
సాక్షి, న్యూఢిల్లీ : చైనా దిగ్గజ కంపెనీ షావోమి నోట్ సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు మరో స్మార్ట్టీవీని కూడా లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత 32 అంగుళాల స్మార్ట్ టీవీని గురువారం ఆవిష్కరించింది. ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది. మార్చి 7వ తేదీనినుంచి మై హోం, ఎంఐ.కాం, ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని షావోమి వెల్లడించింది.
ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో ఫీచర్లు
32 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్
లేటెస్ట్ అమ్లోజిక్ 64బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్
గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్
Here’s the all-new #MiLEDTV4APRO32 for you. At just ₹12,999. Goes on sale on https://t.co/cwYEXeds6Y, @flipkart and Mi Home on 7th March at 12 noon. pic.twitter.com/uEDWq0A7Uf
— Redmi India (@RedmiIndia) February 28, 2019