
సాక్షి, హైదరాబాద్ : మార్కెట్కు వెళ్లి వస్తానని చెప్పి ఓ 19 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(19) తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి బయలు దేరింది. సాయంత్రం అయినా యువతి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment