రిలయన్స్‌,ఎన్‌హెచ్‌పీసీలపై ఫోకస్‌ | Stocks in the news today | Sakshi

రిలయన్స్‌,ఎన్‌హెచ్‌పీసీలపై ఫోకస్‌

May 29 2020 9:58 AM | Updated on May 29 2020 10:09 AM

Stocks in the news today - Sakshi

క్యూ4 ఫలితాలు: 3ఎం ఇండియా, దిలిప్‌ బుల్డికాన్‌, ఈక్విటాస్‌, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌, జాగరన్‌ ప్రకాశన్‌, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, కెఈసీ, లెమన్‌ ట్రీ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌సీఎఫ్‌, వీ-మార్ట్‌, వోల్టాస్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: అబుదాబికి రాష్ట్ర ఫండ్‌ ముబదాల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: రూ.377 కోట్ల రుణాన్ని చెల్లించకపోడంతో విపుల్‌ లిమిటెడ్‌  యాజమాన్యంలోని గుర్‌గావ్‌ఆధారిత ప్రాజెక్ట్‌లో అమ్ముడు పోని 138 యూనిట్లు, 19 ఎకరాల స్థలాన్ని పీఎన్‌బీ హౌసింగ్‌​ ఫైనాన్స్‌ స్వాధీనం చేసుకుంది.

కర్ణాటక బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:కేంద్ర బ్యాంక్‌ ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ నిబంధనలు పాటించనందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌​ ఇండియా(ఆర్బీఐ).. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. 

ఫార్మా ప్లేయర్స్‌: పారాసిటమాల్‌ సంబంధించిన ఏపీఐలు(యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇంగ్రీడియంట్స్‌) ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది.

క్యాడిలా హెల్త్‌కేర్‌:  హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీ ఫెసిలిటీ సెంటర్‌కు అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక‌్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌) వచ్చిందని  హెల్త్‌కేర్‌ హెల్త్‌కేర్‌ వెల్లడించింది.

ఎన్‌హెచ్‌పీసీ: సోలార్‌ పవర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎన్‌హెచ్‌పీసీ వెల్లడించింది.

హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా: మార్చితో ముగిసిన క్యూ4లో నికర లాభం 8.85 శాతం పెరిగి రూ.66.29 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.60.90 కోట్లుగా ఉందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా తెలిపింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement