-
ఈ స్కూటర్ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
నిమిషానికి 90 టీ-షర్ట్స్ సేల్.. దూసుకెళ్లిన అమ్మకాలు
టాటా గ్రూప్ ఫ్యాషన్ చైన్ జూడియో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నిమిషానికి 90 టీ-షర్టులు, 17 లిప్స్టిక్లను విక్రయించినట్లు మాతృ సంస్థ ట్రెంట్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.జూడియో ప్రతి నిమిషానికి 20 డెనిమ్లు విక్రయిస్తూ.. యువ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రెంట్ ఆదాయం 36.1 మిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. అంతే కాకుండా సంస్థ కొత్తగా మరో 46 నగరాల్లో స్టోర్స్ ప్రారంభించింది.2016లో ప్రారంభించిన జుడియోకి 2024 మార్చి నాటికి 161 నగరాల్లో 545 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 86 జూడియో ఔట్లెట్లు, గుజరాత్లో 82 ఉన్నాయి. కర్ణాటకలో 58, ఢిల్లీలో 14 ఔట్లెట్లు జూడియోకు ఉన్నాయని మే 18న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసి.. కస్టమర్లకు చేరువ్వడం వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది. -
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు
భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్ఎఫ్ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్ నివేదిక హైలెట్ చేసింది. -
బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను ఈ మార్చి 2న నిర్వహించాయి. -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
300 నగరాల్లో కియా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కియా ఇండియా విక్రయ, సర్విస్ కేంద్రాలను విస్తరిస్తోంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా డిసెంబర్కల్లా 300 నగరాలు, పట్టణాల్లో అడుగు పెట్టడం ద్వారా టచ్ పాయింట్స్ సంఖ్యను 700లకు చేరుస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 236 నగరాలు, పట్టణాల్లో కంపెనీకి 522 సేల్స్, సర్విస్ సెంటర్స్ ఉన్నాయి. -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్షాప్స్ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్బ్యాక్స్కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
కమర్షియల్ వాహనాలకు ఎలక్షన్స్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు 2024–25లో 4–7 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాలలో విరామం కారణంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయని అంచనా. దేశీయ సీవీ పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీవీల కోసం దీర్ఘకాలిక డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంటుంది. మౌలిక రంగ మూలధన వ్యయంపై నిరంతర దృష్టి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ, తయారీ కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కమర్షియల్ వెహికిల్స్ పరిశ్రమకు దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చు’ అని ఇక్రా తెలిపింది. -
50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు. -
సేల్స్ బీభత్సం.. భారత్లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
భారత్లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్సైజ్ ఎస్యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది. ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు. -
భారత్లో భారీగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఇదే..
ధర ఎక్కువైనప్పటికీ భారతీయ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు డిమాండ్ భారీగానే ఉంది. గత అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రికార్డ్ సేల్స్ సాధించి, 7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కెనాలిస్ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కూడా అత్యధికంగా 15 సిరీస్ మోడళ్లకు గిరాకీ ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో సులభ ఫైనాన్సింగ్ ఎంపికలు, రిటైలర్లకు ప్రోత్సాహక పథకాల కారణంగా.. పండుగ సీజన్లో అమ్మకాలు బాగా పెరిగాయి. అంతే కాకుండా గతేడాది ఐ15 సిరీస్ లాంచ్ అవ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ మీద కూడా సంస్థ తగ్గింపులు ప్రకటించడంతో ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. యాపిల్ మొబైల్స్ అమ్మకాల తరువాత శాంసంగ్, షావోమి, వివో, రియల్మీ, ఒప్పో వంటి కంపెనీలు మంచి అమ్మకాలను పొందాయి. భారతదేశంలో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ల సంఖ్య 14.86 కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది 5జీ పరికరాల ధరలు పెరుగుదల కారణంగా.. తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. కానీ కెనాలిస్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మకాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అయితే అమ్మకాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన విషయమే.. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
అక్కడ ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఈవీ.. భారీ రాయితీలే కారణమా?
నిత్యం కాలుష్యంతో సతమతవుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి సంప్రదాయ ఇంధన వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది సఫలమైనట్టుగానే కనిపిస్తోంది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా నవంబర్ 2023లో 9.5 శాతం ఉండగా డిసెంబర్లో 19.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో డిసెంబరు నెలలో అమ్ముడుపోయిన ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. 2020 ఆగస్ట్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వల్లే ఇది సాధ్యమైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీ కింద ఈవీల కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు రూ. 1.5 లక్షల వరకు క్యాష్బ్యాక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, సరుకు రవాణా వాహనాలకు రూ. 30,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకోవాలనుకునే వారికి స్క్రాపింగ్ ఇన్సెంటివ్లు సైతం ప్రకటించింది. ఒక సంవత్సరంలో నగరం అంతటా 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, పాలసీ అమలును పర్యవేక్షించడానికి 'స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్'ని ఏర్పాటు చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలోని వాటాదారులందరి మధ్య సమన్వయం, సహకారం కోసం త్వరలో ఢిల్లీ ఈవీ ఫోరమ్ను ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో డిస్కౌంటే డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్లో రిపబ్లిక్డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్లో భాగంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్లో కస్టమర్లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 50 వేల వరకు డిస్కౌంట్ రాబోయే సేల్లో అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. 75 శాతం.. 65 శాతం డిస్కౌంట్ అదేవిధంగా, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. -
రియల్ఎస్టేట్ కింగ్ హైదరాబాద్! రికార్డ్స్థాయిలో అమ్ముడుపోయిన ఇళ్లు
రియల్ఎస్టేట్లో హైదరాబాద్ సత్తా చాటింది. గతేడాది నగరంలో ఇళ్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడైంది. ఆల్టైమ్ హై నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో హైదరాబాద్లో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 6 శాతం పెరిగాయి. ఇక హౌసింగ్ యూనిట్ల ప్రారంభంలోనూ కొత్త రికార్డును నెలకొల్పుతూ, నగరంలో రెసిడెన్షియల్ లాంచ్లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. గృహ కొనుగోలుదారులు జీవనశైలి అప్గ్రేడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలు అధికంగా ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా నైట్ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక ఇళ్ల బలమైన డిమాండ్-సరఫరా, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత పెరగడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఖరీదువారీగా చూస్తే.. రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి. రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి క్షీణించాయి. ఈ ధర విభాగంలో 2023లో దాదాపు 13,120 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లో 13,784 యూనిట్లతో పోల్చితే 5 శాతం తగ్గాయి. భారీగా పెరిగిన ధరలు నగరంలో ఇళ్ల ధరలు 2023లో భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్ ఫలితంగా ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల నమోదైంది. నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ప్రాంతాలవారీగా తీసుకుంటే వెస్ట్ రీజియన్లోని కోకాపేటలో అత్యధికంగా 39 శాతం పెరుగుదల ఉంది. 28 శాతం పెరుగుదలతో మణికొండ ఆ తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా నార్త్ రీజియన్లోని సైనిక్పురిలో 2 శాతం ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఆఫీస్ మార్కట్లోనూ.. ఆఫీస్ మార్కట్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో 52 శాతం, 4.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. నగరంలో 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లావాదేవీల జరగ్గా 2023 సంవత్సరంలో 8.8 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సాక్షన్లు నమోదు చేసింది. మరో వైపు నగరంలో 6.5 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్ల సరఫరా నమోదైంది. -
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
అపోహలొద్దు.. అర్హులందరికీ లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పింఛన్ల పథకం కింద పాత లబ్ధిదారులందరికీ ఆ పథకాలు వర్తిస్తా యని వారు కొత్తగా రైతు భరోసా, చేయూత పథకాల కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరో సా, పింఛన్లపై అనవసర అపోహలు వద్దని, కొత్తగా ఈ పథకాల కింద లబ్ధి పొందాలనుకునే వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని కోరారు. ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలవుతున్న తీరుపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితో సమీక్షించారు. ప్రజాపాలన దరఖాస్తులను కొంతమంది విక్రయిస్తుండడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల కొరత లేకుండా చూడండి దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటురానీయొద్దని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. -
ఈ కారుని 10 లక్షల మంది కొనేశారు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
2030 నాటికి అగ్రగామిగా భారత్ - ఇలా..
భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగం పెరుగుతూనే ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగంలో లెక్కకు మించిన వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఏడాదికి 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయాలు జరిగే అవకాశం ఉందని, 2030 నాటికి ఈ విభాగంలో దాదాపు 50 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' తాజాగా వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 3,45,4000 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు.. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం పొందనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడుతుందని అన్నారు. వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు తయారవుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న కార్లను కూడా ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గడ్కరీ తెలిపారు. కేవలం రోజు వారీ వినియోగానికి ఉపయోగించే వాహనాలు మాత్రమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ వంటి వాటిలో కూడా ఈవీల వినియోగం పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాయి. దీంతో తక్కువ కాలంలోనే ఈవీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ సబ్సిడీలను పరిమితం చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కల్పిస్తున్నారు. -
ఇలా ఎలా అనిపించిన ఓలా..
ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్ 2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్లైన్స్ క్రిస్మస్ సేల్లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
- Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
- ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
- ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- 3 నుంచి బడిబాట
- భారత్ లో ఏఐ జోరు
- సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్
- పత్తి విత్తనాల కొరత లేదు
- Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
- Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
Advertisement