June
-
ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్ఎల్ అంచనా వేసింది. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్టీఐమైండ్ట్రీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
కూరగాయలు భగ్గు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి. ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. -
సేవలకు కొత్త ఆర్డర్ల భరోసా
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 60.5కు ఎగసింది. మేలో సూచీ ఐదు నెలల కనిష్ట స్థాయి 60.2కు పడిపోయిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్డర్లు పెరగడం, దేశీయ, అంతర్జాతీయ విక్రయాల్లో పురోగతి వంటి అంశాలు జూన్లో పటిష్ట ఫలితాలు రావడానికి కారణం. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించే సంగతి తెలిసిందే. సూచీ 50 దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పరిగణిస్తారు. ఇదిలావుండగా, సేవలు–తయారీ విభాగాలతో కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ అవుట్పుట్ ఇండెక్స్ కూడా మేలో 60.5 వద్ద ఉంటే, జూన్లో 60.9కి ఎగసింది. 400 సంస్థల ప్యానెల్కు పంపిన ప్రశ్నపత్రాలకు వచి్చన ప్రతిస్పందనల తో హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ను ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందిస్తుంది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: కేరళలోకి గురువారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈలోగా పగటి ఉష్ణోగ్రతలు మరికొంత పెరగొచ్చని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతగా నమోదైంది. ఇప్పటివరకు ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. అలాగే భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెల్లపాడులో 47.1 డిగ్రీల సెల్సియస్, కమాన్పూర్లో 46.7, కుంచవల్లిలో 46.6, కాగజ్నగర్, పమ్మిలో 46.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదైంది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. -
జూన్ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. సోమవారం(మే20) నుంచి మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఈ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి..
రానున్న లోక్ సభ ఎన్నికలు పలు విశేషాలు, ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్సభ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా జరగనున్నాయి. జూన్ 1న చివరి దశ ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు జూన్ నెలలో పోలింగ్ జరగడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగిన 1951-52 తర్వాత ఇవే సుదీర్ఘమైన లోక్సభ ఎన్నికలు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 మధ్య దాదాపు నాలుగు నెలల పాటు లోక్సభకు మొదటి సార్వత్రిక ఎన్నికలు 68 దశల్లో జరిగాయి. 1991లో జూన్లో ఓటింగ్ 1991లో మాత్రమే లోక్సభ ఎన్నికలు జూన్ నెలలో జరిగాయి. ఆ సంవత్సరం మార్చి 13న కేంద్రంలోని ప్రధానమంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దయిన తర్వాత మే 20, జూన్ 12, జూన్ 15 తేదీల్లో ఓటింగ్ జరిగింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మూడు రాష్ట్రాల్లో పోలింగ్ వాయిదా పడింది. గత మూడు లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ ఎన్నికలు మే నెల తర్వాత జరగలేదు. 2019లో పోలింగ్ చివరి తేదీ మే 19 కాగా ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. 2014లో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు మే 12 వరకు జరిగాయి. ఫలితాలు మే 16న ప్రకటించారు. 2009లో చివరి దశ పోలింగ్ మే 13న జరిగింది. -
భారత్కు గుడ్న్యూస్.. త్వరలో ‘ఎల్నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
ఎన్బీఎఫ్సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు జూన్లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్బీఎఫ్సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
రెట్టింపు స్థాయిలో రిటర్నుల దాఖలు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ రిటర్నులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో దాఖలయ్యాయి. ఆడిటింగ్ అవసరం లేని రిటర్నుల దాఖలుకు (వ్యక్తులు) గడువు జూలై 31తో ముగిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తం 1.36 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ఇక రిటర్నుల దాఖలుకు చివరి నెల జూలైలో మొత్తం 5.41 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ నుంచి జూలై 31 నాటికి 6.77 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2022లో ఏప్రిల్–జూన్ మధ్య ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్లో 70.34 లక్షల రిటర్నులు దాఖలు కాగా, 2023 ఏప్రిల్–జూన్ మధ్య 1.36 కోట్ల రిటర్నులు నమోదయ్యాయి. ఈ ఏడాది అధిక సంఖ్యలో రిటర్నులు దాఖలు కావడానికి సోషల్ మీడియా ప్రచారం, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమేనని ఆదాయపన్ను శాఖ తెలిపింది. పెరిగిన కోటీశ్వరులు రూ.కోటికి పైన ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2022 మార్చితో ముగిసిన రెండేళ్ల కాలంలో రెట్టింపై 1.69 లక్షలకు చేరింది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 1,69,890 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం చూపించారు. 2021–22 అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) రిటర్నుల్లో రూ.కోటికి పైన ఆదాయం పేర్కొన్న వారు 1,14,446 మంది ఉన్నారు. 2020–21 అసెస్మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 81,653గానే ఉంది. 2022–23 ఏవైలో వ్యక్తులు, కంపెనీలు, ట్రస్ట్లు, సంస్థలు ఇలా అన్ని వర్గాలూ కలసి రూ.కోటికి పైన ఆదాయం వెల్లడించిన వారి సంఖ్య 2.69 లక్షలుగా ఉంది. 2022–23 అసెస్మెంట్ సంవత్సరంలో మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. 2021–22లో ఏవైలో 7.14 కోట్లు, 2020–21 ఏవైలో 7.39 కోట్ల చొప్పున రిటర్నులు వచ్చాయి. -
టాప్ వన్లో ఉన్న హీరో, హీరోయిన్ ఎవరంటే..?
వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనేది టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ సంస్ధ 2010 నుంచి ప్రతి నెల వారిగా జాబితాను విడుదల చేస్తుంది. 2023 జూన్ నెలకు సంబంధించి ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నారు. (ఇదీ చదవండి: అయ్యో.. ఈ సీన్ ఎప్పుడు జరిగిందంటూ మళ్లీ హృతిక్ను గెలికిన కంగనా) అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా గత నెలతో చూస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకి 4, 5వ స్థానాలలో నిలిచారు. తర్వాత అజిత్ కుమార్ (6), సల్మాన్ ఖాన్ (7)లో ఉన్నారు. గత నెలలో 6వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ ఈసారి 8వ నంబర్తోనే సరిపెట్టుకున్నారు. అక్షయ్ కుమార్ (9), మహేష్ బాబు (10) స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే మహేష్ జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో చోటు సంపాదించడం గమనార్హం. గత నెలలో 10వ స్థానంలో ఉన్న KGF హీరో యశ్కు జూన్ నెలలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. టాప్ పొజీషన్లో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఉన్నారు. తర్వాత రోండో స్థానంలో అలియా భట్ ఉన్నారు. తర్వాత దీపికా పదుకొనే, నయనతార కాజల్ అగర్వాల్, త్రిష, కత్రినా కైఫ్, కైరా అద్వానీ, కీర్తి సురేశ్, రష్మిక మందన్నా వరుసుగా టాప్ టెన్లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2023) #OrmaxSIL pic.twitter.com/I0e35kOGBm — Ormax Media (@OrmaxMedia) July 21, 2023 -
జూన్లో విమానయానం జూమ్..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య జూన్లో 1.25 కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్లో నమోదైన 1.05 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. గో ఫస్ట్ కార్యకలాపాలు నిలి్చపోయిన నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా, విస్తార, ఎయిర్ఏíÙయా ఇండియా, ఆకాశ ఎయిర్ తమ తమ మార్కెట్ వాటాలను పెంచుకున్నాయి. అయితే, స్పైస్జెట్ మార్కెట్ వాటా మాత్రం మరింత తగ్గింది. ఈ ఏడాది జనవరిలో ఇది 7.3 శాతంగా ఉండగా జూన్లో 4.4 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 79 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఇండిగో.. 63.2 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. టాటా గ్రూప్లో భాగమైన ఎయిరిండియా, ఎయిర్ఏíÙయా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్గా పేరు మారింది) విమానాల్లో వరుసగా 12.37 లక్షలు, 10.4 లక్షల మంది ప్రయాణం చేశారు. ఎయిరిండియా మార్కెట్ వాటా 9.7 శాతంగాను, ఎయిర్ఏíÙయా ఇండియా వాటా 8 శాతంగాను ఉంది. 10.11 లక్షల మంది ప్రయాణికులతో విస్తార 8.1 శాతం, 6.18 లక్షల ప్యాసింజర్లతో ఆకాశ ఎయిర్ 4.9 శాతం వాటాను దక్కించుకున్నాయి. అటు స్పైస్జెట్ 5.55 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరోవైపు, సమయ పాలన విషయంలో 88.3 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్తో (ఓటీపీ) విస్తార అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో, ఆకాశ ఎయిర్ (చెరి 87.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో డేటా ఆధారంగా ఓటీపీని లెక్కించారు. -
టాప్ గేర్లో ఆటో: ఆదాయం ఎంత పెరిగిందంటే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి 17 శాతం స్థాయిలో నమోదు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఒక నివేదికలో అంచనా వేసింది. వివిధ విభాగాలన్నీ కూడా మెరుగ్గా రాణించడం ఇందుకు దోహదపడగలదని పేర్కొంది. టాటా మోటర్స్ మినహా పరిశ్రమలోని మిగతా సంస్థలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. విభాగాలవారీగా చూస్తే అర్బన్, ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ కారణంగా ద్విచక్ర వాహన విక్రయాలు 10 శాతం వృద్ధి చెందనున్నాయి. బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం, టీవీఎస్ మోటర్స్వి 5 శాతం, ఐషర్ మోటర్–రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాలు 21 శాతం పెరగనున్నాయి. వాటి మొత్తం ఆదాయాలు వరుసగా 24 శాతం, 19 శాతం, 16 శాతం వృద్ధి చెందనున్నాయి. హోండా మోటర్సైకిల్ అమ్మకాల పరిమాణం 3 శాతం తగ్గినా ఆదాయం 6 శాతం పెరగనుంది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 8శాతం అప్ ఉత్పత్తిని పెంచడం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం తదితర సానుకూల పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్యూ1లో 8 శాతం పెరగనున్నాయి. మారుతీ సుజుకీ విక్రయాలు 6 శాతం, ఆదాయం 17 శాతం వృద్ధి చెందనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో డివిజన్ ఆదాయం 33 శాతం, అమ్మకాలు 21 శాతం పెరగనున్నాయి. వివిధ కేటగిరీల్లో వాహనాల లభ్యత, ధరల పెంపు వంటి అంశాల కారణంగా త్రైమాసికాలవారీగా మారుతీ సుజుకీ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు, అశోక్ లేల్యాండ్ ఆదాయం 9 శాతం, అమ్మకాలు 4 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. -
నాల్గొసారి.. లక్షా 61 కోట్లకు చేరిన జీఎస్టీ ఆదాయం!
దేశీయంగా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 12 శాతం వృద్దిని సాధించి రూ.1,61,497 కోట్ల వసూళ్లను రాబట్టిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ.1.87లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1,57,090 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు స్థూలంగా (Gross) 1.6 లక్షల కోట్ల మార్క్ను దాటడం 4వ సారి, 1.4 కోట్లను వసూలు చేయడం 16 నెలలకు పెరిగింది. ఇక 1.5లక్షల కోట్ల మార్క్ను 7వ సారి అధిగమించినట్లు ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. జూన్ నెలలో గ్రాస్ జీఎస్టీ రూ.1.61,497 కోట్లు వసూలైంది. వాటిల్లో సీజీఎస్టీ రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ.39,035 కోట్లతోపాటు) ఉండగా.. సెస్ రూ.11,900 కోట్లు రూ.1,028 కోట్ల దిగుమతి సుంకంతోపాటు) వసూలయ్యాయి. ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.36,224 కోట్లు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ.30,269 కోట్లు కేటాయించింది. జూన్ నెల జీఎస్టీలో కేంద్రానికి రూ.67,237 కోట్లు, రాష్ట్రాలకు రూ.68,561 కోట్లుగా సెటిల్ చేసినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. 👉 ₹1,61,497 crore gross #GST revenue collected for June 2023; records 12% Year-on-Year growth 👉 Gross #GST collection crosses ₹1.6 lakh crore mark for 4th time since inception of #GST; ₹1.4 lakh crore for 16 months in a row; and ₹1.5 lakh 7th time since inception 👉… pic.twitter.com/Q17qM9mTEX — Ministry of Finance (@FinMinIndia) July 1, 2023 -
తాజా గోల్డ్ బాండ్ స్కీమ్.. ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: బంగారంలో పెట్టుబడిపెట్టాలనుకునేవారికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మొదటి ఆరు నెలల్లో రెండుసార్లు– జూన్, సెప్టెంబర్లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులో రానుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం జూన్ 19 నుంచి 23వ తేదీ వరకూ అలాగే సెప్టెంబర్ 11 నుంచి 15 వ తేదీల్లో గోల్డ్ బాండ్ స్కీమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. గోల్డ్ బాండ్లు– షెడ్యల్డ్ కమర్షియల్ బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
రూ.2 వేల నోటు: జూన్ బ్యాంకు హాలిడేస్ లిస్ట్ చూస్తే షాకవుతారు!
సాక్షి,ముంబై: ప్రతీ నెల చివరి వారంలో తదుపరి నెలలోని పండుగలు, బ్యాంకు హాలిడేస్పై ఆసక్తి ఉంటుంది. అందులోనూ పెద్ద నోటు రూ.2 వేల రీకాల్ నేపథ్యంలో జూన్ నెలలో బ్యాంకుల సెలవులకు మరింత ప్రాధాన్యత నెలకొంది. జూన్లో ఏకంగా 12 రోజులు బ్యాంకులు మూతపడనుండటం ఒక విధంగా నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ఖాతాదారులకు షాకింగ్ అనే చెప్పాలి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్ల మార్పిడికి, డిపాజిట్లకు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి జూన్ నెలలో మొత్తం 12 రోజుల సెలవుల వివరాలు మీకోసం.. జూన్ నెలలో బ్యాంకుల సెలవులు జూన్ 4: ఆదివారం జూన్ 10: రెండో శనివారం జూన్ 11: ఆదివారం జూన్ 15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు జూన్ 18: ఆదివారం జూన్ 20: రథయాత్ర ఒడిశా, మణిపూర్లో సెలవు జూన్ 24: చివరి, నాలుగో శనివారం జూన్ 25: ఆదివారం జూన్26: త్రిపురలో మాత్రమే సెలవు జూన్ 28: ఈద్ ఉల్ అజా, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళల బ్యాంకులకు సెలవు జూన్ 29: బక్రీద్ దేశవ్యాప్తంగా సెలవు జూన్ 30: రెమ్నా ఈద్-ఉల్-అజా మిజోరం, ఒడిశాలో సెలవు. ఇదీ చదవండి: మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? Neuralink మనిషి మెదడులో చిప్ ప్రయోగాలు: మేము సైతం అంటున్న ట్వీపుల్ -
మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్ కార్ల రంగంలో భారత్లో ఎస్యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్యూవీల్లో కాంపాక్ట్ ఎస్యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్ ఎస్యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) కంపెనీ వృద్ధిలో సాయం.. సంస్థ మొత్తం బ్రాండ్ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్-టెరైన్ కాంపాక్ట్ లైఫ్స్టైల్ ఎస్యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్-వీల్-డ్రైవ్ ఆఫ్-రోడర్ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు. (e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..) జిమ్నీకి 30 వేల బుకింగ్స్.. ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్స్టైల్ ఎస్యూవీ సెగ్మెంట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను ఆశిస్తోంది. ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) సాయుధ దళాలకు.. జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
క్యూ1లో పీఈ పెట్టుబడులు డీలా!
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు దేశీ కంపెనీలలో 17 శాతం క్షీణించాయి. వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో 6.72 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 53,000 కోట్లు)కు పరిమితమయ్యాయి. డీల్స్ సైతం 15 శాతం నీరసించి 344కు చేరాయి. గతేడాది(2021–22) క్యూ1లో 8.13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇక గతేడాది జనవరి–మార్చి(క్యూ4)లో తరలివచ్చిన 8.97 బిలియన్ డాలర్లతో పోలిస్తే త్రైమాసికవారీగా 25 శాతం తగ్గాయి. లావాదేవీల సమీక్షా సంస్థ, లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ గ్రూప్ కంపెనీ రెఫినిటివ్ వెల్లడించిన గణాంకాలివి. కాగా.. ఈ క్యాలండర్ ఏడాది(2022)లో తొలి ఆరు నెలల(జనవరి–జూన్)ను పరిగణిస్తే.. దేశీ కంపెనీలలో పీఈ పెట్టుబడులు 26 శాతం పుంజుకుని 15.7 బిలియన్ డాలర్లను తాకాయి. టెక్నాలజీ స్పీడ్ 2022 జనవరి–జూన్ మధ్య పీఈ పెట్టుబడుల్లో టెక్నాలజీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. మొత్తం పెట్టుబడుల్లో 73 శాతానికిపైగా అంటే 6.53 బిలియన్ డాలర్లను టెక్ రంగం సొంతం చేసుకుంది. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇండియా ఆధారిత ఫండ్స్ రెట్టింపునకుపైగా 7 బిలియన్ డాలర్లను సమీకరించినట్లు రెఫినిటివ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు సైతం వెచ్చించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక పరిశ్రమలవారీగా చూస్తే ఇంటర్నెట్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా గరిష్టంగా పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అయితే బయోటెక్నాలజీ, మెడికల్– హెల్త్ విభాగాలకు పెట్టుబడులు భారీగా నీరసించాయి. కాగా.. తొలి అర్ధభాగంలో 10 పీఈ డీల్స్లో వెర్సే ఇన్నోవేషన్(82.77 కోట్ల డాలర్లు), థింక్ అండ్ లెర్న్(80 కోట్ల డాలర్లు), బండిల్ టెక్నాలజీస్(70 కోట్ల డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ(49.47 కోట్ల డాలర్లు), ఎన్టెక్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్(330 కోట్ల డాలర్లు), డెల్హివరీ(30.4 కోట్ల డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్(30 కోట్ల డాలర్లు) చోటు చేసుకున్నాయి. -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
యస్బ్యాంకు భారీ ఊరట: రుణాల్లో 14 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాది జూన్ ఆఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ రుణాల వ్యాపారం 14 శాతం వృద్ధి చెంది రూ. 1,63,654 కోట్ల నుంచి రూ. 1,86,598 కోట్లకు చేరింది. జూన్ క్వార్టర్లో స్థూల రిటైల్ రుణాలు రెట్టింపై రూ. 5,006 కోట్ల నుంచి రూ. 11,431 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిట్లు 18.3 శాతం వృద్ధితో రూ. 1,63,295 కోట్ల నుంచి రూ. 1,93,241 కోట్లకు చేరాయి. అయితే, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ఇవి ప్రొవిజనల్ గణాంకాలని, త్వరలోనే జూన్ త్రైమాసిక ఆర్తిక ఫలితాలను ప్రకటించ నున్నామని బ్యాంక్ తెలిపింది. అటు, ఆర్బీఎల్ బ్యాంక్ కూడా తమ వ్యాపార గణాంకాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 6 శాతం పెరిగి రూ. 79,217 కోట్లకు చేరినట్లు పేర్కొంది. రిటైల్ రుణాలు వార్షికంగా 5 శాతం, సీక్వెన్షియల్గా 3 శాతం క్షీణించాయని వివరించింది. గత కొద్ది త్రైమాసికాలుగా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో వ్యాపారం కూడా పుంజుకుంటోందని ఆర్బీఎల్ బ్యాంకు పేర్కొంది. -
జూన్లోనూ భారీగానే, కానీ మే నెలతో పోలిస్తే
న్యూఢిల్లీ: యూయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీలు జూన్ నెలలోనూ భారీగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో రూ.10లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా స్పష్టం చేస్తోంది. అయితే మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువ జూన్లో 3 శాతం తగ్గింది.యూపీఐ లావాదేవీలు మేతో పోలిస్తే జూన్లో వాల్యూమ్ , విలువ రెండింటిలోనూ తగ్గిపోయాయని ఎన్పీసీఐ డేలా తెలిపింది. జూన్ నెలకు రూ.10,14,384 కోట్ల విలువ చేసే యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, మే నెలకు ఈ మొత్తం రూ.10,41,506 కోట్లుగా ఉంది. జూన్ నెలలో 596 కోట్ల యూపీఐ లావాదేవీలు (సంఖ్య) నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు యూపీఐ లావాదేవీలు 558 కోట్లుగా ఉంటే, వీటి విలువ రూ.9,83,302 కోట్లుగా ఉండడం గమనార్హం. -
పండగే పండగ.. జూన్లో సినిమాల జాతర!
మొన్నటిదాకా భారీ బడ్జెట్ సినిమాలు దుమ్ములేపాయి. కరోనాతో వెలవెలబోయిన థియేటర్లకు జనాలను రప్పిస్తూ తిరిగి కళకళలాడేలా చేశాయి. దీంతో అప్పటిదాకా రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించిన సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని బోల్తా కూడా కొట్టాయి. మరికొన్ని అంచనాలకు మించిన విజయాన్ని అందుకున్నాయి. ఇదే హుషారుతో జూన్ నెల కూడా బోలెడన్ని సినిమాలతో రెడీ అయింది. ఇప్పటికే జూన్ 3న సౌత్లో రిలీజైన రెండు సినిమాలు మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మంచి హిట్లుగా నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఏమేం సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం.. జూన్ 10న 'అంటే సుందరానికీ', 'సురాపానం, జరిగిన కథ', '777 చార్లీ', 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' సినిమాలు రిలీజవుతున్నాయి. 17వ తేదీన 'గాడ్సే', 'విరాటపర్వం', కన్నడ డబ్బింగ్ మూవీ 'కే3', కీర్తి సురేశ్ 'వాశి', 'కిరోసిన్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే జూన్ చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలు మరో ఎత్తు. జూన్ ఆఖరి వారంలో ఏకంగా 9 సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ 23న 'కొండా', 24న 'సమ్మతమే', '7 డేస్ 6 నైట్స్', 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్స్టర్ గంగరాజు', '10th క్లాస్ డైరీస్', 'సదా నన్ను నడిపే', 'సాఫ్ట్వేర్ బ్లూస్' సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. కృష్ణ వ్రింద విహారి సినిమా కూడా జూన్ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న మూవీస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు జై కొడతారనేది చూడాలి. చదవండి: ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం నాకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి సల్మాన్ కంటతడి -
వామ్మో ‘జూన్’.. తలుచుకుంటే వణుకు పుడుతోంది!
‘జూన్ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాం, పెన్నులు, పెన్సిల్ ఇతరాత్ర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు వానాకాలం సీజన్ మొదలవ్వడంతో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈనెల ఎలా గట్టేక్కుతుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.’ సాక్షి,కరీంనగర్: పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఈ నెల 12 నుంచి కొత్తవిద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకునేవారు ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్ ఫీజులు చూసి జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘వామ్మో జూన్’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏయే స్కూల్లో ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, తదితర అంశాలపై తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. అప్పు చేసైనా పైసలున్న బడికి.. జిల్లావ్యాప్తంగా సుమారు 600 పైగా ప్రైవేట్ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.లక్షకు పైగా ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. కొన్ని పాఠశాలలైతే నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్ అనేది వేళ్లూనుకోవడంతో దిగువ, మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. రైతులకు ఖరీఫ్ భారం ఏటా రైతులకు వానాకాలం సీజన్ భారంగా మారుతోంది. ఈ యాసంగి పంటలు పండినా ధా న్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉ న్నారు. వ్యవసాయ పనులూ అంతంతే. ఇతరత్రా కూలీ పనులు దొరక్క గ్రామీణులుæ ఉపాధి పనుల కు వెళ్లినా కొద్ది రోజులుగా డబ్బులు అందక వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ఉపాధి పనులకు వెళ్తే రూ.200 నుంచి రూ. 250 వరకు దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీ ఫ్నకు సంబంధించి ఎరువులు, విత్తనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువు, వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన నెలకొంది. చదవండి: కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! -
జూన్ చివరికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లరేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటివరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హుల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎస్.షాన్మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీపాషా సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు) -
జూన్లో టీచర్లు.. బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను జూన్ మొదటి వారంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బదిలీలు, ట్రాన్స్ఫర్లపై ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మరో దఫా చర్చలు జరుపనున్నారు. అయితే అన్ని స్థాయిల్లో ప్రమోషన్లకు అవకాశం లేకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లా విద్యా శాఖాధికారులు (డీఈవో), ఎంఈవోలు, డైట్ లెక్చరర్ల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసులున్నాయి. ఇవి పరిష్కారం అయ్యాకే పదోన్నతులు కల్పించే వీలుంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యల పరిష్కారం చేపడుతూనే ఇబ్బందుల్లేని వాటిల్లో ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలో ఉపాధ్యాయ సంఘాలు, టీచర్స్ ఎమ్మెల్సీల నుంచి మంత్రి సలహాలు తీసుకోనున్నారు. వీటిపై అధికారులతో చర్చించి, సీఎం దృష్టికి తీసుకెళ్తారని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో ఏకకాలంలో బదిలీలు, పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ వస్తుండటంతో మంత్రి ఆకస్మికంగా చర్చలు జరపడం ప్రాధాన్యం ఏర్పడింది. హెచ్ఎం స్థాయి వరకూ ఓకే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ స్థాయికి పదోన్నతి పొందాల్సిన వారు దాదాపు 8,500 మంది ఉన్నారు. గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన వాళ్లు 1,970 మంది ఉన్నారు. వీటిల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని విద్యా శాఖ భావిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ప్రకారం పాత నిబంధనల మేరకే ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అప్గ్రేడ్ చేసిన పోస్టుల విషయంలో కొన్ని కోర్టు వివాదాలు, పాలన పరమైన సమస్యలున్నాయి. దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కన్పించట్లేదు. భాషా పండితుల పదోన్నతులకు బ్రేక్ పడే వీలుందని తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో 1–8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధించాలని నిర్ణయించిన సర్కారు.. ఇప్పటికే ఇంగ్లిష్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. మరోవైపు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు జరిగాయి. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సీనియారిటీని రూపొందించాల్సి ఉంది. దీనిపై సమావేశంలో ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టెన్త్ పరీక్షలు కాగానే.. వాస్తవానికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను మే నెలలోనే పూర్తి చేయాలని భావించారు. కానీ మే 23 నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఇవి జూన్ 1 వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ముగియగానే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని నిర్ణయించారు. ప్రత్యక్ష విధానంలో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఆన్లైన్ విధానంలో వెబ్ ఆప్షన్ల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 317 జీవో అమలులో అనేక సమస్యలతో విద్యా శాఖ ఇబ్బంది పడుతోంది. బదిలీల ప్రక్రియలో ఇది సమస్య తీవ్రతను పెంచుతుందనే సంకేతాలు రావడంతో వెబ్ ఆధారిత బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. త్వరగా పూర్తి చేయాలి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరగా, వివాద రహితంగా పూర్తి చేయాలి. అన్ని స్థాయిల్లో పోస్టులను భర్తీ చేస్తేనే విద్యా శాఖ బలోపేతమవుతుంది. న్యాయపరమైన చిక్కులను పరిష్కారానికి సమన్వయంతో ముందుకెళ్లాలి. – చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జూన్లో టీఎస్ ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: జూన్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎంసెట్) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ను ఇప్పటికే నియమించారు. ఈ వారం ఎంసెట్పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కాలపట్టికను ప్రకటించే వీలుందని మండలి ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితాలను కూడా నెలవ్యవధిలోనే ప్రకటించాలని నిర్ణయించారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్ ఆఖరు కల్లా పూర్తయ్యే అవకాశాలున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో సీట్లపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఎంసెట్ కౌన్సెలింగ్కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిమాండ్ ఉన్న కోర్సులకే సీట్లు అనుమతించాలని యోచిస్తున్నారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 40 శాతానికి మించి అడ్మిషన్లు లేకపోవడంతో కొన్ని కాలేజీలు ఈ మేరకు సీట్లను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. మరోవైపు కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఫీజుల పెంపుపై కసరత్తు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఎస్ఎఫ్ఆర్సీ) ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు చేస్తోంది. 2019లో పెంచిన ఫీజులు 2021 వరకూ అమలులో ఉన్నాయి. ఒకవేళ ఫీజులు పెంచితే 2022 నుంచి అమలులోకి వచ్చే వీలుంది. ఆదాయ, వ్యయాల నివేదికలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల నుంచి ఎఫ్ఆర్సీ కోరింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మార్చి చివరి నాటికి ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 15 శాతం వార్షిక ఫీజును పెంచేందుకు ఎఫ్ఆర్సీ çసుముఖంగా ఉన్నట్టు తెలిసింది. నోటిఫికేషన్ కోసం సన్నాహాలు ఈసారి ఆలస్యం లేకుండా ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. బహుశా జూన్లో ప్రవేశపరీక్ష నిర్వహించే వీలుంది. త్వరలో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎంసెట్ షెడ్యూల్ ఇస్తాం. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్వేవ్తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
జూన్లో పారిశ్రామిక వృద్ధి 13.6 శాతం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి జూన్లో 13.6 శాతంగా నమోదయ్యింది. లో బేస్ ఎఫెక్ట్కుతోడు తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు బాగుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 16.6 శాతం క్షీణత నమోదయ్యింది. సమీక్షా నెల– జూన్ గణాంకాల్లో ముఖ్యాంశాలు ఇవీ.. ► మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీ రంగం 13 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2020 జూన్లో ఈ విభాగం 17 శాతం క్షీణించింది. ► మైనింగ్ రంగం పురోగతి 23.1 శాతం. 2020 జూన్లో 19.6 శాతం క్షీణత నమోదయ్యింది. ► విద్యుత్ జూన్ ఉత్పత్తి 8.3 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెల్లో 10 శాతం క్షీణతలో ఉంది. ► భారీ పెట్టుబడులు, యంత్రసామాగ్రి ఉత్పత్తిని ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ రంగం 37.4 శాతం క్షీణత నుంచి 25.7 శాతం పురోగతికి మారింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్ల ఉత్పత్తికి సంబంధించి ఈ విభాగం సమీక్షా నెల్లో 30.1 శాతం లాభపడింది. 2020 ఇదే నెల్లో 4.5 శాతం క్షీణతలో ఉంది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఈ ఉత్పత్తుల 4.5 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో 6.9 శాతం వృద్ధి నెలకొంది. 2019 జూన్తో పోల్చితే తక్కువే.. 2019 జూన్తో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి ఇంకా బలహీనంగా ఉంది. 2019 జూన్లో సూచీ 129.3 పాయింట్ల వద్ద ఉంటే, తాజా సమీక్షా నెల (2021 జూన్)లో 122.6 పాయింట్ల వద్ద ఉంది. 2020లో ఇది కేవలం 107.9 (16.6% క్షీణత). వార్షికంగా చూస్తే 2021 జూన్లో 13.6% వృద్ధి అన్నమాట. -
సామాన్యులకు కాస్త ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు పెట్రోల్ ధరలతో, మరో వైపు ఆహర ఉత్పత్తుల ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో సామాన్య జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న వేళ సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది. భారత్లో జూన్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో సుమారు 6.3 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం రోజున రిటైల్ ద్రవ్యోల్భణ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది రెండోసారి. జూన్ నెలలో ప్రధానంగా ఆహరోత్పత్తుల ధరలు, ఇంధన ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.15 శాతానికి పెరిగిందని, మేలో ఇది 5.01 శాతంగా ఉందని ఎన్ఎస్ఓ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా ఉంది. 'ఇంధన, లైట్' విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలతో పోల్చుకుంటే జూన్ నెలలో 12.68 శాతం గణనీయంగా పెరిగింది మే నెలలో 11.58 శాతంగా నమోదైంది. -
GST: 9 నెలల తర్వాత తగ్గిన ఆదాయం
న్యూఢిల్లీ : కోవిడ్ ఆంక్షల ఎఫెక్ట్, కరోనా భయాలు, తగ్గిపోయిన ఉపాధి అవకాశాలు ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపాయి. దీంతో తొమ్మిది నెలల తర్వాత గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు లక్ష కోట్లకు దిగువన నమోదు అయ్యాయి. జూన్ నెలకు సంబంధించి కేంద్రానికి రూ.92,849 కోట్ల జీఎస్టీ ఆదాయమే వచ్చింది. అయితే గతేడాది జూన్తో పోలిస్తే ఈసారి జీఎస్టీ ఆదాయం 2 శాతం పెరగడం కొంత మేరకు ఊరట నిచ్చింది. చివరి సారిగా 2020 సెప్టెంబరులో కేంద్రానికి జీఎస్టీ ద్వారా రూ. 95,480 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆదాయం తగ్గలేదు. ఆఖరికి కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగిన ఏప్రిల్, మేలలోనూ లక్షకు పైగానే ఆదాయం వచ్చింది. అయితే మే లో దాదాపు దేశం మొత్తం లాక్డౌన్ , కఠిన కోవిడ్ ఆంక్షలు కొనసాగాయి. దీంతో జన జీవనం స్థంభించి పోయింది. మే చివరి నుంచి సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా... చాలా మంది ఉపాధి కోల్పోవడం, డెల్టా వేరియంట్ భయాలు కొనసాగుతుండంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. దీంతో వస్తు సేవల పన్ను వసూళ్లు తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్కి ముందు జీఎస్టీ వసూళ్లు మేలో రూ. 1.02 లక్షల కోట్లు, ఏప్రిల్లో రూ.1.41 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. మరోవైపు ఈ వే బిల్లులు కూడా మందగించాయి. 2021 మేలో 3.99 కోట్ల బిల్లులు రాగా అంతకుముందు ఏప్రిల్లో ఈ సంఖ్య 5.88 కోట్లుగా ఉంది. -
జూన్లో ఎగుమతులు జూమ్!!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, రత్నాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో జూన్లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 47 శాతం వృద్ధి చెంది 32.46 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అయితే దిగుమతులు 96 శాతం పెరిగి సుమారు 42 బిలియన్ డాలర్లుగా నమోదు కావడంతో వాణిజ్య లోటు 9.4 బిలియన్ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 జూన్లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు గతేడాది 22 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్లో వాణిజ్య మిగులు సాధించిన భారత్.. ఈ ఏడాది జూన్లో మాత్రం వాణిజ్య లోటు నమోదు చేసిందని వాణిజ్య శాఖ తెలిపింది. క్యూ1లో 95 బిలియన్ డాలర్లకు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగుమతులు 95 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంజనీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తులు మొదలైన రంగాలు మెరుగైన వృద్ధి కనపర్చడంతో ఇది సాధ్యపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2018–19 జూన్ త్రైమాసికంలో ఎగుమతులు 82 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21 ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 51 బిలియన్ డాలర్లుగా, 2020–21 ఆఖరు త్రైమాసికంలో 90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఒక క్వార్టర్లో ఇంత భారీగా నమోదు కావడం ఇదే ప్రథమమని గోయల్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సంబంధిత వర్గాలన్నింటితో తమ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. నిబంధనల సరళీకరణ, లైసెన్సుల పొడిగింపు తదితర అంశాలు రికార్డు స్థాయి ఎగుమతులకు దోహదపడ్డాయని గోయల్ చెప్పారు. మరోవైపు, సేవల రంగం ఎగుమతులు 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత త్వరలోనే 500 బిలియన్ డాలర్లకు కూడా చేరవచ్చని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి దిగుమతులు 61 బిలియన్ డాలర్ల నుంచి 126 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 13 బిలియన్ డాలర్ల నుంచి 31 బిలియన్ డాలర్లకు పెరిగాయి. జూన్ క్వార్టర్లో ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 25.9 బిలియన్ డాలర్లుగా, పెట్రోలియం ఉత్పత్తులు 12.9 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 5.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు!
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన వాహన రంగం జూన్ మాసంలో కోలుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ఈ నెలలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, హోండా వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జూన్లో మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది. మే నెలలో కేవలం 46,555 యూనిట్లతో పోలిస్తే 217% పెరిగింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 54,474 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు మే నెలలో 30,703 వాహనాలను అమ్మింది. మే నెలలో 15,181 యూనిట్లు అమ్మిన టాటా మోటర్స్.., జూన్లో 59% వృద్ధిని సాధించి 24,110 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 32,964 వాహనాలను అమ్మగా, ప్యాసింజర్ వాహనాలు 16,913 యూనిట్లతో రెట్టింపు వృద్ధి నమోదు చేసింది. కియా మోటార్ ఇండియా 36% వృద్ధిని సాధించి మొత్తం 15,015 యూనిట్లను అమ్మింది. మేలో మొత్తం విక్రయాలు 11,050 యూనిట్లుగా ఉన్నాయి. లాక్డౌన్ సడలింపు కారణంగా యుటిలిటీ వాహన విభాగంలో బలమైన వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడం, సెమికండెక్టర్ల కొరతతో ప్యాసింజర్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే డిమాండ్ దృష్ట్యా మెరుగైన రికవరీ కనిపిస్తుంది’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం ప్రెసిడెంట్ శైలేజ్ చంద్ర తెలిపారు. -
భయాందోళన వద్దు: ఈనెలలోనే కరోనా తగ్గుద్ది
భువనేశ్వర్: రాష్ట్రంలో కోవిడ్- 19 సంక్రమణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జూన్ నెలలో తగ్గుముఖం పట్టి ఊరట కలిగిస్తుందని, భయాందోళన చెందాల్సిన పనిలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో పాజిటివ్ రేటు బెంబేలెత్తించింది. 3 లక్షల 20 వేల 803 మందికి కోవిడ్ పాజిటివ్ నమోదైంది. 711 మంది కోవిడ్ రోగులు మృతి చెందారు. మే 22వ తేదీన ఒక్కరోజునే 12 వేల 852 మందికి పాజిటివ్ నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 4 వారాల తర్వాత లాక్డౌన్ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా నమోదైన సుందరగడ్, నువాపడా, గజపతి, సుందరగడ్ జిల్లాల్లో తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల పాజిటివ్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. త్వరలో కోవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి త్వరలో కోవిషీల్డ్ టీకాలు సరఫరా కానున్నాయి. జూన్ నెల 3వ తేదీ నాటికి 3 లక్షల 5 వేల 460 మోతాదుల కోవిషీల్డ్ టీకాలు చేరుతాయి. ఈ విడత టీకాల్ని ప్రధానంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం వినియోగిస్తామని తెలిపారు. జూన్ 6వ తేదీ నాటికి మరో 40 వేల మోతాదుల కోవ్యాక్సిన్ టీకాలు రాష్ట్రానికి చేరుతాయని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ రేటు అధికంగా కొనసాగుతున్న రాష్ట్రంలోని 5 మునిసిపల్ కార్పొరేషన్లు, 6 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కోవిడ్ టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. -
ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. వృద్ధులకు కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్బీఐ వీకేర్' రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్ను 2020 మేలో ఎస్బీఐ తీసుకొచ్చింది. మొదట సెప్టెంబర్ వరకు విధించిన గడువును డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించింది. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్బీఐ వీకేర్' స్కీమ్లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు సమయం ఉంది. 'ఎస్బీఐ వీకేర్' అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. దీనిలో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 80 బేసిస్ పాయింట్స్ అంటే 0.8 శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5.40 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్లో చేరాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల కన్నా ముందే డబ్బులు విత్డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ నష్టపోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండవు. చదవండి: శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు -
వీడని సంక్షోభం : క్షీణించిన విక్రయాలు
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభం నుంచి ఆటో కంపెనీలు ఇంకా బయట పడినట్టు లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా క్షీణించాయి. పరిశ్రమ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) తాజా గణాంకాలను మంగళవారం విడుదల చేసింది. జూన్ 2019 తో పోల్చితే జూన్ 2020 లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో 57.98 క్షీణత నమోదైందని సియామ్ వర్చువల్ కాన్ఫరెన్స్లో తెలిపింది. జూన్ 2019 తో పోలిస్తే జూన్ 2020లో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 31.16 శాతం తగ్గాయని తెలిపింది. జూన్ 2019తో పోల్చితే జూన్ 2020లో వ్యాన్ల అమ్మకాలు 62.06 శాతం తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు కూడా 47.37 శాతం తగ్గి 2,69,811 యూనిట్లను అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే నెలలో 5,12,626 యూనిట్లుగా ఉన్నాయి. సియామ్ తాజా గణాంకాల ప్రకారం జూన్ 2020 లో ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్ల అమ్మకాలు వరుసగా 38.56 శాతం, 80.15శాతం తగ్గాయి. జూన్ 2019 తో పోల్చితే ప్రయాణీకుల వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాల మొత్తం ఎగుమతులు వరుసగా 2020 జూన్లో 56.31 శాతం, 34.98 శాతం, 34.25 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. -
విజృంభణ: జూన్లో జూలు విదిల్చిన కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా.. వైరస్ను కట్టడి చేయడంలో అవన్నీ విఫలమైనట్లు కనిపిస్తోంది. లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసిన అనంతరం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. ఒక్క జూన్ నెలలోనే నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయంటే వైరస్ విజృంభణ ఏ విధంగా ఉందో తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. దేశంలో జనవరి 31న తొలి కరోనా కేసు నమోదైనా.. మార్చినాటికి అంతగా వ్యాప్తి చెందలేదు. లాక్డౌన్ విధింపు, భౌతిక దూరం పాటించడంతో వైరస్ను కట్టడిచేశామనే భావన తొలుత అందరిలోనూ కలిగింది. అయితే మే మూడో వారం నుంచి పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. మార్చిలో విధించిన లాక్డౌన్కు మే నాటికి విడతల వారీగా సడలించడం, శ్రామిక్ రైళ్లు ప్రారంభించడం, వలస కూలీల తరలింపు వంటి నిర్ణయాలతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. (కరోనా కల్లోలం.. పెరుగుతున్న మరణాలు) కేంద్ర గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో మొత్తం 33,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య మే మాసంలో 1,50,195గా పెరిగింది. ఇక జూన్ నెల ముగిసే నాటికి దేశంలో కరోనా వైరస్ జూలు విదిల్చింది. ఒక్క నెలలోనే ఏకంగా నాలుగు లక్షలకు పైగా (4,00,414) కరోనా కేసులు నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్యా అదే రీతిలో పెరుగుతోంది. ఏప్రిల్లో 1105 మరణాలు సంభవించగా.. మే లో 4267, జూన్లో 11,988 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. మే చివరినాటికి లాక్డౌన్ నిబంధనాలు పూర్తిగా ఎత్తివేయడంతో వ్యక్తిగత, సామాజిక వ్యవహార శైలిలో జనజీవనం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. (అన్లాక్తో నిర్లక్ష్యం పెరిగింది!) వైరస్ తొలినాళ్లలో ప్రజలు చూపిన జాగ్రత్తలు, భౌతిక దూరం నిబంధనలు ఇప్పుడు పాటించడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని, కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రధాని సూచించారు. మరోవైపు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులోనే అత్యధిక భాగం నమోదవడం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫ్లాస్మా థెరపీ చికిత్సతో మొదట్లో కొంత కుదుటపడ్డా.. పెరుగుతున్న కేసులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక గడిచిన మూడు రోజులుగా కరోనా తమిళనాడు వాసులకు కంటిమీదు కనుకులేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1201 మంది మృత్యువాత పడ్డారు. -
దేశమంతా.. రైలుకూత
సాక్షి, హైదరాబాద్: జూన్ 1 నుంచి పలు రైళ్ల రాకపోకలకు వీలుగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు సిద్ధమవుతున్నాయి. సుమారు 9 రైళ్లు ఈ రెండు స్టేషన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10వ నంబర్కు అదనంగా ఒకటో నంబర్ ప్లాట్ఫాంను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – బెంగళూరు మధ్య రోజూ రెండు రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే వారానికి ఒక రైలు సికింద్రాబాద్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ఈ ప్రత్యేక రైళ్లతో పాటు జూన్ 1 నుంచి సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల మీదుగా హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, నిజామాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ – ధానాపూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ – హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ – నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్, ముంబై – భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ – ముంబై హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవికాక మరికొన్ని రైళ్లు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్టు సైతం 80 నుంచి 100 వరకు చేరుకుంది. రెండుచోట్లా అదనపు ఏర్పాట్లు ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తుండటంతో సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజుకు 900 నుంచి 1,000 వరకు మాత్రమే ఉంది. దీంతో రైళ్ల రాకపోకలను ప్రస్తుతం 10వ నంబర్కే పరిమితం చేశారు. జూన్ 1 నుంచి ఒకటో నంబర్ ప్లాట్ఫాం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాంపల్లిలోనూ ఇక నుంచి రైళ్లు ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగనున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యా పెరగనుండటంతో ఈ రెండు రైల్వేస్టేషన్లలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా థర్మల్ స్క్రీనింగ్లు సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలోని ఒకటో నంబర్ ప్లాట్ఫాం ప్రవేశమార్గంలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులను స్క్రీనింగ్ చేశాకనే లోనికి అనుమతిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్ల నిబంధనలే జూన్ 1 నుంచి నడిచే వాటికీ వర్తిస్తాయి. ప్రయాణికుల మధ్య భౌతికదూరం తప్పనిసరి. ప్రతి ప్రయాణికుడి వివరాలు రైల్వే వద్ద నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యసేతు యాప్ను కలిగి ఉండాల్సిందే. రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులనే అనుమతిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లను మాత్రం వినియోగించరు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో టికెట్ తనిఖీ సిబ్బందిని కూడా పెంచనున్నారు. రైళ్లను, రైల్వేస్టేషన్ను పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు అనుమతి లేనివారు ప్రవేశించకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తారు. వివరాల నమోదు తప్పనిసరి లాక్డౌన్ వేళలో నడుపుతున్న ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ఇకపై సాధారణ బోగీల్లో ప్రయాణించాలన్నా రిజర్వేషన్ తప్పనిసరి. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల వివరాలను నమోదు చేసేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ పొందే వారంతా తమ వివరాలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. -
జూన్ మొదటి వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ను జారీ చేసేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కసరత్తు చేస్తోంది. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడగానే డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభించేలా షెడ్యూల్ సి ద్ధం చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలి పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఈసేవ/మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో ఉండకుం డా చూసేందుకు, భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించా రు. ఈసారి దరఖాస్తుల సమయంలో బయోమెట్రి క్ అథెంటికేషన్ (థంబ్ ఇంప్రెషన్) లేకుండానే ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పా రు. వేలిముద్రల స్వీకర ణ సమయంలో కరోనా వ్యాప్తికి అవకాశము న్నందున దానిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ఇంట్లో ఉండి కూడా డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డు/డెబిట్/ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చ ని తెలిపారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించే సదుపాయం లేని వారు మాత్రం ఈసేవ/మీసేవ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఇప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో మొౖ బెల్ నంబరు తప్పకుండా ఇవ్వాలని, అది కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నంబరై ఉండాలన్న నిబం ధన ఉందన్నారు. ప్రస్తుతం దానిని కూడా తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడిం చారు. ఇక విద్యార్థి దరఖాస్తుచేసే సమయంలో తనవద్ద ఉండే (లేదా తల్లిదండ్రులది) మొబైల్ నం బరును మాత్రమే ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక మొబైల్ నుంచి ఒకే దరఖాస్తును స్వీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలతో పాటు వాట్సాప్ నంబర్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు సమ గ్ర సమాచారం అందించేందుకు ఈసారి ఫేస్బుక్ (facebook.com/ dost.telangana/), ట్విట్టర్ (twitter.com/dost_telangana) ఖాతాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందించేలా దోస్త్ బిజినెస్ వా ట్సాప్ పేరుతో వాట్సాప్ నంబరు 7901002200 అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల దరఖాస్తు పూర్తయితే పూర్తయినట్లుగా, పూర్తి కాకపోతే పూర్తి కాలేదని, ఇతరత్రా దోస్త్ సమగ్ర సమాచారం ఈ వాట్సాప్ నంబరు ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జూన్లో టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత కోసం ‘టీఎస్–బీపాస్’ వి ధానాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని 87 పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, జూన్ మొద టి వారంలో అన్ని పురపాలికల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్–బీపాస్ అమలుపై గురువారం ఆయనిక్కడ సమీక్ష నిర్వహిం చారు. ప్రస్తుతం 87 పురపాలికల్లో టీఎస్–బీపాస్ కింద 1,100 దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పలు అనుమతులను జారీ చేశామని అధికారులు కేటీఆర్కు వివరించారు. సాఫ్ట్వేర్, సపోర్ట్ సిస్టం పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చిందని, లోపాలుంటే సరిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రా ష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు హైదరాబాద్లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారం భించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరి ధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ మొదటివారంలో టీఎస్–బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీసేవ, పౌరసేవా కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్నెట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మరింత సరళీకృతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. టీఎస్–బీపాస్ అమలుపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్ -
జూన్ వరకూ ఆర్థిక సంవత్సరం పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది. దీనితో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుంది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. అంటే 12 నెలల పాటు ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో 15 నెలలపాటు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగనుంది. ‘‘2020–21 ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుంది’’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రభుత్వ గణాంకాల నుంచి పారిశ్రామిక గణాంకాల వరకూ అన్ని విభాగాలపై కరోనా ప్రభావం నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ మేరకు ఉందన్న అంశాన్ని కొంతమేర ఒక అంచనాకు రావడానికి తాజా నిర్ణయం దోహపడుతుందన్నది నిపుణుల విశ్లేషణ. ఆర్థిక సంవత్సరాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నాయి. కరోనా వైరస్ కల్లోలంతో కనీసం ఆరు నెలల పాటు ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఏడాది 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఉండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక నివేదికలు పూర్తి బిజినెస్ సైకిల్ను ప్రతిబింబించలేవని వివరించారు. -
జూన్ 30 వరకు టోర్నీలు రద్దు
న్యూఢిల్లీ: కరోనా కల్లోలానికి వాయిదా లేదా రద్దవుతోన్న క్రీడల జాబితాలో తాజాగా టేబుల్ టెన్నిస్ (టీటీ) కూడా చేరింది. కరోనా ప్రభావంతో జూన్ 30 వరకు జరగాల్సిన అన్ని అంతర్జాతీయ ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రకటించింది. అంతేకాకుండా ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో జూన్ 30 వరకు ఎలాంటి మార్పులు చేయరాదని, మార్చి నెలలో ఉన్న ర్యాంక్లనే కొనసాగించాలని నిర్ణయించింది. ‘కరోనా కారణంతో ఏర్పడిన అనిశ్చితి వలన ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మేము కఠిన నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. జూన్ 30 వరకు జరగాల్సిన అన్ని ఐటీటీఎఫ్ టోర్నీలను రద్దు చేస్తున్నాం’ అని తమ ప్రకటనలో ఐటీటీఎఫ్ తెలిపింది. -
జూన్లో జాయిన్ అవుతారు
వంశీ పైడిపల్లితో ఓ సినిమాను ప్లాన్ చేశారు మహేశ్బాబు. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు పరశురామ్తో చేయబోయే సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారట మహేశ్. ఈ సినిమా జూన్లో స్టార్ట్ కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనుల్లో ఉన్నారట దర్శకుడు పరశురామ్. ఉగాదికి ఈ సినిమా ముహూర్తం జరపాలనుకుంటున్నారని తెలిసింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందని టాక్. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రెడీ అవుతుందని ఊహించవచ్చు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న సినిమాలో మహేశ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
జూన్కు సరళాసాగర్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : భారీగా వచ్చి చేరిన వరద కారణంగా గండి పడ్డ సరళాసాగర్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. జూన్ ఖరీఫ్ సీజన్ ఆరంభమయ్యే నాటికి నీటి నిల్వకు అనుగుణంగా నీటిపారుదల శాఖ మరమ్మతులు చేయనున్నారు. అప్పటివరకు రింగ్బండ్ నిర్మాణం చేసి, దీనికింద ఉన్న ఆయకట్టుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించనున్నారు. మూడు రోజుల కిందట సరళాసాగర్కు స్పిల్వేకు ఎడమ వైపు కట్టకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా 80మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి దారితీసిన కారణాలు ఇప్పటికీ తెలియలేదు. కట్టకు బొరియలు ఏర్పడటంలో నీరు అందులోకి చేరి ఉంటుందని, పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరడంతో ఒత్తిడికి కట్ట తెగిపోయి ఉంటుందని అంచనా. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలించే నీటితో సరళాసాగర్ కుడి, ఎడమ కాల్వల కింద 4,500 ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని అందించేలా రింగ్బండ్, సమాంతర కాల్వను తవ్వాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రాజెక్టుపై ఉన్న ఒక స్లూయిస్ ద్వారా కాల్వలకు 60 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని తరలించి, అనంతరం తెగిన 80 మీటర్ల కట్ట నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు.ప్రస్తుతం పూర్తి స్థాయి కట్ట నిర్మాణం చేయాలంటే, అంచనాలు రూపొందించి, ప్రభుత్వ అనుమతి తీసుకొని, మళ్లీ డ్రాయింగ్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి మరో నెల, రెండు నెలల గడువు పట్టే అవకాశం ఉంది. తెగిన కట్ట నిర్మాణానికి కనీసంగా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్లు మేర ఖర్చవుతుందని అంచనా. -
హారతి గైకొనుమా
‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం!విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాలేకున్నా, తన ఆఫీస్కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇలాంటివి చాలానే ఉన్నాయ్ రోజూ వినే పాటల్లో, ప్రావెర్బుల్లో.ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉందిఆయన ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అనడం.-మాధవ్ శింగరాజు ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్లో పదవీ విరమణ పొందిన భారత రాష్ట్రపతులు నివాసం ఉండే భవంతి ఒకటి ఉంది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ సామాన్లను అందులోకి మార్పించారు. పుస్తకాలే ఆయన సామాన్లు. ఉండడానికైతే ప్రణబ్ ఇప్పుడు రాజాజీ మార్గ్ నివాసంలోనే ఉంటున్నారు. అయితే ఎక్కువగా పశ్చిమ బెంగాల్లోని ఆయన పూర్వీకుల స్వగ్రామం మిరాటీలో స్థానికులకు కనిపిస్తుంటారు. ఢిల్లీలో ఉన్నా, మిరాటీలో ఉన్నా ఆయన చేతిని వదలని మనుషులు.. పుస్తకాలే! అసలు ఢిల్లీ, మిరాటీ కాదు.. పుస్తకాలు ఎక్కడుంటే అక్కడే ఆయన నివాసం. ప్రణబ్ చుట్టూ తిరిగే రాజకీయాలు కూడా ప్రస్తుతం దేశంలో ఏమీ లేవు కనుక ఎక్కడైనా ఆయన మాట వినిపిస్తే, వెంటనే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడారోనన్న సందేహం రావడానికి కారణం ఇదే.ఇప్పుడేం జరిగిందంటే.. ‘‘పురుషుడి చదువు పురుషుడికి మాత్రమే పరిమితం అవుతుంది. స్త్రీ చదువు కుటుంబం మొత్తానికీ చదువౌతుంది’’ అని ప్రణబ్ అకస్మాత్తుగా దేశ ప్రజలకు వాక్ దర్శనం ఇచ్చారు! ఢిల్లీలోనే ఒక కార్పొరేట్ కంపెనీ ‘బేటీ పఢావో అభియాన్’ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందులో గెస్ట్గా మాట్లాడుతూ ప్రణబ్ అన్నమాట ఇది. అంతే తప్ప తనకు తానుగా రాజాజీ మార్గ్లోనో, మిరాటీలోనో ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడలేదు. అలా మాట్లాడి ఉంటే ఆయన మాటల్ని సీరియస్గానే తీసుకోవలసి వచ్చేది. సందర్భానుసారం మాట్లాడ్డానికి, మాట్లాడవలసిన అవసరాన్నే ఒక సందర్భం చేయడానికీ తేడా ఉంటుంది కదా. ప్రణబ్ చెప్పిన హితవు కూడా కొత్తదేం కాదు. ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యు ఎడ్యుకేట్ ఏన్ ఇండివిడ్యువల్. బట్ ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్, యు ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ’ అని చెప్పారు ఆయన. ఎప్పుడూ వింటుండే మాటే. ఎవరో ఒకరు అంటుండే మాటే. మగ పిల్లవాడిని చదివిస్తే అది వాడికి మాత్రమే మేలవుతుంది. ఆడపిల్లను చదివిస్తే అది దేశానికే మేలవుతుంది అనేది ఆఫ్రికన్ ప్రావెర్బ్. అక్కడి నుంచి మిగతా ప్రపంచానికి ప్రబలింది. వాళ్లు ‘దేశానికి మేలు’ అంటే.. మనం ‘ఇంటికి మేలు’ అని మార్చుకున్నాం. ఆడపిల్లను చదివిస్తే ఇంటికి మేలు ఎలా అవుతుందంటే ఆమె ఇంట్లోనే కూర్చుని పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తూ, బుద్ధులు నేర్పిస్తూ ఉంటుందని! తను చదువుకుంటున్నప్పుడు తోబుట్టువుల్ని చదివించడం, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వాళ్లను చదివించడం, పిల్లల పెళ్లిళ్లు కూడా అయి మనవలు పుట్టాక వాళ్లను చదవించడం.. అలా ఆ విద్యాజ్యోతి తరాలను వెలిగించుకుంటూ పోతుంది. ఆమె ఉద్యోగం చేస్తున్నా కూడా రిటైర్ అయ్యేవరకు ఆమె వెలిగించడం కోసం రోజూ కొన్నిదీపాలు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాయి. ‘మమ్మీ ప్రాజెక్ట్వర్క్’. ‘అమ్మమ్మా హోమ్వర్క్’! చెయ్యడానికి, చేయించడానికి సంతోషమే. కానీ ఓపిక. అదెక్కడి నుంచి వస్తుంది? ‘ఓపిక దేముందీ.. ఫ్యామిలీ కంటే ఎక్కువా’ అని తను అనుకున్నా.. తనకు శక్తిని, జీవితేచ్ఛను ఇచ్చే సంతోషాల కోసం, సమాజం కోసం చేసుకోవాలనుకున్నవి! వాటికి టైమ్ ఎక్కడ? ఇంట్లో ఇంకో జ్ఞానదీపం ఉంటుంది కదా.. మగ జ్ఞానదీపం. అదెప్పుడూ తనకు తను ఇంట్లో, బయటా వెలుగుతూ ఉంటుంది తప్ప ఇంకొకర్ని వెలిగించేందుకు ఉత్సాహం చూపదెందుకు? సొంత పిల్లదీపాలను కూడా పట్టించుకోదెందుకు? డాడీ ఈ సమ్ అర్థంకావడం లేదు. ‘మమ్మీని అడుగు’. డాడీ.. స్కూల్ టైమ్ అవుతోంది. షూజ్కి పాలిష్ చెయ్యవా ప్లీజ్. ‘నీ షూజ్ నువ్వే క్లీన్ చేసుకోవాలని మమ్మీ చెప్పలేదా నీకు?’. విద్య మమ్మీనే. బుద్ధులూ మమ్మీనే. ఒంట్లో బాగోలేకున్నా, తన ఆఫీస్కీ లేట్ అవుతున్నా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. ఇంకా ఇలాంటివే చాలానే ఉన్నాయ్ రోజూ వినే మాటల్లో, పాటల్లో.. స్త్రీని నెత్తి మీద పెట్టుకొని ఎటూ కదలనివ్వకుండా పట్టుకునేవి. ప్రణబ్ కూడా ఇప్పుడు ఒక మాట వేసినట్లే ఉంది ‘ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ ఉమన్..’ అని ఆయన అనడం. ఆడపిల్లల్ని చదివించాలి అని మాత్రమే చెప్పి, రిలేటెడ్గా వేరే ఏమైనా మాట్లాడాల్సింది. ‘తనని చదివిస్తే తను వెలిగిస్తుంది’ అని చెప్పడంలో ఆమె వెలగడం ఎక్కడా లేదు. అంతా చదివి ఏం లాభం? ‘హారతి గైకొనుమా’ అంటూ ఉండటమేనా స్త్రీ జీవితం. ప్రణబ్ ముఖర్జీ కన్నా నలభై ఏళ్లు ముందు పుట్టిన తెలుగు రచయిత, సంస్కర్త గుడిపాటి వెంకటాచలం. స్త్రీ అభ్యున్నతి కోసం ఆయన రాసినంతగా ఎవరూ రాయలేదు. అయినప్పటికీ ఎక్కడా విద్యతోనే స్త్రీ అభ్యున్నతి అని ఆయన అనలేదు. ‘అసలు జన్మ వల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు గొప్పవారు పల్లెటూళ్లలో. కానీ చదివి గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు. మళ్లీ చదువుల వల్ల చక్కని పాలిష్ వొచ్చిన పురుషులున్నారు’ అని రాశారు ఒకచోట. ఎందుకలా మగవాళ్లు మాత్రమే పాలిష్ అవుతారూ అంటే ఎంత చదువుకున్న స్త్రీ అయినా ఇంటిని పాలిష్ చేస్తుండటమే ఆ చదువుకు సార్థకత అన్నట్లుగా వాళ్ల మైండ్ని వీళ్లు ఎప్పటికప్పుడు పాలిష్ చేస్తుంటారు కనుక. ప్రణబ్ బాగా చదువుకున్న మనిషి. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ చదువుతున్న మనిషి. రిటైర్ అయ్యి రాజాజీ మార్గ్లో ఉంటున్నా, ఆ రిటైర్మెంట్ నుంచి మరికాస్త రిటైర్ అవడం కోసం మిరాటీలో ఉంటున్నా, అప్పుడప్పుడూ సభలు సమావేశాలకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లొస్తున్నా.. కాస్త తీరిక చేసుకుని చిన్నపుస్తకమేదైనా రాస్తే బాగుంటుంది.. దీపమనీ, అపురూపమనీ స్త్రీని మభ్యపెట్టింది చాలు, ఆమె కోసం కూడా కాస్త ఆమెను వెలగనివ్వండి అని చెబుతూ! దీపం వెలుగులో ఎదగాలనుకోవడంలో తప్పులేదు. మనం ఎదగడం కోసమే దీపం వెలుగుతూ ఉండాలని అనుకోవడం అన్యాయం. -
రెండేళ్ల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం మరోసారి దిగి వచ్చింది. వరుసగా రెండో నెలలో కూడా తగ్గిన టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) జూన్ నెలలో2.45 శాతం నుంచి 2.02 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఇది 23 నెలల కనిష్టానికి చేరింది. జూన్ 2018 లో ఇది 5.68 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.01 శాతం నుంచి 5.04 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.99 శాతం 6.98 శాతంగా ఉంది. ఏప్రిల్లో 7.37శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బంణం మే నెలలోని 24.76తో పోలిస్తే..33.16 శాతానికి ఎగగిసింది. ఆహార పదార్థాలు, కూగాయల ధరలు, ఇంధన, విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం చల్లబడింది. -
పడిపోయిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు జూన్ మాసంలో పడిపోయాయి. వరుసగా లక్ష కోట్ల రూపాయల రికార్డు వసూళ్లను సాధించిన అనంతరం ఈ నెలలో రూ. 99,939 కోట్లకు పడిపోయాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.18,366 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ, రూ.25,343 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 47,772 కోట్లు (దిగుమతులపై సరూ. 21,980 కోట్లతో సహా) సెస్, 8,457 కోట్లు (దిగుమతులపై సేకరించిన 6 876 కోట్లతో సహా) అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మే నెలలో 1,00,289 కోట్ల రూపాయలను వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
ధరలు ఆకాశం వైపు...
న్యూఢిల్లీ: జూన్ నెలలో రిటైల్ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం మార్కును నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో 5.07 శాతంగా నమోదైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం తిరిగి మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరలు కాస్తంత ఉపశమించినా, చమురు ధరలు పెరిగిపోయే సరికి ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రతిఫలించింది. దీంతో 5 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.87 శాతంగా ఉంది. 2017 జూన్ నెలలో 1.46 శాతంగా ఉండడం గమనార్హం. ఈ మేరకు రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్వో) గురువారం విడుదల చేసింది. ముఖ్య గణాంకాలు... ఆహార ఉత్పత్తుల విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో ఉన్న 3.1% నుంచి జూన్లో 2.91 శాతానికి తగ్గుముఖం పట్టింది. చమురు బాస్కెట్లో ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే 5.8% నుంచి 7.14 శాతానికి ఎగిసింది. వస్త్రాలు, పాదరక్షల విభాగంలో ద్రవ్యోల్బణం 5.67 శాతంగా, హౌసింగ్ విభాగంలో 8.45 శాతంగా నమోదైంది. మేతో పోలిస్తే పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో పరిమితం చేసేలా చూడాలని కేంద్ర సర్కారు ఆర్బీఐ ముందు లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నుంచి జరిగే ఆర్బీఐ తదుపరి ద్వైమాసిక మానిటరీ పాలసీ సమీక్షలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా వ్యవహరించనున్నాయి. ఆగస్ట్ 1న పాలసీ నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది. ఇకపై తగ్గుతుంది ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ రిటైల్ ద్రవ్యోల్బణమే గరిష్టంగా నమోదైంది. అయితే, తర్వాతి నెలల్లో ఇది సగటున 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుంది. ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్బీఐ దాన్ని అదుపు చేయవచ్చు’’. – శుభదా రావుయస్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త -
జూన్ 8,9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు పంపిణీ
-
తగ్గిన డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
♦ జూన్లో 0.90 శాతానికి డౌన్ ♦ ఇది ఎనిమిది నెలల కనిష్టం న్యూఢిల్లీ: కూరగాయలు సహా ఇతర ఆహారపదార్థాల రేట్ల తగ్గుదలతో జూన్లో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.90 శాతానికి క్షీణించింది. బేస్ ఇయర్ను 2011–12కి మార్చిన తర్వాత నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇది 8 నెలల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2016 నవంబర్లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.82 శాతంగా నమోదైంది. ఇది ఈ ఏడాది మే లో 2.17 శాతంగాను, గతేడాది జూన్లో మైనస్ 0.09 శాతంగానూ నమోదైంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయి 1.54 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుదలతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం .. ♦ ఆహారపదార్థాల ధరలు వార్షిక ప్రాతిపదికన 3.47 శాతం క్షీణించాయి. కూరగాయల ధరల ద్రవ్యోల్బ ణం మైనస్ 21.16 శాతంగా నమోదైంది. ♦ బంగాళదుంప రేట్లు గణనీయంగా 47.32 శాతం మేర క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు తర్వాత స్థాయిలో 25.47 శాతం మేర క్షీణించాయి. ఇక ఉల్లి రేట్లు 9.47 శాతం తగ్గాయి. ♦ తృణధాన్యాల ధరలు 1.93 శాతం, గుడ్లు.. మాంసం.. చేపలు మొదలైన వాటి రేట్లు 1.92 శాతం మేర పెరిగాయి. -
14నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : కూరగాయలు, పప్పులు, దుంపలు ధరలు జూన్ నెలలో భారీగా తగ్గాయి. దీంతో టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 14నెలల కనిష్టానికి పడిపోయింది. మే నెలలో 2.17 శాతంగా నమోదైన ఈ ద్రవ్యోల్బణం, జూన్ నెలలో 0.9 శాతానికి ఢమేల్మంది. గతేడాది జూన్లో కూడా ఈ ద్రవ్యోల్బణం 0.09 శాతానికి పడిపోయిన విషయం విదితమే. ఆహార ద్రవ్యోల్బణం 3.47 శాతం పడిపోయింది. పప్పులు, కూరగాయలు, దుంపల ధరలు ఎక్కువగా క్షీణించడంతో ఈ ద్రవ్యోల్బణం కిందకి పడిపోవడానికి సహకరించింది. ఇదే సమయంలో గుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 1.92 శాతానికి పెరిగింది. కాగ, మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 1.02 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. మే నెలతో పోలిస్తే, జూన్ నెలలో ఇంధనం, విద్యుత్ ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా 5.28 శాతానికి పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో తయారీ ఉత్పత్తులు 64.23 శాతం వెయిటేజీని కలిగి ఉంటాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రమే కాక, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయింది. దీంతో వచ్చే నెల ప్రారంభంలో జరుగబోయే ఆర్బీఐ ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రేట్ల కోతను చేపడతారని ఆశలు పెరుగుతున్నాయి. -
నేటి నుంచే గోల్కొండ బోనాలు
-
భారీ బ్యాటరీతో ‘కె10000 ప్రొ’ త్వరలో
చైనీస్ కంపెనీ ఆకిటెల్ భారీ బ్యాటరీ సామర్ధ్యంతో తన తాజా స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే వారం రోజుల పాటు పనిచేసేలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేస్తున్నామంటూ చైనా కంపెనీ ఆకిటెల్ 2015లో లైమ్ లైట్లోకి వచ్చింది. 10వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ’కె 10000 ప్రొ’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది జూన్లోనే ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. టు బి ద కింగ్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఆ స్మార్ట్ఫోన్ ఫోటో ఇపుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. దీని ప్రకారం ఫింగర్ ప్రింట్ సెన్సర్ను వెనుక భాగంలో అమర్చింది. కె 10000ప్రో వేరియంట్ ఇతర ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. కె 10000ప్రో ఫీచర్స్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5.5 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్, 1.5 మీడియా టెక్ ఎంటీ6750టీ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ -
జూన్కు కొత్త టీచర్లు కష్టమే!
నిబంధనల ఖరారుకు కమిటీ.. స్పష్టతకు మరింత సమయం - కొత్త నోటిఫికేషన్ల జారీ కూడా ఆలస్యం.. - సమస్యగా మారిన శాఖల మధ్య సమన్వయ లోపం - కొత్తగా ప్రారంభించే సంక్షేమ గురుకులాల్లో బోధనకు ఇబ్బందే సాక్షి, హైదరాబాద్ జూన్లో స్కూళ్లు తెరిచే నాటికి రాష్ట్రంలో కొత్త టీచర్ల నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రంలో గతేడాది ప్రారంభించిన గురుకులాల్లోని ఖాళీలు, త్వరలో (2017–18 విద్యా సంవత్సరంలో) ప్రారంభించనున్న గురుకులాలకు అవసరమైన పోస్టుల భర్తీ విషయంలో ప్రధానంగా సమస్య నెలకొంది. సంక్షేమ శాఖలు, విద్యా శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా 7,306 టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా శాఖను సంప్రదించకుండానే గురుకుల సొసైటీలు నిబంధనలను రూపొందించడం, అడగకుండా తామెలా చెబుతామని విద్యా శాఖ చూస్తూ ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరకు విద్యార్హతల విషయంలో సీఎం కేసీఆర్ స్వయంగా కల్పించుకొని డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలని, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారమే నిబంధనలను రూపొందించాలని ఆదేశించడంతో సంక్షేమ శాఖలు విద్యా శాఖను సంప్రదించాయి. ఈ నేపథ్యంలో గురుకుల నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలతోపాటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అవసరమైన నిబంధనల రూపకల్పనకు విద్యా శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల విద్య కమిషనర్ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ జగన్నాథరెడ్డి, విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీహరిలతో కమిటీని నియమించింది. ఎన్సీటీఈ నిబంధనలను అధ్యయనం చేసి, నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలు, అర్హతలపై ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొంది. కమిటీ ప్రస్తుతం ఆ పనిలో ఉంది. అయినా ఇప్పటికిప్పుడు నియామకాలకు నోటిఫికేషన్లను జారీ చేసే పరిస్థితి లేదు. కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా.. గురుకుల టీచర్ల భర్తీ నిబంధనలు, పాఠశాలల్లోని ఖాళీల భర్తీ నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులను వేర్వేరుగా జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టేలా ఉంది. ఆ తరువాత నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడి.. తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు మరో మూడు నెలలకు పైగా సమయం పట్టనుంది. దీంతో వచ్చే జూన్లోగా పాఠశాలల్లో టీచర్లను నియమించే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే ప్రారంభించిన 16 బీసీ గురుకులాలు, 104 ఎస్సీ గురుకులాలు, 51 ఎస్టీ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాల్లో టీచర్ల సమస్య తప్పేలా లేదు. కొత్త గురుకులాల్లోనూ అంతే.. మరోవైపు 2017–18 విద్యా సంవత్సరంలో (జూన్ నాటికి) ప్రారంభించే 119 బీసీ గురుకులాలు, 118 మైనారిటీ గురుకులాలకూ టీచర్ల సమస్య తప్పని పరిస్థితి. మరో 30 గురుకుల డిగ్రీ కాలేజీలకు అవసరమైన లెక్చరర్ల నియామకాలకు కూడా సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో జూన్కల్లా టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నాలు సఫలమయ్యేలా లేవు. పాఠశాలల్లో 8 వేలకు పైగా ఖాళీల భర్తీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. -
‘ఆగస్టు’ పైనే ఆశలు
కలవరపెడుతున్న ఖరీఫ్ కురవని భారీ వర్షాలు ఇప్పటికీ నమోదుకాని సాధారణ వర్షపాతం జిల్లాలో 4.34 హెక్టార్లలో పంటల సాగు విస్తీర్ణం వర్షాలు కురవకపోతే ఆగమే అంటున్న రైతులు జోగిపేట: రైతులను ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది. జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో చెప్పుదగ్గరీతిలో వర్షాలు కురవనేలేదనే చెప్పవచ్చు. రైతులు ఆగస్టులో కురిసే వర్షాలపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. సరైన వర్షాలు పడగానే రైతులు నాట్లు వేయాలని, మరికొందరు విత్తిన పంటలను కాపాడుకోవాలని, ఇంకొందరు భూమి దున్ని విత్తనాలు విత్తాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వరుణదేవుడిపై ఆశతో పత్తి పంటలు వేసుకోవడం, వరినాట్లు వేసుకోవడం అక్కడక్కడా జరిగింది. అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మండలాల్లో వరినారు మళ్లు సిద్ధం ఉంచుకున్నారు. గత ఖరీఫ్లో రైతులు 4.15 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేయగా వీటిలో 79వేల హెక్టార్ల వరకు వరి, చెరకు, పంటలు సాగు చేయగా, 3.35 లక్షల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్న పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేశారు. ఈ ఏడాది 4.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలో గత సంవత్సరం ఖరీఫ్లో జూన్ మాసంలో 44.4 మిమీ, జూలైలో 108 ఎంఎం, ఈ సంవత్సరం ఖరీఫ్లో జూన్లో 137.7 మి.మీ, జూలైలో 206.6 మి.మీ సాధారణ వర్షపాతం నమోదయ్యింది. రైతులకు పంపిణీ చేసిన విత్తనాలు ప్రభుత్వం వివిధ పంటలకు సంబంధించి రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది. 41,390 క్వింటాళ్ల వరి, 23,164 క్వింటాళ్ల మొక్కజొన్న, 12,804 క్వింటాళ్ల జొన్న, 489 క్వింటాళ్ల సజ్జలు, 2,402 క్వింటాళ్ల కంది, 3,771 క్వింటాళ్ల పెసర, 2,417 క్వింటాళ్ల మినుము, 19,898 క్వింటాళ్ల సోయాబిన్, 338 క్వింటాళ్ల వేరుశనగ, 43 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 47 క్వింటాళ్ల ఆముదం, 10.9 క్వింటాళ్ల నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు. అన్ని మండలాల్లోనూ అదే తీరు... జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఒక్కటి, రెండు మండలాలు మినహా మిగతా మండలాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. వారం రోజుల క్రితం నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. జూన్ మాసం అటుంచి జూలైలో అప్పుడప్పుడు జిల్లాలోని నలువైపులా వర్షాలు కురిసినా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కురవలేదని రైతుల అభిప్రాయం. పారిశ్రామిక ప్రాంతాల వైపు ఎక్కువగా వర్షం కురిసిందంటున్నారు. గ్రామాలల్లో కురిసిన వర్షాలు పంటలు విత్తే స్థాయిలో వానల్లేవనే చెప్పవచ్చు. ఇప్పటికి వరి సాగు ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు పత్తి, సోయాబిన్ సాగు చేయవద్దని చెబుతున్నా ఇది వరకే పత్తి, కందులు వేసిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. గత ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో కూడా అనుకున్నంతగా వర్షాలు మోస్తారుగా కురిసాయి. ఖరీఫ్లో పంటల సాగు వివరాలు పంట విస్తీర్ణం ( హెక్టార్లలో) వరి 82206 చెరుకు 21532 జొన్న 10753 సజ్జలు 292 మొక్కజొన్న 113490 పెసర 24994 మినుము 13714 కంది 26678 ఇతర ధాన్యాలు 735 వేరుశనగ 38 పొద్దుతిరుగుడు 211 నువ్వులు 306 ఆముదం 303 పత్తి 122436 మిర్చి 652 ఉల్లి 269 సోయాబిన్ 15421 4.34.030 పంటలపై ఆశలు గల్లంతే... జిల్లాలో ప్రధానంగా పత్తి , వరి సాగు చేస్తుంటారు. 80 శాతానికి పైగా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. ఈ సారి వర్షాలు అంతగా కురవకపోవడంతో విత్తిన పంటలపై ఆశలు వదులు కుంటున్నారు. మొలకెత్తిన మొక్కలు అక్కడక్కడ ఎండిపోతున్నాయి. వీటిని రక్షించుకునేందుకు రైతులు ఆష్టకష్టాలు పడుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. నదిలోని నీటి మడుగులు ఎండిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 నుంచి 35 శాతం వరకు మాత్రమే వరినాట్లు వేసుకున్నట్లు సమాచారం. వర్షాలు కురిస్తేనే బతుకు ఆగస్టు నెలలోనైనా వర్షాలు కురిస్తేనే బతకగలుగుతాం. లేకుంటే అప్పుల పాలవుతాం. పత్తిపంటలు వేసి దేవుడి మీద భారం వేశాం. వరి నారు పెంచినా నాట్లు వేసుకునేందుకు ధైర్యం సరిపోతలేదు. ఆగస్టులో సమృద్ధిగా వర్షాలు కురిస్తే బాగుండు. శంకర్ , రైతు, కిచ్చన్నపల్లి వరుణుడి కరుణ కోసం... జూన్, జూలై మాసంలో సరిగ్గా వర్షాలు కురవలేదు. ఈ నెలలోనైనా వానలు పడకుంటా పత్తి పంట మొలకెత్తుడు కష్టమే. అప్పులు చేసి పంటలు పెట్టినం. అధికారులు చెప్పినా చాలా వరకు రైతులు వరుణుడు కరుణించకపోతాడా అని పత్తి పంటలు వేసుకున్నాం. బోర్లు ఉన్న వారే వరి నాట్లు వేసుకుంటున్నారు. వర్షంపై ఆధారపడి జీవించే మా లాంటి రైతుల పరిస్థితి కష్టంగా ఉంది. విఠల్, రైతు , రాంసానిపల్లి -
దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పైకి ఎగబాకింది. జూన్ మాసంలోఇది 1.62 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలోని 0.79 శాతంతో పోలిస్తే అంచనాలకు మించి మరింత పైకి దూసుకుపోయింది. ఆహార ద్రవ్యోల్బం 8.18శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టాన్ని తాకడం దీనికి కారణంగా అంచనావేస్తున్నారు. కూరగాయలకు, పళ్లు,తృణ ధాన్యాల ధరల్లో పెరడతంతో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేసిందన్నారు. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. గతేడాది జూన్లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంది. మరో వైపు ఇదే ఏడాది మే నెలలో 5.76 శాతంగా ఉంది. ఆగస్టు 2014లో వినియోగదారు(రిటైల్) ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదయిన తర్వాత మళ్లీ దాదాపు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టానికి, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాల వారీ చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.47 శాతం ఉండగా, జూన్లో 7.79 శాతానికి పెరిగింది. కూరగాయలకు సంబంధించిన ధరల్లో పెరుగుదల మే నెలలో 10.77 శాతం ఉండగా జూన్లో 14.74 శాతానికి పెరిగింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 31.57 శాతం ఉండగా జూన్ నెలకు 26.86 శాతానికి తగ్గింది. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 1.2 శాతం వృద్ది తో ఉత్సాహకరంగా నిలిచింది. -
టారో: 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) పనుల్లో తలమునకలుగా గడిపిన మీరు ఈ వారంలో తీరికగా, ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబంపై శ్రద్ధ తీసుకుంటారు. కెరీర్లో మార్పులు మిమ్మల్ని మరింతగా సేవాదృక్పథం వైపు మళ్లిస్తాయి. బాధ్యతలు స్వీకరించేందుకు సంసిద్ధులవుతారు. పెట్టుబడుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) భావోద్వేగాలు, అనుబంధాలు మీ ఆలోచనలను నియంత్రిస్తాయి. పని నుంచి మీ దృష్టిని మళ్లిస్తాయి. ఇతరుల సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పనిలో మరింత గాఢంగా నిమగ్నమవుతారు. డబ్బుకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు ఉంటాయి. రచన, బోధన వంటి ప్రాజెక్టులకు అనుకూలం లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) మీ పనులకు, మీ అంచనాలకు పొంతన కుదరకపోవచ్చు. ఇతరులను మెప్పించే ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. కొరుకుడు పడని మనుషులతో పేచీలు రావచ్చు. పని ఒత్తిడితో అలసట చెందుతారు. సృజనాత్మక, ఆధ్యాత్మిక మార్గాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వారమంతా ప్రశాంతంగా గడుపుతారు. తలపెట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితులు ఉంటాయి. పనుల్లో అనుకోని జాప్యాలు ఎదురవుతాయి. కొత్త భాగస్వాములు కలుసుకోవడం లేదా కొత్త వెంచర్లు ప్రారంభించడం జరగవచ్చు. సృజనాత్మకమైన వెంచర్లు సానుకూలంగా ఉంటాయి. లక్కీ కలర్: పసుపు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త ప్రదేశాలకు స్వేచ్ఛగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆశలు, ఆశయాలు, కలలు నెరవేరే తరుణం ఆసన్నమైంది. దూర ప్రయాణాలు చేస్తారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారావకాశాలు కలిసొస్తాయి. అయితే, ఈ వారంలో శక్తికి మించిన భారాలను తలకెత్తుకోకపోవడమే మంచిది. ఆత్మీయా నుబంధాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. లక్కీ కలర్: బూడిదరంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఓపికగా వ్యవహరించడం వల్ల కలిగే లాభాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రశాంతంగా, నిదానంగా వ్యవహరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కొన్ని ఉత్కంఠభరితమైన సంఘటనలను ఎదుర్కొంటారు. నిబద్ధత, లక్ష్యశుద్ధితో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. లక్కీ కలర్: నాచురంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడం ద్వారా శక్తులను కూడదీసుకుంటారు. పని ప్రణాళికలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పకపోవచ్చు. ఈ వారంలో కొత్త పనులు ప్రారంభించే ముందు పాతవి పూర్తి చేయడం క్షేమం. ఆత్రపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబించండి. పరిస్థితులన్నీ నెమ్మదిగా వాటంతట అవే మెరుగుపడతాయి. సొంత ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతారు. లక్కీ కలర్: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) సానుకూలమైన ఆలోచనలతో సత్ఫలితాలను సాధిస్తారు. నేల విడిచి సాము చేయకుండా నిలకడగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింత శ్రద్ధ చూపాల్సి వస్తుంది. మీరు పెట్టాలనుకున్న పెట్టుబడుల కోసం అదనపు నిధులు అవసరమవుతాయి. కెరీర్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. మీ బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తారు. లక్కీ కలర్: మట్టిరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) పనిలో నిరంతరం తలమునకలయ్యే మీరు ఈ వారంలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఒత్తిడికి దూరంగా సన్నిహితులతో కలసి విహారయాత్రకు వెళతారు. మిత్రుల్లో ఒకరి పట్ల డబ్బు విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. లక్కీ కలర్: చాక్లెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలు, సంబరాల్లో పాల్గొంటారు. ఒక ప్రత్యేకమైన వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంటారు. అయితే, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఇదివరకటి కంటే ఎక్కువగా అనురాగాన్ని ప్రదర్శిస్తారు. లక్కీ కలర్స్: పొద్దుతిరుగుడు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) కెరీర్లో పురోగతి బాగుంటుంది. కెరీర్ లక్ష్యాలు ఎలా ఉన్నా, కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, ఇంట్లో సుఖశాంతులు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో మీ ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటాయి. అన్ని రంగాల్లోనూ నీతి నిజాయతీలతో వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: బంగారు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఆర్థిక విజయాలు సాధిస్తారు. అనూహ్యమైన, ఆనందకరమైన సమాచారం ఒకటి అందుకుంటారు. సాహసమే ఊపిరి అన్నట్లుగా ధైర్యసాహసాలతో ముందంజ వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విధి విలాసాన్నీ, కర్మ ఫలితాన్ని ఒకేలా తీసుకుని స్థితప్రజ్ఞ చూపుతారు. ధన వస్తు లాభాల కంటే సాధించిన విజయమే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: తెలుపు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమ వుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు దక్కే సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. నలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు తథ్యం. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంత తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పలుకుబడి కలిగినవారు పరిచయమై సహాయపడతారు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భూవివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రాబడి అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులకు నిరుత్సాహం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టింది బంగారమే. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో: 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) వారం మొత్తం విజయవంతంగా సాగుతుంది. మహిళా వ్యాపారవేత్తలకు, సొంత వృత్తుల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అకస్మాత్తుగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ మైకంలో కలల్లో తేలిపోతారు. ఎలాంటి దిశానిర్దేశం లేకుండా సాగుతున్నామని భావిస్తారు. అయితే, గ్రహబలం వల్ల సురక్షితంగానే ఉంటారు. లక్కీ కలర్: పసుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) జీవితం సుసంపన్నంగా సాగుతుంది. గతానికి చెందిన గాయాలను మరచిపోయి ముందుకు సాగుతారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్థైర్యం కోల్పోయి కలవరపడవద్దు. మానసికంగా చికాకులు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మిత్రులతో మాట్లాడటం ద్వారా సాంత్వన పొందుతారు. వారి సలహాలు స్వీకరిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇంతవరకు మీరు చేసిన కఠోర పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. కెరీర్పరంగా సుస్థిరతను సాధిస్తారు. జీవితం సుస్థిరంగా, సురక్షితంగా, లాభదాయకంగా సాగుతుంది. లక్కీ కలర్: లేత ఊదా కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఇది గడ్డుకాలమే అని చెప్పవచ్చు. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. మీ పనితీరుపై పదే పదే ఎదురయ్యే ప్రశ్నలు చిరాకుపెడతాయి. అవివాహితులు వివాహానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనిశ్చితి నుంచి బయటపడటానికి చొరవ తీసుకుని ధైర్యంగా ముందంజ వేస్తారు. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వ్యాపార భాగస్వాముల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లక్ష్య సాధన కోసం కఠోరంగా పరిశ్రమిస్తారు. ఆశించిన విజయాలు సాధిస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభిస్తాయి. అదనపు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిన కాలం ఇది. ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గులాబి కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఈ వారంలో మీకు లక్ష్మీకటాక్షం పుష్కలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆశించిన లక్ష్యాలు సాధించడానికి మరింతగా శ్రమించాల్సి వస్తుంది. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అదృష్టం కలిసొస్తుంది. లక్కీ కలర్: కెంపు ఎరుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) అనుబంధాల విషయంలో ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే మంచిది. పరుగులు తీసే కాలంతో పోటీ పడి పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మొండితనం వల్ల మీ ఎదుగుదలకే అవరోధం కలుగుతుందని గ్రహించి ముందుకు సాగండి. త్వరలోనే అదృష్టం కలిసొచ్చే కాలం ప్రారంభం కానుంది. ఇంట్లోని పనికిరాని వస్తువులను వదుల్చుకుంటారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) అన్ని విషయాల్లోనూ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వారం మొత్తం సుసంపన్నంగా సాగుతుంది. గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. చిరకాలంగా పూర్తి చేయకుండా మరుగునపడ్డ పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: పొద్దుతిరుగుడు పసుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఈ వారంలో దుబారా ఖర్చులను అదుపు చేసుకుంటేనే మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి బడ్జెట్కు కట్టుబడి ఆచి తూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. శక్తివంచన లేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఒత్తిడులు ఎదురైనా, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వృత్తి, ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి లేదా మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. బదిలీలు జరగవచ్చు. ఈ వారంలో వివాదాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. కల్మషం లేని మీ వ్యక్తిత్వమే మీకు శ్రీరామరక్ష. లక్కీ కలర్: తెలుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. గొప్ప అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో చేరుతారు. కెరీర్ ప్రారంభదశలో ఉన్న ఉద్యోగులు తమ పనితీరుతో సత్ఫలితాలు సాధిస్తారు. అదనపు బాధ్యతలు స్వీకరించి నాయకత్వ పాత్ర పోషించే అవకాశం దొరుకుతుంది. పని ఒత్తిడి పెరిగినా, ఉత్సాహభరితంగా గడుపుతారు. లక్కీ కలర్: నాచురంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సరదా షికార్లు, షాపింగ్లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. చిరకాలంగా కొనాలనుకుంటున్న వాహనం, నగలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. లక్కీ కలర్: లేత గులాబి -
వారఫలాలు : 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. కళాకారులకు ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా, కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తీరతాయి. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ప్రగతి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు కలిసొస్తాయి. కళాకారులకు సన్మానాలు దక్కుతాయి. ఆకుపచ్చ, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కార్యజయం. కుటుంబసభ్యులతో వివాదాలు తీరుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత తీరుతాయి. కొత్తగా భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశాలు ఉన్నాయి.. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. గులాబి, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆశను విడనాడకండి. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుంది. పనులు వాటంతట అవే పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీగా వ్యవహరించండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీ నిబద్ధతే ఈ వారం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. లక్కీ కలర్స్: నీలం, ఊదా వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోగలుగుతారు. సన్నిహితుల్లో ఒకరు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. అయితే, మీరు ప్రేమించిన వారితో మీ బంధం బలపడుతుంది. అనుకోని సంఘటనలు జరిగినా, సీరియస్గా పట్టించుకోకండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. లక్కీ కలర్స్: ఆకుపచ్చ, పసుపు మిథునం (మే 21 - జూన్ 20) మొండిబకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. కొత్త ఇల్లు కట్టడం లేదా ఇంటి పునర్నిర్మాణం చేయడం వంటి పనులు చేపడతారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహానికి అనుకూలమైన కాలం. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అన్ని రంగాల్లోనూ పూర్తి అనుకూలమైన కాలం. మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి. కొత్త జీవితానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. గతాన్ని మరచి ముందుకు సాగుతారు. ఆటవిడుపుగా కాలం గడుపుతారు. చిన్న చిన్న సరదాలు తీర్చుకునేందుకు తగిన తీరిక దొరుకుతుంది. విద్యార్థులకు, పరిశోధకులకు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) చక్కని మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒప్పందాలకు అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి, మీదైన వివేకంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో సవాళ్లు ఎదురవుతాయి. సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నమవుతారు. లక్కీ కలర్స్: తెలుపు, మీగడరంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సంపద సమకూరుతుంది. ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులు జరుగుతాయి. మీరు కలలు కన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త అనుబంధం బలపడుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మరింత అవగాహన పెంచుకుంటారు. విషయాలను కూలంకషంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారంలో ధ్యానానికి సమయం కేటాయించడం మంచిది. చాలారోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల కోసం మరింత కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. లక్కీ కలర్స్: ఎరుపు, నలుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కుటుంబ సభ్యులతోను, బంధుమిత్రులతోను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సమస్యలకు పరిష్కారం మీ ఆలోచనల్లోనే స్ఫురిస్తుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఇంటా బయటా సమతుల్యతను సాధిస్తారు. ఖర్చులను అదుపు చేసుకుంటారు. మీ ప్రయత్నాలన్నింటిలోనూ కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయి. లక్కీ కలర్: గోధుమరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆత్మీయానుబంధాలలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చొరవ తీసుకుని ముందంజ వేస్తారు. డోలాయమానంగా ఉన్న పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. విశ్రాంతి కోసం విహార యాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితంలో మెరుగైన మార్పులు సంభవిస్తాయి. కోరుకున్నవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా పలుకుబడి గల వ్యక్తులను కలుసుకుంటారు.బంధువుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమాను బంధాలలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. ఆచితూచి ఒక అడుగు వెనక్కు వేసి, కొంత విరామం తీసుకుంటారు. మరీ అలసట చెందేంతగా పనులను నెత్తిన వేసుకోవద్దు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తీరికవేళల్లో ఆరుబయట గడపడం ద్వారా నూతనోత్సాహం పొందుతారు. ప్రేమలో పడతారు. తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీ జీవితంలో ముఖ్యమైన దశను విజయవంతంగా ముగిస్తారు. అర్థవంతమైన పనులు సాధించాలని తపన పడతారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల్లో స్ఫూర్తి కలిగిస్తారు. చెక్కుచెదరని మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలితాలను అందుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. శ్రమకు ఫలితం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు నూతనోత్సాహం. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నూత న పరిచయాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృథా శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు నిరాశ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందువినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాహనయోగం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. నూతన వస్తు, వస్త్రలాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటారు. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్య, ఉద్యోగయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రతిభను చాటుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు, విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు. గులాబి, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వచ్చే జూన్లోగా ఏపీకి వస్తే స్థానికులు
- ‘స్థానికత’ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ - తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 2, 2017 నాటికి - వెళ్లే వారికి ఆంధ్రప్రదేశ్ స్థానికత సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థిరపడి తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారి స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1974, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని గెజిట్లో పొందుపరిచింది. ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) ఉత్తర్వులు–1974ను సవరిస్తూ రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల (ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1974 ఉత్తర్వుల్లోని 4వ పేరాగ్రాఫ్లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. ఒక అభ్యర్థి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వస్తే వారిని ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్గా గుర్తిస్తారు. వారిని స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. విద్య నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. ఉద్యోగాలకు సంబంధించి..: ఆర్టికల్ 371–డీ లోని క్లాజ్(1), క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఉత్తర్వులు–1975ను సవరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ ఉత్తర్వులు–2016గా పరిగణిస్తారు. 1975లోని ఉత్తర్వుల్లో పేరా 7లో సబ్ పేరా 2 తర్వాత ‘సబ్ పేరా 1, 2లకు సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికైనా జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలోపు వలస వచ్చేవారిని ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి(లోకల్ క్యాండిడేట్)గా గుర్తిస్తారు. ఆ ప్రాంతంలో నివసించే స్థానికులతో సమానంగా పరిగణిస్తారు. ఉద్యోగాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేస్తుంది’ అని పొందుపరిచారు. కాగా, రాష్ట్రపతి జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్థానికత కోరుకునే వారు ఇప్పటికే అక్కడికి వెళ్లుంటే పరవాలేదు. లేదంటే మరో ఏడాదిలోపు వెళ్లాల్సి ఉంటుంది. -
వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) పుష్కలంగా సంపద కలిసొచ్చే కాలం. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. అంతా సానుకూలంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించినా, వాటిని మానుకోవద్దు. లక్కీ కలర్: బ్రౌన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భయాలను, భ్రమలను విడిచిపెట్టడం ద్వారా జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) శుభ సంకేతాలు అందుతాయి. వాటి ఆధారంగా ముందుకు సాగడం ద్వారా సంపదను, సంతోషాన్ని పొందగలరు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలరు. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. లక్కీ కలర్: బ్రౌన్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) జీవనశైలిపై మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కాస్త లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) అధ్యయనం కోసం మీరు వెచ్చించిన కాలం వృథా పోదు. పైగా సత్ఫలితాలను ఇస్తుంది. జ్ఞాన సంపదతోనే మీరు మీ కలలను నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు. ఈ వారంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కాలం ప్రవాహంలా ముందుకు సాగుతుంది. ఏదీ ప్రణాళికాబద్ధంగా సాగదు. ఏ రోజు పని ఆ రోజుకు ముగించుకుంటారు. సన్నిహితులతో వాదులాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నలుగురూ చేరే చోట సామాజిక, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరి ద్వారా సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి. లక్కీ కలర్: లేత గోధుమరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా కొత్త అవకాశాలు కలిసొస్తాయి. సృజనాత్మకమైన ఆలోచనలతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అన్ని రంగాల్లోనూ గొప్ప ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఘన విజయాలు సాధిస్తారు. అయితే, మీపై అసూయాపరుల చెడు దృష్టి సోకకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సానుకూలమైన మార్పులు సంతోషం కలిగిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కొత్త సవాళ్లకు సంసిద్ధంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కెరీర్లో మీకు అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే, గ్రహబలం వల్ల అవరోధాలను అధిగమిస్తారు. లక్కీ కలర్: నారింజ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) కఠిన పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తారు. మీ ఆరోగ్యం పట్ల ఒక మహిళ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ వారంలో అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిది. జీవిత భాగస్వామితో కలసి నిర్ధారించుకున్న ప్రణాళికల్లో మార్పులు చేయవద్దు. మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతనీలం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) పరస్పర విరుద్ధమైన అంశాలు మిమ్మల్ని చెరోవైపు లాగుతుంటాయి. వారం ప్రారంభంలో ఎటూ తేల్చుకోలేని డోలాయమాన స్థితిలో పడతారు. నెమ్మదిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారు. కొత్త ఆస్తుల కొనుగోలుకు పూర్తి సానుకూలమైన కాలం. కుటుంబంలోని పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: బూడిదరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. గట్టి ప్రయత్నంతో వాటన్నింటినీ అధిగమిస్తారు. ఒక సామాజిక కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. మీ పరిజ్ఞానంతో, అనుభవంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు నిస్తేజంగా అనిపిస్తాయి. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: నారింజ - ఇన్సియా,టారో అనలిస్ట్ -
వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. గతం నుంచి ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కారవుతాయి. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబి, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత పెరిగే అవకాశం. బంధువులు, మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులను విజయాలు వరిస్తాయి. లేత ఎరుపు, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావ లసిన సొమ్ము అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేజారిన విలువైన సామగ్రి తిరిగి దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. ఎరుపు, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు సర్దుబాటు కాగలవు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఒక పెండింగ్ వ్యవహారంలో అనుకూలత. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి. ఎరుపు, లేత గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో ప్రదక్షణలు చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కార్యజయం. ఆప్తులు,సన్నిహితులను కలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళాకారులకు సన్మానాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ, వాహనయోగాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలను కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) దేనికైనా వెనుకంజ వేయడానికి, తాత్సారం చేయడానికి ఇది తగిన సమయం కాదు. పాత బంధాలను వదులుకుంటారు. ఏకాంతమే మీ బాధలన్నింటినీ నయం చేస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన వెంటనే వాటి పరిష్కారానికి నడుం బిగించకండి. కొంత కాలం మౌనంగా గమనిస్తూ ఉంటే, అన్నీ సర్దుకుంటాయి. లక్కీ కలర్: ఊదా వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈ వారం మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అద్భుతమైన శక్తితో పనులు పూర్తి చేస్తారు. ఉరకలు వేసే ఉత్సాహంలోని హెచ్చుతగ్గులు మీ అనుభవంలోకి వస్తాయి. ఉత్సాహం ఉధృతి నిమ్మళించాక మీరు చాలా సహజంగా తయారవుతారు. ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ప్రకృతిలోని చెట్లలా, పిట్టల్లా మీ సహజ స్థితిని మనసారా అనుభూతిస్తారు. అత్యంత సహజంగా మిమ్మల్ని మీరు అభివ్యక్తీకరించుకుంటారు. లక్కీ కలర్: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లుగా ఉంటుంది.. ఈ వారంలో మీ ఊహలకు రెక్కలొస్తాయి. ఇంద్రియాల బాహ్యంతర సంచలనాలను, ఇంద్రియాల ద్వారా కాల చలనాన్ని స్పష్టంగా అనుభూతి చెందుతారు. మీ ఎదుట ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. అనుకున్న పనుల్లో చాలావరకు సునాయాసంగా నెరవేరుతాయి. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 - జూలై 22) కార్యాచరణలోకి దిగే ముందు ఎదురుచూపులోని తీపి బాధను మనసారా అనుభవించే పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని శంకలూ తొలగిపోయి, జీవితంలో అత్యవసరమైనదిగా మీరు భావించే అంశంపై వ్యామోహం పెరుగుతుంది. ప్రతి కొత్త అడుగులోనూ జీవన ప్రయాణం మరింత గాఢతరమవుతూ వస్తుంది.. ఎదురుచూపులు చూసే కాలం పెరుగుతుంది. లక్కీ కలర్: ముదురు ఊదా సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) రిస్కు తీసుకోవలసిన సమయం ఇది. ప్రేమను ఆస్వాదించాలంటే రిస్కు తీసుకోక తప్పదు. అయితే, సూర్యుడి ప్రభావం వల్ల అట్టే ఆత్రపడరు. మిమ్మల్ని ఉద్వేగభరితుల్ని చేసే అంశాల వైపు సాగించే ప్రయాణంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ వారంలో మీ జీవితం ప్రతిక్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సూర్యుడి ప్రభావం వల్ల మీ దారి ఎలాంటి అవరోధాలూ లేకుండా ఉంటుంది. చాలా సహజంగా, తాపీగా ముందుకు సాగుతారు. జీవితంలోని ప్రతి అంశం పరిణామం దిశగా, విస్తరణ దిశగా సంసిద్ధంగా ఉంటాయి. భయం, దిగులు విడనాడి, ధైర్యంగా ముందుకు సాగండి. . మీరు సేదదీరుతూ గడిపినా, ఈ వారంలో పనులు వాటంతట అవే ముందుకు సాగుతాయి. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మబ్బుల్లో తేలియాడే మీ ఆలోచనలను పరిస్థితులు నేలకు దించుతాయి. మిమ్మల్ని అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండేలా చేస్తాయి. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ధ్యానంలో గడపడం ద్వారా మీ జీవితాన్ని మరింత అందంగా మలచుకునేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: బూడిదరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆవేశంలో అదుపు తప్పే అలవాటు మీకు ఉండొచ్చు. అయితే, గ్రహబలం మిమ్మల్ని స్థిరంగా, బలోపేతంగా ఉంచుతుంది. మీరు తలచుకుంటే, ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మీ అదుపులోకి తెచ్చుకునే స్థితిలో ఉంటారు. అయితే, ఎలాంటి అపోహలకు లోనుకాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంతఃసంఘర్షణలో అలజడి రేపే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: తెలుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంతకాలం ఊపిరి సలపనివ్వకుండా ఒత్తిడికి గురిచేసిన ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులకు ఎదురీదుతున్న మీరు శక్తులను కూడదీసుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెడతారు. మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకుంటారు. సంతోషభరితంగా గడుపుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) మీరు సంతోషాన్ని, సంతృప్తిని వేటిలో పొందగలరో వాటన్నింటినీ ఆస్వాదించేందుకు అనువైన సమయం. మీ భుజస్కంధాలపై ఉన్న బాధ్యతల బరువు కొంతవరకు సడలుతుంది. ప్రతి దానికీ బాధ్యత తీసుకునే అలవాటును మానుకోండి. ఆనందానుభూతులు మిమ్మల్ని ఊరిస్తాయి. అయితే, వీటి కారణంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఏర్పడదని తెలుసుకుంటారు. లక్కీ కలర్: లేత ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తక్షణ పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా మీరు స్పందించే తీరును బట్టే మీకు లభించే ఆనందం ఆధారపడి ఉంటుంది. ఒడిదుడుకులు ఎదురైనా, పట్టువీడని ప్రయత్నంతో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. జీవితంలో వెలుగు చీకట్ల నడుమ సమతుల్యత సాధించాలనుకుంటారు. అలాగే స్త్రీ పురుషుల మధ్య సమన్వయం సాధించాలనుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. లక్కీ కలర్: బంగారురంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీలోని శక్తి సామర్థ్యాలను అనుభవంలోకి తెచ్చుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ అంతరాత్మ ప్రబోధానుసారం ముందుకు సాగండి. మీలో పెల్లుబికే వాంఛలను మీ మేధాశక్తితో అణచివేసే ప్రయత్నాలు చేయకండి. ఈ వారం మీ జీవితం మిరుమిట్లుగొలిపే వెలుగులతో ఆనందభరితంగా సాగుతుంది. లక్కీ కలర్: గోధుమరంగు - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) బంధువుల ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివచ్చే అవకాశం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమస్య పరిష్కారమవుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. లేతనీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సత్కారాలు, విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కుటుంబ సమస్యలు కొంత చికాకు పరిచినా సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలోనే పూర్తి కాగలవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. లేతపసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి ఆశాజనకమే. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, నిరుద్యోగులను విజయాలు వరిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు కొంత మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు ప్రయత్నాలు కొంత సఫలమవుతాయి. గులాబి, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనులలో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారుల యత్నాలు కలిసి వస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు వరించే సూచనలు. గులాబి, లేతఎరుపు రంగులు, దక్షిణదిశప్రయాణాలు సానుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
ఒకేసారి 22 ఉపగ్రహాలను పంపుతారట!
బెంగళూరు: ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. తాజాగా రీ-యూజబుల్ లాంచింగ్ వెహికల్(ఆర్ఎల్వీ) ప్రయోగంలో తొలి అడుగు విజయవంతంగా వేసిన ఇస్రో జూన్ నెలలో ఈ ప్రయోగానికి సన్నద్ధమవుతున్నట్లు చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ కేసీసీఐ) సమావేశంలో మాట్లాడిన ఆయన 22 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే భారత్ కు చెందినవి వివరించారు. జూన్ ఆఖరి వారంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్, కెనడా, ఇండోనేషియా, జర్మనీ తదితర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సీ34 ను వినియోగించనున్నట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ కే శివన్ వివరించారు. ఇస్రో 2008లో ఒకేసారి 10 శాటిలైట్లను కక్షలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం పూర్తయిన వెంటనే స్కాటరోమీటర్ ప్రయోగాన్ని, ఆ తర్వాత ఇన్ శాట్-3డీఆర్ లను ప్రయోగించనున్నట్లు కిరణ్ చెప్పారు. -
జూన్ లోనే "ఫెడ్" వడ్డన...!
ఫెడ్ రిజర్వు ఆసియన్ మార్కెట్లకి షాకినిచ్చింది. జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు సంకేతాలు విడుదల చేసింది. బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ బాగుంటే జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తంచేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దీంతో జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు మినిట్స్ నివేదించింది. అయితే వాల్ స్ట్రీట్ అంచనా వేసిన దానికంటే చాలా త్వరగానే జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతాదనే తెలుస్తోంది. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మినిస్ట్స్ విడుదల చేసిన ఈ రిపోర్టుతో మార్కెట్లో డాలర్ బలపడింది. ఫెడ్ 2శాతం టార్గెట్ కు ద్రవ్యోల్బణం పెరుగుతుందని పాలసీమేకర్స్ వ్యక్తంచేసినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ సంకేతాల ప్రభావం ఆసియన్ స్టాక్ మార్కెట్లపై చూపించింది. ఈ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. 2008 లో నెలకొన్న ఆర్థికమందగమనంతో ఫెడ్ రిజర్వు రేట్లను 0శాతానికి ఉంచింది. దాదాపు దశాబ్దం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ కొంత మెరుగుపడిందని గణాంకాలు చూపడంతో, డిసెంబర్ లో మొదటిసారి ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం-0.50 శాతం పెంచింది. -
జూలైలో... కబాలి?
పంచ్ డైలాగ్స్ రజనీకాంత్ చెబితే ఆ కిక్కే వేరప్పా! ఆయన చెప్పిన ఆ తరహా సంభాషణల్లో ‘లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా’ ఒకటి. ఇప్పుడా డైలాగ్ని గుర్తు చేయడానికి కారణం ‘కబాలి’ విడుదల కాస్తంత వెనక్కి వెళ్ళడమే! రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్లో తెర పైకి వస్తుందన్నారు. కాగా, రిలీజ్ మరో నెల వాయిదా పడిందని సమాచారం. జూలై 1న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. నిర్మాణానంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం పట్టడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. రజనీ గ్యాంగ్స్టర్గా కనిపించనున్న ఈ చిత్రంలో తైవానీస్ నటుడు విన్స్టన్ చౌ విలన్గా నటించారు. ఇందులో తాను చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఆయన చెన్నై చేరుకున్నారు. ఇప్పటికే రజనీ లుక్ ఒక చర్చనీయాంశమైతే, ఇటీవల విడుదలైన టీజర్ కోట్లల్లో వ్యూస్ దక్కించుకొని, చిత్రంపై భారీ అంచనాలు పెంచింది. రజనీ అభిమానులు, ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా ‘కబాలి’ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందుతున్న రోబో సీక్వెల్ ‘2.0’లో విలన్గా నటిస్తున్న అక్షయ్కుమార్ అయితే, ఈ టీజర్ చూసి ముగ్ధులైపోయారు. విడుదలైన మొదటి రోజు, మొదటి షోనే ‘కబాలి‘ని చూడాలనుకుంటున్నట్లు చెప్పేశారు. టీజర్ అంత ఆసక్తికరంగా అనిపించిందన్నారు. మొత్తానికి, తాజా ‘కబాలి’ కూడా గతంలో రజనీకాంత్ గ్యాంగ్స్టర్గా నటించిన ‘బాషా’ స్థాయిలోనో, అంతకు మించో విజయవంతమవుతుందని అంచనాలు ఉన్నాయి. -
జూన్ లో జైలుకు వెళ్లనున్న క్రీడాకారుడు
ప్రిటోరియా: తన ప్రియురాలు, మోడల్ అయిన రేవా స్టీన్ కాంప్ ను హత్య చేసిన కేసులో సౌతాఫ్రికన్ ఒలింపిక్ క్రీడాకారుడు ఆస్కార్ పిస్టోరియస్ జూన్ లో జైలుకు వెళ్లనున్నాడు. ప్రియురాలి హత్య కేసులో ఈ బ్లేడ్ రన్నర్ కు న్యాయస్థానం గతంలోనే ఐదేళ్ల శిక్షను విధించింది. అయితే ఒక ఏడాది జైలులో గడిపిన పిస్టోరియన్ ఈ హత్యకు తాను సిగ్గు పడుతున్నానని, శిక్ష తగ్గించాలని కోరుతూ గతేడాది డిసెంబర్ లో సౌతాఫ్రికా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి.. పిస్టోరియస్ జూన్ నుంచి కొత్తగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. కోర్టు శిక్ష ఖరారుకు ముందు వరకు ఆయన గృహనిర్భందంలో ఉన్నారు. -
జూన్లోగా 15 వేల టీచర్ పోస్టుల భర్తీ
సంగెం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు కషి చేయాలని సూచించారు. వరంగల్ జిల్లా సంగెంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం, గవిచర్లలోని మోడల్ స్కూల్, హాస్టల్ భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే జూన్లోగా రాష్ట్రంలో 15 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. విద్యారంగానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, కేజీ టు పీజీ విద్యను అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నారని కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మించిన 192 మోడల్ స్కూళ్లల్లో 190 పనిచేస్తున్నాయని, ఒక్కో స్కూల్కు రూ.3 కోట్లు, హస్టళ్లకు 1.28 కోట్లు వెచ్చించామని తెలిపారు. మోడల్ స్కూళ్ల ప్రహరీలకు రూ.50 కోట్లు, కేజీబీవీల ప్రహరీలకు రూ. 40 కోట్లు మంజూరు చేశామన్నారు. కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ అమలు చేస్తామని కడియం హామీ ఇచ్చారు. -
జూన్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్
ఆదిలాబాద్ : ఉద్యోగుల విభజనలో కమల్నాథన్ కమిటీ జాప్యం చేయడంతోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ఆలస్యం అవుతోందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కమల్నాథన్ కమిటీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను తెలుపకపోవడం, ఉద్యోగుల విభజన చేయకపోవడంతో నియామకాలు ఆలస్యమవుతున్నాయన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత రెండు వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రూప్-1, గ్రూప్-4 లతో పాటు ఇతర ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం లక్షా 7 వేల వరకు ఖాళీలు ఉన్నాయన్నారు. రాబోయే రెండేళ్లలో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతారన్నారు. దీంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుపుతామని తెలిపారు. గత ఏపీపీఎస్సీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, తాము మాత్రం పారదర్శకంగా నియామకాలు చేపడుతామని వివరించారు. -
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
-
జూన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక
హైదరాబాద్లోని బొల్లారంలో విడిది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్లో వేసవి విడిది చేయనున్నారు. జూన్ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వారం నుంచి పది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్లో శీతాకాల విడిదికి రావాల్సి ఉండగా... అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది. గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతి ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. దీంతోపాటు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలను కలిసేందుకు ఆయన కొంతసమయం వెచ్చిస్తారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఒక బృందం విడిది ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిసింది. మే నెలాఖరున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ను విడుదల చేసే అవకాశముంది. -
జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!
-
జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!
మార్చిలోనే కొత్త తరగతులు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్ నుంచి) రాష్ట్రంలోని పాఠశాలల పని వేళలు మారనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్యా విషయక క్యాలెండర్పై చర్చించేందుకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇతర అధికారులు.. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం ప్రధాన సంఘాలతో, మధ్యాహ్నం ఇతర సంఘాలతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ పాఠశాలల వేళలను ఉదయం 9:30 గంటల నుంచి కొనసాగించేలా మార్పు చేయాలని కోరాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ కూడా పరిశీలిస్తోందని ఈ సందర్భంగా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. దీంతో పాఠశాలల వేళలను మార్పు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగించేందుకు ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే సమరేటివ్ 1, 2, 3 (త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక) పరీక్షల విధానం కాకుండా రెండు సమరేటివ్ పరీక్షలనే నిర్వహించాలని కోరాయి. ఈ సమావేశంలో ప్రధాన సంఘాలతో ఉదయం, మిగతా సంఘాలతో సాయంత్రం సమావేశం నిర్వహించడంపై ఇతర సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్తోపాటు అదనపు డెరైక్టర్ గోపాల్రెడ్డి, రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్, టీఎస్-యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీటీయూ, పండిత పరిషత్తు, పీఆర్టీయూ-తెలంగాణ, జీటీఏ, బీటీఏ, టీఎస్టీఎఫ్, టీటీఎఫ్, హెచ్ఎంల సంఘం నేతలు పాల్గొన్నారు. పాఠశాలల విలీనంపై భిన్నాభిప్రాయాలు ‘‘ఒక నివాస ప్రాంతంలో లేదా ఒకే స్కూల్ ఆవరణలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోకి విలీనం చేస్తారు. ఇది చేసేప్పుడు ఎన్రోల్మెంట్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకున ్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపడతారు. వారిలో ఒక టీచర్ పూర్తిగా తెలుగు/ఉర్దూ బోధనను, మరో టీచర్ ఇంగ్లిష్, ఇంకో టీచర్ గణితం ఇతర అంశాలను బోధించాలి’’ అని పాఠశాల విద్యా విషయక క్యాలెండర్లో పొందుపరిచిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నత పాఠశాల లేకపోతే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు. వాటిలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూళ్లను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మరో స్కూల్లో విలీనం చేయాలా? కొనసాగించాలా? అన్న దానిపై సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు ఉండాలన్న నిబంధనను సమర్థించారు. ఏకాభిప్రాయం కుదిరిన అంశాలు.. టెన్త్ పరీక్షలను ఇంటర్ పరీక్షల్లాగే మార్చి 15కి పూర్తి చేయాలి. మిగతా తరగతుల వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలి. కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ఈ పాఠశాలల తరహాలో వేసవి సెలవులకు ముందే పై తరగతికి వెళ్లే విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాల బోధనను మార్చి 16 నుంచి ప్రారంభించాలి. పాఠ్య పుస్తకాలను మార్చి మొదటి వారం నాటికే విద్యార్థులకు అందించాలి. అందుకోసం పక్కాగా ముద్రణ చేపట్టాలి. స్కూళ్లను ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగించాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలి. ఉపాధ్యాయులకు నిష్ణాతులైన వారితో నాణ్యమైన శిక్షణను అందించాలి. -
జూన్ నుంచి చెరువుల అనుసంధానం
గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం : జిల్లాలో జూన్ నుంచి చెరువుల అనుసంధానం పథకాన్ని ప్రారంభించనున్నట్టు కలెక్టర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురాలలో విలేకరులతో మాట్లాడారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా జిల్లాలో 1500 చెరువులను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. 27 పెద్ద చెరువులను పొక్లయినర్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో చైన్ఆఫ్ ట్యాంకు(చెరువుల అనుసంధానం) పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద గ్రామాల్లో ఉన్న ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు మళ్లిస్తూ పంటపొలాలకు నీరును అందించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఒక మండలంలోని సుమారు ఐదు చెరువులను కలిపి చైన్ ఆఫ్ ట్యాంకు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. జిల్లాకు లక్షా 36వేల మరుగుదొడ్లు మంజూరయ్యాయని తెలిపారు. గుమ్మలక్ష్మీపురం వైటీసీలో మరి కొద్ది రోజుల్లో గిరిజన, గిరిజనేతర నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయక్ తెలిపారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఇప్పటికి ఎటువంటి తాగునీటి సమస్య లేదన్నారు. అయినా జిల్లాలో ఉన్న 18వేల బోర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని, ఎక్కడైనా నీటి ఎద్దడి ఏర్పడితే, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. పార్వతీపురం సబ్ప్లాన్లో నీటి ఎద్దడి లేకుండా ఐటీడీఏ పీఓ చర్యలు చేపట్టారన్నారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు ఐటీడీఏ కార్యాలయంలో మానటరింగ్సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐఏపీ నిధులతో వైసీటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పది యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. జెడ్పీకి 13వ ఆర్థిక సంఘ నిధులు రూ. 10కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే పీడీఎస్ బియ్యం రీసైక్లిన్పై చర్యలు చేపట్టామన్నారు. తోటపల్లి నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందిస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. నాగావ ళిలో కలుషితనీరు ప్రవహిస్తోందని, దీనికి ఒడిశాకు చెందిన కొన్ని పరిశ్రమలు కారణమని, ఆ నీటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించి రాయగడ కలెక్టర్తో మాట్లాడతామన్నారు. ఉపాధికి సంబంధించి బిల్లులు మంజూరయ్యాయన్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి స్థలం, నిధులు, అంబులెన్స్లు సమకూరుస్తామన్నారు. అలాగే పీహెచ్సీలు తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి లఠ్కర్, ఆర్డీఓ రోణంకి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ ముగుస్తున్నా కానరాని వానచుక్క.