగాయి. ♦ యుటిలిటి వాహన విక్రయాలు 43 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ వాహన విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. ♦ పెళ్లిళ్ల సీజన్ కారణంగా మోటార్ సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న అంచనాల వల్ల సెంటిమెంట్ మెరుగుపడినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ♦ 2011-12లో వివిధ కేటగిరి వాహన విక్రయాలు గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతానికైతే ఏ కేటగిరి వాహనాలు కూడా ఈ స్థాయి దరిదాపుల్లో లేవు. ♦ వాణిజ్య వాహనాల విక్రయాలు 17 శాతం వృద్ధితో 53,835కు పెరిగాయి. ♦ మౌలిక, గనుల రంగాల జోరు పెరగడంతో భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్కు డిమాండ్ బాగా పెరుగుతోంది. ♦ గత ఏడాది ఏప్రిల్లో 15,83,582గా ఉన్న అన్ని కేటగిరిల వాహన విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్లో 17 శాతం వృద్ధితో 19,00,879కు పెరిగాయి. -
పన్నులు తగ్గించండి.
-
వరుసగా పదో నెలలోనూ పెరిగిన కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: కార్ల విక్రయాలు ఆగస్టులో 6 శాతం పెరిగాయి. కార్ల అమ్మకాలు పెరగడం ఇది వరుసగా పదవ నెల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని, వాహన పరిశ్రమ మెల్లమెల్లగా రికవరీ బాట పడుతోందని సియాం డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. వడ్డీరేట్లు తగ్గితే డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. అయితే ఆగస్టులో మోటార్ సైకిళ్ల అమ్మకాలు 10 శాతం తగ్గాయని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్ తగ్గడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సియాం కొత్త ప్రెసిడెంట్ వినోద్ దాసరి
- వైస్-ప్రెసిడెంట్గా జనరల్ మోటార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం) కొత్త ప్రెసిడెంట్గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎన్నికయ్యారు. కొత్త వైస్-ప్రెసిడెంట్గా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా, కొత్త కోశాధికారిగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ ఎన్నికయ్యారు. వాహన పరిశ్రమ మెరుగుదలకు తగిన కృషి చేస్తానని ఈ సందర్భంగా వినోద్ దాసరి పేర్కొన్నారు. జాతి పట్ల సియాం సంస్థకున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పాడతానని చెప్పారు. వాహన కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే దేశంలోనే అతిపెద్ద సంస్థ సియాం, పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. వాహన పరిశ్రమకు సంబంధించి నియమ, నిబంధనలను, విధానాల రూపకల్పనలో సంబంధిత వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తుంది. -
పన్నులు మరింత తగ్గించాలి
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా పడిపోయాయి. ఆర్థిక మందగమనం కారణంగా కార్లకు డిమాండ్ తగ్గిందని, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు 4.65 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియాం) వెల్లడించింది. ఫలితంగా ఈ రంగంతో సంబంధం ఉన్న లక్ష-లక్షన్నర ఉద్యోగాలు పోయాయన్న అంచనాలున్నాయని సియాం అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్వల్పంగా పుంజుకోవచ్చని, కనీసం ప్రతికూల ఫలితాలు రాకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాహన రంగంపై పన్నులు బాగా ఉన్నాయని, పన్నులు మరింత తగ్గించాలని ఆయన కోరారు. వృద్ధికి ఊతమిచ్చేలా, తయారీ రంగం పుంజుకునేలా, వినియోగదారు సెంటిమెంట్ను పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడే చర్యలు తీసుకుంటే వాహన రంగానికి కూడా ప్రయోజనమేనని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుండడంతో తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు పెరుగుతాయని, టూవీలర్ల, ముఖ్యంగా స్కూటర్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహన కంపెనీలు రూ.20 వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాయని, 35 కొత్త మోడళ్లు, 51 కొత్త వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయని వివరించారు. స్వచ్ఛంద వాహన రీకాల్ విధానానికి వాహన పరిశ్రమ అనుకూలమేనని ఆయన వివరించారు. పెరిగిన మారుతీ మార్కెట్ వాటా భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో మారుతీ సుజుకి వాటా మరింత పెరిగి 42 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి వాహన విక్రయాలకు సంబంధించిన గణాంకాలను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు తగ్గినప్పటికీ, మారుతీ మార్కెట్ వాటా 39.43 శాతం నుంచి 42 శాతానికి పెరగడం విశేషం. సియామ్ గణాంకాల ప్రకారం... హ్యుందాయ్ కంపెనీ 15.18 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో టాటా మోటార్స్ను తోసిరాజని మహీంద్రా అండ్ మహీంద్రా(10.15 శాతం) దూసుకువచ్చింది. 8 శాతం మార్కెట్ వాటాతో టాటా మోటార్స్ నాలుగో స్థానంతో సరిపుచ్చుకుంది. ఐదవ స్థానంలో హోండా(5.36 శాతం మార్కెట్ వాటా), ఆరవ స్థానంలో టయోటా(5.14 శాతం)లు నిలిచాయి. -
కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఇంతేనేమో!
న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు నవంబర్లో 8 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ మంగళవారం తెలిపారు. పండుగల సీజన్ ముగియడంతో అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. పండుగల సీజన్లో ఉన్నంతగా నవంబర్లో వాహన విక్రయాలుండవని అంచనా వేశామని, అందుకు తగ్గట్లుగానే అమ్మకాలు పడిపోయాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ పరిస్థితుల్లో మార్పుండకపోవచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అద్భుత చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...., గత నవంబర్లో 1,55,535 కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది నవంబర్లో 1,42,849 కార్లు విక్రయమయ్యాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 8,67,508 నుంచి 1 శాతం వృద్ధితో 8,80,015కు పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 2,44,414 నుంచి 25 శాతం వృద్ధి చెంది 3,05,586కు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 61,403 నుంచి 29 శాతం క్షీణించి 43,730కు తగ్గాయి. మొత్తం మీద గత నవబర్లో 15,12,869గా ఉన్న మొత్తం వాహనాల అమ్మకాలు 0.90 శాతం వృద్ధితో ఈ ఏడాది నవంబర్లో 15,26,438కు చేరాయి. వడ్డీరేట్లు, ఇంధనం ధరలు పెరుగుతుండడం, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంట్ తక్కువగా ఉండడం వంటి అంశాలు వాహనాల డిమాండ్, అమ్మకాలపై ప్రభావం చూపాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్ అమ్మకాలు 4% చొప్పున తగ్గాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 42% పడిపోయాయి. హోండా అమేజ్ కారు కారణంగా హోండా కార్స్ ఇండియా విక్రయాలు మాత్రం 151 % పెరిగాయి. -
కార్ల పరుగు: సియాం
న్యూఢిల్లీ: దేశీయంగా కార్ల అమ్మకాలు సెప్టెంబర్లో పుంజుకున్నాయి. గత నెలలో మొత్తం 1,56,018 కార్లు అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికంగా కార్లు విక్రయమైన నెల ఇదేనని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా మందగమనంగా ఉన్న కార్ల విక్రయా లు సెప్టెంబర్లో పెరగడంతో వాహన మార్కెట్ పుంజుకుంటోందన్న ఆశలను రేకెత్తిస్తోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కనిష్ట క్షీణత : ఒక్క కార్లే కాకుండా, ప్రయాణికుల, యుటిలిటీ వాహనాలు, టూ- వీలర్ల అమ్మకాలు సెప్టెంబర్లో పుంజుకున్నాయని, ఇదే జోరు కొనసాగగలదన్న ఆశాభావాన్ని విక్రమ్ కిర్లోస్కర్ వ్యక్తం చేశారు. అయి తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు వృద్ధి సాధించే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కార్ల అమ్మకాలు 4.67 శాతం క్షీణించాయని, 2002-03 ఆర్థిక సంవత్సరం తర్వాత కనిష్ట క్షీణత ఇదేనని వివరించారు. 2002-03 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కార్ల అమ్మకాల క్షీణత 6.96 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. వర్షాలు బాగా కురవడం వల్ల పండుగల సీజన్లో అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. -
‘సియాం’ కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్
న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) కొత్త అధ్యక్షుడిగా విక్రమ్ కిర్లోస్కర్ ఎన్నికయ్యారని సియాం తెలిపింది. ఆయన టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇక సియాం కొత్త వైస్ ప్రెసిడెంట్గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి, కోశాధికారిగా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ లొవెల్ పాడాక్లు ఎన్నికయ్యారని సియాం పేర్కొంది. భారత వాహన పరిశ్రమకు ఉన్నత స్థానాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండడమే కాకుండా వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే గురుతర బాధ్యతను కూడా నిర్వర్తిస్తోందని చెప్పారు.