sales
-
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: నెలాఖరుకల్లా..
న్యూఢిల్లీ: వెండార్లతో సంప్రదింపుల వల్ల తలెత్తిన వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు మధ్య వ్యత్యాసాల సమస్యను పరిష్కరించుకోవడంపై ఓలా ఎలక్ట్రిక్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 40 శాతం బ్యాక్లాగ్లను క్లియర్ చేశామని, మిగతా వాటిని నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది.ఓలా ఫిబ్రవరిలో 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వాహన్ పోర్టల్లో 8,651 స్కూటర్లు మాత్రమే రిజిస్టర్ అయినట్లు గత గణాంకాల్లో వెల్లడయ్యాయి. మార్చి 20 నాటికి కంపెనీ రిజి్రస్టేషన్లు 11,781 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల గణాంకాల్లో వ్యత్యాసాలను నియంత్రణ నిబంధనలపరమైన సమస్యగా కొన్ని స్వార్ధ శక్తులు దుష్ప్రచారం చేశాయని ఓలా వ్యాఖ్యానించింది.కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడం, లాభదాయకతను మెరుగుపర్చుకునే క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించే రెండు జాతీయ స్థాయి వెండార్లతో కాంట్రాక్టులను నిలిపివేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైందని పేర్కొంది. అమ్మకాలు, రిజి్రస్టేషన్ల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలపై భారీ పరిశ్రమల శాఖ, రహదారి రవాణా.. హైవేస్ శాఖ కంపెనీని స్పష్టత కోరిన నేపథ్యంలో ఓలా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
11 నెలలు.. నాలుగు లక్షల సేల్స్: బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే!
2025 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో టీవీఎస్ అపాచీ శ్రేణి బైకుల అమ్మకాలు నాలుగు లక్షల యూనిట్లు దాటాయి. 2019 ఆర్ధిక సంవత్సరంలో అధిక అమ్మకాలను పొందిన అపాచీ.. ఇప్పుడు మరోమారు సరికొత్త సేల్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బైక్ బెస్ట్ సెల్లింగ్ మోడల్గా నిలిచింది.టీవీఎస్ మోటార్సైకిల్ కంపెనీ 2025 ఆర్ధిక సంవత్సరంలో అమ్మకాల్లో బలమైన వృద్ధిని సాధించింది. ఇందులో స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, మోపెడ్లు ఉన్నాయి. 11 నెలల్లో కంపెనీ హోల్సేల్ అమ్మకాలు 32 లక్షల కంటే ఎక్కువ. ఈ సేల్స్ అంతకుముందు ఏడాది కంటే అధికం.టీవీఎస్ అపాచీ 150 సీసీ - 200 సీసీ విభాగంలో మంచి ఆదరణ పొందిన టీవీఎస్ అపాచీ సేల్స్.. 4 లక్షల యూనిట్లు దాటడం ఇది రెండోసారి. 2018లో కంపెనీ 399035 యూనిట్ల అపాచీ బైకులను విక్రయించింది. కోవిడ్ సమయంలో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి.ఇదీ చదవండి: రెండువారాల్లో 50000 బుకింగ్స్.. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనంటీవీఎస్ అపాచీ బైకులు మొత్తం నాలుగు మోడల్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు లక్ష రూపాయల కంటే ఎక్కువే. ఎంచుకునే వేరియంట్ను బట్టి ధరలు, ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి పనితీరు కూడా ఎంచుకునే ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది. -
రెండువారాల్లో 50000 బుకింగ్స్.. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం
అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన.. రెండు వారాల్లోనే 50,000 బుకింగ్లను అందుకుంది. లాంచ్ సమయంలో ప్రకటించిన ధర మొదటి 10000 యూనిట్లకు మాత్రమే పరిమితం అని కంపెనీ వెల్లడించింది. కానీ ఈ ఆఫర్ను 50000 బుకింగ్లకు పొడిగించింది. మొత్తం బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి.రెండు వారాల క్రితం షాక్వేవ్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్తో పాటు అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ను కూడా లాంచ్ అయింది. లాంచ్ సమయంలో, టెస్సెరాక్ట్ను రూ. 1.20 లక్షల ప్రారంభ ధరకు ఆవిష్కరించారు. ఈ ధర మొదటి 10,000 ప్రీ బుకింగ్లకు మాత్రమే చెల్లుతుందని బ్రాండ్ వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత కేవలం 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందింది. దీంతో కంపెనీ ఈ ఆఫర్ను మరో 30,000 ప్రీ-బుకింగ్లకు విస్తరిస్తున్నట్లు నిర్ణయించింది.అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్బోర్డ్ నావిగేషన్తో కూడిన 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్క్యామ్లు (ముందు, వెనుక), వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండిల్బార్ కోసం హాప్టిక్ ఫీడ్బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు. -
మూడేళ్ళలో.. రెండు లక్షల మంది కొన్న కారు ఇది
అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. దాని విభాగంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా అవతరించిన ఈ కారు.. ప్రీమియం ఫీచర్స్, కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.కియా ఇండియా.. కారెన్స్ కారును లాంచ్ చేసినప్పటి నుంచి, అంటే 36 నెలల్లో ఏకంగా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. కంపెనీ 70 కంటే ఎక్కువ దేశాల్లో 24064 యూనిట్ల కారెన్స్ కార్లను విక్రయించిందని స్పష్టం చేసింది.మొత్తం అమ్మకాలలో కారెన్స్ పెట్రోల్ వేరియంట్లు 58 శాతం వాటాను కలిగి ఉండగా, 42 శాతం కస్టమర్లు డీజిల్ వెర్షన్ను ఎంచుకున్నారు. 32% కొనుగోలుదారులు ఆటోమేటిక్, iMT ట్రాన్స్మిషన్లను ఎంచుకుంటున్నారు. 28 శాతం మంది కస్టమర్లు సన్రూఫ్తో కూడిన వేరియంట్లను ఎంచుకున్నారు.ఇదీ చదవండి: 48 గంటల్లో 20000 బుకింగ్స్.. మొదటి 50వేల మందికి..కియా కారెన్స్ ధరలు ఇండియన్ మార్కెట్లో రూ. 12.92 లక్షల నుంచి రూ. 19.95 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో, వివిధ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కాబట్టి ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.నెలవారీ (ఫిబ్రవరి) అమ్మకాల్లో సోనెట్ (7,598 యూనిట్లు), సెల్టోస్ (6,446 యూనిట్లు) మంచి వృద్ధిని సాధించాయి. కారెన్స్ గత నెలలో 5318 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం సేల్స్.. 2024 ఫిబ్రవరి కంటే 23.8 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తుంటే.. కియా కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. -
ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్లో (మార్చి 1, ఉదయం 7 గంటల నాటికి) అందుబాటులో ఉన్న సేల్స్ డేటా ప్రకారం.. 21,335 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, 'బజాజ్ చేతక్' 81 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది.ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 10,18,300 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు, మోపెడ్ల మొత్తం రిటైల్ అమ్మకాలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగం ఒక ఆర్ధిక సంవత్సరంలో మొదటిసారి.. 10 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ అమ్మకాలు అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ. ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో.. బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, మొదలైనవి ఉన్నాయి.ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీలు➤బజాజ్ ఆటో: 21,335 యూనిట్లు➤టీవీఎస్ మోటార్ : 18,746 యూనిట్లు➤ఏథర్ ఎనర్జీ: 11,788 యూనిట్లు➤ఓలా ఎలక్ట్రిక్: 8,647 యూనిట్లు➤గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ: 3,700 యూనిట్లు➤విడా (హీరో మోటోకార్ప్): 2,677 యూనిట్లుఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా -
రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన.. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీకి చెందిన ''స్కార్పియో ఎన్'' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ 2,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్యూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సంస్థ స్కార్పియో-N కార్బన్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 19.19 లక్షల నుంచి రూ. 24.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ పటిష్టమైన డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్తో.. స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతుంది. డార్క్ ట్రీట్మెంట్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వానో ఫినిష్డ్ రూఫ్ రెయిల్స్ వంటివి దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఈ కొత్త ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.స్కార్పియోదశాబ్దాల చరిత్ర కలిగిన మహీంద్రా స్కార్పియో.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే స్కార్పియో ఎన్ లాంచ్ అయింది. ఇప్పుడు స్కార్పియో ఎన్ కార్బన్ వేరియంట్ లాంచ్ అయింది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!స్కార్పియో ఎన్ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మంచి డిజైన్, కొత్త ఫీచర్స్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఈ కారును చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పటికే రెండు లక్షల మంది ఈ కారును కొనుగోలు చేసారంటే.. దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
ఎక్కువమంది కొనేస్తున్న వెహికల్స్ ఇవే..
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల్లో దేశవ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 - 7 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్టు రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. డిమాండ్ను నడిపించే విభాగాలు తటస్థంగా లేదా అనుకూలంగా ఉంటాయని వివరించింది. ‘ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2023-24లో 42 లక్షల యూనిట్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ తయారీదారుల స్థిర ఉత్పత్తి కారణంగా హోల్సేల్స్ స్థిరంగా ఉన్నాయి. అయితే తగ్గుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్, అధిక ఇన్వెంటరీ స్థాయిల నేపథ్యంలో పరిశ్రమ పరిమాణ వృద్ధి దాదాపు 2 శాతం వద్ద నిరాడంబరంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో 2024-25లో 11-14 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6–9 శాతం ఉండొచ్చు. మెరుగైన వర్షపాతం కారణంగా కొన్ని నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోంది.రబీ సాగు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. దేశీయ వాణిజ్య వాహన పరిశ్రమ 2025–26లో స్వల్ప వృద్ధి నమోదు చేస్తుంది. ప్రభుత్వ పాత వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా చేయడం, రీప్లేస్మెంట్ డిమాండ్ బస్ల విక్రయాల్లో వృద్ధిని పెంచుతాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ల జోరు, ఈ–కామర్స్లో మందగమనంతో తేలికపాటి వాణిజ్య వాహనాల వృద్ధి తక్కువగా ఉంటుంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు; తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్లు 2025–26లో వరుసగా 0–3 శాతం, 3–5, 8–10 శాతం దూసుకెళ్తాయని అంచనా’ అని ఇక్రా తెలిపింది. -
ఎఫ్పీఐల షాక్
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
అమ్మకాల్లో తగ్గేదేలే.. మార్కెట్లో విండ్సర్ హవా!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్, పనోరమిక్ సన్రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. -
ఈ స్కూటర్ను 18 లక్షల మంది కొనేశారు
టీవీఎస్ ఎన్టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్గా రికార్డ్ క్రియేట్ చేసింది.టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్టార్క్ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.ఎన్టార్క్ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్టార్క్'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్టార్క్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
2024లో లంబోర్ఘిని కార్లను ఇంతమంది కొన్నారా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. -
నాలుగేళ్లలో 5 లక్షలమంది కొన్న కారు ఇదే
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.టాటా పంచ్ 2021 అక్టోబర్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.ఇతర ఆఫర్స్ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 16 డీటెయిల్స్ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులుదేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్ఆపిల్ తయారీ కేంద్రాలుభారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. -
టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల స్కూటర్లు
టీవీఎస్ మోటార్ కంపెనీ మరో ఘనతను సాధించింది. కంపెనీ తయారీ జూపిటర్ స్కూటర్ (TVS Jupiter) 70 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. హోల్సేల్గా కంపెనీ 2024 నవంబర్ నాటికి 71,40,927 యూనిట్లను విక్రయించింది. 2013 సెప్టెంబర్ నుంచి సంస్థ మొత్తం 1.14 కోట్ల స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో జూపిటర్ వాటా ఏకంగా 62 శాతం ఉంది.స్కూటర్స్ విభాగంలో సెగ్మెంట్లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న జూపిటర్ 110, 125 సీసీ ఇంజన్ సామర్థ్యంలో లభిస్తోంది. 2024 మార్చి నాటికి 80,000 జూపిటర్ స్కూటర్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2016 జూన్ నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును సాధించింది. 2017 సెప్టెంబర్ నాటికి 20 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2022 సెప్టెంబర్ నాటికి 50 లక్షల యూనిట్లను తాకింది.మరో 10 లక్షల యూనిట్లకు ఏడాది, ఆ తర్వాతి 10 లక్షలకు 14 నెలల సమయం తీసుకుంది. భారత స్కూటర్స్ పరిశ్రమలో రెండవ స్థానం దక్కించుకున్న టీవీఎస్కు 25 శాతం వాటా ఉంది. 2023–24లో 8,44,863 జూపిటర్ స్కూటర్స్ రోడ్డెక్కగా.. 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–నవంబర్లో ఈ సంఖ్య 7,01,360 యూనిట్లు ఉంది. ప్రస్తుతం 110 సీసీలో నాలుగు, 125 సీసీలో మూడు వేరియంట్లలో జూపిటర్ లభిస్తోంది.సుజుకీ యాక్సెస్ 60 లక్షలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్సైకిల్ ఇండియా కూడా ఇటీవల సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 (suzuki access 125) మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే.దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో ఇది రూపుదిద్దుకుంది.5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది
ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ (CNG) బైక్ లాంచ్ చేసిన బజాజ్ ఆటో (Bajaj Auto) ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. 'ఫ్రీడమ్ 125' బైకును ఆరు నెలల్లో.. 40,000 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ వెల్లడించారు.బజాజ్ సీఎన్జీ బైక్.. అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన వినియోగదారులకు ఆకర్శించింది. మేము దాదాపు 40,000 బైక్లను రిటైల్ చేసాము. ఇది 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుండంతో.. రోజువారీ వినియోగానికి కూడా దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారని రాకేష్ శర్మ (Rakesh Sharma) పేర్కొన్నారు.బజాజ్ సీఎన్జీ బైకును ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటికి సుమారు 350 పట్టణాలకు విస్తరించినట్లు రాకేష్ శర్మ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాలలో ఈ బైకును ప్రదర్శించడానికి, అక్కడ విక్రయాలను కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.బజాజ్ ఫ్రీడమ్ 125బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన సీఎన్జీ బైక్ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్తోపాటు పుణెలో ఆల్టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల వారీ విక్రయాలు.. ⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. ⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. ⇒ అహ్మదాబాద్లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ⇒ కోల్కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ⇒ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది.. ‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్ఫ్రాంక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు. -
వాహన రిటైల్ విక్రయాల్లో 9 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. నిలకడగా పరిశ్రమ.. వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు. -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. 2020 జనవరిలో ఎలక్ట్రిక్ చేతక్ ద్వారా స్కూటర్స్ రంగంలోకి బజాజ్ రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ-టూ వీలర్స్ విభాగంలో దేశంలో ఒక నెల అమ్మకాల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంస్థకు ఇదే తొలిసారి. డిసెంబర్ నెలలో 17,212 యూనిట్లతో టీవీఎస్ మోటార్ కంపెనీ రెండవ స్థానంలో నిలిచింది.నవంబర్ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత నెలలో అతి తక్కువగా 13,769 యూనిట్లతో 19 శాతం వాటాతో మూడవ స్థానానికి పరిమితమైంది. 2024లో కంపెనీకి అతి తక్కువ విక్రయాలు నమోదైంది డిసెంబర్ నెలలోనే కావడం గమనార్హం. అక్టోబర్లో 41,817 యూనిట్ల అమ్మకాలు సాధించిన ఓలా ఎలక్ట్రిక్ నవంబర్లో 29,252 యూనిట్లను నమోదు చేసింది.హోండా ఎలక్ట్రిక్ (Honda Electric) టూ వీలర్లు రోడ్డెక్కితే ఈ ఏడాది మార్కెట్ మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనపడుతోంది. సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) ఆధారత టూవీలర్ రంగాన్ని ఏలుతున్న దిగ్గజాలే ఎలక్ట్రిక్ విభాగాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి నెల నమోదవుతున్న అమ్మకాలే ఇందుకు నిదర్శనం.రెండింటిలో ఒకటి ఈవీ..భారత త్రిచక్ర వాహన రంగంలో ఎలక్ట్రిక్ త్రీవీలర్లు దూకుడుమీదున్నాయి. భారత ఈవీ రంగంలో టూవీలర్ల తర్వాత త్రీవీలర్లు రెండవ స్థానంలో నిలిచాయి. 2024లో దేశవ్యాప్తంగా మొత్తం 6,91,011 యూనిట్ల ఈ-త్రీవీలర్స్ రోడ్డెక్కాయి. భారత్లో గతేడాది ఎలక్ట్రిక్, ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాల్లో కలిపి మొత్తం 12,20,925 యూనిట్ల త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ఎలక్ట్రిక్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. అంటే అమ్ముడవుతున్న ప్రతి రెండింటిలో ఒకటి ఎలక్ట్రిక్ కావడం విశేషం.ఎలక్ట్రిక్ త్రీవీలర్స్లో నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తున్న మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ 10 శాతం వాటా సాధించింది. వేగంగా దూసుకొచ్చిన బజాజ్ ఆటో 6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో అమ్ముడైన 5,83,697 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రీవీలర్లతో పోలిస్తే 2024 విక్రయాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది.2023లో సగటున ఒక నెలలో 48,633 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళితే గతేడాది ఈ సంఖ్య నెలకు 57,584 యూనిట్లకు ఎగసింది. ఐసీఈ, సీఎన్జీ, ఎల్పీజీ ఆప్షన్స్తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం వల్లే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రుణ లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందుబాటులోకి విభిన్న మోడళ్లు, సరుకు రవాణాకై లాజిస్టిక్స్ కంపెనీల నుంచి డిమాండ్ ఇందుకు మరింత ఆజ్యం పోస్తోంది. త్రీవీలర్స్లో సీఎన్జీ విభాగానికి 28 శాతం వాటా కాగా, డీజిల్కు 11, ఎల్పీజీ 3, పెట్రోల్కు ఒక శాతం వాటా ఉంది.పోటీలో నువ్వా నేనా..రెండవ స్థానంలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతూ.. 2024 సెప్టెంబర్లో 19,213 యూనిట్లతో తొలిసారిగా బజాజ్ ఆటో రెండవ స్థానాన్ని పొంది టీవీఎస్ను మూడవ స్థానానిని నెట్టింది. అక్టోబర్, నవంబర్లో టీవీఎస్కు గట్టి పోటీ ఇచ్చిన బజాజ్ ఆటో మూడవ స్థానానికి పరిమితమైంది.ఇక 2020 జనవరి నుంచి 2023 నవంబర్ వరకు బజాజ్ ఆటో మొత్తం 1,04,200 యూనిట్ల అమ్మకాలను సాధించింది. తొలి లక్ష యూనిట్లకు కంపెనీకి 47 నెలల సమయం పట్టింది. 2024లో ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలకు చేరువైంది. గతేడాది సంస్థ మొత్తం 1,93,439 యూనిట్ల అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో మూడవ స్థానంలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ 4,07,547 యూనిట్లతో మొదటి, టీవీఎస్ మోటార్ కో 2,20,472 యూనిట్లతో రెండవ స్థానంలో నిలిచాయి. -
ఒకే కంపెనీ ఏడాదిలో 10 లక్షల టీవీ యూనిట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ 2025లో పది లక్షల యూనిట్ల టీవీ విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్ల భారత మార్కెట్ లైసెన్స్ కలిగిన ఈ సంస్థ టీవీ(TV)లతోపాటు గృహోపకరణాలను విక్రయిస్తుంటుంది. ఉత్పత్తుల పోర్ట్ఫోలియో, సామర్థ్య విస్తరణ, ఆఫ్లైన్ ఛానళ్ల అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. థామ్సన్, కొడాక్(Kodak), బ్లాపంక్ట్, వైట్–వెస్టింగ్ హౌస్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ లైసెన్స్ హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి.మరో రెండు అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించి భారత మార్కెట్ హక్కులను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, జనవరి చివరికి వీటిని ప్రవేశపెడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది 6,00,000 యూనిట్ల టీవీ అమ్మకాలను సాధించనున్నాం. వచ్చే ఏడాది 10,00,000 లక్షల అమ్మకాలు మా లక్ష్యం’అని చెప్పారు. అందుబాటు ధరల శ్రేణిలో వివిధ బ్రాండ్లపై స్మార్ట్ టీవీ(Smart TV)లను విక్రయిస్తున్న ఈ సంస్థ టర్నోవర్ రూ.700 కోట్లుగా ఉంది. ఆదాయంలో అధిక భాగం టీవీల విక్రయాల ద్వారానే వస్తోంది.కరోనా తర్వాత అమ్మకాల జోరుకరోనా అనంతరం ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల అమ్మకాలు ఆ సమయంలో జోరుగా సాగాయి. అనంతరం ఈ మార్కెట్లో వృద్ధి బలహీనపడింది. అయినప్పటికీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీ అమ్మకాల్లో వృద్ధి నమోదు చేస్తుండడం గమనార్హం. ఈ విభాగంలో థామ్సన్ బ్రాండ్ విక్రయాలపై ఈ కంపెనీకి అధిక ఆదాయం లభిస్తోంది. ఆ తర్వాత కొడాక్ బ్రాండ్ అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ మొబైల్ టారిఫ్లు పెంపు..?వాషింగ్ మెషిన్లపై దృష్టి..సూపర్ ప్లాస్ట్రానిక్స్ టీవీల తర్వాత వాషింగ్ మెషిన్ల విభాగంలో అధిక అమ్మకాలు సాధిస్తోంది. ఆన్లైన్ మార్కెట్లో వాషింగ్ మెషిన్ల విక్రయాల్లో ఈ సంస్థ వాటా రెండంకెల స్థాయిలో ఉంటోంది. ఆఫ్లైన్ ఛానళ్లనూ ఈ ఏడాది విస్తరించుకున్నామని, 2025లో రెండు లక్షల వాషింగ్ మెషిన్ యూనిట్ల అమ్మకాలు నమోదు చేయనున్నట్టు అవనీత్ సింగ్ తెలిపారు. ప్రధానంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్(Amazon) ఈ–కామర్స్ పోర్టళ్లలో ఈ సంస్థ ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తుంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లోనూ విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తమ అమ్మకాల్లో 80 శాతం ఆన్లైన్ నుంచి, 20 శాతం ఆఫ్లైన్ నుంచి వస్తున్నాయని అవనీత్ సింగ్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆఫ్లైన్లో విక్రయాల వాటాను 40 శాతానికి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. టైర్–1 నగరాల నుంచి 35 అమ్మకాలు వస్తుండగా, టైర్–2 నుంచి 25 శాతం, టైర్–3 నుంచి 15 శాతం ఉంటున్నట్టు వెల్లడించారు. మిగిలిన 25 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: 2024 సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు(Vehicle sales) రికార్డు స్థాయిలో 43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు 2023 ఏడాదిలో విక్రయించిన 41.09 లక్షల వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 4.64% అధికంగా ఉంది. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు అధిక గిరాకీ, గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్(Demand) బలంగా ఉండడం కలిసొచ్చింది. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ(Maruti Suzuki), హ్యుందాయ్, టాటా మోటార్స్(Tata Motors), టయోటా కిర్లోస్కర్ మోటార్, కియా ఇండియాలు గతంలో ఎన్నడూ చేయని అధిక స్థాయిలో వార్షిక విక్రయాలు నమోదు చేశాయి. ఇదీ చదవండి: కంపెనీల విడదీత.. లాభాల మోత!మారుతీ సుజుకీ 2024లో 17,90,977 వాహనాలు విక్రయించింది. అంతకు ముందు 2018లో అమ్ముడైన 17,51,919 యూనిట్ల అమ్మకాల రికార్డు బద్దలైంది. కాగా 2023లో కంపెనీ మొత్తం 17,26,661 వాహనాలను విక్రయించింది.గత క్యాలెండర్ ఏడాదిలో హ్యుందాయ్ మోటార్ రికార్డు స్థాయిలో 6,05,433 యూనిట్లు విక్రయించింది. వీటిలో ఎస్యూవీ విభాగపు వాటా 60.6 శాతంగా ఉంది. కాగా 2023లో 6,02,111 విక్రయాలు నమోదయ్యాయి. -
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం
-
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు - కారణం ఇదే..
హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.సరఫరాలో క్షీణత➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.➤ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.➤కోల్కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది. -
గృహ విక్రయాలు 21% తగ్గొచ్చు !
న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో డిసెంబర్ క్వార్టర్లో గృహ అమ్మకాలు 21 శాతం తగ్గి 1.08 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని స్థిరాస్తి డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ అంచనా వేసింది. ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్లో (ఎన్సీఆర్) మాత్రం విక్రయాలు పెరుగుతాయని వెల్లడించింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్కతా, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, థానే నగరాల్లో గృహ విక్రయాల వివరాలను ప్రాప్ఈక్విటీ శనివారం విడుదల చేసింది. మొత్తం తొమ్మిది నగరాల్లో 2024 డిసెంబర్ క్వార్టర్లో 1,08,261 యూనిట్ల ఇళ్లు అమ్ముడు కావొచ్చు.గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,37,225 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అయితే 2024 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ అమ్మకాలు 5% పెరిగే అవకాశం ఉందని వివరించింది. అధిక బేస్ ధరల ప్రభావం కారణంగానే క్యూ3లో ఇళ్ల ధరలు తగ్గాయి. పండుగ డిమాండ్ కలిసిరావడంతో త్రైమాసిక ప్రాతిపదికన అమ్మకాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మూలాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉన్నాయని ప్రాప్ఈక్విటీ వ్యవస్థాపకుడు సీఈవో సమీర్ జసుజా తెలిపారు. ⇒ హైదరాబాద్ పరిధిలో విక్రయాలు 47% తగ్గొచ్చని అంచనా వేసింది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 24,044 గృహ విక్రయాలు జరిగితే ఈ ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు. ⇒ బెంగళూరులో 13 శాతం తగ్గి విక్రయాలు 17,276 యూనిట్ల నుంచి 14,957 యూనిట్లకు దిగివచ్చే అవకాశం ఉంది. చెన్నైలో 4,673 యూనిట్ల నుంచి తొమ్మిది శాతం తగ్గి 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు. కోల్కతాలో అమ్మకాలు 33% తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు దిగిరావచ్చు. ⇒ ముంబై నగరంలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27% పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13% విక్రయాలు తగ్గొచ్చు. కాగా 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 8,607 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 7,478 గృహాలకు పరిమితం కావచ్చు. థానేలో 26,099 యూనిట్ల నుంచి 21,893 యూనిట్లకు పడిపోవచ్చు. పుణేలో ఇండ్ల విక్రయాలు 24 శాతం తగ్గే చాన్స్ ఉంది.⇒ ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతాల్లో గురుగ్రాం పరిధిలో లగ్జరీ ఇళ్లకు కొన్నేళ్లుగా డిమాండ్ అసాధారణ రీతిలో పెరుగుతోంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో 10,354 గృహ అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య 12,915 ఇళ్ల విక్రయాలు జరిగే అవకాశం ఉంది. అంటే 25% అమ్మకాలు పుంజుకోవచ్చు. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్లోని హన్సల్పూర్ ప్లాంట్లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
ఒకటే బ్రాండ్.. 4 లక్షల మంది కొనేశారు
2024 ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అనేక కొత్త వాహనాలను దేశీయ విఫణిలో అడుగుపెట్టాయి. ఇందులో టూ వీలర్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెట్టినా.. ప్రజలు మాత్రం 'ఓలా ఎలక్ట్రిక్' స్కూటర్స్ కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఓలా ఎలక్ట్రిక్ ఈ ఒక్క ఏడాది (2024) సుమారు నాలుగు లక్షల స్కూటర్లను విక్రయించింది. దీంతో దేశంలోనే అత్యధిక రిటైల్ విక్రయాలను సాధించిన స్కూటర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. వాహన్ డేటా ప్రకారం.. 2024 డిసెంబర్ 15 ఉదయం 7 గంటల సమయం నాటికి దేశంలో అమ్ముడైన మొత్తం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏకంగా 4,00,099 యూనిట్లు అని తెలిసింది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ ఈవీ దినోత్సవం (సెప్టెంబర్ 9) నాటికి 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ తరువాత మంచి ఎక్కువ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. -
అమ్మకాల్లో అదరగొట్టిన నిస్సాన్: ఏకంగా..
నిస్సాన్ ఇండియా అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్లో 5 లక్షల కార్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థ 2010లో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 5,13,241 యూనిట్ల సేల్స్ సాధించింది. నవంబర్ 2024లో నిస్సాన్ 9,040 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 2,342 యూనిట్లు కాగా.. ఎగుమతులు 6,698 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.నిస్సాన్ కంపెనీ అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ప్రధాన కారణం. రూ. 6 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వల్ల లభించే ఈ కారును చాలామంది కస్టమర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఎక్స్-ట్రైల్తో పాటు అమ్ముడవుతోంది.ఇదీ చదవండి: ట్రైన్ ఆలస్యమైతే.. అవన్నీ ఫ్రీ: రీఫండ్ ఆప్షన్ కూడా..సన్రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. -
రోజుకు 1000 మంది కొన్న కారు ఇదే..
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో 61% వాటాను కలిగి ఉంది.అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో రూ.22,500 వరకు క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్టాప్ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
రెండేళ్లు.. లక్ష సేల్స్: ఈ కారు రేటెంతో తెలుసా?
భారతదేశంలో వాహన విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రజలు కొన్ని బ్రాండ్ కార్లను మాత్రమే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన కార్లలో ఒకటి ఇన్నోవా హైక్రాస్. ఇప్పటికే ఈ కారును లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం రెండేళ్లలో కంపెనీ ఈ అరుదైన ఘనతను సాధించింది.2022లో అమ్మకానికి వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఇన్నోవా క్రిస్టాతో పాటు అమ్ముడైంది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నపటికీ.. ఆ తరువాత సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారు పెట్రోల్ - హైబ్రిడ్ పవర్ట్రెయిన్ పొందుతుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?టయోటా ఇన్నోవా హైక్రాస్ నాన్-హైబ్రిడ్ వేరియంట్లు 172 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. టాప్ వేరియంట్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 184 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందుతాయి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. -
స్మార్ట్ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్యూ7షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?
భారతదేశంలో మొత్తం పండుగ సీజన్లో 42 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్ అన్నీ ఉన్నాయి. 2023 ఇదే పండుగ సీజన్లో అమ్ముడైన మొత్తం వాహనాలు 38.37 లక్షల యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో వాహన విక్రయాలు పెరిగినట్లు తెలుస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2024 పండుగ సీజన్లో 45 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా వేసింది. అయితే ఊహించిన అమ్మకాలు జరగలేదు, కానీ 2023 కంటే 2024లో సేల్స్ ఉత్తమంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది.2023లో ద్విచక్ర వాహనాల సేల్స్ 29.10 లక్షల యూనిట్లు కాగా.. 2024లో 33.11 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అమ్మకాలు 13.8 శాతం వృద్ధి చెందాయి. త్రీ వీలర్స్ సెల్స్ 2023లో 1.50 లక్షల యూనిట్లు.. 2024లో 6.8 శాతం పెరిగి 1.60 లక్షల యూనిట్లకు చేరింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..కమర్షియల్ వాహన విక్రయాలు 2023లో 1.27 లక్షల యూనిట్లు.. కాగా 2024లో 1.29 లక్షల యూనిట్లు. ఈ విభాగంలో అమ్మకాలు 1 శాతం పెరిగింది. ప్యాసింజర్ వాహన సేల్స్ 2023లో 5.63 లక్షల యూనిట్లు, 2024లో 6.03 లక్షల యూనిట్లు. ఇలా మొత్తం మీద 2024లో మొత్తం వాహనాల సేల్స్ 42 లక్షల యూనిట్లను అధిగమించింది. -
రెండు లక్షల మంది కొన్న టయోటా కారు ఇదే..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అమ్మకాలు భారతదేశంలో లక్ష యూనిట్లు దాటేశాయి. సెప్టెంబర్ 2022లో మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అక్టోబర్ చివరి నాటికి హైరైడర్ మొత్తం సేల్స్ 1,07,975 యూనిట్లుగా నమోదయ్యాయి.2023 ఆర్ధిక సంవత్సరంలో 22,839 యూనిట్లు, 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,916 యూనిట్లు, 2025 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 36,220 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిన హైరైడర్.. టయోటా గ్లాంజా హ్యాచ్బ్యాక్, మారుతి బాలెనో నుంచి పుట్టిన రీబ్యాడ్జ్ మోడల్.ఇదీ చదవండి: ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయంటయోటా కంపెనీ అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,91,029 యూనిట్ల హైరైడర్ కార్లను డీలర్షిప్లకు పంపించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ వరకు హైరైడర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనికి పండుగ సీజన్ చాలా దోహదపడింది. టయోటా కంపెనీ మరింత మంది కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో పండుగ సీజన్లో హైరైడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ను కూడా లాంచ్ చేసింది. -
పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్లో అన్లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.నాన్ మెట్రో అమ్మకాలే అధికం ఈసారి ఆన్లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది. -
రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized RatesDelighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024 -
అప్పుడు భారీ బుకింగ్స్.. ఇప్పుడు రికార్డ్ సేల్స్
ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న 'టాటా టియాగో ఈవీ' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 50,000 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన టియాగో ఈవీ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ మోడల్.సెప్టెంబర్ 2022లో ప్రారంభమైన టాటా టియాగో ఈవీ కేవలం 24 గంటల్లో 10,000 బుకింగ్స్ అందుకుంది. ఇప్పుడు అమ్మకాల్లో 50వేలు దాటేసింది. డెలివరీలు ప్రారంభమైన మొదటి నాలుగు నెలల కాలంలో 10వేల యూనిట్ల టియాగో ఈవీలను విక్రయించిన కంపెనీ మరో 17 నెలల్లో 40000 యూనిట్ల విక్రయాలను సాధించగలిగింది.ఇదీ చదవండి: స్కూటర్పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనటియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 250 కిమీ రేంజ్ అందించే 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 315 కిమీ రేంజ్ అందించే 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు 55 కేడబ్ల్యుహెచ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న టాటా మోటార్స్ సరసమైన మోడల్ టాటా టియాగో ఈవీ ప్రారంభ ధరలు రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే..
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన 'టీవీఎస్ రైడర్ 125' బైక్.. అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 2021లో లాంచ్ అయిన తరువాత మొత్తం 10,07,514 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. మూడేళ్ళ కాలంలో ఈ బైక్ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.గత ఆర్ధిక సంవత్సరం నాటికి టీవీఎస్ రైడర్ మొత్తం 7,87,059 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2,12,941 యూనిట్ల సేల్స్ సాధించింది. మొత్తం మీద ఈ బైక్ సేల్స్ 10 లక్షల యూనిట్లు దాటేసింది.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్సైకిల్గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ బైక్ ఐజీఓ ఎడిషన్ రూపంలో రూ. 98,389 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. ఇది 124.8 సీసీ ఇంజిన్ కలిగి 11.22 Bhp పవర్, 11.75 Nm టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. -
ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..
దేశవ్యాప్తంగా 30 ద్వితీయ శ్రేణి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జులై–సెప్టెంబర్లో 41,871 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే విక్రయాలు 13 శాతం తగ్గాయని ప్రాప్ఈక్విటీ నివేదిక తెలిపింది. గతేడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ఈ క్షీణతకు కారణం అని వివరించింది.నివేదికలోని వివరాల ప్రకారం..కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ 34 శాతం క్షీణించింది. మొత్తం విక్రయాల్లో అహ్మదాబాద్, వడోదర, గాందీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్పూర్తో కూడిన వెస్ట్ జోన్ వాటా 72 శాతం ఉంది. తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానుల్లో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్ను పెంచుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్ మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం, వెండి ధరలు‘ద్వితీయ శ్రేణి నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడికి పెద్దగా అనుకూలించవు. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా వృద్ధి ఉండకపోవడం, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరసి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది. -
AP: మందుబాబులకు ప్రభుత్వం షాక్ !
సాక్షి,విజయవాడ: మందుబాబులకు ఏపీ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్ విధిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం(అక్టోబర్ 15) ఉత్తర్వులిచ్చింది.ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా అన్ని రకాల మద్యంపై రౌండప్ చార్జీల పేరుతో బాదిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు నిర్ణయించింది. ఈ బాదుడును తక్షణమే అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. కాగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్షాపులను ప్రైవేటు రిటైలర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వారి నుంచి షాపులకు దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ పద్ధతిన షాపులు కేటాయించింది.ఈ విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో ఓ పక్క మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల నుంచి అటు ప్రభుత్వం ఇటు పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకోనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇదీ చదవండి: తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు -
భారీగా పెరిగిన వెహికల్ సేల్స్: ఎస్ఐఏఎమ్ రిపోర్ట్
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) సెప్టెంబర్ 2024లో ఆటో పరిశ్రమ విక్రయాల సంఖ్యను విడుదల చేసింది. గత నెలలో వెహికల్ సేల్స్ 24,62,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు సెప్టెంబర్ 2023 కంటే 12.6 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 3,56,752 యూనిట్లు. 2023లో ఇదే నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3,61,717 యూనిట్లు. 2023 సెప్టెంబర్ నెల కంటే కూడా 2024 సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కొంత మందగించాయి.సెప్టెంబర్ 2024లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20,25,993 యూనిట్లు. కాగా ఇదే నెల 2023లో టూ వీలర్ సేల్స్ 17,49,794 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే గత నెలలో టూ వీలర్ సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్పేలో కొత్త ప్లాన్వాహనాల అమ్మకాలను గురించి ఎస్ఐఏఎమ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. మొత్తం భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కొంత ఊపందుకుంది. టూ వీలర్, త్రీ వీలర్ సేల్స్ వరుసగా 12.6 శాతం, 6.6 శాతం వృద్ధి చెందాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు మాత్రం కొంత క్షీణతను నమోదు చేశాయని పేర్కొన్నారు. -
కారు.. రికార్డు! 2 లక్షల మంది కొనేశారు..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (FRONX) ఎస్యూవీ మరో మైలురాయిని సాధించింది. కేవలం 17.3 నెలల్లో 2 లక్షల విక్రయాల మార్కును చేరుకుని సరికొత్త పరిశ్రమ రికార్డును నెలకొల్పిందని కంపెనీ ప్రకటించింది.2023 ఏప్రిల్లో లాంచ్ అయిన ఈ కాంపాక్ట్ ఎస్యూవీ దాని థ్రిల్లింగ్ డ్రైవ్, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన గాడ్జెట్లు, మల్టీ పవర్ట్రెయిన్ ఎంపికల కారణంగా ఈ అద్భుతమైన ఫీట్ను సాధించింది. గతేడాది జనవరిలో 1 లక్ష విక్రయాల మైలురాయిని చేరుకున్న అత్యంత వేగవంతమైన కొత్త మోడల్గా గుర్తింపు పొందిన తరువాత 7.3 నెలలకే మరో లక్ష విక్రయాలు సాధించి 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం విశేషం.ఫ్రాంక్స్ సాధించిన ఈ మైలురాయి మారుతి సుజుకి పట్ల కస్టమర్లకు ఉన్న అంచనాలు, వాటికి అనుగుణంగా ఉత్పత్తులను అందించడానికి తాము చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ పేర్కొన్నారు. మారుతీ ఫ్రాంక్స్ టైర్ 1, టైర్ 2 నగరాల్లోని కస్టమర్లలో గణనీయమైన ఆకర్షణను పొందింది. వీటి అమ్మకాలకు ఎన్సీఆర్, ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు మొదటి ఐదు టాప్ మార్కెట్లుగా నిలిచాయి. -
పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 5 శాతం పెరిగాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతుల (స్పేస్) లీజింగ్ సైతం 18% పెరిగింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది పట్టణాలకు సంబంధించిన డేటాను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ కాలంలో 87108 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 82,612 యూనిట్లుగా ఉన్నాయి.స్థూల ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ పట్టణాల్లో 18% పెరిగి 19 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎప్టీ) చేరింది. బహుళజాతి కంపెనీలు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల (జీసీసీ) నుంచి అధిక డిమాండ్ నెలకొంది. జూలై–సెప్టెంబర్లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయన్న అనరాక్, ప్రాప్ ఈక్విటీ సంస్థల అంచనాలకు భిన్నంగా నైట్ఫ్రాంక్ గణాంకాలు ఉండడం గమనార్హం. ‘‘2024లో ఇళ్ల మార్కెట్లో సానుకూల ధోరణి నెలకొంది. క్యూ3లో రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి’’అని నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది. రూ.1 కోటికి మించి ధర కలిగిన ప్రీమియం ఇళ్లకు ఏర్పడిన డిమాండ్ అమ్మకాల వృద్ధికి సాయపడుతున్నట్టు నైట్ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు. అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల అమ్మకాలు తగ్గినట్టు చెప్పారు. ఇళ్ల లభ్యత, వాటి ధరల పరంగా సవాళ్లు నెలకొన్నట్టు తెలిపారు. జీసీసీల ముఖ్య భూమిక‘‘భారత్లో వ్యాపార సంస్థలు, జీసీసీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. వృద్ధిలో వీటిదే ప్ర ముఖ పాత్ర. ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి ఉంటుందని అంచనా వేస్తున్నాం. 2024 మొత్తం మీద ఆఫీస్ స్థలాల లీజింగ్ 70 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించొచ్చు. నికరంగా 10 మిలియన్ ఎస్ఎఫ్టీ ఎక్కువ. క్రితం ఏడాది కంటే 20% అధికం. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతుండడాన్ని ఈ అసాధారణ వృద్ధి తెలియజేస్తోంది’’అని శిశిర్ బైజాల్ వివరించారు. హైదరాబాద్లో 9 శాతం వృద్ధి➤హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 2024 జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం పెరిగి 9,114 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం తగ్గి 2.2 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 2.9 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండడం గమనార్హం. ➤ముంబై మార్కెట్లో రికార్డు స్థాయిలో 24,222 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల కంటే 9 శాతం ఎక్కువ. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ మాత్రం 17 శాతం తగ్గిపోయి 2.7 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది. ➤బెంగళూరులో 11 శాతం వృద్ధితో 14,604 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇక్కడ రెండున్నర రెట్లు పెరిగి 5.3 మిలియన్ చదరపు అడుగులకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 2.1 మిలియన్ ఎస్ఎఫ్టీగానే ఉంది.➤పుణెలో ఇళ్ల అమ్మకాలు కేవలం ఒక శాతమే పెరిగి 13,200 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్క డ కార్యాలయ స్థలాల లీజింగ్ 14 శాతం క్షీణించి 2.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది.➤అహ్మదాబాద్లో 11 శాతం వృద్ధి నమోదైంది. 4,578 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ సైతం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది. 0.3 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ➤కోల్కతాలోనూ 14 శాతం అధికంగా 4,309 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. స్థూల ఆఫీస్ స్థలాల లీజింగ్ 38 శాతం తక్కువగా 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.➤ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. 12,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 26 శాతం పెరిగి 3.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది.➤చెన్నైలో 4,105 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాల కంటే 6 శాతం తక్కువ. చెన్నైలో ఆఫీస్ స్పేస్ 35 శాతం వృద్ధితో 2.6 మిలియన్ ఎస్ఎఫ్టీగా నమోదైంది.➤జూలై–సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్లో జీసీసీలు తీసుకున్నదే 37 శాతం (7.1 మిలియన్ ఎస్ఎఫ్టీ)గా ఉంది. -
అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు
న్యూఢిల్లీ: మొబైల్ఫోన్స్ తయారీలో ఉన్న దేశీయ కంపెనీ లావా అక్టోబర్ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్ఫోన్ను విక్రయించనుంది. అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా ఈ మోడల్ లభించనుంది. ప్రారంభ ధర రూ.19,999.లావా అగ్ని-3 బార్ ఫోన్లో రేర్ డిస్ప్లేతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే పొందుపరిచారు. ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్ కెమెరా, సామ్సంగ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో రూపుదిద్దుకుంది.లావా అగ్ని-3 స్మార్ట్ఫోన్ 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని–3 రాకతో రూ.20–25 వేల ధరల శ్రేణిలో ఆన్లైన్ విభాగంలో 2025–26 నాటికి 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ఈడీ సునీల్ రైనా తెలిపారు. -
బుల్లి ఎస్యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్బ్యాక్ల నుంచి అప్గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్యూవీలు కొన్ని హ్యాచ్బ్యాక్లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్రూఫ్, డాష్క్యామ్, 6 ఎయిర్బ్యాగ్ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
అమ్మకాల్లో అదరగొట్టిన టైగన్.. మూడేళ్ళలో లక్ష!
టైగన్ అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.ఇదీ చదవండి: పాల ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి వేలకోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా..టాటా కర్వ్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న.. ఫోక్స్వ్యాగన్ టైగన్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 18.70 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఈ కారు జఫ్రీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. -
నాలుగేళ్లలో.. ఈ కారును 4.5 లక్షల మంది కొనేశారు
నాలుగు సంవత్సరాల క్రితం దేశీయ విఫణిలో విడుదలైన కియా ఇండియా మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్' అమ్మకాలు ఏకంగా నాలుగు లక్షలు దాటింది. ఎస్ఐఏఎమ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 3,57,743 లక్షల విక్రయాలు, ఎగుమతులు 92,069 యూనిట్లు నమోదైనట్లు తెలుస్తోంది.మొత్తం నాలుగేళ్లలో కియా సోనెట్ సేల్స్ 4,49,812 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా.. ఎగుమతులు కూడా ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో సోనెట్ విక్రయాలు 63,717 యూనిట్లు, కాగా.. 2025 ఆర్థిక సంవత్సరంలో 44,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు, కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!ఎగుమతుల విషయానికి వస్తే.. కియా సోనెట్ విక్రయాలు 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగినట్లు (30,574 యూనిట్లు) తెలుస్తోంది. ప్రారంభంలో ఎగుమతులు నెమ్మదిగా సాగి ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ ఎస్యూవీను ఇష్టపడి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగటం వల్ల ఈ అమ్మకాలు సాధ్యమయ్యాయి. -
ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ వాహనాలలో ఒకటైన లెక్సస్ తన 'ఎల్ఎమ్ 350హెచ్' (Lexus LM 350h) బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 మార్చిలో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ 2023 ఆగష్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం 100 బుకింగ్స్ పొందింది.కంపెనీ వంద బుకింగ్స్ పొందింది, కాబట్టి వీటిని డెలివరీ చేసిన తరువాత మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్ళీ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయనేది తెలియాల్సిన విషయం.లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్విశాలమైన క్యాబిన్ కలిగిన ఈ ఎంపీవీ.. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగులలో లభించే ఈ కారు 14 ఇంచెస్ టచ్స్క్రీన్ పొందుతుంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 23 స్పీకర్ ఆడియో సిస్టం, ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్రెస్ట్, రిఫ్రిజిరేటర్ మొదలైనవన్నీ ఇందులో లభిస్తాయి.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనఈ లగ్జరీ ఎంపీవీ 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లు. ఈ కారు టయోటా వెల్ఫైర్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
అమ్మకాల్లో అరుదైన రికార్డ్!.. అప్పుడే 2 లక్షల మంది కొనేశారు
ఏప్రిల్ 2023లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కేవలం 17 నెలల్లో రెండు లక్షల అమ్మకాలను చేరుకుంది. మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి 10 నెలల్లో 100000 యూనిట్లు.. మరో నాలుగు నెలల్లో 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 14 నెలల్లోనే 1.50 లక్షల సేల్స్ మైలురాయిని చేరుకుంది.1.50 లక్షల సేల్స్ సాధించిన తరువాత.. మరో మూడు నెలల్లో 50వేల విక్రయాలను పొందింది. అంటే మొత్తం 17 నెలల్లో రెండు లక్షలమంది కస్టమర్లను ఆకర్శించి అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది.ఇదీ చదవండి: కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయంమారుతి ఫ్రాంక్స్ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్.. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్ (ఓ), జీటా, ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి. -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక కోటి (10 మిలియన్) యాక్టివా స్కూటర్లను విక్రయించి సేల్స్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.2001లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన యాక్టివా 2017 నాటికి 50 లక్షల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత 50 లక్షల సేల్స్ సాధించడానికి 7 సంవత్సరాల సమయంలో పట్టింది. యాక్టివా స్కూటర్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు వంటి ప్రాంతాల్లో విరివిగా అమ్ముడైంది. దీంతో 1 కోటి సేల్స్ సాధించింది. అమ్మకాల్లో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడల్స్ రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..హోండా మోటార్సైకిల్ విక్రయిస్తున్న టూ వీలర్స్ ఇవే..యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోటార్సైకిల్స్ మాత్రమే కాకుండా డియో, షైన్ 100, సీడీ 110 డ్రీమ్ డీలక్స్, షైన్ 125, ఎస్పీ125, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి టూ వీలర్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 110సీసీ, 125 సీసీ బైకులు అమ్ముడవుతున్నాయి. -
రియల్టీ మార్కెట్లో భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్లలో భాగంగా విక్రయించింది. → డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి. → ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్లు నమోదు చేసింది. → గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం. → బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి. → బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. → ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్లు సాధించాయి. → ముంబైకి చెందిన మరో సంస్థ సన్టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి. బలమైన డిమాండ్.. కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్లిస్టెడ్లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. -
ఏడు సంవత్సరాలు.. 67 లక్షల సేల్స్: దూసుకెళ్లిన జుపీటర్
స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టీవీఎస్ జుపీటర్.. 2013 సెప్టెంబర్ నుంచి జులై 2024 వరకు 67,39,254 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 110 సీసీ మోడల్, 125 సీసీ మోడల్ రెండూ ఉన్నాయి.2024 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ జుపీటర్ సేల్స్ 8,44,863 యూనిట్లు. హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూనే మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. జుపీటర్ ప్రారంభమైన మొదటి రెండు సంవత్సరాల్లో 5 లక్షల స్కూటర్లు మాత్రమే సేల్ అయ్యాయి.2021 ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల జుపీటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి 50 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం మీద జుపీటర్ అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. -
ఒక్కరోజులో సరికొత్త రికార్డ్!.. రాఖీ వేళ నిమిషానికి..
అన్నా చెల్లల్ల అనుబంధానికి గుర్తుగా చేసుకునే పండుగ 'రక్షా బంధన్' (రాఖీ). ఈ పండుగ వేళ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లైన బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ గణనీయమైన అమ్మకాలను నివేదించాయి. 2023లో జరిగిన మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు భారీగా పెరిగాయి.రాఖీ పండుగ వేళ నిమిషాల వ్యవధిలో ఆల్-టైమ్ హై ఆర్డర్లను ఒక రోజులో అధిగమించామని బ్లింకిట్ సీఈఓ 'అల్బీందర్ దిండ్సా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పేర్కొన్నారు. ఇందులో చాక్లెట్స్ అమ్మకాలు కూడా చాలానే ఉన్నట్లు వెల్లడించారు. బ్లింకిట్లో నిమిషానికి 693 రాఖీలు విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రక్షా బంధన్ సమయంలో బ్లింకిట్ తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దీంతో అమెరికా, కెనడా, జర్మనీతో సహా ఆరు దేశాల నుంచి ఆర్డర్లను స్వీకరించినట్లు ధిండ్సా వెల్లడించారు.స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కూడా రాఖీ రోజు అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ కో ఫౌండర్ 'ఫణి కిషన్' వెల్లడించారు. మేము ఏడాది పొడవునా విక్రయించే రాఖీల కంటే.. రాఖీ పండుగ రోజు ఎక్కువ విక్రయించగలిగాము. ఈ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. ముంబైలో ఒక వ్యక్తి తన సోదరికి 11000 రూపాయల విలువైన బహుమతులను కూడా ఇచ్చినట్లు.. ఇది ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆర్డర్ అని కిషన్ వెల్లడించారు. ఈ ఆర్డర్లో హామ్లీస్, చాక్లెట్లు, పువ్వులు, కొన్ని బ్యూటీ కాస్మొటిక్స్ ఉన్నట్లు సమాచారం. -
భారీగా తగ్గిన టెస్లా సేల్స్.. కారణం ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు.. టెస్లా అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) సపోర్ట్ చేస్తున్నారనే విషయం రాజకీయ వివాదం రేకెత్తించింది. ఇది టెస్లా అమ్మకాలపైన తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.ట్రంప్కు మస్క్ ఇస్తున్న మద్దతును చాలామందికి నచ్చడం లేదు. దీనివల్ల టెస్లా కార్లను కొనుగోలు చేయకుండా ఊరుకున్నారు. ఈ కారణంగా టెస్లా కార్ల విక్రయాలు 50 శాతం తగ్గిపోయింది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా తెలియడం లేదు.బ్యాటరీతో నడిచే వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో యునైటెడ్ స్టేట్స్లో మాత్రం అమ్మకాలు క్షిణించాయి. టెస్లాతో పోలిస్తే.. ఇతర ప్రత్యర్థుల సేల్స్ కొంతవరకు ఉత్తమంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. టెస్లా కార్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని పలువురు నెటిజన్లు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాల ద్వారా పేర్కొంటున్నారు. -
చైనాను అధిగమించనున్న భారత్!.. అమ్మకాల్లో అగ్రగామిగా..
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ ఈ ఏడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్గా అవతరించనుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.2024 ప్రారంభం నుంచి అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం టూ-వీలర్స్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఇందులో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, ఏథర్ ఎనర్జీ ప్రధానంగా ఉన్నాయి.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా.. ప్రీమియం టూ వీలర్ సెగ్మెంట్లో హార్లే డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, ఆల్ట్రావయొలెట్, రివోల్ట్ మోటార్స్ వంటివి మాత్రమే కాకుండా ఎనర్జికా మోటార్, డామన్ వంటి కొత్త సంస్థలు ప్రవేశించడానికి చూస్తున్నాయి.రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా, సీనియర్ విశ్లేషకుడు సౌమెన్ మండల్ కూడా భారత్ ద్విచక్రవాహన విభాగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుందని అన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో దాదాపు 44 శాతం వాటా మనదేశానిదే అని భావించారు. -
మెప్పించలేకపోతున్న ఏఐ.. పరిశోధనలో కీలక విషయాలు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఎక్కువవుతోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మార్కెటింగ్ రంగం కొంప ముంచుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.ఏఐ అనేది నేడు స్మార్ట్ఫోన్, గూగుల్, ఇంటర్నెట్లలో కనిపించే సాధారణ పదం అయిపోతోంది. యాడ్స్ విషయంలో కూడా ఏఐ హవా సాగుతోంది. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచే అవకాశం ఉందని సంస్థలు కూడా భావిస్తున్నాయి. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రకటనలలో ఏఐ ఉపయోగించడం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టంగా వెల్లడించారు.ఏ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడినా.. అమ్మకాల విషయంలో మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. దీంతో సేల్స్ గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది. జర్నల్ ఆఫ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈ విషయాలను వెల్లడించింది.ఏఐ క్రియేట్ చేసిన లేబుల్స్ కస్టమర్లను ఎక్కువ ఆకర్శించలేవు. ఏఐ భావోద్వేగాలను తగ్గిస్తుంది. అమ్మకాల్లో ఎమోషన్ చాలా ప్రధానం, ఏఐ అదే విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోతోందని డబ్ల్యూఎస్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసూట్ సిసెక్ వెల్లడించారు.కంపెనీలు తమ మార్కెటింగ్లో ఏఐను ఎలా ప్రదర్శించాలో జాగ్రత్తగా పరిశీలించాలని అధ్యయనం సూచిస్తుంది. మార్కెటర్లు ఫీచర్లు లేదా ప్రయోజనాలను వివరించడంపై దృష్టి పెట్టాలి. ఏఐ బజ్వర్డ్లను నివారించాలని సిసెక్ సలహా ఇచ్చారు. -
రెండు లక్షల మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.ప్రస్తుతం కంపెనీ 600 కంటే ఎక్కువ షోరూమ్లను కలిగి ఉంది. ఈ షోరూమ్లలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు జరుగుతున్నాయి. 2023 మార్చిలో అమ్మకాలు కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి. ప్రారంభంలో మొదటి 15 నెలల్లో 1587 యూనిట్ల అమ్మకాలను పొందిన చేతక్ క్రమంగా వాహన వినియోగదారులు ఆకర్శించడంలో విజయం సాధించింది.బజాజ్ ఆటో చేతక్ లైనప్ స్టెమ్ను రెండు కొత్త వేరియంట్లలో విడుదల చేయడంతో స్టెర్న్గా మార్చింది. చేతక్ బేస్ 2901, మిడ్-టైర్ అర్బేన్, రేంజ్ టాపింగ్ ప్రీమియం వేరియంట్ రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఫీచర్స్, రేంజ్ విషయంలో కొంత తేడా ఉంటుంది. -
రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్
2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది.కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది. -
హైదరాబాద్లో పెరిగిన రెసిడెన్షియల్ సేల్స్.. వీటికే డిమాండ్!
నైట్ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288 కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా తెలిసింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా, నెలవారీ వృద్ధి 14 శాతంగా నమోదైంది.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి హైదరాబాద్లో మొత్తం 39220 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇది 2023 మొదటి ఆరు నెలల్లో పోలిస్తే 15 శాతం ఎక్కువ.జూన్ 2024లో 50 లక్షల రూపాయలకంటే తక్కువ ధర కలిగిన కేటగిరీలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ అమ్మకాలు 2023 కంటే 10 శాతం తక్కువ. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జూన్ 2024లో 14 శాతం పెరిగాయి. ఇందులో గృహాల కొనుగోలు కాకుండా.. ఆస్తుల కొనుగోలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూన్ 2024లో, హైదరాబాద్లో నమోదైన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల కేటగిరి ఉంది. ఈ అమ్మకాలు కూడా 2023 కంటే తక్కువ. అయితే 2000 చదరపు అడుగుల ఆస్తుల విక్రయాలు పెరిగాయి. వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. వీటి రిజిస్ట్రేషన్స్ 2024లో 14 శాతంగా నమోదయ్యాయి. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
అరుదైన సేల్స్ రికార్డ్.. అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా!
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి. -
మీకు తెలుసా? ఈ కారును భారత్లో 30లక్షల మంది కొన్నారు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి స్విఫ్ట్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా కంపెనీ 2005లో తన స్విఫ్ట్ కారును ప్రారంభించింది. ఆ తరువాత ఇప్పటివరకు అనేక అప్డేట్స్ పొందూతూ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. దీంతో భారతదేశంలో స్విఫ్ట్ సేల్స్ 30లక్షల యూనిట్లకు చేరుకుంది.అమ్మకాల్లో స్విఫ్ట్ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. లక్షలాది మంది స్విఫ్ట్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్విఫ్ట్ యజమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. త్వరలో CNG రూపంలో కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే.. 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.4 Bhp పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం. ఈ మోడల్ కేవలం మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్సీఆర్లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
ఏడేళ్లలో 7 లక్షలు.. ఇండియన్ కార్ ఘనత!
టాటా నెక్సాన్ 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2017లో భారత్లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ అమ్మకాల మార్కును అధిగమించడానికి కేవలం ఏడేళ్లు పట్టింది. ఈ ఘనతను పురస్కరించుకుని టాటా మోటార్స్ నెక్సాన్పై రూ .1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మహీంద్రా స్కార్పియో వంటి వాటిని అధిగమించి, టాటా నెక్సాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో 1,71,697 యూనిట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో 1,72,139 యూనిట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో 1,24,130 యూనిట్లతో భారత్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది. అయితే టాటా నెక్సాన్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలోకి ప్రవేశించలేకపోయింది. ఈ రెండు నెలల్లో 11వ స్థానానికే పరిమితమైంది.నెక్సాన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ), ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్యూవీలో రెవోట్రాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్, 170 ఎన్ఎమ్), రెవోటార్క్ 1.5-లీటర్ డీజిల్ (115 పీఎస్, 260 ఎన్ఎమ్) రెండు ఐసీఈ ఎంపికలు ఉన్నాయి. ఇక ఈవీ వెర్షన్లో 129 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో మీడియం రేంజ్ (ఎంఆర్), 145 పీఎస్/215ఎన్ఎం పీఎంఎస్ఎం, 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో లాంగ్ రేంజ్ (ఎల్ఆర్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంఆర్ వెర్షన్ రేంజ్ 325 కిలోమీటర్లు, ఎల్ఆర్ వెర్షన్ రేంజ్ 465 కిలోమీటర్లు.నెక్సాన్ ఐసీఈ, ఈవీ వర్షన్లు రెండూ సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. నెక్సాన్ ఐసీఈకి గ్లోబల్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండగా, నెక్సాన్ ఈవీకి భారత్ ఎన్సీఏపీలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇక ధర విషయానికి వస్తే టాటా నెక్సాన్ ఐసీఈ రూ .8 లక్షల నుంచి రూ .15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య, ఈవీ రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. -
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
తక్కువ సరఫరా, లగ్జరీ అపార్ట్మెంట్లకు అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఎనిమిది ప్రధాన నగరాల్లో అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు 4 శాతం క్షీణించి 61,121 యూనిట్లకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. మొదటి ఎనిమిది స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ జనవరి-మార్చి కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల అమ్మకాలు 6,3787 యూనిట్లుగా ఉన్నాయి. చౌక గృహాల సరఫరా తక్కువగా ఉండటం అమ్మకాలు స్వల్పంగా పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం, ఈ టాప్ 8 నగరాల్లో 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో రూ.60 లక్షల మేర విలువైన ఇళ్ల తాజా సరఫరా 53,818 యూనిట్ల నుంచి 33,420 యూనిట్లకు తగ్గింది.ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో రూ .60 లక్షల వరకు ధర కలిగిన గృహాల అమ్మకాలు 23,401 యూనిట్ల నుంచి 28,826 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 14,532 యూనిట్ల నుంచి 12,299 యూనిట్లకు పడిపోయాయి. అహ్మదాబాద్లో 8,087 యూనిట్ల నుంచి 6,892 యూనిట్లకు తగ్గాయి.హైదరాబాద్లో ఈ ఇళ్ల అమ్మకాలు 3,674 యూనిట్ల నుంచి 3,360 యూనిట్లకు తగ్గగా, చెన్నైలో అమ్మకాలు 3,295 యూనిట్ల నుంచి 2,003 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరులో అమ్మకాలు 5,193 యూనిట్ల నుంచి 2,801 యూనిట్లకు తగ్గాయి. కోల్కతాలో మాత్రం అమ్మకాలు 2,831 యూనిట్ల నుంచి 3,741 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో 2,774 యూనిట్ల నుంచి 1,199 యూనిట్లకు తగ్గాయి. -
భారత్లో భారీగా పెరిగిన జపనీస్ బ్రాండ్ కారు సేల్స్
2024 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు 'నిస్సాన్ ఇండియా' కూడా సేల్స్ డేటా రిలీజ్ చేసింది.కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిస్సాన్ కంపెనీ మే 2024లో 6204 యూనిట్ల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు సమాచారం. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో 3043 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అమ్మకాల్లో కంపెనీ మునుపటి కంటే కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.మే 2023లో నిస్సాన్ అమ్మకాలు 4631 యూనిట్లు మాత్రమే. అదే మే 2024లో కంపెనీ సేల్స్ 6204కు చేరాయి. ఇందులో దేశీయ విక్రయాలు 2211 కాగా.. ఎగుమతులు 3993గా నమోదయ్యాయి. క్రమంగా నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'సౌరభ్ వత్సా' పేర్కొన్నారు.నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పడు కేవలం ఒకే కారును విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కంపెనీ ఇండియాలో తన నెట్వర్క్ పెంచుతూనే ఉంది. ప్రస్తుతం నిస్సాన్ 272 టచ్పాయింట్లను కలిగి ఉంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేల్స్ మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందిస్తోంది.కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ SUVని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండా, బ్రూనై వంటి దేశాలు మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. -
ఈ స్కూటర్ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
నిమిషానికి 90 టీ-షర్ట్స్ సేల్.. దూసుకెళ్లిన అమ్మకాలు
టాటా గ్రూప్ ఫ్యాషన్ చైన్ జూడియో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నిమిషానికి 90 టీ-షర్టులు, 17 లిప్స్టిక్లను విక్రయించినట్లు మాతృ సంస్థ ట్రెంట్ తన వార్షిక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.జూడియో ప్రతి నిమిషానికి 20 డెనిమ్లు విక్రయిస్తూ.. యువ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రెంట్ ఆదాయం 36.1 మిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. అంతే కాకుండా సంస్థ కొత్తగా మరో 46 నగరాల్లో స్టోర్స్ ప్రారంభించింది.2016లో ప్రారంభించిన జుడియోకి 2024 మార్చి నాటికి 161 నగరాల్లో 545 స్టోర్స్ ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 86 జూడియో ఔట్లెట్లు, గుజరాత్లో 82 ఉన్నాయి. కర్ణాటకలో 58, ఢిల్లీలో 14 ఔట్లెట్లు జూడియోకు ఉన్నాయని మే 18న విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలలో ఒక్కో స్టోర్ ఉన్నాయి. కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసి.. కస్టమర్లకు చేరువ్వడం వల్ల అమ్మకాలు పెరుగుతున్నాయని సంస్థ తెలిపింది. -
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు
భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్ఎఫ్ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్ నివేదిక హైలెట్ చేసింది. -
బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను ఈ మార్చి 2న నిర్వహించాయి. -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
300 నగరాల్లో కియా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కియా ఇండియా విక్రయ, సర్విస్ కేంద్రాలను విస్తరిస్తోంది. కియా 2.0 వ్యూహంలో భాగంగా డిసెంబర్కల్లా 300 నగరాలు, పట్టణాల్లో అడుగు పెట్టడం ద్వారా టచ్ పాయింట్స్ సంఖ్యను 700లకు చేరుస్తామని ప్రకటించింది. ప్రస్తుతం 236 నగరాలు, పట్టణాల్లో కంపెనీకి 522 సేల్స్, సర్విస్ సెంటర్స్ ఉన్నాయి. -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్షాప్స్ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్బ్యాక్స్కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
కమర్షియల్ వాహనాలకు ఎలక్షన్స్ దెబ్బ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు 2024–25లో 4–7 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాలలో విరామం కారణంగా జనవరి–మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయని అంచనా. దేశీయ సీవీ పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. సీవీల కోసం దీర్ఘకాలిక డిమాండ్ చెక్కుచెదరకుండా ఉంటుంది. మౌలిక రంగ మూలధన వ్యయంపై నిరంతర దృష్టి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ, తయారీ కార్యకలాపాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కమర్షియల్ వెహికిల్స్ పరిశ్రమకు దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉంటుంది. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చు’ అని ఇక్రా తెలిపింది. -
50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు. -
సేల్స్ బీభత్సం.. భారత్లో ప్రతి 5 నిమిషాలకు అమ్ముడు పోయే కారు ఇదే!
భారత్లో ప్రముఖ తయారీ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్కును సాధించినట్లు తెలిపింది. 2015లో మార్కెట్కి పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో, క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్సైజ్ ఎస్యూవీగా కొనసాగుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడవుతోంది. ఈ సందర్భంగా సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..‘భారతీయ రోడ్లపై పది లక్షలకు పైగా క్రెటాతో బ్రాండ్ తన వారసత్వాన్ని కొనసాగిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల లాంచ్ చేసిన కొత్త క్రెటాకు కూడా అద్భుతమైన కస్టమర్ రెస్పాన్స్ వచ్చిందని, ప్రకటించినప్పటి నుండి 60 వేల బుకింగ్స్ ను దాటిందని తెలిపారు. దేశీయ మార్కెట్ అమ్మకాలతో పాటు, ఎగుమతి మార్కెట్లో కూడా 2.80 లక్షల యూనిట్లకు పైగా క్రెటా విక్రయించినట్లు వెల్లడించారు. -
భారత్లో భారీగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఇదే..
ధర ఎక్కువైనప్పటికీ భారతీయ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు డిమాండ్ భారీగానే ఉంది. గత అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రికార్డ్ సేల్స్ సాధించి, 7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కెనాలిస్ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కూడా అత్యధికంగా 15 సిరీస్ మోడళ్లకు గిరాకీ ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో సులభ ఫైనాన్సింగ్ ఎంపికలు, రిటైలర్లకు ప్రోత్సాహక పథకాల కారణంగా.. పండుగ సీజన్లో అమ్మకాలు బాగా పెరిగాయి. అంతే కాకుండా గతేడాది ఐ15 సిరీస్ లాంచ్ అవ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ మీద కూడా సంస్థ తగ్గింపులు ప్రకటించడంతో ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. యాపిల్ మొబైల్స్ అమ్మకాల తరువాత శాంసంగ్, షావోమి, వివో, రియల్మీ, ఒప్పో వంటి కంపెనీలు మంచి అమ్మకాలను పొందాయి. భారతదేశంలో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ల సంఖ్య 14.86 కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది 5జీ పరికరాల ధరలు పెరుగుదల కారణంగా.. తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. కానీ కెనాలిస్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మకాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అయితే అమ్మకాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన విషయమే.. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
అక్కడ ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఈవీ.. భారీ రాయితీలే కారణమా?
నిత్యం కాలుష్యంతో సతమతవుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి సంప్రదాయ ఇంధన వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది సఫలమైనట్టుగానే కనిపిస్తోంది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా నవంబర్ 2023లో 9.5 శాతం ఉండగా డిసెంబర్లో 19.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో డిసెంబరు నెలలో అమ్ముడుపోయిన ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. 2020 ఆగస్ట్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వల్లే ఇది సాధ్యమైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీ కింద ఈవీల కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు రూ. 1.5 లక్షల వరకు క్యాష్బ్యాక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, సరుకు రవాణా వాహనాలకు రూ. 30,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకోవాలనుకునే వారికి స్క్రాపింగ్ ఇన్సెంటివ్లు సైతం ప్రకటించింది. ఒక సంవత్సరంలో నగరం అంతటా 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, పాలసీ అమలును పర్యవేక్షించడానికి 'స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్'ని ఏర్పాటు చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలోని వాటాదారులందరి మధ్య సమన్వయం, సహకారం కోసం త్వరలో ఢిల్లీ ఈవీ ఫోరమ్ను ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. -
ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు బంపరాఫర్!
వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్కార్ట్ తర్వలో ఈ ఏడాది తన తొలి ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 14 నుంచి జనవరి 19 వరకు కొనసాగనుంది. ఇక ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఐఫోన్15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12, పిక్సెల్ 7ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 5జీ, పిక్సెల్ 8, వివో టీ2 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, వివో టీ2ఎక్స్, పోకో ఎక్స్ 5, రియల్ మీ 11, రెడ్మీ 12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఇస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 నుండి ఉండగా ఫ్లిప్కార్ట్ రూ.72,999కే అమ్ముతుంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 70,900కి అమ్ముతుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు పొందవచ్చు. తద్వారా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లపై కూడా వరుసగా 75 శాతం, 65 శాతం తగ్గింపు ఉండనుంది. ఈ డిస్కౌంట్లపై ఫ్లిప్కార్ట్ మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. -
‘హౌస్’ ఫుల్! రూ.7,200 కోట్ల ఇళ్లు మూడు రోజుల్లో కొనేశారు..
దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే.. శాటిలైట్ సిటీలో.. దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్లోని ఏడు టవర్లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్లు, పెంట్హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్మెంట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్లను ప్రేరేపిస్తోంది. గతేడాదిలోనూ.. కాగా గత సంవత్సరంలోనూ డీఎల్ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. -
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో డిస్కౌంటే డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్లో రిపబ్లిక్డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్లో భాగంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్లో కస్టమర్లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 50 వేల వరకు డిస్కౌంట్ రాబోయే సేల్లో అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. 75 శాతం.. 65 శాతం డిస్కౌంట్ అదేవిధంగా, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. -
రియల్ఎస్టేట్ కింగ్ హైదరాబాద్! రికార్డ్స్థాయిలో అమ్ముడుపోయిన ఇళ్లు
రియల్ఎస్టేట్లో హైదరాబాద్ సత్తా చాటింది. గతేడాది నగరంలో ఇళ్ల అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడైంది. ఆల్టైమ్ హై నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం.. 2023లో హైదరాబాద్లో చరిత్రాత్మక గరిష్ట స్థాయిలో 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇవి అంతకుముందు ఏడాది కంటే 6 శాతం పెరిగాయి. ఇక హౌసింగ్ యూనిట్ల ప్రారంభంలోనూ కొత్త రికార్డును నెలకొల్పుతూ, నగరంలో రెసిడెన్షియల్ లాంచ్లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. గృహ కొనుగోలుదారులు జీవనశైలి అప్గ్రేడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలు అధికంగా ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా నైట్ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఇక ఇళ్ల బలమైన డిమాండ్-సరఫరా, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత పెరగడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయి. ఖరీదువారీగా చూస్తే.. రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి. రూ.50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి క్షీణించాయి. ఈ ధర విభాగంలో 2023లో దాదాపు 13,120 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022లో 13,784 యూనిట్లతో పోల్చితే 5 శాతం తగ్గాయి. భారీగా పెరిగిన ధరలు నగరంలో ఇళ్ల ధరలు 2023లో భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్ ఫలితంగా ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల నమోదైంది. నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల ఎక్కువగా ఉంది. ప్రాంతాలవారీగా తీసుకుంటే వెస్ట్ రీజియన్లోని కోకాపేటలో అత్యధికంగా 39 శాతం పెరుగుదల ఉంది. 28 శాతం పెరుగుదలతో మణికొండ ఆ తర్వాత స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా నార్త్ రీజియన్లోని సైనిక్పురిలో 2 శాతం ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఆఫీస్ మార్కట్లోనూ.. ఆఫీస్ మార్కట్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు 2023లో 52 శాతం, 4.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగాయి. నగరంలో 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ లావాదేవీల జరగ్గా 2023 సంవత్సరంలో 8.8 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సాక్షన్లు నమోదు చేసింది. మరో వైపు నగరంలో 6.5 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్ల సరఫరా నమోదైంది. -
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
అపోహలొద్దు.. అర్హులందరికీ లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పింఛన్ల పథకం కింద పాత లబ్ధిదారులందరికీ ఆ పథకాలు వర్తిస్తా యని వారు కొత్తగా రైతు భరోసా, చేయూత పథకాల కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరో సా, పింఛన్లపై అనవసర అపోహలు వద్దని, కొత్తగా ఈ పథకాల కింద లబ్ధి పొందాలనుకునే వారు మా త్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని కోరారు. ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయిలో కార్యక్రమం అమలవుతున్న తీరుపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితో సమీక్షించారు. ప్రజాపాలన దరఖాస్తులను కొంతమంది విక్రయిస్తుండడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల కొరత లేకుండా చూడండి దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటురానీయొద్దని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. -
ఈ కారుని 10 లక్షల మంది కొనేశారు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
2030 నాటికి అగ్రగామిగా భారత్ - ఇలా..
భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగం పెరుగుతూనే ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగంలో లెక్కకు మించిన వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఏడాదికి 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయాలు జరిగే అవకాశం ఉందని, 2030 నాటికి ఈ విభాగంలో దాదాపు 50 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' తాజాగా వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 3,45,4000 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు.. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం పొందనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడుతుందని అన్నారు. వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు తయారవుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న కార్లను కూడా ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గడ్కరీ తెలిపారు. కేవలం రోజు వారీ వినియోగానికి ఉపయోగించే వాహనాలు మాత్రమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ వంటి వాటిలో కూడా ఈవీల వినియోగం పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాయి. దీంతో తక్కువ కాలంలోనే ఈవీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ సబ్సిడీలను పరిమితం చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కల్పిస్తున్నారు. -
ఇలా ఎలా అనిపించిన ఓలా..
ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్ 2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
బస్ టికెట్ రేటుతో ఫ్లైట్ జర్నీ..
ప్రస్తుతం విమాన ప్రయాణం సర్వసాధారణం అయినప్పటికీ.. కొంద మంది మాత్రం విమాన ప్రయాణానికి ఎక్కువ డబ్బు అవసరమౌతుందని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 'విస్తారా ఎయిర్లైన్స్' ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విస్తారా ఎయిర్లైన్స్ క్రిస్మస్ సేల్లో భాగంగా కేవలం బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఈ రోజు (డిసెంబర్ 21) నుంచి డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉండే ఆఫర్ మీద రూ. 1924కే ఫ్లైట్ జర్నీ చేసేయొచ్చు. క్రిస్మస్ సేల్ కింద విస్తారా ఎకానమీ క్లాస్ వన్-వే ఛార్జీ ధర రూ.1924 (దిబ్రూఘర్-గౌహతి) మాత్రమే. ప్రీమియం ఎకానమీ క్లాస్ (దిబ్రూగర్-గౌహతి) విమాన టిక్కెట్లు రూ. 2324 నుండి ప్రారంభమవుతాయి. లగ్జరీ, బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలనుకుంటే.. దీని ప్రారంభ ధర రూ. 9924. విదేశాలకు వెళ్లే వారికి కూడా ఈ క్రిస్మస్ సేల్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఖాట్మండు, ఢాకా, సింగపూర్, జెడ్డా, డమ్మామ్, కొలంబో, అబుదాబి, దుబాయ్, మాలే, దోహా, మస్కట్, బ్యాంకాక్, హాంకాంగ్, బాలి, మారిషస్ వంటి దేశాలు జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ టికెట్ రేట్లు విషయానికి వస్తే.. ఎకానమీ క్లాస్ రూ.10,999 నుంచి ప్రారంభం కాగా.. ప్రీమియం ఎకానమీ ధర రూ. 14,999 (ఢిల్లీ-ఖాట్మండు) నుంచి ప్రారంభమవుతాయి. బిజినెస్ క్లాస్ ( ఢిల్లీ -ఢాకా) ప్రారంభ ధర రూ. 29,999. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! విస్తార క్రిస్మస్ సేల్స్ కేవలం ఇప్పటికి మాత్రమే కాకుండా.. 2024 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయడానికి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 23 అర్ధరాత్రి 23 గంటల 59నిముషాలకు ముగుస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ కింద ప్రయాణికులు వెకేషన్స్, ఫ్యామిలీ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్స్ వంటి వాటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. Discover the beauty of India! Enjoy discounted fares across all three cabin classes on our domestic network. Hurry, book until 23-December-2023 for travel until 30-September-2024. Blackout dates apply. T&C Apply. Book now: https://t.co/nJjfTemsjM ⁰#VistaraChristmasSale pic.twitter.com/VsebvAJoKG — Vistara (@airvistara) December 21, 2023 -
భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే!
Pakistan Car Sales: భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం. పాకిస్తాన్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం 'పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం' మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి. 2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! భారతీయ మార్కెట్లో అమ్మకాలు పాకిస్తాన్లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ. పాకిస్తాన్లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్లో తమ ఫోర్ వీలర్ కౌంటర్పార్ట్లను అధిగమించారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA) గణాంకాల ప్రకారం నవంబర్లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బ్లాక్ ఫ్రైడే సేల్.. కళ్లు చెదిరే ఆఫర్స్
అగ్రరాజ్యం అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి మొదలైంది. యూఎస్ఏలో ప్రతి సంవత్సరం బ్లాక్ ఫ్రైడే పేరుతో సేల్ను నిర్వహిస్తుంటారు. ఏటా థాంక్స్ గివింగ్ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలోని ప్రముఖ కంపెనీలు బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభి.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. ప్రతి ఏడాది అమెరికన్లు నవంబర్ నాలుగో గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ రాకను సూచిస్తూ శాంటా క్లాజ్ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి. ఈ సేల్లో భాగంగా ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా చాలా కంపెనీలు కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులు.. కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తాయి. కొన్ని సంస్థలు 'బ్లాక్ థర్స్ డే' పేరుతో గురువారం నుంచే సేల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున కస్టమర్లు షాపింగ్ చేయటానికి తరలి వచ్చారు. దీంతో అన్ని షాపులు కిటకిటలాడాయి. ఇక ప్రధాన రోడ్లతో పాటు పార్కింగ్ స్థలాలు రద్దీగా మారాయి. -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది. ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే! -
విలాస భవనాలకు గిరాకీ.. ఈ ఏడాది అదే టాప్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాసవంతమైన ఇళ్లకు (అల్ట్రా లగ్జరీ) అధిక గిరాకీ నెలకొన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.40 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు రూ. 4,063 కోట్ల మేర నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె పట్టణాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 58 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2022 ఏడాది మొత్తం మీద ఈ విభాగంలో అమ్ముడుడైనవి 13 యూనిట్లుగానే ఉన్నాయి. వీటి విలువ రూ. 1,170 కోట్లుగా ఉంది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ధనవంతులు (హెచ్ఎన్ఐ), అధిక ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) ఖరీదైన ఇళ్లను పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు’’అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న నేపథ్యంలో హెచ్ఎన్ఐలు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో మార్పులు చేయడం అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డివండ్ను పెంచినట్టు చెప్పారు. ముంబై టాప్.. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యంత ఖరీదైన ఇళ్లు 58 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో 53 యూనిట్లు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నాలుగు యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లోనూ ర.40 కోట్ల పైన విలువ చేసే ఒక యూనిట్ విక్రయం నమోదైంది. ముంబైలోని 53 యూనిట్లలో మూడు ఇళ్ల ధర రూ. 200 కోట్లపైనే ఉంది. ఏడు ఇళ్ల ధర రూ. 100–200 కోట్ల మధ్య ఉంది. ఢిల్లీలో రెండు యూనిట్ల ధర రూ.100 కోట్లపైన ఉంది. ‘‘ఇటీవలి కాలంలో సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష అన్ని ఆదాయ వర్గాల వారిలో పెరిగింది. జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇందుకు కారణం. మరింత విలాసవంతమైన ఇల్లును కలిగి ఉండాలన్న ధోరణి ధనవంతుల్లో పెరిగింది’’అని గురుగ్రామ్కు చెందిన క్రిసూమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ పేర్కొన్నారు. -
లగ్జరీ ఇళ్ల గిరాకీ : కోట్లు అయినా...సరే! హైదరాబాదీల జోరు
న్యూఢిల్లీ: కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో భారతీయ రియల్ ఎస్టేట్ దూసుకుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పుంజుకుంది. స్మార్ట్, లగ్జరీ హోమ్స్, టాప్ క్లాస్ ఎమినిటీస్ ఉంటే చాలు ధర ఎంతైనా వెనుకాడ్డం లేదు. 4 కోట్ల రూపాయ విలువైన ఇళ్లను సొంతం చేసుకునేందుకు బడాబాబులు ఎగబడుతున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి అభిస్తున్న ఆదరణ, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాపై పెరుగుతున్న ఆకాంక్ష,ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విలాసవంతమైన నివాసాల కొరత వంటి అనేక అంశాలు లగ్జరీ హౌసింగ్ అమ్మకాల పెరుగుదలకు దారితీసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2023 జనవరి-సెప్టెంబర్ మధ్య భారతదేశంలో రూ. 4 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన విలాస వంతమైన గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 తొలి తొమ్మిది నెలల్లో 97 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఏడు నగరాల్లో, ఈ సంవత్సరం 9,200 లగ్జరీ గృహాలు అమ్ముడైనాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 4,700 యూనిట్లు మాత్రమే. ఈ కాలంలో జరిగిన మొత్తం లగ్జరీ హౌసింగ్ విక్రయాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్ల వాటా 90 శాతంగా ఉందని వేదిక ఢిల్లీ-ఎన్సీఆర్లో 37 శాతం, ముంబైలో 35 శాతం, హైదరాబాద్లో 18 శాతం అమ్మకాలు జరిగాయి. మిగిలిన 4 శాతం పూణేలో నమోదైనాయి. (విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్ సింఘానియా) అంతేకాదు అక్టోబరు- డిసెంబరు పండుగల సీజన్లో లగ్జరీ హౌసింగ్ విక్రయాలు మరింత జోరందు కుంటాయని కూడా నివేదించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తొలిసారిగా లగ్జరీ గృహాలను కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లగ్జరీ లైఫ్పై పెరుగుతున్న ఆసక్తి, ఈ పెరుగుదలకు కొన్నికారణాలులుగా సీబీఆర్ఈ వెల్లడించింది. ఈప్రాధాన్యతల కారణంగా ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగంలో రెసిడెన్షియల్ అమ్మకాలతోపాటు, కొత్త లాంచ్లు పెరుగుతాయని అంచనా వేసింది. 2023లో 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. అలాగే సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే అధిక-నికర-విలువ గల వ్యక్తులు (HNIలు), ప్రవాస భారతీయులు (NRIలు) ఆసక్తి కూడా ఈ పెరుగుదలకు దోహదపడుతోందని వెల్లడించింది. (ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్కీ డబ్బులు అడుగుతారేమో?) -
అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే!
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ మొదలపోతోంది. నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ బ్యూటీ సేల్ 26 వరకు ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద 50 నుంచి 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కే-బ్యూటీ నుంచి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్ జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, బ్యూటీ బ్రాండ్ల వంటి ఉత్పత్తులు, సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు. అసలే శీతాకాలం పైగా వివాహాల సీజన్.. కొందరు చర్మ రక్షణ కోసం మరి కొందరు ఫంక్షన్స్లో ప్రత్యేకంగా కనిపించడం కోసం అనేక సౌదర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి అమెజాన్ ద బ్యూటీ సేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో మీద మంచి డీల్స్, ఫ్రీ గిఫ్ట్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బై మోర్, సేవ్ ఆఫర్స్ కింద కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 PM డీల్స్, సబ్స్క్రైబ్ అండ్ సేవ్తో 10% వరకు ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ షాపింగ్, ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుంచి ఉత్పత్తి అనుకూలత వంటి వాటికి కంపెనీ అందిస్తుంది. మేబిలైన్, లోరియల్ ప్రొఫెషనల్, బయోటిక్, కామా ఆయుర్వేద, స్విస్ బ్యూటీ, లాక్మే, రినీ కాస్మెటిక్స్, మైగ్లామ్, కలర్ బార్ కాస్మటిక్స్, పౌలాస్ ఛాయిస్.. ఇంకా ఎన్నో 300 కంటే ఎక్కువ బ్రాండ్స్పై ఉత్తేజభరితమైన 8000 కంటే ఎక్కువ డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ద బ్యూటీ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జెబా ఖాన్' మాట్లాడుతూ.. ఇప్పటికే ది బ్యూటీ సేల్ మొదటి రెండు ఎడిషన్లకు కస్టమర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మూడవ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. చర్మ సంరక్షణ, మేకప్ వంటి లగ్జరీ ఉత్పత్తులతో అందాన్ని మరింత పెంచుకోవడంలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అందం మీద ద్రుష్టి పెట్టే ప్రతి ఒకరికి ఇది సరైన చోటు అని వెల్లడించారు. -
వాహనాలకు పండుగ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు అక్టోబరులో రికార్డు స్థాయిలో పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. పటిష్ట పండుగ సీజన్ డిమాండ్ ఇందుకు దోహదం చేసిందని వెల్లడించింది. ‘గత నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ సంఖ్య 3,89,714 యూనిట్లు. 2022 అక్టోబర్తో పోలిస్తే ఇది 16 శాతం అధికం. త్రిచక్ర వాహనాలు 42 శాతం ఎగసి 76,940 యూనిట్లను తాకాయి. ఒక నెలలో ఈ స్థాయి యూనిట్లు హోల్సేల్లో విక్రయం కావడం ఇదే తొలిసారి. ద్విచక్ర వాహనాలు 20 శాతం అధికమై 18,95,799 యూనిట్లుగా ఉంది. ఈ మూడు విభాగాలు అక్టోబర్ నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధి ఊపందుకోవడం పరిశ్రమకు ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వ స్థిర అనుకూల విధానాలు, కొనసాగుతున్న పండుగల సీజన్తో ఇది సాధ్యమైంది’ అని సియామ్ తెలిపింది. -
65 వేల దిగువకు సెన్సెక్స్
ముంబై: ద్రవ్యోల్బణ డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి బలహీనతలు సెంటిమెంట్పై మరింత పెంచాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 64,934 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 19,444 వద్ద నిలిచింది. దీంతో సూచీలకు ముహూరత్ ట్రేడింగ్ లాభాలన్నీ మాయమ య్యాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 406 పాయింట్లు నష్టపోయి 64,853 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 19,415 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, విద్యుత్, ఆటో షేర్ల రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,244 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.830 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బలిప్రతిపద సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ తిరిగి యథావిధిగా బుధవారం ప్రారంభవుతుంది. ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ షేరు లిస్టింగ్ రోజు 11% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.792) వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో క్రమంగా కొనుగోళ్ల మద్దతు పెరగడంతో ఈ షేరు పుంజుకుంది. ట్రేడింగ్లో 12% ర్యాలీ చేసి రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.883 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.3,571 కోట్లుగా నమోదైంది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతితో దీపావళి మరుసటి రోజూ భారత ఈక్విటీ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు ప్రభావాలతో ఐఐపీ వృద్ధి, తయారీ రంగ పీఐఎం భారీగా క్షీణించాయి. అయితే మెరుగైన కార్పొరేట్ ఆదాయాలు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సంస్థాగత కొనుగోళ్లు తదితర అంశాలు దిగువ స్థాయిలో దేశీయ మార్కెట్కు దన్నుగా నిలిచే వీలుంది’. – దీపక్ జెసానీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ -
జియోఫోన్ ప్రైమా సేల్స్ షురూ - ధర రూ.2,599 మాత్రమే!
ముంబై: కై–ఓఎస్ ప్లాట్ఫామ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ కీప్యాడ్తో జియోఫోన్ ప్రైమా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. రిటైల్ స్టోర్స్తో పాటు రిలయన్స్ డిజిటల్డాట్ఇన్, జియోమార్ట్ ఎలక్ట్రానిక్స్, అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా విక్రయాలు ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 2,599గా ఉంటుంది. 2.4 అంగుళాల డిస్ప్లే స్క్రీన్, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, 23 భాషలను సపోర్ట్ చేయడం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఫీచర్ ఫోన్ తరహాలోనే ఉన్నా వీడియో కాలింగ్, ఫొటోల కోసం డిజిటల్ కెమెరాలు, జియోటీవీ, జియోసినిమా వంటి ఎంటర్టైన్మెంట్ సర్వీసులు, జియోపే లాంటి యూపీఐ చెల్లింపుల విధానం మొదలైన ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి. -
పండుగల జోష్.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భేష్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ మొదటి 15 రోజుల్లో అమ్మకాలు తగ్గగా.. తర్వాతి 15 రోజుల్లో గణనీయంగా పెరిగాయి. దీంతో విక్రయాల్లో నికర వృద్ధి నమోదైంది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ అక్టోబర్లో 3 శాతం అధికంగా 2.87 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. డీజిల్ అమ్మకాలు 5 శాతం పెరిగి 6.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అక్టోబర్ మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9 శాతం తగ్గగా, డీజిల్ విక్రయాలు 3.2 శాతం క్షీణతను చూడడం గమనార్హం. తిరిగి దసరా నవరాత్రుల సమయాల్లో వీటి విక్రయాలు బలంగా పుంజుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్ తొలి 15 రోజుల్లో పెట్రోల్ విక్రయాలు 1.17 మిలియన్ టన్నులుగా ఉంటే, తర్వాతి 15 రోజుల్లో దీనికంటే 44 శాతం అధికంగా 1.70 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. డీజిల్ విక్రయాలు అక్టోబర్ మొదటి భాగంలో 2.99 మిలియన్ టన్నులుగా నమోదు కాగా, ద్వితీయ భాగంలో 3.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్లో డీజిల్ అమ్మకాలు 5.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు అక్టోబర్ నెలకు 6,21,200 టన్నులుగా ఉన్నాయి. 2021 అక్టోబర్ విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 6.9 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో అమ్మకాలు 6,03,600 టన్నులతో పోల్చి చూసినా 3 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం వృద్ధితో 2.49 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో ఆల్టైం రికార్డ్!
ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు. -
భారత్లో యాపిల్ ఆదాయం రూ.50వేల కోట్లు.. టిమ్ కుక్ ఊహించి ఉండరు..
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో అదరగొట్టేస్తుంది. భారత్లో ఆ సంస్థ వ్యాపారం రూ.50 వేల కోట్ల చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. 2022-23 దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు 48 శాతం వృద్దితో ఆదాయం రూ.49,321 కోట్లకు చేరింది. నెట్ ప్రాఫిట్ సైతం 76 శాతం పెరిగి రూ.2,229గా నమోదైనట్లు రెగ్యూలరేటరీ ఫైలింగ్లో యాపిల్ తెలిపింది. యాపిల్ భారత్లో గత ఐదేళ్ల నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి ఊహించని విధంగా బిజినెస్తో పాటు అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా, యాపిల్ ప్రొడక్ట్ల తయారీ కోసం ఉపయోగించి విడి భాగాల ధరల తగ్గింపుతో న్యూజనరేషన్ ప్రొడక్ట్లు మాక్, హోం ప్యాడ్, ఐఫోన్ 15ల అమ్మకాల షేర్, మార్జిన్ సేల్స్ పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాదిలో యాపిల్ రూ.45 వేలకంటే విలువైన ఐఫోన్లు 59 శాతం షేర్ను సాధించగా.. షిప్మెంట్ 56 శాతం జరిగింది. నిర్వహణ పరంగా చూస్తే.. నిర్వహణ ఖర్చు5.4 శాతంతో, ప్రొడక్ట్ల అమ్మకాలు 94.6 శాతంతో జరిగినట్లు యాపిల్ రెగ్యూలరేటరీలో ఫైల్ చేసింది. గత ఏడాది 2022తో పోలిస్తే విదేశీ మారకపు అవుట్ ఫ్లో 2023లో 2 శాతం పెరిగి రూ.18,140కి, విదేశీయ మారకం ఆదాయం 39 శాతంతో రూ.2,662గా నమోదైంది. ఈ సందర్భంగా గడిస్తున్న ఆదాయంతో భారత్లో యాపిల్ దీర్ఘ కాలం వ్యాపార శక్తి సామర్ధ్యాలు మెండుగా ఉన్నాయని నిరూపిస్తుందని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ తరణ్ పాఠక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. క్షీణించిన ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జూలై–సెప్టెంబర్లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ 10,74,189 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 4.7 శాతం అధికం. భారత్లో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశీయ ప్యాసింజర్ వెహికిల్స్ టోకు విక్రయాలు 20 లక్షల మార్కును దాటడం కూడా ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్తో పోలిస్తే పీవీ హోల్సేల్స్ 19,36,804 యూనిట్ల నుంచి ఈ ఏడాది 20,70,163 యూనిట్లకు దూసుకెళ్లాయి. ద్విచక్ర వాహనాలు మినహా.. 2023–24 రెండవ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్లు, వాణిజ్య వాహనాల విభాగాలు వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు స్వల్పంగా తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూలై–సెప్టెంబర్లో డీలర్లకు చేరిన మొత్తం ద్విచక్ర వాహనాలు 46,73,931 యూనిట్ల నుంచి 45,98,442 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల హోల్సేల్ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాలు 1,20,319 నుంచి 1,95,215 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 60,52,739 యూనిట్ల నుండి 61,16,091 యూనిట్లకు ఎగశాయి. పండుగ సీజన్లోకి ప్రవేశించడంతో అన్ని వాహన విభాగాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడవ త్రైమాసికంలో కూడా మెరుగ్గా ఉంటుందని సియామ్ అంచనా వేస్తోంది. ఎంట్రీ లెవెల్ బేజారు.. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ కారణంగా పీవీ విభాగంలో అమ్మకాల వృద్ధికి ఆజ్యం పోసింది. మొత్తం అమ్మకాలలో యుటిలిటీ, ఎస్యూవీ విభాగం 60 శాతం వాటాను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. 2018–19 జూలై–సెప్టెంబర్లో నమోదైన 1.38 లక్షల యూనిట్ల గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంట్రీ లెవల్ కార్ల హోల్సేల్స్ 35,000 యూనిట్లకు పడిపోయాయి. ఎంట్రీ లెవల్ టూ వీలర్ సెగ్మెంట్లోనూ ఇదే ట్రెండ్ ఉంది. గ్రామీణ డిమాండ్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం ఇందుకు కారణం. కాగా, సెప్టెంబర్ నెలలో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ గతేడాదితో పోలిస్తే 3,55,043 నుంచి 2 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 17,35,199 నుంచి 17,49,794 యూనిట్లకు, త్రీవీలర్లు 50,626 నుంచి 74,418 యూనిట్లను తాకాయి. అన్ని విభాగాల్లో కలిపి సెప్టెంబర్లో హోల్సేల్ అమ్మకాలు 20,93,286 నుంచి 21,41,208 యూనిట్లకు పెరిగాయి. క్షీణించిన ఎగుమతులు భారత్ నుంచి వాహన ఎగుమతులు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 22,11,457 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం తగ్గుదల. వివిధ దేశాలలో భౌగోళిక రాజకీయ, ద్రవ్య సంక్షోభాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అర్థ భాగంలో ఎగుమతులు క్షీణించాయని వాహన పరిశ్రమల సంఘం సియామ్ సోమవారం తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ ఎగుమతులు 5 శాతం వృద్ధితో 3,36,754 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్లు 20 శాతం తగ్గి 16,85,907 యూనిట్లు, త్రీవీలర్లు 2,12,126 నుంచి 1,55,154 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 25 శాతం పడిపోయి 31,864 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్రధానంగా రెండు కారణాల వల్ల ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్నాయని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. మొదటిది కొన్ని ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సమస్యలు, రెండవది పలు భౌగోళిక ప్రాంతాలలో ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి ఉందని చెప్పారు. రూపాయి పరంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో సహా చాలా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎగుమతులు మున్ముందు మెరుగుపడతాయని. భావిస్తున్నామని ఆయన వివరించారు. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్కార్ట్కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్షిప్లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
13 బిలియన్ డాలర్ల దీపావళి పండుగ..చిన్న సంస్థలకు మరింత లాభసాటిగా
ముంబై: దేశీ చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఈసారి దీపావళి పండుగ మరింత లాభసాటిగా ఉండనుంది. ఈ–కామర్స్ ద్వారా 13 బిలియన్ డాలర్ల మేర వ్యాపారాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని ఎంఎస్ఎంఈలు మరింత ఎక్కువగా ఆర్డర్లు దక్కించుకుంటున్నాయి. టెక్ ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ షిప్రాకెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం ఆర్డర్లలో 10–15 శాతం ఆర్డర్లు తొలిసారిగా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి నుంచే ఉండనున్నాయి. పండుగ అమ్మకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) 28 శాతం వాటాతో అగ్రస్థానంలో, 13 శాతం వాటాతో ముంబై, 7 శాతం వాటాతో బెంగళూరు ఆ తర్వాత స్థానాల్లో ఉంటాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్ వినియోగం పెరిగింది. షిప్రాకెట్కి వచ్చే ఆర్డర్లలో 56 శాతం వాటా మెట్రోయేతర నగరాల నుంచే ఉంటోంది. ఎగుమతులు అప్.. పండుగ సీజన్లో ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ఎక్కువగా కృత్రిమ జ్యుయలరీ, సౌందర్య సంరక్షణ, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, పుస్తకాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, హోమ్ ఫర్నిషింగ్స్ మొదలైనవి వీటిలో ఉంటున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, యూఏఈలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ అదనంగా మూడు గిడ్డంగులను సమకూర్చుకుంది. ఆర్డర్లను సత్వరం ప్రాసెస్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను 50 శాతం మేర పెంచుకుంది. -
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
లగ్జరీ కార్ల అమ్మకాల్లో జోష్.. పండుగల సీజన్పై ఆశలు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. గతేడాదికి మించి అమ్మకాలు ‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్సీ 500 హెచ్ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్ఎం మల్టీపర్పస్ వెహికల్కు కూడా బుకింగ్లు ప్రారంభించనుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. -
మరో వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఓలా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైడ్ హెయిలింగ్ యాప్ ఓలా తాజాగా ఓలా పార్సల్ సేవలను బెంగళూరులో ప్రారంభించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఇందుకోసం కంపెనీ వినియోగించనుంది. దశలవారీగా పార్సల్ సర్వీ సులు ఇతర నగరాల్లో పరిచయం చేయనున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 చార్జీ వసూలు చేస్తారు. 5 కిలోమీటర్లపైన దూరాన్నిబట్టి 20 కిలోమీటర్ల వరకు చార్జీ రూ.100 దాకా ఉంది. -
ఆడి కార్ల అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో కార్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఈ జనవరి –సెప్టెంబర్ మధ్య 88% వృద్ధితో మొత్తం 5,530 కార్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 2,947 కార్లను డెలివరీ చేసింది. క్యూ8 ఈ–ట్రాన్, క్యూ8 స్పోర్ట్బ్యాక్ ఈ–ట్రాన్, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్లతో పాటు ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలిపింది. ‘‘ఎస్యూవీల విభాగపు అమ్మకాల వృద్ధి 187% నమోదైంది. రానున్న పండుగ సీజన్ కారణంగా నెలకొనే డిమాండ్తో ఈ ఏడాది మొత్తం విక్రయాల వృద్ధిని కొనసాగిస్తాము’’ అని ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరణతో పాటు మెరుగైన ఆర్థిక స్థితిగతులు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమయ్యాయని బల్బీర్ సింగ్ వివరించారు. -
హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం..పెరుగుతున్న వాహనాల ధరలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్కు మార్కెట్లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే? ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెరుగుతున్న ఎగుమతులు కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం. చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు! -
పండుగ సీజన్లో వాటి కొనుగోళ్లకే మొగ్గు.. డెలాయిట్ సర్వే సంచలన రిపోర్ట్!
న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్లో వినియోగదారులు అధిక వ్యయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు డెలాయిట్ సర్వే వెల్లడించింది. లగ్జరీ, సెలబ్రేటరీ (వేడుకలకు సంబంధించి) వస్తువుల కొనుగోలు పెరగడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఊహించని పెద్ద మొత్తంలో ఖర్చులు వచ్చినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ‘డెలాయిట్ కన్జ్యూమర్ సిగ్నల్ రీసెర్చ్’ సర్వేలో సగం మంది చెప్పారు. ‘‘భారత్లో పండుగల సీజన్ సమీపిస్తోంది. దీంతో వినియోగదారుల్లో నమ్మకం పెరుగుతోంది. 56 శాతం మంది వేడుకలకు సంబంధించిన (పుట్టిన రోజు, వివాహం తదితర) వస్తువులు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు’’అని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. సమీప కాలంలో వస్త్రాలు, వ్యక్తిగత సంరక్షణ, వినోదం, విహారంపై వ్యయాలు పెరగొచ్చని తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధిని సాధిస్తుండడంతో, వినియోగదారులు విలాస వస్తువులు, ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నట్టు డెలాయిట్ ఆసియా పసిఫిక్ పార్ట్నర్ రాజీవ్సింగ్ పేర్కొన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రవాణా, ఆతిథ్యానికి కూడా ఇదే ధోరణి విస్తరిస్తున్నట్టు చెప్పారు. టైర్ 2, 3 పట్టణాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగం పెరగనుందని, దీంతో రిటైల్, ఆటోమోటివ్, రవాణా, ఆతిథ్య రంగాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు. భారత వినియోగదారులు కేవలం విలావవంతమైన కొనుగోళ్లకే పరిమితం కావడం లేదని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. ఇందుకు నిదర్శంగా దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్లను పేర్కొంది. -
ఐఫోన్ 15 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ.. ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న కస్టమర్లు!
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 సిరీస్ సేల్ ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయకముందు నుంచే కొనుగోలుదారు బయట బారులుతీరారు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో యాపిల్ స్టోర్ల ప్రారంభోత్సవం తర్వాత ఐఫోన్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి. ఉదయం 8 గంటలకు స్టోర్ ప్రారంభమైంది.. కస్టమర్లను బ్యాచ్ల వారీగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది కస్టమర్లు ఉదయం 3 గంటల నుంచే ఎదురు చూస్తున్నట్లు సమాచారం. యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే మోడల్స్ లాంచ్ చేసింది. వీటి ధరలు ఎందుకునే స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇవి మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇదీ చదవండి: భారత్లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే.. కొత్త ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించడం ద్వారా రూ. 6000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర మోడల్స్ మీద రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త మోడల్స్ మీద మాత్రమే కాకుండా ఐఫోన్ 14, 13 సిరీస్ల మీద కూడా రూ. 4000 & రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. #WATCH | A customer outside the Apple store at Mumbai's BKC says, "I have been here since 3 p.m. yesterday. I waited in the queue for 17 hours to get the first iPhone at India's first Apple store. I have come from Ahmedabad..." Another customer, Vivek from Bengaluru says, "...I… https://t.co/0deAz5JkCH pic.twitter.com/YE6m5cufC2 — ANI (@ANI) September 22, 2023 -
ఊపందుకున్న పెట్రోల్ వినియోగం.. నీరసించిన డీజిల్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఈ నెల తొలి పక్షం రోజుల్లో పెట్రోల్ వినియోగం ఊపందుకోగా.. డీజిల్ అమ్మకాలు నీరసించాయి. వర్షాలు డిమాండును దెబ్బతీయడంతో వరుసగా రెండో నెలలోనూ డీజిల్ విక్రయాలు మందగించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పారిశ్రామిక కార్యక్రమాలు మందగించడం సైతం ప్రభావం చూపింది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు నామమాత్రంగా పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వివరాల ప్రకారం ఈ నెల 1–15 మధ్య డీజిల్ అమ్మకాలు 5.8 శాతం క్షీణించి 2.72 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. అయితే ఈ ఆగస్ట్ తొలి 15 రోజులతో పోలిస్తే 1 శాతం పుంజుకున్నాయి. కాగా.. పెట్రోల్ అమ్మకాలు 1.2 శాతం పెరిగి 1.3 మిలియన్ టన్నులను తాకాయి. ఆగస్ట్ తొలి పక్షంతో పోలిస్తే 8.8 శాతం ఎగశాయి. -
ఆరోగ్య విభాగంపై డాబర్ ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ విభాగం నుంచి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అలాగే హోమ్, పర్సనల్ కేర్ విభాగాల నుంచి ఆదాయాన్ని 5–7 ఏళ్లలో రూ.7,000 కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. హెల్త్ కేర్, హోమ్, పర్సనల్ కేర్తో కూడిన కన్జ్యూమర్ కేర్ విభాగం నుంచి డాబర్కు అధిక ఆదాయం వస్తుండడాన్ని గమనించొచ్చు. 2022–23 మొత్తం ఆదాయం రూ.11,530 కోట్లలో ఈ విభాగం నుంచి 56.2 శాతం లభించింది. హెర్బల్, ఆయుర్వేదిక్ ఉత్పత్తుల అమ్మకాలు తలసరి ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతాయని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది. ఎగువ మధ్యతరగతి జనాభా పెరుగుదలతో ప్రయోజనం పొందే ప్రీమియం బ్రాండ్లు కూడా డాబర్ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో లో యూనిట్ ప్యాక్ల (ఎల్యూపీ) అమ్మకాలు సైతం పెరుగుతాయనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మందికి చేరుకునే విధంగా ఎల్యూపీల పోర్ట్ఫోలియో పెంచుతామని పేర్కొన్నారు. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో ప్రస్తుత ఉత్పత్తుల విభాగాలను విస్తరిస్తూనే, నూతన విభాగాల్లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రియల్ పేరుతో జ్యూస్ల విభాగంలో డాబర్ తగినంత మార్కెట్ వాటా సంపాదించం గమనార్హం. రియల్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. బాద్షా మసాలాను అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. డాబర్ గతేడాదే బాద్షా మసాలను రూ.587 కోట్లకు సొంతం చేసుకుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసుకునే ప్రణాళికతో ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు. గులాబరి బ్రాండ్పై బాడీవా‹Ù, సబ్బులను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. -
తగ్గనున్న డీజిల్ వాహన అమ్మకాలు - కారణం ఇదే!
న్యూఢిల్లీ: కఠిన ఉద్గార నిబంధనల కారణంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో డీజిల్ కార్ల శాతం తగ్గుతుందని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. వాహనం ఖరీదు కావడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. ఇప్పటికే డీజిల్ వాహన అమ్మకాలు క్షీణిస్తున్నట్టు తెలిపాయి. నిబంధనలు కఠినతరం అయితే సహజంగానే ధర పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో డీజిల్ వాహనాల విక్రయాల తగ్గుదల శాతం వేగంగా ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డీజిల్ మోడళ్లకు స్వస్తి పలుకుతున్నట్టు ఇప్పటికే చాలా కంపెనీలు స్పష్టం చేశాయన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 2013–14లో డీజిల్ మోడళ్ల వాటా 53.2 శాతం. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్లో ఇది 18.2 శాతానికి వచ్చి చేరిందన్నారు. డీజిల్–పెట్రోల్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం తగ్గింది. డీజిల్ వాహనాలతో లభించే వ్యయ ప్రయోజనాలు తగ్గాయన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ మాట్లాడుతూ తమ కంపెనీ అమ్మకాల్లో డీజిల్ విభాగం వాటా 18 శాతానికి వచ్చి చేరిందన్నారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్క్యాప్స్నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
నాలుగేళ్లకే లగ్జరీ కారు మారుస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు 38.9 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో లగ్జరీ వాహన విభాగం 45,000 యూనిట్లను నమోదు చేయవచ్చని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్రాండ్లవి కలిపి 36,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని చెప్పారు. మెర్సిడెస్ బెంజ్కు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తరువాత 10 శాతం వాటాతో అయిదవ స్థానంలో హైదరాబాద్ మార్కెట్ నిలిచిందన్నారు. 4–5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్–3 స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వినియోగదార్లలో మహిళల వాటా 30 శాతం ఉందన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రస్తుతం భారత్లో 14 మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయంగా ఇవి తయారవుతున్నాయి. ఇవి కాకుండా 10 మోడళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 3 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో 16,497 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. టాప్ ఎండ్ మోడళ్లపైనే ఫోకస్ చేస్తున్నట్టు అయ్యర్ తెలిపారు. ‘గతంలో వ్యాపారస్తులు మాత్రమే మా కార్లను కొనేవారు. ఇప్పుడు ఉద్యోగస్తులు సైతం కొంటున్నారు. కస్టమర్లలో వేతన జీవులు 13 శాతం ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏటా 12 యూనిట్ల వరకు విక్రయిస్తున్నాం. వీటి ధర రూ.8–13 కోట్ల మధ్య ఉంటుంది. పూర్తిగా తయారైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను జర్మనీ నుంచి భారత్కు దిగుమతి చేసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈవీల్లో తొలి స్థానంలో.. మెర్సిడెస్ మొత్తం విక్రయాల్లో 3–4 శాతం ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సమకూరుతోంది. కంపెనీకి ఈవీ విభాగంలో 8–9 శాతం వాటాతో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉంటాయని సంతోష్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో ఎస్యూవీ, సెడాన్ విభాగాలు చెరి 50 శాతం ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్యూవీల వాటా ఏకంగా 70 శాతం ఉంది. ఈ మార్కెట్లో రూ.1.5 కోట్లు, ఆపైన ధర కలిగిన టాప్ ఎండ్ లగ్జరీ కార్ల వాటా 25 శాతం ఉంది. వృద్ధి 40 శాతం ఉండడం విశేషం. కొన్ని మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ 24 నెలల వరకు ఉంది. అయినా కస్టమర్లు వేచి చూస్తున్నారు. వినియోగదార్లు లగ్జరీ కారును నాలుగేళ్లకే మారుస్తున్నారు. గతేడాది 3,000 యూనిట్ల పాత కార్లను విక్రయించాం’ అని వివరించారు. -
AP: కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా! ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషిస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ ఎందుకు పెరిగాయి? కార్లు, ద్వి చక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయంటే అర్థమేంటీ..? రాష్ట్రంలో అభివృద్ది వేగంగా జరుగుతోందని అర్ధం. అంతేకాదు.. జనాల చేతుల్లో డబ్బులున్నాయని అర్ధం. సంపదను ప్రభుత్వం ప్రజలకు పంచుతుందని అర్ధం. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
మళ్లీ జియో ఫైనాన్స్ డీలా
ముంబై: వరుసగా రెండో రోజు జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మరోసారి 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. బీఎస్ఈలో రూ. 12.5 కోల్పోయి రూ. 239 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈలోనూ ఇదే స్థాయి నష్టంతో రూ. 237 దిగువన స్థిరపడింది. సోమవారం సైతం ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్ను తాకిన సంగతి తెలిసిందే. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ గత నెలలో జరిగిన ధర నిర్ధారణ ట్రేడింగ్లో రూ. 262 ధర వద్ద స్థిరపడింది. తదుపరి ఈ కౌంటర్లో స్టాక్ ఎక్సే్ఛంజీలు సోమవారం(21) నుంచి 10 రోజులపాటు ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో సాధారణ ట్రేడింగ్కు తెరతీశాయి. ఫలితంగా రోజుకి 5 శాతం సర్క్యూట్ బ్రేకర్ అమలుకానుంది. తొలి రోజు 5 శాతం పతనమై రూ. 250 సమీపంలో నిలిచింది. ఇండెక్సులలో.. ధరలో నిలకడను తీసుకురావడం, హెచ్చుతగ్గులను పరిమితం చేయడం వంటి లక్ష్యాలతో స్టాక్ ఎక్సే్ఛంజీలు జియో ఫైనాన్షియల్ను ప్రధాన ఇండెక్సులలో తాత్కాలికంగా భాగం చేశాయి. విలీనాలపై సవరించిన తాజా నిబంధనల అమలులో భాగంగా సెన్సెక్స్లో 31వ, నిఫ్టీలో 51వ షేరుగా ప్రస్తుతం కొనసాగుతోంది. నిజానికి ఈ షేరుని లిస్టింగ్ తదుపరి మూడు రోజులకు సెన్సెక్స్, నిఫ్టీల నుంచి తొలగించవలసి ఉంది. అయితే వరుసగా సర్క్యూట్ బ్రేకర్లను తాకడంతో ఈ షేరుని ఆగస్ట్ 29వరకూ సెన్సెక్స్, నిఫ్టీలలో కొనసాగించనున్నట్లు ఇండెక్సుల కమిటీ పేర్కొంది. అప్పటికి కూడా సర్క్యూట్ బ్రేకర్లను తాకడం కొనసాగితే.. మరోమారు ఇండెక్సుల నుంచి తొలగింపు వాయి దా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎల్ఐసీకి షేర్లు ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్లను జియో ఫైనాన్షియల్ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత నెలలో ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ 1 ఆర్ఐఎల్ షేరుకిగాను 1 జియో ఫైనాన్షియల్ను కేటాయించింది. ఫలితంగా ఆర్ఐఎల్లోగల వాటాలకుగాను ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్లో 6.66 శాతం వాటాను పొందినట్లు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా వెల్లడించింది. ఆటుపోట్ల మధ్య మార్కెట్ అక్కడక్కడే ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు బలపడి 65,220 వద్ద నిలిచింది. 3 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 19,346 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో సెన్సెక్స్ 147 పాయింట్ల వరకూ పుంజుకుని 65,396కు చేరింది. నిఫ్టీ సైతం 19,443–19,381 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూఎస్లో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,165 లాభపడితే 1503 డీలాపడ్డాయి. పిరమిడ్ టెక్నో ఐపీవో సక్సెస్ ఇండ్రస్టియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు మంగళవారాని(22)కల్లా 18 రెట్లుపైగా సబ్్రస్కిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 75.6 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 13.83 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఈ ఆఫర్తో కంపెనీ రూ. 153 కోట్లు సమకూర్చుకుంది. రూపాయి రికవరీ 14 పైసలు అప్; 82.99 వద్ద ముగింపు న్యూఢిల్లీ: డాలరు మారకం విలువ తగ్గిన నేపథ్యంలో దేశీ కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. డాలర్తో పోలిస్తే 14 పైసలు బలపడి, 82.99 వద్ద ముగిసింది. అమెరికా డాలరు బలహీనత దీనికి కారణం. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్ నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ 25,597 యూనిట్లు బుకింగ్స్ను నమోదు చేసిందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జూలై 4న బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. సెప్టెంబరులో తయారీ మొదలుపెట్టి అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. ఎక్స్షోరూంలో ఎక్స్440 ధరలు డెనిమ్ వేరియంట్ రూ.2.39 లక్షలు, వివిడ్ రూ.2.59 లక్షలు, ఎస్ వేరియంట్ రూ.2.79 లక్షలు ఉంది. ‘ప్రీమియం విభాగంలోకి ప్రవేశించడంపై కస్టమర్లు చూపుతున్న విశ్వాసాన్ని చూస్తుంటే సంతోషం కలుగుతోంది. బుకింగ్స్ ఎక్కువ భాగం టాప్ ఎండ్ మోడల్ నుండి వస్తున్నాయి. వినియోగదార్లు సరైన బ్రాండ్, మోడల్కు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దీనినిబట్టి స్పష్టం అవుతోంది. ప్రీమియం విభాగంలో గెలుపొందేందుకు కంపెనీ ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే’ అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. హార్లే డేవిడ్సన్ బైక్స్ అభివృద్ధి, విక్రయం కోసం 2020 అక్టోబరులో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. -
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) జోరు కొనసాగుతోంది. 2023 జనవరి–జూలై మధ్య అన్ని విభాగాల్లో కలిపి రిటైల్లో 8,38,766 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 జనవరి–డిసెంబర్లో అమ్ముడైన మొత్తం యూనిట్లతో పోలిస్తే గడిచిన ఏడు నెలల విక్రయాల వాటా ఏకంగా 82 శాతం ఉంది. జూలైతో ముగిసిన ఏడు నెలల అమ్మకాల్లో ఈ–టూ వీలర్లు 4,89,640 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 3,00,099, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ 46,164, సరుకు రవాణాకు ఉపయోగించే ఈ–వాహనాలు 1,603, ఈ–బస్లు 945, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు 316 యూనిట్లు ఉన్నాయి. 2022 జనవరి–జూలైలో ఈ–టూవీలర్ల అమ్మకాలు 3,06,947 యూనిట్లు నమోదయ్యాయి. 2022లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్లు కలుపుకుని 10,24,806 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. జూలైలో 1,15,836.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో 2023 జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్లో అన్ని విభాగాల్లో కలిపి 1,15,838 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈవీల విక్రయాలు లక్ష యూనిట్ల మార్కును దాటడం వరుసగా ఇది 10వ నెల. జూన్లో ఈ సంఖ్య 1,02,362 యూనిట్లు నమోదైంది. వాస్తవానికి జూన్ 1 నుంచి ఫేమ్–2 సబ్సిడీ తగ్గుతోందన్న కారణంగా మే నెలలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు కస్టమర్లు అధికంగా ఉత్సాహం చూపించారు. దీంతో మే నెలలో అన్ని విభాగాల్లో కలిపి 1,58,300 యూనిట్ల ఈవీలు అమ్ముడు కాగా, ఇందులో ఏకంగా 1,05,452 యూనిట్ల ఈ–టూ వీలర్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఈ–టూ వీలర్లు 54,272 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 53,736 యూనిట్లు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ 7,475 యూనిట్లు, గూడ్స్ వాహనాలు 219, ఈ–బస్లు 133 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
భారత్లో యాపిల్, అమ్మకాల్లో సరి కొత్త రికార్డులు..సంతోషంలో టిమ్ కుక్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 2023 జూన్ త్రైమాసికంలో గరిష్ట స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఐఫోన్లకు భారీ డిమాండ్ ఇందుకు కారణం. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారత్లో వృద్ధి పట్ల యాపిల్ సీఈవో టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడి మార్కెట్లో బలమైన రెండంకెల వృద్ధి సాధించామన్నారు. ‘అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి శక్తిని ఉపయోగిస్తాం. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇప్పటికీ చాలా నిరాడంబరమైన, తక్కువ వాటాను కలిగి ఉన్నాం. కాబట్టి ఇది మాకు గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. జూన్ త్రైమాసికంలో రెండు స్టోర్లను తెరిచాం. అంచనాలను మించి ఇవి పనితీరు కనబరుస్తున్నాయి’ అని చెప్పారు. -
పెట్రోల్కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
రూ.10 వేల ధరలో షావొమీ 5జీ!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది. షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు. -
ఆ బైక్ సేల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకీ మోటార్సైకిల్ ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్ల యాక్సిస్–125 స్కూటర్లను ఉత్పత్తి చేసి ఈ ఘనతను సాధించింది. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా దాదాపు ఏటా ఈ మోడల్ను అప్గ్రేడ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్లో 2007లో యాక్సిస్–125 స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో 125 సీసీ విభాగంలో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే. -
టాప్ గేర్లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 2023 జనవరి-జూన్లో భారత్లో 8,528 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్ ఎండ్ వెహికిల్స్ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ఈ ఏడాది టాప్ ఎండ్ వెహికిల్స్ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు వెయిటింగ్ పీరియడ్ 6-24 నెలలు ఉన్నప్పటికీ విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్సీ మోడల్ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్లో మెర్సిడెస్ బెంజ్ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్ ఎండ్ వెహికిల్స్ ఉన్నాయి. -
చరిత్రలోనే తొలిసారి.. అమ్మకాల్లో సోనాలికా సరికొత్త రికార్డ్లు
హైదరాబాద్: భారత్ నెంబర్ 1 ట్రాక్టర్ ఎక్స్పోర్ట్ బ్రాండ్ సోనాలికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)లో రికార్డు స్థాయిలో 40,700 ట్రాక్టర్ల అమ్మకాలు జరిపింది. సోనాలికా వ్యాపార చరిత్రలో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరపడం ఇదే తొలిసారి. మార్కెట్ షేర్లో కూడా సంస్థ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే తరహా రికార్డు విక్రయాలు మున్ముందు త్రైమాసికాల్లో కూడా కొనసాగుతాయన్న విశ్వాసాన్ని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. వ్యవసాయం–పర్యావరణ వ్యవస్థల మధ్య సమతౌల్యత సాధిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యతతో కూడిన హెవీ డ్యూటీ ట్రాక్టర్లు అలాగే ఇతర సరసమైన వ్యవసాయ ఉత్పాదకతలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (సోనాలికా అండ్ సోలిస్)జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ పేర్కొన్నారు. రైతులను మరింత ఉత్పాదకత దిశగా నడిపించడానికి, ప్రగతిశీల బాటలో వారిని సంపన్నులుగా మార్చడానికి సంస్థ తన వంతు కృషి చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. -
రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే
న్యూఢిల్లీ: ఖరీదైన అపార్ట్మెంట్ల అమ్మకాలు దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో రూ.కోటికి పైన విలువ చేసే ఫ్లాట్ అమ్మకాలు 50,132 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అమ్మకాలు 33,477 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పీటీఐ నివేదించింది. అంతేకాదు 15 ఏళ్లలో తొలిసారి విలాసవంత ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు జెల్ఎల్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. విల్లా, ప్లాట్ల అమ్మకాలను ఇందులో జేఎల్ఎల్ ఇండియా కలపలేదు. కేవలం అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలనే పరిగణనలోకి తీసుకుంది. ►ఏడు పట్టణాల్లో మొత్తం మీద అన్ని రకాల ఫ్లాట్ల అమ్మకాలు 2023 జనవరి–జూన్ కాలంలో 21 శాతం పెరిగి 1,26,500 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,04,926 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి - జూన్ అమ్మకాలు 15 ఏళ్లలో అత్యధికంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగినట్లు స్పష్టం చేసింది. ►రూ.50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చినప్పుడు, 2 శాతం క్షీణించి 24,482 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో అఫర్డబుల్ విభాగం (అందుబాటు ధరల) ఫ్లాట్ల వాటా 24 శాతం నుంచి 17 శాతానికి పరిమితమైంది. ►రూ.50–75 లక్షల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరిగి 30,125 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ అమ్మకాల వాటా మొత్తం అమ్మకాల్లో 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. ►రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన ఫ్లాట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 21,848 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం వాటా 17 శాతంగా ఉంది. ►రూ.1–1.5 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగి 24,121 యూనిట్లుగా ఉన్నాయి. ►ఇక రూ.1.5 పైన ధర కలిగిన ఫ్లాట్లు 26,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 18,993 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ద్వితీయ భాగంలోనూ బలమైన అమ్మకాలు ప్రస్తుత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో పండుగలు ఉండడంతో బలమైన అమ్మకాలు నమోదు అవుతాయని భావిస్తున్నట్టు జేఎల్ఎల్ ఇండియా ఎండీ శివకృష్ణన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం వైపు నుంచి బలమైన ప్రోత్సాహం, వడ్డీ రేట్లను గత రెండు సమీక్షల నుంచి ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగిరావడం ఇళ్ల మార్కెట్ పుంజుకునేందుకు మద్దతుగా నిలిచాయి. మధ్య కాలానికి ఇళ్లకు డిమాండ్ వృద్ధి బాటలోనే ఉంటుంది’’అని శివకృష్ణన్ తెలిపారు. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు -
యాపిల్ ఎయిర్పాడ్స్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..రూ.20వేల డిస్కౌంట్!
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ లవర్స్కు శుభవార్త చెప్పింది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను భారీ డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ హెడ్ఫోన్స్ ధర ఎక్కువ ఇప్పుడా ప్రొడక్ట్లపై రూ.20,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్ పాడ్స్ ప్రో ధరని సైతం రూ.8,000 పైగా తగ్గిస్తుండగా.. వీటిపై బ్యాంక్ ఆఫర్లను అదనంగా పొందవచ్చు. యాపిల్ సంస్థ ఆన్లైన్ స్టోర్లో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను రూ.59,900కే విక్రయిస్తుంది. ఫ్లిప్కార్ట్ మాత్రం వాటి ధరను రూ.19,901 తగ్గించి రూ.39,999కే అమ్ముతుంది. అదనంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై రూ.1250 డిస్కౌంట్,ఈఎంఐ సదుపాయం ఉంది. దీంతో ఫ్లిప్కార్ట్లో వాటి ధర రూ.38,749కి తగ్గుతుంది. అయితే, ఈ డీల్ పింక్ మోడల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్కు మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్, సిల్వర్ కలర్ ధర రూ.44,999. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్తో రూ.41,999కే సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోను ఫ్లిప్ కార్ట్ కేవలం రూ.16,990కే అమ్ముతుంది. వీటి మార్కెట్ ధర రూ. 24,900 గా ఉంది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఫ్లిప్కార్ట్లో రూ. 7,910 డిస్కౌంట్ లభిస్తుండగా పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్తో వాటి ధర రూ.15,740కి తగ్గుతుంది. 2వ తరం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో రెండవ తరం ఎయిర్పాడ్స్ ప్రోని యాపిల్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్లెస్ ఇయర్బడ్లు యాపిల్ అధికారిక వెబ్సైట్లో ధర రూ. 26,900 అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులు ఎటువంటి బ్యాంక్ కార్డ్ని ఉపయోగించకుండా ఫ్లిప్కార్ట్ ద్వారా తగ్గింపు ధరతో రూ. 24,990కే పొందవచ్చు. -
పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్లో రికార్డు స్థాయి..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6–10 శాతం పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 10 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,980గా ఉంది. ఏడు పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 36 శాతం అధికంగా 1,15,100 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 84,940 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్ మార్కెట్పై పడలేదు. 2023 ద్వితీయ ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్ బలంగానే ఉంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు. హైదరాబాద్లో అమ్మకాలు 13,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 11,190 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంలో పుణె పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 65 శాతం పెరిగి 20,680 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,500 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు కేవలం 7 శాతం పెరిగాయి. ఒకే అంకె అమ్మకాల వృద్ధిని చూసిన పట్టణం ఇదొక్కటే. ఇక్కడ 16,450 యూనిట్లు విక్రయమయ్యాయి. కోల్కతా మార్కెట్లో 20 శాతం వృద్ధితో అమ్మకాలు 5,780 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 48 శాతం అధికంగా 38,090 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో 15,050 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి. 5,490 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడు పట్టణాల్లో నూతన ఇళ్ల నిర్మాణం వార్షికంగా 25 శాతం పెరిగి 1,02,620 యూనిట్లుగా ఉంది. అమ్మకాలు బలంగా ఉండడంతో ఏడు పట్టణాల్లో ఇళ్ల నిల్వలు 2 శాతం తగ్గి 6.14 లక్షల యూనిట్లుగా జూన్ చివరికి ఉన్నాయి. -
షాపింగ్ లవర్స్కు అమెజాన్ బంపరాఫర్.. కేవలం రెండు రోజులే!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్లో కొనుగోలు దారులు వారికి కావాల్సిన వస్తువుల్ని డిస్కౌంట్ ధరలో పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ఫోన్స్,ల్యాప్ట్యాప్స్,ఎలక్ట్రానిక్స్,హోమ్అప్లయెన్సెస్పై అందిస్తుంది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ వివరాలు భారత్లో అమెజాన్ రెండు రోజుల పాటు ఈ సేల్ను నిర్వహించనుంది. జులై 12ఏమ్ నుంచి ప్రారంభమై..జులై 16 వరకు కొనసాగుతుంది.ప్రత్యేక అమ్మకాల్లో కొనుగోలు దారులు డిస్కౌంట్స్, సేవింగ్స్, కొత్తగా మార్కెట్లో విడుదలైన ప్రొడక్ట్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో బ్యాంక్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదే కార్డ్లపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్పై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ప్రయాణాలంటే ఇష్టమైతే..ట్రావెల్స్ బుకింగ్స్లో ఈ కార్డ్ వినియోగంతో అన్లిమిటెడ్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు బిల్లు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటిపై 50 శాతం డిస్కౌంట్ వన్ప్లస్, ఐక్యూ, రియల్మీ నార్జో, శాంసంగ్, మోటరోలా,బోట్,సోనీ ఇలా 400 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిపై తగ్గింపును పొందుతారు. అదనంగా, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. చదవండి👉 ఎలాన్ మస్క్కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!
Tata Nexon EV Sales: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో 'నెక్సాన్ ఈవీ' (Nexon EV) లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలను పొందుతూ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. కాగా ఇప్పుడు అమ్మకాల పరంగా అరుదైన ఒక కొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి మూడు సంవత్సరాల సమయంలో ఏకంగా 50,000 యూనిట్ల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మార్కెట్లో నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 14.49 లక్షలు, రూ. 19.54 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ , ఇండియా) ఉన్నాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ అనేది 30.2 కిలోవాట్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 312 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. కాగా ఈవీ మ్యాక్ 40.5kWh బ్యాటరీని కలిగి 453 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇవి రెండూ ఐపి67 రేటింగ్ పొందుతాయి. అదే సమయంలో ఇవి 3.3kW లేదా 7.2kW ఛార్జర్తో లభిస్తాయి. (ఇదీ చదవండి: స్విట్జర్లాండ్లో ఖరీదైన విల్లా కొన్న ఇండియన్ ఫ్యామిలీ - ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!) ఈవీ ప్రైమ్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ని ఉపయోగించి 60 నిమిషాల్లో 10-80 శాతం, ఈవీ మ్యాక్స్ 50 కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ని ఉపయోగించి 56 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు ఒక్క చూపులోనే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా ఎక్స్యువి400 ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. Together, #NexonEV50kCommunity is forging a new path, one that's powered by electric dreams and a passion for change. Join us as we continue to drive towards a greener, cleaner, and more exhilarating future. Cheers to 50,000 and beyond!#50kCommunity #TATAMotors #TATA #NexonEV pic.twitter.com/KHZIKB8J9F — Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) June 27, 2023 -
సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో సేల్స్, టెక్నాలజీ సంబంధ ఉద్యోగులకు భారీగా డిమాండ్ నెలకొంది. టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సైబర్సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు.. సేల్స్లో కస్టమర్లతో మాట్లాడాల్సిన సిబ్బందికి డిమాండ్ నెలకొందని సియెల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 15 వరకు, 11 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్న 60 బీఎఫ్ఎస్ఐల మానవ వనరుల ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన సర్వే ఆధారంగా సియెల్ దీన్ని రూపొందించింది. ఇందుకోసం పోర్టల్స్లో 33,774 జాబ్ పోస్టింగ్స్ను విశ్లేíÙంచింది. నివేదిక ప్రకారం .. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొన్ని రకాల ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► బీఎఫ్ఎస్ఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 18 శాతమే ఉంది. 10 శాతం మహిళలు మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. ► ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీతో పని ప్రదేశాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్థిక రంగం కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా టెక్నాలజీ–డేటా గవర్నెన్స్ స్పెషలిస్ట్, ట్రెజరీ హెడ్, ప్రోడక్ట్ హెడ్, ప్రీమియం బ్యాంకింగ్–రిలేషన్షిప్ హెడ్ వంటి కొత్త హోదాలు పుట్టుకొస్తున్నాయి. ► మొత్తం బీఎఫ్ఎస్ఐ జాబ్ పోస్టింగ్స్లో ముంబై వాటా అత్యధికంగా 20 శాతంగా ఉంది. పోస్టింగ్స్లో 19 శాతం వాటాతో బెంగళూరు రెండో స్థానంలో నిలి్చంది. ఇక పుణె (13 శాతం), హైదరాబాద్ (8 శాతం), చెన్నై (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► కృత్రిమ మేథ, మెషిన్ లెరి్నంగ్, బ్లాక్చెయిన్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలు ఉన్న వారికి భారీగా డిమాండ్ నెలకొంది. ► మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడంలో అట్టడుగున ఉన్న అయిదు రంగాల్లో బీఎఫ్ఎస్ఐ కూడా ఒకటి. పరిశ్రమలో లింగ సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. ► ఉద్యోగార్థుల్లో టెక్నాలజీ అనుభవం, కొత్త ఆవిష్కరణల సామర్థ్యం, మారే పరిస్థితులకు అలవాటుపడటం వంటి నైపుణ్యాలను బీఎఫ్ఎస్ఐ సంస్థలు పరిశీలిస్తున్నాయి. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్తోపాటు కోల్కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం: ప్రెసిడెంట్గా పారుల్ శర్మ) -
బోట్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు అదరహో.. రూ.4,000 కోట్ల టర్నోవర్
న్యూఢిల్లీ: ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ బోట్ 2022–23లో రూ.4,000 కోట్ల నికర అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ‘కొన్నేళ్లుగా స్థానిక భారతీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాం. ఆడియో, వేరబుల్స్ ఉత్పత్తులను డిక్సన్తో సహా అనేక కంపెనీలు దేశీయంగా తయారు చేస్తున్నాయి. డిక్సన్తో జేవీ కూడా ఏర్పాటు చేశాం’ అని బోట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 2,870 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 40 శాతం పెరిగింది. సొంత ఆర్ అండ్ డీ సదుపాయం, బోట్ ల్యాబ్స్ను గతేడాదే కంపెనీ ఏర్పాటు చేసింది. గత సంవత్సరం కొలుగోలు చేసిన సింగపూర్కు చెందిన సొల్యూషన్స్ ప్లాట్ఫామ్ ‘కాహా’ సహకారంతో స్మార్ట్, హోలిస్టిక్ వెల్నెస్ ఎకోసిస్టమ్ను రూపొందించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి - అజయ్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఫేమ్–2 పథకంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సొసైట ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) తాజాగా నీతి ఆయోగ్ను కోరింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చర్యలు ఫేమ్–2 విధానాన్ని విధ్వంసం చేస్తున్నాయని నీతి ఆయోగ్ చైర్పర్సన్ సుమన్ కె బెర్రీకి రాసిన లేఖలో సొసైటీ సెక్రటరీ జనరల్ అజయ్ శర్మ పేర్కొన్నారు. ‘18 నెలలుగా మంత్రిత్వ శాఖ చర్యలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ, విస్తరణ ప్రక్రియను గణనీయంగా ఆలస్యం చేసే అవకాశం ఉంది. రాయితీల నిలిపివేత, 2019లో ఇచ్చిన రాయితీల పునరాలోచనను డిమాండ్ చేయడం, నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ పోర్టల్ నుండి కంపెనీల తొలగింపు, ఫేమ్–2 సబ్సిడీల తగ్గింపు వినాశకర చర్యల శ్రేణిగా భావిస్తున్నాం. సబ్సిడీ దిగ్బంధనం, పెనాల్టీ నోటీసులు, భవిష్యత్ విక్రయాలపై ఆంక్షలు ఫేమ్–2 విధానాన్ని నాశనం చేస్తున్నాయి. (ఇదీ చదవండి: అప్పుచేసి ట్రక్కు కొని వేలకోట్లు సంపాదిస్తున్నాడిలా!) తయారీ కంపెనీలు సమస్యల నుంచి గట్టెక్కడానికి కష్టపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. ఉద్యోగులు పారిపోతున్నారు. కంపెనీలకు అప్పులు పెరుగుతున్నాయి. మూసివేతలే ఇక తదుపరి దశ’ అని లేఖలో వివరించారు. -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్షిప్లలో 35–40 శాతం డీలర్షిప్లను దశలవారీగా అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ జోరు తగ్గనుందా? కారణం ఇదే అంటున్న నిపుణులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) హెచ్చరించింది. సబ్సిడీ తగ్గుదల ఇలా.. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్కు గతంలో ఇచ్చిన రూ.15,000 సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10,000 ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్ అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, 2023 మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్ టాప్–5లో నిలిచాయి. వృద్ధి వేగానికి కళ్లెం.. ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్ఎంఈవీ తెలిపింది. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్ రమణ తెలిపారు. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ సేల్స్ - గత నెలలో అమ్మకాలు ఇలా..) కస్టమర్లు సన్నద్ధంగా లేరు.. భారత్లో ధర సున్నితమైన అంశం అని ఎస్ఎంఈవీ ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్ వృద్ధి చెందే వరకు సబ్సిడీలను కొనసాగించాల్సిందే. భారత్లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్మార్క్ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి నిరంతర రాయితీలు ఇవ్వాల్సిందే’ అని వివరించారు. (ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..) వరుసలో బజాజ్ చేతక్.. బజాజ్ చేతక్ ధర రూ.22,000 పెరిగింది. దీంతో చేతక్ ప్రారంభ ధర ఎక్స్షోరూంలో రూ.1.44 లక్షలకు చేరింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ ధర వేరియంట్ను బట్టి రూ.17–22 వేల మధ్య పెరిగింది. ఏథర్ 450ఎక్స్ ప్రో సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. ప్రస్తుతం ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఇప్పటికే తెలిపింది. -
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది. సున్నితమైన ధర.. ‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. మార్కెట్ వృద్ధి చెందే వరకు కస్టమర్కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్మార్క్ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు. సమయం ఆసన్నమైంది.. సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్ ఉందని స్పష్టమైందని వోల్టప్ కో–ఫౌండర్ సిద్ధార్థ్ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు. హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ నిఖిల్ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతి వ్యాగన్-ఆర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా హ్యాచ్బ్యాక్ వేగన్–ఆర్ 30 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు నమోదు చేసింది. 1999లో ఈ మోడల్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. 2008లో 5 లక్షల యూనిట్లు, 2012 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది. ఆ తర్వాత అయిదేళ్లలోనే అమ్మకాలు రెండింతలయ్యాయి. 2021 నాటికి మొత్తం 25 లక్షల కార్లు రోడ్డెక్కాయి. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ వేగన్–ఆర్ మార్కెట్లో ఉంది. ధర ఎక్స్షోరూంలో రూ.5.54–7.42 లక్షల మధ్య పలుకుతోంది. కె–సిరీస్, డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ 1.0, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో లభిస్తోంది. మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రూపుదిద్దుకుంది. సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేగన్–ఆర్ కస్టమర్లలో 24 శాతం మంది ఇదే మోడల్కు అప్గ్రేడ్ అవుతున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. 2021–22లో 1,89,000 యూనిట్లు, 2022–23లో 2,12,000 యూనిట్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా వేగన్–ఆర్ స్థానం దక్కించుకుంది. -
తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో రిటైల్ స్టోర్ ఓపెన్ చేసిన 10 రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. తొలి రోజునుంచే అద్భుతమైన అమ్మకాలతో ఐఫోన్ స్టోర్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్టోర్గా నిలుస్తోంది. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్వర్త్ ఎంతో తెలుసా?) ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లోని మొదటి అంతస్తులో 8,417.83 చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్లపాటు లీజుకు తీసుకుని మరీఈ స్టోర్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం కంపెనీ సుమారు రూ. నెలకు 40 లక్షలతో పాటు కొంత ఆదాయ వాటాను చెల్లించ నుంది. అయితే తొలి పది రోజుల్లోనే యాపిల్ ఐఫోన్లు,ఎయిర్ పాడ్స్, ఐప్యాడ్స్, ఇతర ఉత్పత్తుల్లో భారీ అమ్మకాలను సాధించింది. ఈ మొత్తం అమ్మకాల విలువ దాదాపు రూ. 2 కోట్లని తెలుస్తోంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఇండియాలో రెండో స్టోర్గా యాపిల్ సాకేత్ను ఢిల్లీలో ఏప్రిల్ 20న యాపిల్ సీఈవో టిక్ కుక్ లాంచ్ చేశారు. అంతకుముందు ముంబైలో తొలిస్టోర్ను లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ప్రత్యర్థిబ్రాండ్ల స్టోర్స్ లేకుండా జూలై 2022లో మాల్తో ఒప్పందం కుదుర్చుకుంది యాపిల్. -
యాపిల్ డేస్ సేల్: ఐఫోన్లు, ల్యాప్టాప్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ ఎలక్ట్రానిక్స్ స్టోర్ విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ ను లాంచ్ చేసింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు విజయ్ సేల్స్ స్టోర్స్, ఆన్లైన్ వెబ్సైట్ ఆపిల్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈసేల్లో యాపిల్ ఐఫోన్13, 14, ఎంఐ మ్యాక్బుక్ఎయిర్ (M1 MacBook Air) తదితర యాపిల్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ,డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ కారర్డ్స్కొనుగోళ్లపై క్యాష్బ్యాక్లు , ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా పొందవచ్చు. అలాగే నో కాస్ట్ EMI స్కీమ్ కూడాఉంది. దీంతోపాటు మొత్తం కొనుగోలుపై 0.75శాతం MyVS లాయల్టీ రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తుందిజ వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలలో విస్తరించి ఉన్న కంపెనీకి చెందిన 125+ స్టోర్లలోఈ సేల్ యాక్టివ్గా ఉంటుంది. కంపెనీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆఫర్లను పొందవచ్చు. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) రూ. 69,900విలువైన ఐఫోన్ 13 ప్రత్యేక డీల్ ధర రూ. 61,490. హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా రూ. 2వేలు తగ్గింపు. మొత్తంగా రూ. 59,490కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (లావా బ్లేజ్ 1ఎక్స్ 5జీ చూశారా? బడ్జెట్ ధరలో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ ) ఐఫోన్ 14 ప్లస్ ఆఫర్ ధర రూ. 80,490 కాగా, వెనిలా ఐఫోన్ 14 రూ. 70,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్లు వరుసగా రూ. 1,20,990 , రూ. 1,31,490కి అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ల ద్వారా ఐఫోన్ 14 సిరీస్పై రూ. 4వేల వరకు క్యాష్బ్యాక్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం. (ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!) యాపిల్ ఎంఐ మ్యాక్ బుక్ ఎయిర్ రూ. 82,900కి అందుబాటులో ఉంటుంది. మిగిలిన ల్యాప్టాప్లపై కస్టమర్లు రూ. 5 వేల వరకు క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఇంకా ఐప్యాడ్స్ , ఎయిర్పాడ్స్, వాచెస్పై తగ్గింపుధరలను ప్రకటించింది. -
భారీ నష్టాల్లో శ్యాంసంగ్..రికార్డు స్థాయిలో పడిపోయిన సేల్స్
-
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్..వాటిని పునరుద్ధరించమని యూఎస్కి విజ్క్షప్తి!
అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్ మిలటరీ ఫైనాన్సింగ్ సేల్స్ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో జరిగిన సెమినార్లో అమెరికాకు చెందిన పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్, ఫారిన్ మిలటరీ సేల్స్ను పునరుద్ధరించడం పాక్కి చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎలిజబెత్ హూర్ట్స్ సమస్యత్మకంగా మారిన పాక్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్. పాక్ ఐఎంఎఫ్తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు. కానీ పాక్ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్తో అంగీకరించిన సంస్కరణలను పాక్ ముందుగా అమలు చేయాలని యూఎస్ కోరింది. ఈ మేరకు పాక్ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్ రష్యా చమురు కోసం పాక్ తన మొదటి ఆర్డర్ ఇచ్చిందని కానీ యూఎస్తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్ అఫ్ఘనిస్తాన్లో సుస్థిరత తీసుకురావడంలో పాక్ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్, అఫ్ఘాన్లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్ పిలుపునిచ్చారు. (చదవండి: సూడాన్ నుంచి మరో 754 మంది రాక) -
గ్రామీణ ప్రాంతాలపై పడిన నెస్లే దృష్టి.. అమ్మకాల వృద్ధికి కొత్త వ్యూహాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్వర్క్ ఉంది. నెస్లే హెల్త్సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గిస్తారా..? ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు. పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా పెరగొచ్చన్నారు. -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
మే నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఇతర గృహోపరకరణాలు కొనుగోలు చేయాలని అనుకున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ ఈ - కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు అదిరిపోయే సేల్ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. మే 5 నుంచి మే 10 వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ పేరుతో ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ఆరు రోజుల పాటు జరిగే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్ ఆఫర్లను పొందవచ్చు. అదే సమయంలో నిర్వహించే క్రేజీ డీల్స్, బెస్ట్ ప్రైస్ వంటి డీల్స్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. 80శాతం వరకు డిస్కౌంట్స్ ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, గ్రూమింగ్, స్టైలిష్ ప్రొడక్ట్లపై ఆఫర్లు, మైక్రో ఎస్డీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, హార్డ్ డ్రైవ్లపై 60 శాతం డిస్కౌంట్, టీవీలు, ఉపకరణాలపై 75 శాతం, రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషీన్లపై 55 శాతం, గృహోపకరణాలపై 70 శాతం డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు.ప్లిప్కార్ట్ సొంతం ప్రొడక్టులైన ఫ్యాషన్, బ్యూటీ,ఫుడ్, స్పోర్ట్స్ ప్రొడక్ట్, హోమ్, కిచెన్లో వినియోగించే వస్తువులపై 80శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ పాలసీ ఈ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు మే 4న డీల్స్లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు 5శాతం అపరిమిత క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 20వేల విలువైన సూపర్కాయిన్స్, రివార్డ్ల కంటే నాలుగు రెట్లు సంపాదించవచ్చు. ఫ్లిప్కార్ట్ పే లేటర్ పాలసీలో వస్తువులు కొనుగోలు చేసి తర్వాత డబ్బులు చెల్లించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చదవండి👉 మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు!