డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి.. | Two People Missing in Hyderabad | Sakshi
Sakshi News home page

డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..

Published Fri, Dec 31 2021 7:26 AM | Last Updated on Fri, Dec 31 2021 11:36 AM

Two People Missing in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(కేపీహెచ్‌బీకాలనీ): డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 3వ ఫేజులో ముత్యాల జ్యోత్స్న, శ్రీనివాస్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న శ్రీనివాస్‌ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

వ్యక్తి అదృశ్యం 
భాగ్యనగర్‌కాలనీ: పని నిమిత్తం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగిరాని సంఘటన గురువారం కూకటపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మన్సూర్‌ ఆలి (32), ఆస్మా బేగం దంపతులు బోరబండలో నివాసముంటున్నారు. మన్సూర్‌ఆలీ అల్లాపూర్‌లోని ఓ వెల్డింగ్‌ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు పని నిమిత్తం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు రాకపోవడంతో ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. షాపునకు ఫోన్‌ చేసి అడగ్గా రాలేదని సమాధానం చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆస్మా, బంధువులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement