
ప్రభుత్వానికి సింగరేణి రూ.132 కోట్ల డివిడెండ్
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ సంస్థ (ఎస్సీసీఎల్) తెలంగాణా ప్రభుత్వానికి రూ.132 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా ఎస్సీసీఎల్ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారని సింగరేణి కాలరీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.418 కోట్లు నికర లాభాన్ని అర్జించిందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తిలో రెండంకెల వృద్ధిని సాధించటానికి తగిన చర్యల్ని తీసుకుంటామని, పవర్ ప్లాంటు కార్యకలాపాలను షెడ్యూల్ ప్రకారం ప్రారంభించటానికి కృషి చేస్తానని వివరించారు.