woman missing
-
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు. -
అమ్మా.. నేను సూర్యతో వెళ్లిపోతున్నా!
రాప్తాడు రూరల్: ‘అమ్మా నా కోసం ఎక్కడా వెతకొద్దు. ప్రేమించిన వ్యక్తి వద్దకు వెళ్తున్నా’ అంటూ లేఖ రాసి ఓ యువతి అదృశ్యమైన ఘటన గురువారం అనంతపురం రూరల్ మండలం కురుగుంటలో వెలుగు చూసింది. అనంతపురం రూరల్ పోలీసులు తెలిపిన మేరకు... కురుగుంటలో నివాసముంటున్న ముస్లిం దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాడు. కుమారుడు బైకు మెకానిక్గా పని చేస్తుండగా, 22 ఏళ్ల వయసున్న కుమార్తె నగరంలోని ఓ షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తూ వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో తల్లి ఇంట్లో పరిశీలించగా ఓ లేఖ లభించింది. అందులో ‘అమ్మా... నేను సూర్య అనే యువకుడిని ప్రేమించా. ఆయనతోనే వెళ్తున్నా. మీరు నా కోసం వెతకొద్దు. విజయవాడ వెళ్తున్నా. వాళ్ల అమ్మానాన్న కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇంట్లో బంగారు, డబ్బులేవీ తీసుకెళ్లడం లేదు. అన్నా... అమ్మను బాగా చూసుకో’ అంటూ రాసి ఉంది. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న అనంతపురం రూరల్ పోలీసులు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.యువతి అదృశ్యంకదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్లో నివాసముంటున్న యువతి కనిపించడం లేదు. ఈ మేరకు తల్లి ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. బంధువుల అబ్బాయితో ఈ నెల 18న ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ఫంక్షన్ హాల్లో ఆమెకు వివాహ నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కదిరికి చెందిన మునివర్ధన్ (గజ), చిన్నాన్న పవన్ కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. -
Hyderabad: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
వెంగళరావునగర్: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు నామవరపు జ్యోత్స్న శ్రీ (17) భద్రాచలంలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది. అనంతరం ఆమెను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ తల్లి రజిని భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్నశ్రీ తనకు ఇంగ్లిష్ పాఠాలు అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వచి్చంది. భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్నశ్రీ తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. నాలుగురోజులుగా ఆ యువతి అమీర్పేటలోని ఓ షోరూంలో పని చేస్తుంది. ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో షాపు ఓనర్ నాగమణి యువతి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్లింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్ చేసి అటు చదువుకోకపోగా పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ మందలించింది. దాంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేకని సమయంలో ఆ యువతి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచి్చన స్వరూప తలుపు గడియకూడా పెట్టకుండా ఉండటంతో లోపలకు వెళ్లింది. స్వరూపకు జ్యోత్న్స ఉరేసుకుని ఉండటం చూసి 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి పిన్ని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మా కూతురిని వెతికిపెట్టండి
గోనెగండ్ల: తమ కూతురు కనిపించకుండా పోయి 56 రోజులైనా జాడ లేదని, దయచేసి వెతికిపెట్టాలని మండల కేంద్రానికి చెందిన రూపేంద్రరెడ్డి, రామేశ్వరమ్మ దంపతులు పోలీసులను వేడుకున్నారు. ఏప్రిల్ 21న కూతురు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టకపోవడంతో దంపతులు శనివారం స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే తమ కూతురిని బేతంచర్ల మండలం శంకలాపురం గ్రామానికి చెందిన మధు అనే యువకుడు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు. ఇదే విషయాన్ని ఏప్రిల్ 21న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకుని, పోలీసులు చేతులు దులిపేసుకున్నారన్నారు. ఇప్పటికై నా పోలీసులు తమ కూతురి జాడ కనిపెట్టి, తమకు దక్కేలా చేయాలని, లేనియెడలా తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు తెలిపారు. ఇదే విషయమై సీఐ రామకృష్ణయ్యను ఆరా తీయగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. బా లిక, నిందితుడి సెల్ఫోన్లు కూడా ట్రెస్ కావడం లేదన్నారు.అయినా త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. -
గోవా: మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
పనాజీ: గోవాలో అదృశ్యం అయిన నేపాల్లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్ కుమార్తె ఆర్తీ హామల్ ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించింది. ఆర్తీ హామల్ రెండు రోజుల క్రితం గోవాలో అదృశ్యమైన విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అదృశ్య ఘటనపై కేసు నమోదు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులకు ఆమె ఆచూకీ లభించింది. ఆమె నార్త్ గోవాలోని మాండ్రేమ్లో ఓ హెటల్లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో మరో ఇద్దరు మహిళలతో ఆమెను ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు. ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియా పేర్కొంది. ఆర్తీ స్నేహితురాలు ఆమె తండ్రికి అదృశ్యం విషయం తెలియజేయగా ఆయన సోషల్ మీడియా వేదికగా తమ కూతురి ఆచూకీ తెలియజేయాలని కోరారు. ‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. గోవా ఉండేవారు నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. అదేవిధంగా తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయల్దేరారని తెలిపారు. తన కూతురును వెతకటంలో సాయం అందించాలని ఆచూకీ తెలియటంతో తమను సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్లను జత చేశారు. -
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్తో కలిసి మధురానగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్వాక్కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి
హైదరాబాద్: స్టేట్హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్హోం ఇన్చార్జి ముంతాజ్బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తరచూ ఫోన్లో మాట్లాడుతున్న భార్య..
శివ్వంపేట(నర్సాపూర్): భర్త ప్రశ్నించడంతో వివాహిత అదృశ్యమైన ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతులబోగుడ గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్కు 2013లో తూప్రాన్ మండలం యావపూర్ గ్రామానికి చెందిన కాగిత అనురాధతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అనురాధ సోమవారం ఫోన్లో మాట్లాడుతుండగా భర్త ప్రశ్నించడంతో గొడవపడింది. చిట్టి డబ్బులు కట్టడానికని ఆమె మంగళవారం ఇంట్లోంచి వెళ్లి సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బీరువాలో ఉన్న రూ.50 వేలు కనిపించలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియా వెళ్తున్నా.. నా కోసం వెతకొద్దు
హైదరాబాద్: ఆస్ట్రేలియా వెళ్తున్నట్లు.. తన కోసం ఎవరూ వెతకవద్దంటూ వాట్సాప్లో మెసేజ్ పెట్టి వైద్యురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న మహియా తరన్నం (24) ఈ నెల 3న ఎప్పటిలాగే ఉదయం సబ్జా కాలనీలోని తన నివాసం నుంచి విధులకు వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులకు చెప్పింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి మహ్మద్ గఫార్కు వాట్సాప్ కాల్ చేసి తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని తన కోసం వెతకవద్దంటూ చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో గాలించారు. గత 8 నెలలుగా ఆమెతో పాటు వైద్యుడిగా పని చేస్తున్న నదీమ్తో.. పరిచయం ఏర్పడిందని.. బిహార్కు చెందిన అతను మాయమాటలు చెప్పి మహియా తరన్నంను తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హుస్సేన్సాగర్ నాలాలో మహిళ గల్లంతు?
హైదరాబాద్: కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు నాలాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. వందమంది సిబ్బంది నాలుగు బృందాలుగా నాలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కోసం డ్రోన్లనూ వినియోగించారు. సోమవారం కవాడిగూడ నుంచి గోల్నాక వరకు దాదాపు 10 కి.మీ.ల మేర గాలింపు జరిపినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
ప్రియుడి గొడవ.. ‘అమ్మా.. అందరి ముందు పరువు పోయింది’ అంటూ
సాక్షి, మేడ్చల్: అమ్మా.. అందరి ముందు నా పరువు పోయిందని లేఖ రాసి ఇంట్లో పెట్టిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి సుతారిగూడలో చోటు చేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25) రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజులుగా అతడితో మాట్లాడటం మానేసింది. ఈ నెల 9న రాత్రి సమయంలో ప్రేమించిన యువకుడు మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోయాడు. దీంతో మరుసటి రోజు 10వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా శైలజ వెళ్లిపోయింది. ఇంట్లో లెటర్ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం వెతకకండి’ అంటూ శైలజ లేఖలో పేర్కొంది. దీంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ రావడంతో బయటకు వెళ్లి.. ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండం వెంకటేశ్వరి(22) కొంత కాలంగా ఓ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమెకు ఫోన్ వచ్చింది. దీంతో ఫొన్ మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబికులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్తో డ్యాన్స్లు -
జ్యూస్ కోసం బయటకు.. మధుమిత మిస్సింగ్! అతనిపైనే అనుమానం
హైదరాబాద్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వర్లు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన తపన్ కుమార్ గిరి, మధుమిత డగారా(22) ఏడాది క్రితం జల్పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. స్థానికంగా ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ కంపెనీలో మధుమిత పని చేస్తోంది. 10వ తేదీన అనారోగ్యంగా ఉందని ఇంటి వద్దే ఉన్న మధుమిత.. మధ్యాహ్నం సమయంలో జ్యూస్ తీసుకొస్తానని బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమెతో పాటు కంపెనీలో పనిచేసే బినేష్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గానీ 87126 62367 నంబర్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
యువతి అదృశ్యం
హుజూర్నగర్: పట్టణంలోని దద్దనాలచెరువు కాలనీకి చెందిన యువతి అదృశ్యమైనట్లు శుక్రవారం ఫిర్యాదు అందిందని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దద్దనాలచెరువు కాలనీకి చెందిన షేక్ రిహానా, ఖాజామియా దంపతులకు కుమారుడు, కుమార్తె షేక్ షఫియా సంతానం. షఫియా ఇంటి వద్దనే ఉంటోంది. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షఫియా బ్యాగులో బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా షఫియా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఆమె తండ్రి ఖాజామియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫిలింనగర్లో ఇద్దరు యువతుల అదృశ్యం... ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
నగరం పరిధిలో ఇటీవల అదృశ్యం కేసులు ఎక్కువ అవుతున్నాయి. సిటీ నలుమూలలా ఏదో ఒక చోట బాలిక లేదా బాలుడు లేదా యువతీయువకులు అదృశ్యమయ్యారని ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వీరంతా ఏమయ్యారో తెలియక బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఇలా నాలుగు పోలీస్ స్టేషన్లలో అదృశ్యం ఫిర్యాదులు అందాయి. – సాక్షి, నెట్వర్క్ డిగ్రీ విద్యార్ధిని అదృశ్యం నల్లకుంట: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రమాదేవి తెలిపిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ తుమ్మ యాదగిరి కుమార్తె శ్రావ్య (21)కు ఇటీవలే వివాహమైంది. కాగా 2021లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతూ నల్లకుంట శంకరమఠం సమీపంలోని హాస్టల్లో ఉంటుంది. ఇటీవల ఇంటికి వెళ్లిన ఆ యువతి ఈ నెల 15న హాస్టల్కు వచ్చింది. ఈ క్రమంలో 17న సాయంత్రం తండ్రి యాదగిరి కుమార్తెను చూడడానికి హైదరాబాద్కు వచ్చాడు. హాస్టల్ నిర్వాహకులను విచారించగా శ్రావ్య ఈ నెల 16న సాయంత్రం 8 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారిని విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన యాదగిరి తమ కుమార్తె కనిపించడంలేదంటూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్లో ఇద్దరు పిల్లలు.. మేడ్చల్ రూరల్: నిత్యం ఇంట్లో ఉండే అన్నా చెల్లెలు ఇద్దరు తండ్రి పనికి వెళ్లొచ్చేసరికి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన బ్రహ్మదేశ్ పాశ్వాన్–బబ్లీదేవి దంపతులు మేడ్చల్ పట్టణానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు అజయ్కుమార్ (7), ప్రతిభ (5)లు సంతానం. కాగా మూడేళ్ల క్రితం దంపతులు విడాకులు తీసుకోవడంతో పిల్లలు తండ్రి వద్ద ఉంటున్నారు. నిత్యం పిల్లలకు భోజనం తినిపించి ఇంటి వద్దే ఉంచి తండ్రి సెంట్రింగ్ పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన రోజులాగే ఉదయం 7 గంటలకు పనికి వెళ్లిన బ్రహ్మదేవ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చేసరికి పిల్లలు అజయ్కుమార్, ప్రతిభ ఇంట్లో కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనుమడిని చూసేందుకొచ్చిన వృద్ధురాలు.. వెంగళరావునగర్: నగరంలో నివసిస్తున్న మనుమడిని చూడటానికి వచ్చిన ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఒంగోలులో నివసించే డి.అచ్చమ్మ (70) వెంగళరావునగర్ డివిజన్ వీడియోగల్లీలో నివసించే మనుమడి ఇంటికి మూడు రోజుల కిందట వచ్చింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అచ్చమ్మ తిరిగి రాలేదు. మనుమడు వెంకటేశ్వర్లు బంధుమిత్రులకు ఫోన్ల ద్వారా సమాచారం తెలియజేసి విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం మధురానగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అచ్చమ్మ నలుపు రంగు ఉండి. దాదాపు 4.8 అడుగులు ఎత్తు ఉంటుందని, కొద్దిగా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనుమడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫిలింనగర్లో యువతి... ఫిలింనగర్: అనుమానాదస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన అంకిత(19) డెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నది. ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. తండ్రి ఊషన్న అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడంలేదు అని ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. -
యువతి అదృశ్యం
మెదక్: యువతి అదృశమైన సంఘటన మండల పరిధి చెండిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నర్మద గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తెల్లవారుజామున గమనించిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం యువతి తండ్రి భూపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్నగర్ డివిజన్ సూర్యానగర్లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు -
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్నగర్లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భర్తతో విడాకులు.. ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి..
సీతమ్మధార(విశాఖపట్నం): ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో.. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకానగర్, మొదటి లేన్లోని పవన్ టవర్స్లో వాచ్మన్గా పని చేస్తున్న సింహాచలం నాయుడు కుమార్తె రామలక్ష్మి వివాహిత. భర్తతో విడిపోవడంతో తండ్రి వద్ద ఉంటూ, చుట్టుపక్కల ఇంటి పనులకు వెళ్లి వస్తుంటుంది. ఈ నెల ఐదో తేదీన పనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కుమార్తె రాకపోవడంతో, బంధువులు, స్నేహితులను వాకబు చేశారు. వారు రాలేదని తెలపడంతో బుధవారం ద్వారకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని హెచ్సీ కె.అప్పలరాజుకు సూచించారు. -
మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి
సాక్షి, రంగారెడ్డి: ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదంండ్రులకు సందేశం పంపిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాంకాలనీకి చెందిన తాడాల శ్రీనివాస్రావు కుమార్తె ప్రత్యూష(24) మెడిసిన్ కోర్సు చదివి రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటుంది. ఈనెల 18న ఉదయం 10గంటలకు మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ కాలేజీలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లిన ప్రత్యూష 19వ తేదీన ఉదయం 8గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజి పెట్టింది. ఆందోళనకు గురైన తల్లి గంగాభవానీ పహాడీషరీఫ్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీతో ఉండను నన్ను వెతకొద్దు.. వెతికితే చస్తా..!
సాక్షి, హయత్నగర్ (హైదరాబాద్): నన్ను వెతకకండి.. ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూర్కు చెందిన తిరందాస్ ప్రసాద్కు ఆరేళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న తగాదాల కారణంగా రెండు వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం నాగోల్లోని తన అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉండను.. నన్ను వెతక వద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు) -
Hyderabad: వంశీతో వెళ్లిపోతున్నానని రాసి పెట్టి..యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్కు చెందిన గోకల బాల్రాజ్గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్ఫోన్ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది. కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్ఫోన్కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్ -
చదువుకునే సమయంలో రాజేష్తో ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్లోని సాయినగర్కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు. అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు.. -
ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి అదే నా చివరి కోరిక..
తూర్పు గోదావరి: మండలంలోని నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజుల క్రితం అదృశ్యమైందని, కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని కోరంగి ఎస్సై టి.శివకుమార్ బుధవారం తెలిపారు. ఎం.ఎస్.శర్మ దంపతుల 22 ఏళ్ల కుమార్తె ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఇంటినుంచి వెళుతూ యువతి రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వేధింపుల వల్ల మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో పేర్కొంది. యానాం గోదావరిలోగాని, కోరంగి గోదావరిలో గాని దూకి తాను చనిపోతానని, తన కోసం గాలించవద్దని తెలిపింది. దీంతో యువతి తండ్రి ఆందోళన చెందుతూ యానాం, కోరంగి గోదావరి ప్రాంతాలలో తీవ్రంగా గాలించి, ఆచూకీ లభించకపోవడంతో కోరంగి పోలీసులకు 13 తేదీన ఫిర్యాదు చేశారు. కలకలం రేపుతున్న వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో ఒక యువకుడు ఆ యువతి ఫొటోలను తగులబెడుతూ, ఆమె చనిపోకపోతే నేనే చంపేస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ యువకుడు ఎవరు, సూసైడ్ నోట్లో యువతి పేర్కొన్న ఇద్దరి పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్నోట్లో గోదావరిలో దూకి చనిపోతానని పేర్కొనడం, కొంతమంది గోదావరి పరీవాహక ప్రాంతంలో యువతిని చూసినట్లుగా చెప్పడంతో గోదావరిలో విస్తృతంగా గాలించినట్లు ఎస్ఐ తెలిపారు. సూసైడ్నోట్లో పేర్కొన్న ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, అదే నా చివరి కోరిక అని యువతి పేర్కొంది. కాగా తమ కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. తమకు ఇద్దరు పిల్లలని మూడేళ్ల వయసులోనే కాలువలో పడి తమ కుమారుడు మృతి చెందాడని, తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తె ఈ రకంగా కనిపించకపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. -
పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. 2 నెలల క్రితం మరో వ్యక్తితో వెళ్లిందని..
సాక్షి, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలతో సహా ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు మండలం నాగాలదిన్నెకు చెందిన కీరసాకరే రామకృష్ణ బతుకుదెరువు కోసం వచ్చి లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంతో కలిసి పెద్దంబర్పేట్లోని శాంతినగర్లో అద్దె కుంటున్నాడు. భార్య స్వప్న (32) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తుంది. వారికి కూతురు లావణ్య (14), కొడుకు ప్రవీణ్ (12) ఉన్నారు. జులై 27న పనికి వెళుతున్నానని పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన స్వప్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్క తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్వప్న రెండు నెలల క్రితం రాము అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లిందని ప్రస్తుతం అతనిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ -
యువకుడితో చాటింగ్.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి
రంగారెడ్డి: యువతి అదృశ్యమైన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పల్లె మహేశ్వరి(20) శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉంది. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చే వరకు యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల తెలిసిన వారి వద్ద వాకబు చేసిన అచూకీ లభించలేదు. దీంతో చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి ఇటీవల సందీప్ అనే యువకుడితో చాటింగ్ చేస్తుండడంతో కుటుంబసభ్యులు మందలించినట్లు తెలిపారు. దీంతో యువతి సోదరుడు సందీప్పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
నేను రవితోనే ఉంటా..సాయిప్రియ
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ, రవి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. సాయిసుప్రియ, రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బతుకుతామని, ఇక ఇంటికి వెళ్లమని, తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు. తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని, తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయిప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయలు ఖర్చయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతుండగా సాయిప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేటు కారులో త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
బీచ్లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..?
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): రెండు రోజులు గడుస్తున్నా వివాహిత మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. పెళ్లి రోజు సందర్భంగా సాగరతీరంలో సరదాగా గడిపిన ఆ జంట... ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన సమయంలో బీచ్లో అసలేం జరిగిందో అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం భర్తతోపాటు కుటుంబ సభ్యులు, పోలీసులు, నగర వాసుల మదిలో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. వెనక్కి తిరిగి చూస్తే కనిపించలేదని ఫిర్యాదు సాయిప్రియ మిస్సింగ్పై ఆమె భర్త శ్రీనివాస్ సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో ఆమెతో కలిసి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చినట్లు తెలిపాడు. తాను హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య విశాఖ ఎన్ఏడీలోని వాళ్ల అమ్మవారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. అయితే ఆదివారం పెళ్లిరోజు కావడంతో రెండు రోజుల క్రితమే విశాఖ వచ్చినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం సాయిప్రియతో కలిసి ఆర్కేబీచ్కు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నామన్నారు. అయితే రాత్రి 7.30 సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవగా... తన ఫోన్కు మెసేజ్ రావడంతో చూసుకుంటూ రోడ్డు వైపు వచ్చినట్లు శ్రీనివాస్ ఫిర్యాదులో వివరించాడు. ఆ సమయంలో కాళ్లు కడుక్కోవడానికి సముద్రంవైపు వెళ్లిన తన భార్య సాయిప్రియ వెనుక వస్తుందని భావించినట్లు తెలిపాడు. అయితే కొంతసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూడగా ఆమె కనిపించలేదన్నాడు. అనంతరం తీరంలో వెతగ్గా ఎక్కడా కనిపించలేదని వెల్లడించాడు. అయితే సోమవారం కూడా శ్రీనివాస్ని పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ తాను ఫిర్యాదులో మాదిరిగానే సమాధానం ఇచ్చినట్లు త్రీ టౌన్ సీఐ రామారావు వెల్లడించారు. అయితే సాయిప్రియ, శ్రీనివాస్ దంపతుల మధ్య ఎలాంటి గొడవలైనా ఉన్నాయా అనే అంశంపై సాయిప్రియ తండ్రి అప్పలరాజుతోపాటు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా గొడవలు లేవని, వారు అన్యోన్యంగానే ఉంటున్నారని వెల్లడించినట్లు సీఐ తెలిపారు. అయితే సాయిప్రియ బీచ్లో గల్లంతై ఉంటే 24 గంటల నుంచి 36 గంటల్లోపు ఒడ్డుకు కొట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీచ్ వెంబడి పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు. తీరంలో విస్తృతంగా గాలింపు సాయిప్రియ బీచ్లో గల్లంతై ఉంటుందా..? అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆర్కే బీచ్ తీరం వెంబడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో కోస్ట్గార్డ్స్, నేవీ అధికారుల సహాయం కోరడంతో 11 గంటల ప్రాంతంలో రెండు కోస్ట్గార్డ్ గస్తీ నౌకలతోపాటు హెలికాప్టర్ ద్వారా ముమ్మరంగా గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతోపాటు మంగళవారం మధ్యాహ్నం నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు ఆర్కేబీచ్కు వచ్చారు. సాయిప్రియ గల్లంతైనట్లుగా భావిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. దర్యాప్తుపై పోలీసుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకటకుమారి కలెక్టర్ మల్లికార్జునతో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. దీంతోపాటు తీరప్రాంతం వెంబడి గస్తీ పెంచాలని, హెచ్చరిక బోర్డులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునిటీ గార్డుల ఏర్పాటుపైనా చర్చించినట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, ఇతర ఉన్నతాధికారులతోపాటు సాయిప్రియ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంజీవయ్యనగర్లో విషాదం గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్లో సాయిప్రియ గల్లంతైన ఘటనతో జీవీఎంసీ 52వ వార్డు సంజీవయ్యనగర్లో విషాదం నెలకొంది. సాయిప్రియ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోయింది. సోమవారం సాయంత్రం గల్లంతైనప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. విజయనగరం జిల్లా కందివలసకు చెందిన శ్రీనివాసరావుకు సాయిప్రియకు వివాహమై రెండేళ్లయింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసరావు పెళ్లి రోజు కానుకగా బంగారు చేతి గాజులు చేయించి బహుమతిగా తీసుకొచ్చాడు. అల్లుడూ, కుమార్తెది అన్యోన్యమైన దాంపత్యమని గుర్తు చేసుకుంటూ తల్లి విలపించిన తీరు చూపరులకు కన్నీరుతెప్పిస్తోంది. త్వరలో భార్యను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోవాలనుకున్నంతలో ఘోరం జరిగిపోయిందని వాపోతున్నారు. -
పక్కింటి వ్యక్తితో పింకి చనువు.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, హైదరాబాద్: తన భర్త మందలించాడని ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితు ల వివరాల ప్రకారం.. రింగ్ బస్తీకి చెందిన మనీష్గౌడ్(34), పింకి(30)లకు 2012లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్, దీప్లు ఉన్నారు. కాగా వీరి ఇంటి ప్రక్కనే ఉండే ఓ వ్యక్తి పింకితో చనువుగా ఉండడంతో మనీష్ పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఈ నెల 19న పింకి తన పిల్లలతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. మొబైల్ ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె జాడ కోసం బందువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పక్కింట్లో ఉన్న వ్యక్తి కూడా ఆదే రోజు నుంచి కనిపించకపోవడంతో అతడి మీదే అనుమానం ఉందని మనీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా.. -
పెళ్లిరోజు నాడే విషాదం.. ఆర్కే బీచ్లో వివాహిత గల్లంతు..
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్లో గల్లంతైంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్.సాయిప్రియ భర్త శ్రీనివాస్తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్కు విహారానికి వచ్చింది. తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, కొంతసేపటికి తిరిగి చూస్తే తాను కనిపించలేదని అతను వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె బీచ్లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని త్రీటౌన్ సీఐ రామారావు తెలిపారు. -
గండం ఉందని గల్లంతు నాటకం
కొలిమిగుండ్ల(కర్నూలు): భర్త, కుమార్తెకు ప్రాణ గండం ఉందని, దాని నుంచి వారు బయట పడేందుకు ఓ మహిళ తాను గల్లంతైనట్లు నాటకం ఆడింది. మూడు రోజుల పాటు అనంతపురంలో ఉండి ఆదివారం తాపీగా ఇంటికి చేరుకుంది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్బీతో పాటు కూతురు, బంధువులు, ఇంటి పొరుగున ఉన్న మహిళలు మొత్తం పది మంది కలిసి శుక్రవారం ఆటోలో బయలుదేరి ముందుగా తుమ్మలపెంట పొలిమేర సమీపంలో ఉన్న సుంకులమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండం వద్దకు చేరుకున్నారు. రామేశ్వరస్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో గుండంలో నీటిలో దిగారు. రసూల్బీ గుండంలో గల్లంతయిందని కూతురుతో పాటు శివమ్మ, తోటి మహిళలంతా ఘంటా పథంగా చెప్పారు. అక్కడే ఉన్న పూజారితో పాటు అంకిరెడ్డిపల్లె, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి భారీగా అక్కడికి చేరుకొని ఆచూకీ కోసం నీళ్లలోకి దిగి వెతకటం ప్రారంభించారు. రాత్రంతా అక్కడే ఉండి ప్రయత్నం చేసినా కుదరలేదు. శనివారం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సహకారంతో జనరేటర్ ఏర్పాటు చేసి మోటార్ల సాయంతో రాత్రి తొమ్మిది గంటల వరకు నీటిని బయటకు పంపింగ్ చేశారు. కేవలం మూడు అడుగుల నీళ్లు ఉండటంతో యువకులు నీళ్లలో దిగి గుండం అంతా జల్లెడ పట్టినా ఆనవాళ్లు దొరకలేదు. చివరకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయత్నం చేశారు. తాపీగా బస్సు దిగి ఇంట్లోకి.. గుండంలో మూడు రోజుల నుంచి గ్రామస్తులు, బంధువులు విశ్వప్రయత్నాలు చేస్తున్న ఉత్కంఠ సమయంలో మధ్యాహ్నం తాపీగా బస్సు దిగి రసూల్బీ ఇంట్లోకి వెళ్లడంతో హైడ్రామా ముగిసింది. గ్రామస్తులు భారీగా ఆగ్రహావేశాలతో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకొని రసూల్బీలో పాటు తాడిపత్రిలో ఉన్న ఆమె అక్క, బావలు శివమ్మ, కార్తీక్ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. భర్త, కూతురుకు ప్రాణగండం ఉందని చెప్పారని, మూడు రోజుల పాటు కనిపించ కుండా పోతే గండం తప్పి పోతుందనే ఉద్దేశంతోనే ఈ నాటకం ఆడినట్లు ఆమె పోలీసులకు చెప్పారు. అనంతపురంలో ఉండి ఆమె ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది. చివరకు భయపడి ఇంటికి చేరుకుంది. విచారణ కోసం అందరినీ కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. -
ఆమె బతికే ఉందా.. ఇంకేదైనా జరిగిందా?
వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని అమలపాడుకు చెందిన వివాహిత కర్ని లక్ష్మి అదృశ్యమై నెల రోజులు దాటినా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. వజ్రపుకొత్తూరు పోలీసులు గాలిస్తున్నా ఆమె ఎక్కడ ఉన్నారో అంతు పట్టడం లేదు. ఆమె బతికే ఉందా.. ఇంకేదైనా జరిగిందా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం లక్ష్మి కుమారుడు నీలకంఠం శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. కర్ని లక్ష్మికి తన భర్త మాధవరావుతో ఐదేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి అమలపాడు గ్రామంలో నివాసముండగా, ఆమె భర్త మాధవరావు కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 6వ తేదీ నుంచి లక్ష్మి కనిపించడం లేదు. చదవండి: ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి.. సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుమారుడు ఎంతగా వెతికినా తల్లి ఆచూకీ లభించలేదు. దీంతో 15 రోజుల తర్వాత అతను వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాల్ డేటాను సైతం పరిశీలించి భర్త మాధవరావును కూ డా విచారించారు. ఇప్పటికి నెల దాటిపోయినా కేసు లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో లక్ష్మి కుమారుడు ఎస్పీ గ్రీవెన్స్సెల్ను ఆశ్రయించాడు. గ్రామంలో కొందరిపై అనుమానంగా ఉందని, లో తుగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆయన చెబుతున్నాడు. దీనిపై వజ్రపుకొత్తూరు ఎస్ఐ కూన గోవిందరావును ‘సాక్షి’ సంప్రదించగా తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త ను కూడా విచారించామన్నారు. కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వారిని మరోసారి విచారించి కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు. -
వాకిలి తుడవలేదని అత్త.. చల్లబడ్డాక తుడుస్తానని కోడలు.. చివరికి..
పిఠాపురం(కాకినాడ జిల్లా): పొద్దు కునుకుతోంది ఇంకా వాకిలి తుడలేదని అత్త, ఇంకా చాలా ఎండగా ఉంది కదా చల్లబడ్డాక తుడుస్తానని కోడలు అంతే ఇద్దరు పంతాలకు పోవడంతో వారి మధ్య చిన్న గొడవ. ఇంతలో బయటి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తన తల్లిని భార్యను చిన్న దానికి గొడవెందుకంటూ మందలించాడు. అంతా సర్దుమణిగింది అనుకుంటు ఉదయం లేవగానే కోడలు తనను కొడుకుతో తిట్టించిందని కోపగించి అత్త ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు రోజుల పాటు ఎంత వెదికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో కొడుకు పోలీసులను ఆశ్రయించగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే? పట్టణ ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం స్థానిక కత్తులగూడేనికి చెందిన వాకాడ సత్యనారాయణ తన తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి, భార్యకు మధ్య వాకిలి తుడిచే విషయంలో చిన్న గొడవ జరగడంతో సత్యనారాయణ తల్లి వీరరాఘవమ్మ అలిగి ఈనెల 14వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
వివాహిత అదృశ్యం.. భర్త ఇంట్లోలేని సమయంలో..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): మండల కేంద్రంలోని రామకోటి కాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే వివాహిత అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. వివరాలు.. తాడిపత్రి మండలం అక్కన్నపల్లికి చెందిన తలారి నాగలక్ష్మమ్మ బాలసుంకన్న కుమార్తె లక్ష్మీనారాయణమ్మను ఏడాది క్రితం ఆటో నడుపుతూ జీవనం సాగించే పెద్దపప్పూరుకు చెందిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. చదవండి: ‘నేను చనిపోతా.. నన్ను బలవంతంగా పంపుతున్నారు’ ద్విచక్ర వాహనం కొనుగోలు విషయమై భార్యాభర్తలు గొడవపడ్డారు. సోమవారం భర్త ఇంట్లోలేని సమయంలో లక్ష్మీనారాయణమ్మ ఇంటినుంచి వెళ్లి పోయింది. తమ కూతురు ఆచూకీ కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బీటీ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అదృశ్యం.. ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి..
సంగారెడ్డి అర్బన్: వివాహిత అదృశ్యమైన సంఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని దంపతులు పట్టణ పరిధిలోని భవానీనగర్లో నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 10 తేదీన ఆంజనేయులు పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. చదవండి: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు: కీలక విషయాలు వెలుగులోకి.. తిరిగి ఇంటి వచ్చేసరికి ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి నందిని వెళ్లిపోయింది. బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 94906 17010, 0845527633 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
సంధ్య మిస్సింగ్.. పక్క పోర్షన్లో అద్దెకు ఉంటున్న లోకేష్ కూడా..
సీతానగరం (తూర్పుగోదావరి): స్థానికురాలైన తేలు శ్రావణి సంధ్య అనే యువతి 20 రోజుల క్రితం అదృశ్యమైంది. రాజమహేంద్రవరంలోని మీ సేవకు వెళ్లి వస్తానంటూ గత నెల 14న ఆమె ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అప్పటి నుంచీ ఆమె తిరిగి రాలేదు. కాగా ఆమె ఇంటి పక్క పోర్షన్లో అద్దెకు ఉంటున్న సింగవరపు లోకేష్ అనే యువకుడు కూడా అప్పటి నుంచి కనిపించడం లేదు. అతడే తన కుమార్తె శ్రావణి సంధ్యను కిడ్నాప్ చేసి ఉండవచ్చని తల్లి శ్రీలత అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు. చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య -
రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?
సాక్షి, మనోహరాబాద్(మెదక్): మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్సై రాజుగౌడ్ వివరాల ప్రకారం మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతని రెండో కూతురు షేక్ జహ్నబీ(21) ఈనెల 24 రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రపోయింది. అయితే కుటుంబ సభ్యులు వేకువ జామున చూసేసరికి జహ్నాబీ ఇంట్లోంచి వెళ్లిపోయింది. బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా కాళ్లకల్ గ్రామానికి చెందిన వీరబోయిన కృష్ణ మూడో కుమారుడు నాగార్జున్తో వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తండ్రి శనివారం ఫిర్యాధు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వప్న యువతి అదృశ్యం పరిగి: ఓ యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ కిష్టయ్య కూతురు స్వప్న ఈనెల 23న తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామానికి చెందిన మధుసూదన్రెడ్డిపై అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూడగా అతడు కూడా కనిపించలేదు. మధు సూదన్రెడ్డిపై అనుమానంతో యువతి కుటుంబీకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భర్త వర్క్ ఫ్రం హోమ్లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో. -
హైదరాబాద్లో ఒక మహిళ, ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్(అబ్దుల్లాపూర్మెట్): వేర్వేరు చోట్ల ఓ మహిళ, యువతి అదృశ్యమయ్యారు. ఈ సంఘటనలు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. తారమతిపేటకు చెందిన రక్షిత(19) ఈ నెల 11న ఉదయం మహంకాళీ దేవాలయానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆచూకీ కోసం గ్రామంతో పాటు బంధువుల ఇళ్లలో వాకబు చేయగా జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో చోట మహిళ .. మండలంలోని కవాడిపల్లికి చెందిన గృహిణి (30) ఈ నెల 12న ఉదయం అబ్దుల్లాపూర్మెట్లోని బ్యాంక్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పహాడీషరీఫ్లో యువతి.. పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటయ్య ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడిపల్లిలో నివాసం ఉండే కంట్రోత్ సంధ్య దగ్గరకు ఆమె అక్క కుమార్తె బడావత్ మంజుల (19) ఐదు నెలల క్రితం వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే ఈ నెల 5న ఉదయం డ్యూటీకి వెళ్లిన మంజుల సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. స్వాతి, మహేశ్వరి, మంజుల (ఫైల్ ఫొటోలు) -
హైదరాబాద్: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో తల్లి..
సాక్షి, చిలకలగూడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్కు చెందిన సెంట్రింగ్ కార్మికుడైన ముస్తాల రవి, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి పార్శిగుట్టలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న నాగలక్ష్మి (24) తన కుమార్తెలు రిత్విక(4), రెండున్నరేళ్ల సిరిని వెంటతీసుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్వగ్రామంతోపాటు సన్నిహితులు, బంధు మిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త రవి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అడ్మిన్ ఎస్ఐ తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యం
సాక్షి, చాంద్రాయణగుట్ట: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హషమాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీవుద్దీన్, ముష్రత్ అన్సారీ(24) దంపతులు. వీరికి సైదా జైనా ఫాతిమా(5), సైదా జోహ ఫాతిమా (1.5) సంతానం. ఈ నెల 21వ తేదీన భర్త పని నిమిత్తం బయటికి వెళ్లాడు. చదవండి: నా భర్తతో ప్రాణహాని ఉంది.. రక్షించండి అనంతరం ముష్రత్ అన్సారీ సోదరి కౌసర్ అన్సారీ సమీవుద్దీన్కు ఫోన్ చేసి సోదరి ఫోన్ స్వీచాఫ్ వస్తుందని తెలిపింది. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా.. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కనిపించలేదు. పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... -
18 రోజుల క్రితం పెళ్లి.. ఇంటికొచ్చి చూస్తే షాక్.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్
సాక్షి, నిజాంపేట్: కొత్తగా పెళ్లైన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట శివనగర్కు చెందిన సిద్దయ్యగౌడ్, సంగీతల కుమార్తె కావేరి (19), వెంకటేష్కు 18 రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 6న తల్లిదండ్రులు పనులపై వెళ్లగా కావేరి ఒక్కత్తే ఇంట్లో ఉంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్ఫోన్కు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ తెలియరాలేదు. దీంతో కావేరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో పరిచయం.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, మీర్పేట: భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పదర గ్రామానికి చెందిన కుమార్, రాధ (30) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో రాధ భర్తను వదిలేసి జిల్లెలగూడ అంబేడ్కర్నగర్కు వచ్చి ఓ అపార్ట్మెంట్లో వాచ్ఉమన్గా పనిచేస్తూ ఇక్కడే ఉంటోంది. తరచూ భర్త వచ్చి వెళ్తుండేవాడు. రాధ కూలీ పనులకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో రెండు నెలలుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్ గత నెల 4న కుటుంబసభ్యులతో కలిసి అంబేడ్కర్నగర్కు వచ్చి రాధను మందలించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత రాధ తన ఇద్దరు కుమారులు రవి (10), గణేష్ (12)ను తీసుకుని దుర్గాప్రసాద్తో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ -
డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..
సాక్షి, హైదరాబాద్(కేపీహెచ్బీకాలనీ): డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కేపీహెచ్బీ 3వ ఫేజులో ముత్యాల జ్యోత్స్న, శ్రీనివాస్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న శ్రీనివాస్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం భాగ్యనగర్కాలనీ: పని నిమిత్తం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగిరాని సంఘటన గురువారం కూకటపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మన్సూర్ ఆలి (32), ఆస్మా బేగం దంపతులు బోరబండలో నివాసముంటున్నారు. మన్సూర్ఆలీ అల్లాపూర్లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు పని నిమిత్తం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపునకు ఫోన్ చేసి అడగ్గా రాలేదని సమాధానం చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆస్మా, బంధువులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం కూకట్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం.. ఫోన్ చేయగా
సాక్షి, హైదరాబాద్(భాగ్యనగర్కాలనీ): ఇంట్లో నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్పల్లి సంగీత్నగర్లో జీతాబాయి (23), వెంకటేష్ నాయక్లు నివాసముంటున్నారు. ఈ నెల 16న ఉదయం వెంకటేష్ నాయక్ పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా భార్య జీతాబాయి కనిపించలేదు. దీంతో అత్తమామలకు ఫోన్ చేసి ఆరాతీయగా తమవద్దకు రాలేదని సమాధానం చెప్పారు. జీతాబాయికు ఫోన్ చేయగా స్విచ్చాఫ్లో ఉంది. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఒకే కాలేజీ ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..) -
‘అమ్మా ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తా’..! యువతి అదృశ్యం..
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! -
Hyderabad: ఎప్పటిలాగే విధులకు వెళ్లారు..కానీ తిరిగి రాలేదు
సాక్షి, జవహర్నగర్: యువతి అదృశ్యమైన సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డ జైజవాన్ కాలనీలో నివసించే లాజరు పెద్ద కుమార్తె బూలగ్రేస్ (20) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీనగర్లో నివసించే మహేశ్వరి (20), రెండు నెలలుగా రత్నదీప్ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన మహేశ్వరి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యూటీకి వెళ్లి.. బంజారాహిల్స్: విధులకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10, శ్రీరాంనగర్లో నివసించే బి. లోకేష్ స్టార్ ఆస్పత్రిలో టెక్నీషియన్గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి రెండ్రోజులైనా ఇంటికి రాకపోవడంతో సోదరుడు కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని...
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతీ అదృశ్యమైన సంఘటన డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నూర్ఖాన్బజార్ ఉస్మాన్పురా ప్రాంతానికి చెందిన వాసియా బేగం ఇంట్లో సోదరి కూతురు ముస్కాన్ బేగం (19) నివాసముంటూ ఇంటర్ చదువుతోంది. కాగా గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముస్కాన్ బేగం స్నేహితురాలి వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వాసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
భర్త మందలింపు; టైలరింగ్ షాప్కు వెళ్తున్నానని చెప్పి..
సాక్షి, మల్కాజిగిరి: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల ప్రకారం... గౌతంనగర్కు చెందిన గడ్డం మహేందర్, అనూష(24) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడడాన్ని గమనించి అనూషను మహేందర్ ప్రశ్నిస్తే సోదరితో మాట్లాడుతున్నానని చెప్పింది. గత నెల 30వ తేదీ ఉదయం ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అనూష ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం అఫ్జల్గంజ్: బంధువులను కలిసేందుకు నగరానికి వచి్చన ఓ బధిర మహిళ అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్ చంద్రకళ అనే మహిళ గతంలో కోఠి ఈఎన్టీ ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాంటీన్లో పని చేస్తూ జీవనం సాగించేది. మూడు నెలల క్రితం పనిమానేసి నల్గొండకు వెళ్లింది. ఈ నెల 27న బంధువులను కలిసేందుకు వచి్చన చంద్రకళ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె కుమార్తె శ్రీలత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చంద్రకళ, శైలజ ఇంట్లో చెప్పకుండా.. బహదూర్పురా: ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్బాగ్ ఎక్స్ రోడ్డు ప్రాంతానికి చెందిన ఏక్నాథ్ కుమార్తె శైలజ గత నెల 31వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆమె తండ్రి ఏక్నాథ్ పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడిన మిస్టరీ: శ్రీదేవితో సుప్రియ వివాహం.. భర్త వేధించడంతో
సాక్షి, వెంకటగిరి: మండలంలోని కేజీపల్లి దళితవాడకు చెందిన వివాహితలు పీ విజయ, పీ సుప్రియ తమ ముగ్గురు చిన్నారులతో కలిసి ఈ నెల 16న అదృశ్యమైన మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారిని గురువారం రాత్రి హైదరాబాద్లో గుర్తించినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డి వెల్లడించారు. స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హైదరాబాద్లో వేరుగా బతికేందుకు తమ పరిచయస్తుల ద్వారా కూకట్పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయకాలనీకి చేరుకున్నారు. వీరిని గుర్తించి సోమవారం వెంకటగిరికి తీసుకొచ్చి ఇన్చార్జి తహసీల్దార్ ఆదిశేషయ్య వద్ద హాజరుపరిచినట్లు వివరించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యం కావడం జిల్లాలో సంచలనంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గాలింపు చర్యలను వేగవంతం చేయించారు. స్వతహాగా బతకాలని.. అదృశ్యమైన మహిళలు పీ విజయ, సుప్రియ తోడుకోడళ్లు. వీరిలో పెద్ద కోడలు విజయకు కృష్ణయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవ పడేవారు. చిన్నకోడలు సుప్రజకు కృష్ణయ్య సోదరుడు సుధాకర్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే సుప్రియ వివాహానికి ముందు నెల్లూరులో నివాసం ఉండే సమయంలో ఓ వృద్ధ దంపతుల ఇంట్లో పనిచేసేది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న శ్రీదేవి (ట్రాన్స్జెండర్) సిద్దూ అనే పేరుతో పురుషుడి మాదిరి వస్త్రధారణ, ప్రవర్తన ఉండడంతో సుప్రియ ప్రేమించి రహస్య వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసి సుప్రియకు సైతం భర్త నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. (ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం) దీంతో సుప్రియ తన తోడుకోడలు విజయతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వేరుగా బతకాలని నిర్ణయించుకుని శ్రీదేవి అలియాస్ సిద్దూ సహయంతో పిల్లల ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటి నుంచి జీకేపల్లి ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే శ్రీదేవి అలియాస్ సిద్దూ గూడూరు నుంచి అద్దెకు తీసుకొచ్చిన కారులో శ్రీకాళహస్తి, అక్కడి నుంచి మరో కారులో విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో చేరుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. వీరిని తిరిగి వెంకటగిరి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కేసును ఛేదించిన వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, డక్కిలి, వెంకటగిరి ఎస్సైలు కామినేని గోపి, వెంకటరాజేష్, అనూష, తదితరులను అభినందించారు. -
కృష్ణమ్మ అగ్రహారం సమీపంలో ఘటన
సాక్షి, గద్వాల: పట్టణంలోని కృష్ణారెడ్డిబంగ్లా కాలనీకి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య రవళి (25) గురువారం నదీ అగ్రహారం సమీపంలోని కృష్ణానదిలో గల్లంతు అయ్యింది. ఈ మెతో పాటు నదిలో మునిగిపోయిన ఆమె పిల్లలు ఆశ్రిత(6), అక్షిత్(4)తో పాటు తోడి కోడలు స్రవంతిలను అక్క డే ఉన్న స్థానికులు నదిలోకి దూకి రక్షించారు. ఆమె కోసం ఎంతవెతికినా ఆచూ కీ లభించలేక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రవళి బంధువుల్లోని ఓ వ్యక్తి దినకర్మలు బుధవారం ముగిశాయి. 8మంది మహిళలు, 6గురు చిన్నారులతో కలిసి కుటుంబసభ్యులు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కృష్ణానదిలో స్నానాలు చేసి పూజలు చేసేందుకు వెళ్లారు. అందరితో పాటు రవళి కూడా ఇద్దరు పిల్లలతో నదిలోకి దిగి పిల్లలకు స్నానం చేయిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. గజఈతగాళ్లతో గాలింపు విషయం తెలుసుకున్న డీఎస్పీ యాదగిరి, తహసీల్దార్ మంజూల, ఎస్ఐ సత్యనారాయణలు గజ ఈతగాళ్లతో సంఘట నా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో గజ ఈతగాళ్లుకు నదిలో వెళ్లేందుకు కాస్తా కష్టంగా మరింది. మహిళ కోసం దిగువ ప్రాంతంలోని అధికారులను డీఎస్పీ అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు చేపడుతున్న గజ ఈతగాళ్లు , స్థానికుల సాయంతో బయటపడిన ముగ్గురు -
గాయత్రి మిస్సింగ్ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : కుత్బుల్లాపూర్లో సంచలనం సృష్టించిన గాయత్రి (19) మిస్సింగ్లో కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు తన కోసం వెతకొద్దంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(19) బుధవారం తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీ చేయగా ఆమె రాసిన లేఖ లభించింది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో 19 ఏళ్ల యువతి అదృశ్యం
-
హైదరాబాద్లో 19 ఏళ్ల యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : మార్కెట్కు వెళ్లి వస్తానని చెప్పి ఓ 19 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(19) తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి బయలు దేరింది. సాయంత్రం అయినా యువతి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కుమార్తెతో సహా తల్లి అదృశ్యం
చిలకలగూడ : కుటుంబకలహాల కారణంగా ఓ మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వరుణ్కాంత్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్ట సంజీవపురం ప్రాంతానికి చెందిన చెందిన చరణ్దాస్, శ్రీపూజ అలియాస్ అనూష దంపతులకు ఇద్దరు సంతానం. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 6న కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీపూజ అదే రోజు మధ్యాహ్నం తన సోదరుడికి ఫోన్ చేసి తాను చిన్నకుమార్తె రితిక (03)ను తీసుకుని హుజూరాబాద్లోని పుట్టింటికి వెళుతున్నానని, పెద్ద కూతురు మన్విత (05)ను స్కూత్ నుంచి తీసుకు రావాలని తన భర్త చరణ్దాస్కు చెప్పాలని సూచించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన చరణ్దాస్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. పుట్టింటికి వెళ్లలేదని తెలియడంతో ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వరుణ్కాంత్రెడ్డి తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: యువతి పట్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్పోర్ట్లో పనిచేసే 18 ఏళ్ల యువతి.. సల్మాన్ అనే డ్రైవర్ నడుపుతున్న ఇన్నోవా క్యాబ్ను ఎక్కింది. ఆమె వాహనంలోకి ఎక్కిన తర్వాత సల్మాన్లోని కామాంధుడు తన వికృతరూపం బయటపెట్టాడు. ఆ యువతి చేతులు పట్టుకొని లాగి.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్ తిన్న ఆ యువతి వెంటనే కేకలు వేసింది. యువతి కేకలతో భయపడిపోయిన సల్మాన్.. ఆమెను అక్కడే క్యాబ్లోంచి దింపేసి పరారయ్యాడు. బాధితురాలు ఈ ఘటనపై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులోని సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా క్యాబ్ డ్రైవర్ సల్మాన్ను అరెస్టు చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చిపోయే ప్రయాణికులు పోలీసు అనుమతి ఉన్న క్యాబ్ల్లోనే ప్రయాణించాలని ఎయిర్పోర్ట్ ఏసీపీ అశోక్కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మహిళ అదృశ్యం శంషాబాద్ ఎయిర్పోర్టులో మరో మహిళ అదృశ్యమైంది. మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన భవానీ (28) అనే మహిళ అదృశ్యమయ్యారు. భవానీని రిసీవ్ చేసుకొనేందుకు ఆమె భర్త భీమారావు ఎయిర్పోర్ట్కు వచ్చారు. ఆయన ఎంతసేపు వేచిచూసినా భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే.. స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన భీమారావు తన భార్య కనిపించడం లేదంటూ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
-
యువతి అదృశ్యం
మేడ్చల్: ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కండ్లకోయ హెచ్బీ కాలనీకి చెందిన జె.శ్రావణి (23) నానక్రామ్గూడలోని క్యాప్జెమిని కంపెనీ కార్యాలయంలో ఇంటర్వూ కోసం శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది. 9:48 గంటలకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కేంద్రానికి చేరుకున్నట్లు చెప్పిందని ఆమె సోదరుడు ప్రశాంత్రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అదేరోజు రాత్రి క్యాప్జెమినీ కార్యాలయానికి వెళ్లి విచారించగా సమాచారం తెలియలేదన్నారు. శ్రావణి , ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని మేడ్చల్ పోలీసులు కోరారు. -
ఆమె అదృశ్యం..!
ఆమె, అతను పగులబడి నవ్వుతూ.. ‘ఏవ్వా.. ఏవ్వా.. నాకు పోస్టు ఎప్పుడిస్తవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా.. ఎప్పుడు చేతుల పెడుతవ్ ఏవ్వా. ఏవ్వా.. ఏవ్వా..’ అంటూ సరసపు సంభాషణతో సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. స్వర పోలికను బట్టి ఆ మహిళ వరంగల్ అర్బన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినట్లు తెలిసింది. అయితే.. ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆమె అదృశ్యమైంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య గొంతును పోలిన వ్యక్తితో ఫోన్లో సరదాగా మాట్లాడిన మహిళ కనిపించకుండా పోయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సదరు మహిళ తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు నేతల భవితవ్యం ఈ ఆడియో క్లిప్పింగ్పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో మహిళ అదృశ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏం జరిగింది..? ఓ మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా ఉంటోంది. నిరుపేద కుటుంబానికి చెందిన సదరు మహిళను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక వెసులుబాటు కోసం కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సహకారం కోరవచ్చని.. టీఆర్ఎస్ స్థానిక దిగువ శ్రేణి నేతలను పట్టుకుంటే నకిలీ సర్టిఫికెట్లతో డబ్బు ఇప్పిస్తారని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుతెలుస్తోంది. దీంతో ఆమె స్థానిక నాయకులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆమాయకత్వాన్ని, ఆర్థికలేమిని ఆసరా చేసుకున్న స్థానిక నాయకులు ఆమె జీవితంతో ఆడుకున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఆ తర్వాత వారి నుంచి ఎగువ శ్రేణి నాయకుడికి చేరువైనట్లు స్థానికులు చెబుతున్నారు. చురుకుగా ఉండే ఆమెకు మండల స్థాయిలో ఒక పోస్టు ఇస్తామని చెప్పి, ఆ మేరకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇంకొంత చనువు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన్ని స్థానికంగా ఉన్న నాయకులు ఆమెతో సెల్ఫోన్లో సంభాషణ చేశారు (బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్లో వారి పేర్లు ఉన్నాయి). చైనా తయారీ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న సదరు మహిళ ఆండ్రాయిడ్ ఫోన్లో వాయిస్ రికార్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సోమదేవరపల్లి నుంచే లీకైందా..? 5.43 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో స్త్రీ, పురుషులిద్దరూ పగులబడి నవ్వుతూ సంభాషణ సాగిస్తారు. ఫోన్లో సహజంగానే ఈ సంభాషణ రికార్డు అయింది. ఆడియో క్లిప్పింగ్లోని పురుష గొంతు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ తాజామాజీ ఎమ్మెల్యే రాజయ్య స్వరంను పోలి ఉండడంతో.. రాజకీయంగా తనను అణగదొక్కటానికి తన గొంతును మిమిక్రీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని అతను స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, మహిళతో పరిచయం ఉన్న సోమదేవరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 8 నెలల కిందట çఆమె ఫోన్ను తీసుకున్నాడు. ఆడియో స్టోర్ నుంచి వాయిస్ రికార్డ్ క్లిప్పింగ్ను ఆమెకు తెలియకుండా తన ఫోన్లోకి పంపుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక అక్కడి నుంచి వాయిస్ రికార్డు ముందుగా ఎక్కడికి వెళ్లిందనే వివరాలు తెలియరాలేదు. నైతికతపై దాడి నేపథ్యంలో.. రాజయ్యకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిన నాటి నుంచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవువుతున్నాయి. తొలుత రాజా రపు ప్రతాప్తో మొదలైన అసమ్మతి.. క్రమంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచరుల చేతిలోకి వెళ్లిపోయింది. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్తో కొంత కాలంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆడియో క్లిప్పింగ్ బయటికి వచ్చింది. అదే రోజు సదరు మహిళ హుటాహుటిన హన్మకొండకు వెళ్లినట్లు, అప్పటి నుంచే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. కడియం శ్రీహరినే పోటీలో ఉండాలని కోరుతూ ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున వరంగల్ సర్క్యూట్ హౌస్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీని మీద అధినాయకత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. చివరి అస్త్రంగా ప్రత్యర్థి నైతికత మీద దెబ్బ తీయడానికి, అవసరమైనప్పుడు ము ఖ్యమంత్రి ముందుకు తీసుకుపోవటానికి కడి యం శ్రీహరి అనుచరులు ఆమెను తీసుకుపోయి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు మహిళపై ఒత్తిడి తెచ్చి ఒక వేళ ఆడియో క్లిప్పింగ్లో ఉన్న పురుష గొంతు తమ నేతది కాకు న్నా.. ఆయనదే అని చెప్పిస్తారేమోననే ఉద్దేశంతో రాజయ్య అనుచరులు తీసుకెళ్లి ఉండవచ్చనే మరో ప్రచారం సైతం జరుగుతోంది. దీనిపై జిల్లా పోలీ సు యంత్రాంగం స్పందించి.. ఎక్కడున్నా ఆమె ను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం
-
ఎయిర్పోర్ట్లో మహిళ మిస్సింగ్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో యార్లగడ్డ సాయిప్రసన్న అనే ప్రయాణికురాలు అదృశ్యమైంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ మిస్సింగ్ కేసు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలివి.. సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం ఎక్కించారు. ఆమె హైదరాబాద్కు చేరుకుంది. సాయిప్రసన్న కోసం తండ్రి, తమ్ముడు ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తున్నారు. వారికి తెలియకుండానే క్యాబ్ మాట్లాడుకుని సాయిప్రసన్న ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. క్యాబ్ ఎక్కిన తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడింది. దీంతో తమ్ముడు వెంటనే క్యాబ్ దిగాల్సిందిగా ఆమెకు చెప్పాడు. అనంతరం సాయిప్రసన్న ఫోన్ స్విఛ్చాప్ రావడంతో తండ్రి, తమ్ముడు ఆందోళన చెందారు. సాయిప్రసన్న తండ్రి విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాడు. ఖమ్మంకి చెందిన మోహన్ రావు అనే వ్యక్తిపై సాయిప్రసన్న భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వెంటనే తన కూతరు మిస్సైందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఎయిర్పోర్ట్లోని సీసీ టీవీ ఫుటేజీలే కీలకమని పోలీసులు భావిస్తున్నారు. -
భార్య కనిపించట్లేదు
ధర్మవరం అర్బన్: తన భార్య అనూష మూడురోజులుగా కనిపించడంలేదని గోరంట్ల మండలం కామిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు శనివారం ధర్మవరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులుకు ధర్మవరానికి చెందిన అనూషతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. బ్యాంక్ కోచింగ్ నిమిత్తం రోజూ ధర్మవరం నుంచి అనంతపురానికి వెళ్లివచ్చేది. మార్చి 27న సాయంత్రం ఆమె ధర్మవరానికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి వెతుకుతున్నా ఎక్కడా కనిపించలేదు. తన భార్య ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులకు సమాచారమందించాలని శ్రీనివాసులు కోరుతున్నాడు. పోలీసులు గాలింపు చేపట్టారు. -
వివాహిత అదృశ్యం
ఉరవకొండ: వజ్రకరూర్ మండలం ఎన్ఎన్పీ తండాకు చెందిన వివాహిత అంజలీబాయ్ అదృశ్యమైంది. ఎస్ఐ జనార్థన్నాయుడు మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్ఎన్పీ తండాకు చెందిన సోమ్లానాయక్ కుమార్తె అంజలీబాయితో అదే గ్రామానికి చెందిన రమావత్ హరినాయక్తో కొన్ని నెలల క్రితం వివాహం అయింది. ఈ నెల 12న అత్తారింటి నుంచి బయటకు వెళ్లిన అంజలి తిరిగి రాలేదు. తల్లిదండ్రులతో పాటు భర్త అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె అదృశ్యమైనట్లు వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9440901867ను సంప్రదించాలన్నారు. -
అనుమానంతో అంతమొందించాడు!
- మహిళను చంపేసి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం - కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు - నలుగురి నిందితుల అరెస్ట్ - మరొకరి కోసం గాలిపు నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి, అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె.. శ్రీనివాసులుగా దూరంగా ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కడతేర్చాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్ సహాయం తీసుకున్నాడు. మే 8వ తేదీన పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20వ తేదీన పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం సంఘటన స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురి నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
గంగలాపురం (కణేకల్లు) : తన కుమార్తె కొంతకాలంగా కన్పించడం లేదని కణేకల్లు మండలం గంగలాపురానికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ యువరాజు సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లయ్య కుమార్తె మహాదేవి(24) అనంతపురంలోని మైత్రి ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తోంది. అక్కడే ఉన్న వాసవి హాస్టల్లో ఉంటూ విధులు నిర్వర్తించేది. నెలకోసారి ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇంటికెళ్లింది. మరుసటి రోజు డ్యూటీకి వెళతానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. తిరిగి ఎన్ని రోజులైనా కుమార్తె రాకపోవడంతో మల్లయ్య తన కుమార్తెకు ఫోన్ చేశాడు. అది పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశాడు. అయితే మహాదేవి డ్యూటీకి రాలేదని వారు చెప్పడంతో ఆమె ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలో గాలించాడు. అయినా లభ్యం కాకపోవడంతో సోమవారం కణేకల్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్యాబ్లో వెళ్లిన యువతి అదృశ్యం
బంజారాహిల్స్(హైదరాబాద్): ఇంటి నుంచి క్యాబ్లో వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని స్టోన్వ్యాలీ అపార్ట్మెంట్స్లో నివసించే సుశ్మితా గాయత్రి విష్ణుభట్ల(22) మంగళవారం ఉదయం క్యాబ్లో బయటకు వెళ్లింది. సాయంత్రం ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తండ్రి చంద్రమౌళి బంధుమిత్రుల ఇళ్లలో వాకబు చేశారు. ఫోన్ చేసినా సెల్ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. అంతకుముందే బ్యాంకులో నుంచి రెండు దఫాలుగా రూ.15 వేలు డ్రా చేసినట్లు మెస్సేజ్లు అందాయి. ఆమె ఫోన్ నంబర్కు ప్రయత్నించగా లిఫ్ట్ చేయడం లేదు. క్యాబ్ డ్రైవర్ కోసం ఆరా తీయగా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని క్యాబ్ వివరాల కోసం ఆరా తీస్తున్నారు. యువతి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటుచేసి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. అదృశ్యమైన యువతి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె అదృశ్యం కేసును ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
వివాహిత అదృశ్యంపై కేసు
చిలమత్తూరు (హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండకు చెందిన డి.శ్రీనివాసులు భార్య అనిత అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. తన ఇద్దరు పిల్లలను వదిలేసి, ఎనిమిది రోజుల నుంచి తమ కుమార్తె కనిపించడం లేదంటూ అనిత తండ్రి నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బాలిక అదృశ్యంపై.. తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలం సజ్జలదిన్నెకు చెందిన శ్రావణి(14) అదృశ్యంపై గురువారం కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈ నెల 16న బయటకు వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఆమె తండ్రి విజయ్ తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హెచ్చెల్సీలో మహిళ గల్లంతు
బుక్కరాయసముద్రం : మండలంలోని సంజీవపురం గ్రామంలో ఓ మహిâýæ ప్రమాదవ శాత్తూ హెచ్చెల్సీలో పడి కొట్టుకుపోయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. సంజీవపురం గ్రామంలో ఈశ్వరయ్య, భార్య శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేవారు. గురువారం ఆమె కూలి పనుల కు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వస్తూ ప్ర మాదవశాత్తూ హెచ్చెల్సీలోకి పడింది. చు ట్టుపక్కల వారు చూసేసరికి ఆమె నీటి ప్రవా హంలో కొట్టుకుపోయింది. విషయం తెలు సుకున్న భర్త, బంధువులు, స్థానికులు సా యంత్రం వరకు గాలింపు చేపట్టారు. ఈతగాల్లు కాలువలో వెతికినా ఆమె కనపడలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాఖీ పండుగకు వెళ్లి యువతి అదృశ్యం
హైదరాబాద్(నాగోలు) : రాఖీ పండుగకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన బి.రమాదేవి (20) ఈ నెల 18న రాఖీ పండుగ సందర్భంగా బయటకు వెళ్లింది. అయితే ఎంతకూ ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రమాదేశి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి అదృశ్యంలో టీడీపీ నేతల హస్తం?
ఓ నేతను తప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం శూన్యం కాకినాడ లీగల్ :కాకినాడకు చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక నేతపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆ నేతను తప్పించేందుకు మరో నేత పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కాకినాడ వినుకొండవారి వీధికి చెందిన చప్పా శివమ్మ, అప్పారావుకు నలుగురు కుమార్తెలు. రెండో కుమార్తె రామలక్ష్మి 10వ తరగతి వరకు చదివింది. ఆమెకు విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. జూన్ 10న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇదిలా వుండగా టీడీపీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి కొంతమంది యువతులను నియమించుకుని ఎన్నికల డ్యూటీ కోసం వారితో ఫీల్డ్ వర్క్ చేయించేవాడు. రామలక్ష్మి కూడా అతడి వద్దకు పనికి వెళ్లేది. ఆమెను డ్యూటీ అనంతరం కృష్ణ ఆమె ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించి వెళ్లేవాడు. ఈక్రమంలో గత నెల 24 ఉదయం 11 గంటలకు ఆమెను డ్యూటీకి రమ్మని కృష్ణ ఫోన్ చేశాడు. పింఛను పుస్తకాలు పట్టుకుని రమ్మని ఆమెకు చెప్పాడు. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పి పుస్తకాలు తీసుకుని వార్ఫు రోడ్డులోని మున్సిపల్ స్కూల్ వద్దకు బయలుదేరిం ది. ఆ రోజు రాత్రి వరకూ ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కృష్ణకు ఫోన్ చేసి రామలక్ష్మి గురించి అడిగారు. డ్యూటీ అయిపోయిన వెంటనే వెళ్లిపోయిందని, ఏమైందో తనకు తెలియదని అతడు బదులిచ్చాడు. కొంత సమయం తర్వాత ఆమె కుటుంబ సభ్యు లు మళ్లీ కృష్ణకు ఫోన్ చేయగా కంగారు పడవద్దు, ఎక్కడా ఫిర్యాదు చేయవద్దు, సాయంత్రానికల్లా ఆమెను అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆమె గురించి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో మళ్లీ కృష్ణకు ఫోన్ చేశారు. రామలక్ష్మి ఏమైందో తనకు తెలియదని, మీ ఇష్టమొచ్చింది చేసుకోం డంటూ అతడు బదులిచ్చాడు.దీంతోతల్లిదండ్రులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గత నెల 29న యువతి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేత కృష్ణపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆ పార్టీ వాణిజ్య విభాగానికి చెందిన నేత ఒకరు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో పోలీసులు కృష్ణపై కేసు నమోదు చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు వారు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్పీ రవిప్రకాష్ సెలవులో ఉండడంతో కింది స్థాయి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టుచెప్పారు. తమ కుమార్తె ఏమైందోనని తమకు భయంగా ఉందంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. -
అమ్మ...నీ రాక కోసం
-
ఆశారాం బాపుపై ఫిర్యాదుచేసిన మహిళ అదృశ్యం
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అదృశ్యమయ్యారు!! 33 ఏళ్ల ఆ మహిళతో పాటు ఆమె భర్త, కుమారుడు కూడా కనిపించడం లేదు. వారం రోజులుగా ఆ కుటుంబం మొత్తం కనిపించడం లేదని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. ఆశారాం బాపు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గత సంవత్సరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే ఆశారాం బాపు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే, ఇప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళే కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం గుజరాత్ పోలీసులు ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశారు. -
ఆమె ఏమైంది!
మామిడికుదురు :తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన అంతటి శిరీష(25) అదృశ్యంపై ఆమె అన్నయ్య ధనుంజయ్గౌడ్ నగరం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన గెడ్డం జగదీష్.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని తోటలో ఖననం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడు నెలల నుంచి తన చెల్లెలు కనిపించడం లేదని, దీనిపై ఆరా తీయగా.. జగదీష్ ఆమెను హతమార్చి తన సొంత పొలంలోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు నిర్ధారణ అయిందన్నాడు. దీనిపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరాడు. ఈ సంఘటనపై ధనుంజయ్గౌడ్ ఇక్కడి విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శిరీష బీఏ చదివింది. చిన్నతనంలోనే తల్లి పుష్ప చనిపోవడంతో అమ్మమ్మ చంద్రమ్మ ఆమెను పోషించింది. శిరీషకు, జగదీష్తో ఏర్పడిన పరిచయం వారి పెళ్లికి దారితీసింది. 2012 డిసెంబర్ 9న రాజోలులో వీరు వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 4న వారికి బాబు పుట్టాడు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందన్న కోపంతో శిరీష కుటుంబ సభ్యులు వారి గురించి పట్టించుకోలేదు. తర్వాత ఫోన్లో ఆమె తన పుట్టింటి వారితో మాట్లాడేది. ఒకసారి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల నుంచి ఆమె ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ధనుంజయ్గౌడ్ ఇక్కడకు వచ్చి ఆరా తీశాడు. స్థానికులు చెప్పిన సమాచారంతో అతడికి కొన్ని వివరాలు తెలిశాయి. మంగళవారం అతడు జగదీష్ ఇంటికి వె ళ్లి ఆరాతీయగా, జగదీష్ రాశాడంటూ అతడి తల్లి ఓ లెటర్ చూపించింది. కడుపులో కణితి వల్ల నొప్పి భరించలేక శిరీష ఉరివేసుకుందని, మృతదేహాన్ని రాజోలు నుంచి పాశర్లపూడికి తీసుకొచ్చి ఖననం చేసినట్టు, కుమారుడితో తాను ముంబై వెళ్లిపోతున్నట్టు లేఖలో రాసి ఉంది. కాగా శిరీషను హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే జగదీష్ ఈ లేఖ రాశాడని ధనుంజయ్గౌడ్ ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపించి, జగదీష్పై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో కోరాడు. దీనిపై నగరం ఎస్సై బి.సంపత్కుమార్ను వివరణ కోరగా, ఇంకా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.