
సాక్షి, ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సౌత్ ఇండియన్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. కెవేసీ నిబంధనలు, ఆస్తుల వర్గీకరణ తదితర అంశాల్లో ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించిందన్న ఆరోపణలపై 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆస్తుల వర్గీకరణ, కెవైసీ నిబంధనల ఉల్లంఘన, ట్రెజరీ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్ఏసీ, కేవైసీ, ట్రెజరీ ఫంక్షన్కు సంబంధించిన సూత్రాలను సౌత్ ఇండియన్ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో, సెక్షన్ 47ఏ1సీ, సెక్షన్ 46ఏఐ కింద ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment