KPHB Colony
-
గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, కూకట్పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు. ఈ నలుగురు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, కేపీహెచ్బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఉత్సాహంగా వినాయక నిమజ్జనం
కూకట్పల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జీఎల్ఎన్ రెడ్డి, కోటిరెడ్డి, చెన్నారెడ్డి, శివ, మాధవరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిత్యం పూజలతో పాటు అన్నదానం నిర్వహించారు. సోమవారం వినాయక నిమజ్జనం ఉత్సాహంగా సాగింది. కాలనీలో జగన్మోహన్రెడ్డి లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.Hyderabad KPHB Colony....😍 @ysjagan pic.twitter.com/XyRLr7CRA4— rebelstar Trends ™ (@fanofysjagann) September 15, 2024KPHB, HYD 💥🔥🔥 @ysjagan @YSJaganTrends @YSRCParty @JaganannaCNCTS pic.twitter.com/qI8xkP3Bom— Bangalore YSRCP Forum (@YSRCPFORUM_BLR) September 16, 2024 -
హైదరాబాద్ లోని KPHB కాలనీ వద్ద కారు బీభత్సం
-
హైదరాబాద్లో అతిపెద్ద బొమ్మల కొలువు.. ప్రారంభించిన సితార
ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద బొమ్మల కొలువు పెట్టింది. సూపర్స్టార్ మహేశ్ బాబు కూతురు సితార దీన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మహేశ్ భార్య నమ్రత కూడా హాజరైంది. వినియోగదారులని ఆకర్షించడం, లేటెస్ట్ ఫ్యాషన్ల అతి తక్కువ ధరలకు ఇవ్వడమే లక్ష్యంగా నెల రోజుల పాటు సదరు వ్యాపార సంస్థ ఈ వేడుకని చేస్తోంది. హైదరాబాద్లోని కేపీహెచ్బీలోని ఓ మాల్లో 30 x 40 అడుగుల సైజులో ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: నో చెప్పానని ఛాన్సులు ఇవ్వడం మానేశారు.. నటి కామెంట్స్!) ఈ బొమ్మల కొలువుని దసరా పండుగ కలెక్షన్తో అలంకరించారు. బహుమతులు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్జీవోల నుంచి పిల్లలు, వృద్ధులకు దసరా కానుకలను అందజేశారు. అలానే హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామమని సదరు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: 'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!) -
కూకట్పల్లి షాపింగ్మాల్లో డింపుల్ హయాతి సందడి (ఫొటోలు)
-
జయత్రి ఇన్ఫ్రా మోసాలు.. రియల్ ఎస్టేట్ పేరుతో నమ్మించి ముంచేశారు
కేపీహెచ్బీకాలనీ: జయత్రి ఇన్ఫ్రా కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో పలువురి నుంచి రూ.కోట్లలో దండుకుని మొహం చాటేయటంతో బాధితులు పోలీసుస్టేషన్కు క్యూ కడుతున్నారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించిన వారి వివరాలను బట్టి తెలుస్తుండగా, రూ.100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. మీడియాలో వస్తున్న కధనాలను చూసి బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాగా, 2020 నుంచి ఆకర్షణీయమైన ప్రాజెక్టుల పేరుతో, వివిధ సంస్థల పేరుతో రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. వినియోగదారులకు ఇస్తానన్న ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్ల ఫ్లాట్లు ఇవ్వక పోవటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల ఫిర్యాదుతో బుధవారం సంస్థ ఎండి కాకర్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో చెల్లించిన పలువురు గురువారం కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజులోని జయత్రి రిలయబిలిటి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే కార్యాలయం మూసి ఉండటంతో పోలీస్స్టేషన్కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరో 15 మంది ఫిర్యాదు.. కేపీహెచ్బీ కాలనీలో కార్యాలయం మూసివేసి ఉండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో డబ్బులు కట్టించిన సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే కొందరు లిఫ్ట్ చేయడం లేదని, మరి కొందరు తాము జయతి సంస్థలో ఉద్యోగం మానేశామని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మరో 15 మంది బాధితులు కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజాంపేట్, చందానగర్, సర్ధార్పటేల్ నగర్, అమీన్పూర్లలో అపార్టుమెంట్లు నిరి్మస్తున్నట్లు నమ్మిస్తూ భూ యజమానులతో సంతకాలు, అగ్రిమెంట్ పత్రాలు చూపించటంతో ఫ్రీ లాంచ్లో తక్కువకు వస్తుందని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలు మొదలు 1.5 కోట్లు డబ్బులు కట్టించుకుని ఫ్లాట్లు ఇవ్వకుండా మొహం చాటేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు.. జయత్రి రిలియబిలిటీ సంస్థతో పాటు గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పదుల సంఖ్యలో ఇన్ఫ్రా, మైనింగ్, రిసార్ట్స్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును భూముల కొనుగోలు, మైనింగ్లలో పెట్టుబడులు పెట్టి ఉంటారని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆధారాలతో వస్తే కేసులు నమోదు చేస్తాం.. జయత్రి సంస్థ బాధితుల ఎవరైనా సరే డబ్బులు చెల్లించి మోసపోయినట్లు ఆధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. బుధవారం వరకు 8 మంది ఫిర్యాదు చేయగా నిందితుడు కాకర్ల శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. గురువారం కొందరు బాధితులు వచ్చారు. డబ్బులు ఇచి్చనట్లుగా రశీదులు, అగ్రిమెంట్లు వంటి ఆధారాలు తీసుకువచ్చి నిరి్థష్టమైన ఫిర్యాదులు ఇవ్వాలని సూచించాం. – కిషన్ కుమార్, సీఐ, కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ -
Hyderabad: హౌసింగ్బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ నుంచి హఫీజ్పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్బాబు, హౌసింగ్బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
Hyderabad: కేపీహెచ్బీ.. ఇదో హైరైజ్ కాలనీ
ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా రూపొందిన కేపీహెచ్బీ కాలనీ నగరంలోనే ప్రసిద్ధిగాంచిన నివాస ప్రాంతంగా ఏర్పడింది. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు స్థానమున్న ఈ కాలనీలో గంజి, బెంజి మిళితమై నివాసకేంద్రంగా ఉండటం విశేషం. ఒకప్పుడు రాళ్లూ రప్పలు, చెట్టూ చేమలతో చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఆకాశ హర్మ్యాలకు చిరునామాగా మారింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో దేశ, విదేశాల వారికి ఆవాసంగా ఉంది. మహా నగరానికే మణిమకుటంగా వెలుగొందుతోంది కేబీహెచ్బీ కాలనీ. దాని ప్రస్థానమిదీ.. 1969లో 1,326 ఎకరాలను అప్పటి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 1978లో హౌసింగ్ బోర్డు పేద, మద్య తరగతి ప్రజలకు నివాసం కోసం నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది. హుడా నిబంధనల ప్రకారం 40 శాతం ఖాళీ స్థలాలను వదిలి మిగిలిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించింది. అనంతరం 1981– 82 ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్లు లేని వారు ఎంతోమంది హౌసింగ్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. - మొదట్లో కేపీహెచ్బీ కాలనీ ఫేజ్– 1, ఫేజ్– 2 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పటికి దరఖాస్తులు మిగిలిపోవటంతో 3, 4 ఫేజుల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 100 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయించింది. అనంతరం 5వ, 6వ ఫేజులో హెచ్ఐజీల పేరుతో పెద్ద ప్లాట్లను వేలం వేసింది. లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్లు కేటాయిస్తూ హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకొంది. 15 ఫేజుల్లో లాటరీ పద్ధతిలో కమర్షియల్ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. హౌసింగ్ బోర్డుకు గుండె లాంటి కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు ఆదాయం సమకూర్చుకునేందుకు బహిరంగ వేళాన్ని ప్రోత్సహించింది. దీంతో పోటాపోటీగా స్థలాల విక్రయాలు జరిగాయి. స్పైనల్ రోడ్డుతో మహర్దశ.. కూకట్పల్లి నుంచి కేపీహెచ్బీ మీదుగా హైటెక్ సిటీ వరకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్పైనల్ రోడ్డు నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన ఈ రోజు వేలల్లో ఉన్న సామాన్యులను కోటీశ్వరులుగా చేసింది. స్పైనల్ రోడ్డుకు ముందు 10 వేల రూపాయలకు ఇళ్లు కొనాలన్నా హడలిపోయే ప్రజలు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో గజం లక్ష రూపాయలకు చేరింది. అప్పట్లో రాష్ట్రంలోనే హౌసింగ్బోర్డు వేసిన వేలంలో గజం ధర లక్ష రూపాయలకు పలకటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవైపు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, మరోవైపు మెట్రో రైల్వే స్టేషన్, ఇంకో వైపు హైటెక్ సిటీకి వెళ్లే హైస్పీడ్ రహదారి, మరో వైపు స్పైనల్ రోడ్డు నిర్మాణంతో హౌసింగ్ బోర్డు దశ మారిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కూకట్పల్లి ప్రఖ్యాతి గాంచింది. దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ యూనివర్సిటీ ఇక్కడే ఉండటంతో జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు కూడా సమీపంలోనే ఉండటంతో ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా మారింది. సకల సౌకర్యాలకు నెలవు.. తెలంగాణలోనే మొట్టమొదట గేటెడ్ కమ్యూనిటిల నిర్మాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమయ్యాయి. అత్యంత ఎత్తైన 42 అంతస్థుల భవన నిర్మాణాలు చోటుచేసుకోవటమే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇక్కడ నిర్మాణం కావటంతో ఈ ప్రాంతానికి మహర్దశ పలికింది. ప్రభుత్వం 50 శాతానికిపైగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. కొన్ని డ్లూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా లోదా కాలనీ, రెయిట్ట్రీ పార్కు (మలేసియా టౌన్ షిప్), హిందూ ఫార్చ్యూన్, వన్ సిటీ కాలనీ వంటి ప్రాంతాలు అధునాతనంగా నిర్మించటంతో అధిక శాతం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ ప్రాంతం పట్ల ఆకర్షితులయ్యారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ రోడ్లు్ల, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ప్లే గ్రౌండ్స్, క్లబ్ హౌస్, మీటింగ్ హౌస్లను ఏర్పాటు చేయటంతో సామాన్యుడితో పాటు కోటీశ్వరులకు కూడా కావాల్సిన వస్తువులు అందుబాటులో లభిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ ఒకవైపు ఓఆర్ఆర్ సమీపంలో ఉండటమే కాకుండా ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో ఈ ప్రాంతం మరో అబిడ్స్ను తలపిస్తోంది. ఇక్కడ అక్షరాలా లక్షకు పైగా జనాభా నివాసం ఉంటారంటే అతిశయోక్తి లేదు. అతిపెద్ద నివాస కేంద్రం.. కూకట్పల్లికి చుట్టు పక్కల పారిశ్రామిక ప్రాంతాలైన సనత్నగర్, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, బొల్లారం, పటాన్ చెరు, కాజిపల్లి, బొంతపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనటంతో ఇక్కడి కారి్మకులకు నివాస యోగ్యమైన ప్రాంతంగా కేపీహెచ్బీ అవతరించింది. దీంతో ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగింది. మాదాపూర్, గచి్చబౌలి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావటంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడే బీహెచ్ఇయల్ ఆర్ అండ్, ఎన్ఆర్ఎస్ఏ, ఎంఎస్ఎమీ, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఐడీఎల్, బీడీఎల్ ప్రభుత్వరంగ సంస్థలు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా ఏర్పరచుకున్నారు. కోస్తాంధ్రవాసులకు అడ్డా.. నగరంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, సామాన్యుడికి అవసరమయ్యే ఇళ్లు అద్దెకు కావాలన్నా ఇతర ప్రాంతాల నుంచి వలస వచి్చన ప్రజలు ఈ ప్రాంతాన్నే ప్రధాన అడ్డాగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యారంగంతో పాటు వ్యాపార రంగం, కార్మికరంగం, ప్రజలు ఎక్కువగా నివాసముంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలోనే నివాసముంటూ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు. ఇక్కడ నివాసముంటూ హాస్టళ్లలో బ్యాచ్లర్స్ జీవితాలను గడుపుతూ ఏదో ఒక రంగంలో ఉపాధి వెదుక్కొని ఇక్కడే వివాహం చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకోవటం విశేషం. కోస్తా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల వారు ఇక్కడే నివాసం ఉండటంతో ఆ ప్రాంతానికి సంబంధించిన హోటల్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవటం విశేషం. గుంటూరు గోంగూర, రాగి సంకటి, నాటు కోడి పులుసు, గోదావరి ఘుమఘుమలు, రొయ్యల పులుసు, పాలమూరు చికెన్ గ్రిల్స్, హైదరాబాద్ బిర్యానీతో పాటు అన్ని వంటలకు కేరాఫ్గా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు లభించటంతో కేవలం కేపీహెచ్బీ ప్రాంతంలోనే వెయ్యికి పైగా హాస్టల్స్ ఏర్పడటం విశేషం. ఇలా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద ఆదాయ వనరుగా ఏర్పడటం విశేషం. -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్నగర్లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్ను నమ్ముకుని..
కేపీహెచ్బీకాలనీ: సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జోగులాంబగద్వాల జిల్లాకు చెందిన గోగినేని వరప్రసాద్ భార్య సరళ(58), కుమారుడు సందీప్ చంద్ర(38)లతో కలిసి కేపీహెచ్బీ పరిధిలోని బృందావన్కాలనీలో గల రిషితాకల్యాణ్ అపార్టుమెంట్లోని 208 ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. వ్యాపార రీత్యా రైస్ మిల్లులు నిర్వహిస్తున్న వరప్రసాద్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అయితే మూడు రోజుల కిందట వరకు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడిన సరళ, సందీప్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, ఇంట్లోను నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అపార్టుమెంట్ వాచ్మెన్ను వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు సరళ, సందీప్లు ఉన్న ఫ్లాట్కు వెళ్లి తలుపు తట్టినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: (సర్పాలతో మేలే.. రాష్ట్రంలో విషపూరిత సర్ప జాతులు నాలుగే) కేపీహెచ్బీ పోలీసులు వెళ్లి తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా కిచెన్లోని సీలింగ్ ఫ్యాన్కు సరళ, మరో గదిలోని సీలింగ్ ప్యాన్కు సందీప్లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అంతేకాకుండా ఇద్దరి మృతదేహాలు కూడా ఢీ కంపోజ్డ్ స్థితికి చేరడాన్ని బట్టి మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భర్త వరప్రసాద్ వచ్చి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తేనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. కలెక్టర్ అవుదామని.. సందీప్ చంద్ర కలెక్టర్ కావాలని కళలు కని అందుకు తగిన విధంగా సిద్ధమయ్యాడు. అయితే రెండు సార్లు ఇంటర్వ్యూ స్థాయికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ను నమ్ముకున్నాడు. తాము పోగు చేసుకున్న సొమ్ముతో పాటు తెలిసిన వారి వద్ద కూడా కొంత మొత్తం అప్పుగా తీసుకొని ఓ భూమిని కొనుగోలు చేశాడని, అది వివాదాల్లో చిక్కుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని సందీప్చంద్ర స్నేహితులు పేర్కొనడం గమనార్హం. స్థానికంగా పలువురి వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడం, జీవితంలో స్థిరపడకపోవడం వంటి పలు ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు సైతం భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్బీ సీఐ కిషన్కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
సందడిగా ‘సాక్షి’ స్పెల్బీ సెమీ ఫైనల్స్
మూసాపేట/హైదరాబాద్: ‘సాక్షి’ స్పెల్బీ సెమీఫైనల్స్ పోటీలు ఆదివారం కేపీహెచ్బీ కాలనీలోని మెరిడియన్ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్బీ పోటీలకు హాజరయ్యారు. నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్లో పోటీ పడ్డారు. మెయిన్ స్పాన్సర్స్గా డ్యూక్ వప్పీ అసోసియేషన్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. –వకుళ, మీర్పేట్ విద్యార్థిని తల్లి కొత్త పదాలు తెలుసుకున్నా ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను. స్పెల్ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్ వరకు రావటం ఆనందంగా ఉంది. – సహస్ర మారెడ్డి, మీర్పేట్ చాలా విషయాలు తెలిశాయి ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి. –హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని పోటీతత్వం పెరుగుతుంది ‘సాక్షి’ స్పెల్బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. – అరుణ, విద్యార్థిని తల్లి -
Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలకు గురైన యువకుడి తండ్రిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సర్దార్పటేల్ నగర్లో నివసించే గాయత్రి, నరేష్ ప్రేమించుకున్నారు. వారివారి ఇళ్లల్లో వివాహానికి అంగీకరించకపోవడంతో శనివారం రాత్రి గాయత్రి, నరేష్లు కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, అర్ధరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శాంతయ్య, రాజేశ్వరి దంపతులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకొని వెళ్లిన గాయత్రి బంధువులు, వారిని ఓ గదిలో బంధించి నరేష్ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. నరేష్ ఆచూకీ తెలుపకుంటే చంపుతామని బెదిరించి వదిలేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని కేపీహెజ్బీ సీఐ కిషన్కుమార్ తెలిపారు. చదవండి: Hyderabad: మెట్రో స్టేషన్ వద్ద యువకుడి హంగామా -
డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..
సాక్షి, హైదరాబాద్(కేపీహెచ్బీకాలనీ): డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కేపీహెచ్బీ 3వ ఫేజులో ముత్యాల జ్యోత్స్న, శ్రీనివాస్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 27న శ్రీనివాస్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య కనిపించలేదు. దీంతో ఆమె కోసం ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం భాగ్యనగర్కాలనీ: పని నిమిత్తం దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరిగిరాని సంఘటన గురువారం కూకటపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మన్సూర్ ఆలి (32), ఆస్మా బేగం దంపతులు బోరబండలో నివాసముంటున్నారు. మన్సూర్ఆలీ అల్లాపూర్లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు పని నిమిత్తం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఆ రోజు రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. షాపునకు ఫోన్ చేసి అడగ్గా రాలేదని సమాధానం చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఆస్మా, బంధువులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో గురువారం కూకట్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేపీహెచ్బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య
సాక్షి, కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్): అనారోగ్య కారణాలతో ఓ యువతి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లాకు చెందిన పాలపర్తి శాంతి (26) భాగ్యనగర్ ఫేజ్–2లోని తనూజ హాస్టల్లో నివాసం ఉంటూ బాలానగర్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా తలనొప్పి తదితర అనారోగ్య కారణాలతో బాధపడుతుంది. ఆదివారం ఉదయం శాంతి ఫోన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన శాంతి తల్లి హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాకబు చేసింది. హాస్టల్ నిర్వాహకులు శాంతి గదికి వెళ్ళి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆమె తల్లికి, సోదరికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన తరలివచ్చి పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: హైదరాబాద్: అన్నను కొట్టి చంపిన తమ్ముడు -
కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్లో ఆర్టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య (7) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాగర్కర్నూల్కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా (10) నాలుగో తరగతి చదువుకుంటోంది. వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు. నిర్లక్ష్యమే పెను శాపం.. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్బీ 4వ ఫేజులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల లోతు సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో గుంత నీటితో నిండి నిరుపయోగంగా ఉంది. ఎనిమిదేళ్లుగా ఇలాగే ఉండటంతో పిల్లల ప్రాణాల పాలిట యమపాశంగా మారింది. గతంలో ఇద్దరు బాలురు ఇందులో పడి మృతిచెందారు. -
ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్.. పవిత్ర తండ్రికి ఫోన్చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్చేసి పవిత్ర సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్ ఏంటంటే..) -
యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి
కేపీహెచ్బీకాలనీ: యువత తమ ఉజ్వల భవిష్యత్కు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని జేఎన్టీయూహెచ్ చాన్స్లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. శనివారం జేఎన్టీయూలో నిర్వహించిన రెండు రోజుల మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే తమ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వాటిని చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు. ఒకసారి ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటి డెవలప్మెంట్ స్కిల్స్ను పెంపొందించుకోవాలని అన్నారు. పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ జాబ్ మేళా నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. అనంతరం వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యా బోధనకు జేఎన్టీయూహెచ్ కృషి చేస్తున్నదని తెలిపారు. వర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్మేళాలో రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారా కళ్యాణి, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్ ట్రస్టీ కొండా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్ మేళాలో 144 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా సుమారు 65 వేల మంది యూజీ, పీజీ, డిప్లమో, ఇంటర్, ఎస్ఎస్సి విద్యార్హతలు ఉన్న ఔత్సాహికులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు
సాక్షి, కూకట్పల్లి: రెండు వేర్వేరు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన కేపీహెచ్బీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ వద్ద ఎల్ఐజీ గృహంలో వ్యభిచారం నిర్హహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పల్లికల శ్రీనివాసరావును మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్హ్యండెడ్గా అనంతరం యువతిని రెస్క్యూ హోంకు తరలించగా.. శ్రీనివాసరావును రిమాండ్కు తరలించారు.. అదే విధంగా కేపీహెచ్బీ కాలనీలో రోడ్డు నెంబర్3లో ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 6..30 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంగులూరి నాగ వెంకటేశ్వరరావుతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. -
భార్య మీద కోపం.. మామకు నిప్పంటించి పరారైన అల్లుడు
కేపీహెచ్బీకాలనీ: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అడ్డువచ్చిన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన అత్తకు కూడా గాయాలయ్యాయి. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజుకు చెందిన టి. సాగర్రావు, రమా దంపతుల కుమార్తె నీతికకు కరీంనగర్కు చెందిన సాయికృష్ణతో 2017లో ప్రేమ వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి సంసారం సంతోషంగా సాగింది. తరువాత భర్త సాయికృష్ణ భార్య నీతికను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులకు తట్టుకోలేక 2019లో తల్లిదండ్రుల వద్దకు నీతిక వచ్చింది. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అప్పటి నుంచి నీతిక తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాయి కృష్ణ పెట్రోల్ బాటిల్తో ఇంటికి వచ్చాడు. యాసిడ్ పోసేందుకు వచ్చాడనుకొని భయపడిని నీతిక బెడ్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీతిక తండ్రి సాగర్రావు... అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సాగర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. అత్త రమ మంటలను చూసి అరవటంతో సాయికృష్ణ పరారయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా రమకు సైతం గాయాలు అయ్యాయి. దీంతో సాగర్ రావు, రమలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సాయి కృష్ణకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. -
ఉరివేసుకొని వైద్యుడి ఆత్మహత్య
కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్)/మెదక్ జోన్: బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లల వైద్యుడు హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీలోని హోటల్ గదిలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇక్కడికి భార్యతో కలసి వచ్చి హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం కొడుకును నిజాంపేటలోని పరీక్షా కేంద్రం వద్ద దింపారు. భార్యను తిరిగి మెదక్లోని ఆసుపత్రికి పంపి హోటల్ గదికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేపీహెచ్బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు చంద్రశేఖర్ (50) ఆదివారం ఉదయం భార్య డాక్టర్ అనురాధ, కొడుకు సాయివెంకట రామకృష్ణప్పలతో కలసి కేపీహెచ్బీ కాలనీలోని సితార గ్రాండ్ హోటల్కు వచ్చారు. నిజాంపేట్లోని పరీక్ష కేంద్రంలో కొడుకు పరీక్ష రాసి.. తిరిగి వచ్చేవరకు వేచి ఉండటం కోసం ఉదయం 8 గంటలకు హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. 9 గంటలకు కొడుకును పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టారు. అనురాధను మెదక్లోని ఆసుపత్రిలో రోగులను చూసేందుకు పంపించి.. 11 గంటల ప్రాంతంలో హోటల్ గదికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గం. సమయంలో అనురాధ.. చంద్రశేఖర్కు పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో హోటల్కు ఫోన్ చేసి ఆ గదికి వెళ్లి చూడాలని కోరారు. హోటల్ సిబ్బంది వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి చూడగా చంద్రశేఖర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించారు. విషయాన్ని పోలీసులకు తెలప డంతో వారు హోటల్ గది తలుపులు తెరిచి మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలాఉండగా, గత నెల 9న మెదక్ జిల్లా మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన బీజేపీ నేత కటికె శ్రీనివాస్ హత్యకేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే శ్రీనివాస్ హత్యతో డాక్టర్కు ఎలాంటి సంబంధం లేదని తూప్రాన్ డీఎస్పీ తెలిపారు. చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే ఇక్కడకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉరివేసుకునేందుకు నైలాన్ తాడు వాడటంతోపాటు హోటల్ గదిలో నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడ్లు లభించడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒంటిపై దుస్తులు ఎందుకు లేవనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చి.... చంద్రశేఖర్ స్వస్థలం కర్ణాటక కాగా, ఇరవై ఏళ్ల క్రితం మెదక్ వచ్చి అజంపులలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అనురాధ కూడా ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె పేరుతోనే అనురాధ నర్సింగ్హోం నెలకొల్పారు. ఇద్దరూ మంచి డాక్టర్లుగా పేరు సంపాదించారు. కొంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ భాగస్వామ్యం ఉంది. కాగా, మెదక్ జిల్లాలో ఏ స్థిరాస్తి కొనాలన్నా చంద్రశేఖర్ ముందుండేవారన్న పేరుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. చంద్రశేఖర్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. గదిలో 140 నుంచి 150 వరకు నిద్ర మాత్రలున్నాయి. మూడు సర్జికల్ బ్లేడ్లు కూడా లభించాయి. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా? అనేది ఆరా తీస్తున్నాం. వెల్దుర్తి పరిధిలో నమోదైన శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ను పోలీసులు పిలిచి విచారించారు. – ఆకుల చంద్రశేఖర్, కూకట్పల్లి ఏసీపీ -
‘మెదక్ కారు డెత్’ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన డా.ఆర్.చంద్రశేఖర్ మెదక్లో 20 ఏళ్లుగా అనురాధ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా నివసిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారులో హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపణలు చేశారు. ఆ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను రిమాండుకు తరలించారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఆ కేసుపై భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో చంద్రశేఖర్ తన భార్యతో కలిసి వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన అనంతరం భార్య తిరిగి మెదక్కి వెళ్లింది. చంద్రశేఖర్ కేపీహెచ్బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్లో రూమ్ నం.314లో బస చేశాడు. గదిలోకి వెళ్లిన అతడు ఎంతకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్కు చేరుకొని గది తలుపులు తెరచిచూడగా చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్ర శేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రూమ్లో సర్జికల్ కత్తులు, స్లీపింగ్ పిల్స్ లభించాయని తెలిపారు. ఆయనపై మెదక్ కారు దగ్ధం శ్రీనివాస్ కేసులో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్బీ పోలీస్లు రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: యువతులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాలోని ఇద్దరిని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్ –1లోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతో కలిసి కేపీహెచ్బీ పోలీసులు దాడులు నిర్వహించారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్ (22), కేపీహెచ్బీకాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన మేకల కృపాకర్(29)లను అరెస్టు చేశారు. బాధితురాలిని రీహాబిలేషన్ సెంటర్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం -
అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సమాచారం మేరకు... కేపీహెచ్బీకాలనీ మొదటి ఫేజ్లోని ఈడబ్ల్యూఎస్ 702 గృహంలో కొన్ని రోజులుగా కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు. సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడిచేసిన పోలీసులు ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్కు తరలించి యువకులు సురదామసీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
రెండేళ్లు నమ్మకంగా నటించి ముంచేశాడు
కేపీహెచ్బీకాలనీ: వృద్ధ దంపతులకు కేర్టేకర్గా ఉంటూ ఇంట్లోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం..కేపీహెచ్బీకాలనీ ఫేజ్–5కు చెందిన సూరపనేని మోహన్రావు (75) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు కేర్ టేకర్గా కావాలని సైనిక్పురిలోని వీకేర్ ఏజెన్సీని సంప్రదించగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మెరుగు శశికిరణ్ను నియమించారు. 2018 నుంచి మోహన్రావు ఇంట్లో పనిచేస్తున్న శశికిరణ్ వారితో నమ్మకంగా ఉన్నాడు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యం, ఇతరత్రా వ్యసనాలకు బానిసైన శశికాంత్ కన్ను ఆ ఇంట్లో ఉన్న నగదుపై పడింది. మార్చి 28న మధ్యాహ్నం మోహన్రావు నిద్రలో ఉండగా బీరువాలోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించి ఏమీ తెలియనట్లుగా వివిధ కారణాలతో తాను కేర్టేకర్ బాధ్యతలను నుంచి తప్పుకుంటున్నానని, చెప్పి మార్చి 28న మరో వ్యక్తిని నియమించి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా మార్చి 30న మోహన్రావు సమీప బంధువు సీతారామస్వామికి డబ్బు అవసరం ఉండటంతో డబ్బు ఇచ్చేందుకు బీరువాను తెరిచి చూశాడు. బీరువాలో ఉండాల్సిన డబ్బు కనిపించలేదు. దీంతో శశికిరణ్పై అనుమానం వ్యక్తం చేస్తూ కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శశికిరణ్ సైనిక్పురిలోని వీకేర్ ఏజెన్సీకి సమీపంలో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ.1.05 లక్ష జల్సాకు వాడుకున్నట్లు నిందితుడు తెలిపాడు. శశికిరణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. (చదవండి: ఈ కాలేజీలో చదవలేను.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను ) -
హైటెక్ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్ ఉన్న హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ స్టేషన్ మార్గంలో కష్టాలు తీరనున్నాయి. ఇక జేఎన్టీయుహెచ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. చదవండి: సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి -
కూకట్పల్లి: మందులోకి నీళ్లు ఇవ్వాలంటూ..
సాక్షి, కేపీహెచ్పీకాలనీ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేసిన ఘటన కేపీహెచ్పీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్పీకాలనీలోని పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్దకు ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చారు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. దీంతో సోడాలు అమ్ముకునే వ్యక్తి నీరు ఇచ్చేందుకు నిరాకరించాడు. కోపోద్రిక్తులైన ఆ యువకులు సోడా బండిలోని సోడాలు, మంచినీటి డబ్బాను కింద పడేశారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు తాను పోలీస్ అధికారి కొడుకునంటూ ఇన్నోవా వాహనం సైరన్ మోగించి భయభ్రాంతులకు గురి చేయగా, సోడాలు అమ్మే వ్యక్తి 100కు డయల్ చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అరుణ్, శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఓ పోలీస్ అధికారి కుమారుడు కాగా, అరుణ్ డాక్టర్. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి.. -
సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా
కేపీహెచ్బీకాలనీ: బైక్లు నడపాలనే సరదా చోరీలు చేసేలా తయారు చేసింది. మూడు బైక్లను దొంగిలించి కేపీహెచ్బీ పోలీసులకు చిక్కాడు. వాహనాలను స్వాదీనం చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఆ యువకుడిని రిమాండ్కు తరలించారు. డీఐ నాగిరెడ్డి తెలిపిన మేరకు.. హైటెక్ సిటీ ప్రాంతంలోని చందానాయక్ తండాలో నివాసముండే ఇత్తడి అరుణ్(19) కొండాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆఫీస్బాయ్. ఇతడి తల్లిదండ్రులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అరుణ్కు బైక్ల మీద దూసుకువెళ్లాలనే సరదా ఉండేది. దీంతో బైక్లను దొంగిలించి తన సరదా తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో ఒక బైక్, మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మరో బైక్ను దొంగిలించాడు. ఈ రెండు బైక్లు నచ్చకపోవటంతో కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని మరో బైక్ను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం జేఎన్టీయూ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న కేపీహెచ్బీ పోలీసులకు నంబర్ ప్లేట్ లేని బైక్పై తిరుగుతూ అటువైపుగా వచ్చిన అరుణ్ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోగా బైక్కు సంబంధించిన పత్రాలు అతడి వద్ద లేవు. దీంతో పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి మూడు బైక్లను స్వా«దీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. చదవండి: తల్లీ-కొడుకు బైక్పై వెళ్తుండగా ప్రమాదం -
కూకట్పల్లిలో ‘స్మార్ట్’ పార్కింగ్, గంటకు రూ.10 మాత్రమే!
కేపీహెచ్బీకాలనీ: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో పార్కింగ్ ఓ సవాల్గా మారింది. ముఖ్యంగా షాపింగ్ మాళ్లు కొలువుదీరిన ప్రాంతాల్లోనైతే పార్కింగ్ కోసం పరేషాన్ కావాల్సిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య సైతం ఉత్పన్నమై అటు వాహన చోదకులతో పాటు ట్రాఫిక్ పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా పార్కింగ్ సమస్య గుదిబండగా మారిన దృష్ట్యా ‘స్మార్ట్’ పార్కింగ్ దిశగా జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఒకప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం అంటే ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం నిరి్మంచేవారు. కానీ.. నేడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టడంతో పాటు ఆధునిక హంగులకు నిలయంగా మారింది. రద్దీకి చిరునామైనా కూకట్పల్లి హౌసింగ్బోర్డు ఫోరం మాల్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద నగరంలోనే మొదటిసారిగా చేపట్టిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్ కేంద్రమే ఇందుకు నిదర్శనం. ► దాదాపుగా రూ. 48 లక్షలతో ఏర్పాటు చేసిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్లో 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ► అక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించి యాప్ ద్వారా పార్కింగ్ వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ► నేరుగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి వెళ్లినా స్లాట్ ఖాళీగా ఉంటేనే అనుమతి లభిస్తోంది. ► పార్కింగ్ కేంద్రం వద్దకు వెళ్లగానే ముందుగానే యాప్లో పొందుబర్చిన వివరాల ఆధారంగా వాహన నెంబర్ను సెన్సార్ స్కానర్లు ఆటోమేటిక్గా స్కాన్ చేస్తాయి. ► కేటాయించిన పార్కింగ్ గడిలో వాహనాన్ని పార్క్ చేసినప్పటి నుంచి మళ్లీ వాహనం తీసుకెళ్లే సమయాన్ని ఆటోమేటిక్గా సెన్సార్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ గణించి గంటకు రూ.10ల చొప్పున చెల్లించాలని సూచిస్తుంది. ఆ మేరకు చెల్లింపు పూర్తి కాగానే వాహనంతో బయటకు వెళ్లేందుకు గేటు ఓపెన్ అవుతుంది. ► ఇందులో మహిళలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లను సైతం ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్వహణ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ► స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి ఎదురుగానే ఫోరం సుజనామాల్, పక్క వీధిలో డీ–మార్ట్ వంటి షాపింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా గంటకు రూ.10 చొప్పున స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని వాహనదారులు ఏ మేరకు వినియోగించుకుంటారనేది సందేహంగానే ఉంది. ► షాపింగ్ మాల్స్లో మొదటి అరగంట ఉచిత పార్కింగ్ అవకాశం ఉండడంతో పాటు ఏదైనా షాపింగ్ చేసినా బిల్లు చూపిస్తే మిగతా సమయానికి పార్కింగ్ ఉచితంగానే లభిస్తుంది. ► ఈ నేపథ్యంలో స్మార్ట్ పార్కింగ్ కేంద్రంలో గంటకు రూ.10కి బదులు 2, 3 గంటలకు రూ.10 చొప్పున వసూలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► మరో వైపు ప్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై వేయించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. -
దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలోని హౌజింగ్బోర్డు కాలనీలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. చరణ్ అనే పదేళ్ల యువకుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే కుమారుడు సరిగా చదువుకోవడం లేదని తండ్రి అతనిపై పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. అంతేగాక కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్పై టర్పెంటైల్ పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్లో జరిగిందా? -
కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాందేవ్ ఎలక్ట్రికల్ హార్ట్వేర్ షాపులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాపులోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. అయితే ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. -
రూ. 100కే ‘మ్యాచ్ ఫైండర్’ సభ్యత్వం!
హైదరాబాద్: భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న వివాహ సంబంధాల పరిచయ వేదిక మ్యాచ్ ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (matchfinder.in) వినియోగదారుల కోసం మరిన్ని సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ రూ.100కే సభ్యత్వ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమమైన వివాహ సంబంధాల వేదికగా నిలవడం, తక్కువ ధరకే సభ్యత్వం అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ కుమార్ రష్మి గౌతమ్ ఈ సేవలను ప్రారంభించారు. కేపీహెచ్బీ కాలనీలోని మ్యాచ్ఫైండర్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మ్యాచ్ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రత్తయ్య, మ్యాచ్ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా మ్యాచ్ఫైండర్ ద్వారా ఆన్లైన్లో వివాహ సంబంధాలు కుదిర్చే సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ డాటాబేస్లో 2లక్షలకు పైగా ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్నవారికి, తమ రిజిష్టర్డ్ యూజర్ల కోసం సులభంగా వినియోగించుకోగలిగిన, సురక్షితమైన రీతిలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వివాహ పరిచయ రంగానికి సంబంధించిన వ్యాపార రంగంలో మునుపెన్నడూ లేని రీతిలో మొట్టమొదటి సారిగా రూ.100కే సభ్యత్వం అవకాశం కల్పిస్తున్నామన్నారు. మరే ఇతర మ్యాట్రిమోని సైట్ కూడా ఇంత తక్కువ ధరలో సభ్యత్వం అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలుస్తుందని, తమను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని భావించే వినియోగదారులు మ్యాచ్ఫైండర్.ఇన్ (matchfinder.in) లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం, సదరు వ్యక్తి తన ఆసక్తులకు తగిన రీతిలో భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఈ సమయంలోనే వారు కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం సంబంధిత సభ్యులు అందించిన డాటా ఆధారంగా వారిని సంప్రదించవచ్చు. ఈ సౌలభ్యం వివాహ సంబంధాల ప్రయత్నాల్లో ఉన్నవారికి పెద్ద వెసులుబాటుగా నిలుస్తుంది. దీంతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్, పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మేం అందిస్తున్నాం’’ అని తెలిపారు. ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి: రష్మి ఇక సినీ నటి రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి సంబంధాలు స్వర్గంలో కుదుర్చబడతాయి’’ అనేవారు.. అయితే.. ప్రస్తుతం వివాహ సంబంధాలు ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి. మన జీవనశైలి ప్రస్తుత పరిస్థితుల్లో సంక్లిష్టంగా మరియు ఒత్తిళ్లమయంగా మారిపోయింది. ఈ తరుణంలో జీవిత భాగస్వామిని అన్వేషించడం కష్టమైన అంశంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు పిల్లలకే వదిలివేసినప్పటికీ... యువతకు సరైన సంబంధం వెతుక్కోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వివాహ సంబంధాలను కుదిర్చే సైట్లపై ఆధారపడుతున్నారు.ఫాస్ట్ఫుడ్ లేదా ఇన్స్టంట్ నూడుల్స్ వలె, ప్రస్తుత తరానికి వివాహం సైతం సౌకర్యవంతంగా మరియు వేగంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రతి ఒక్కరి చూపు మ్యాట్రిమోనీ వెబ్సైట్లపై పడింది. అలాంటి వెబ్సైట్లలో టాప్లో నిలిచేది మ్యాచ్ఫైండర్’’ అని పేర్కొన్నారు. ఆర్థికంగా ఏమాత్రం భారం కాదు ‘‘మ్యాచ్ఫైండర్.ఇన్లో సులభంగా ఉపయోగించే వీలున్న వెబ్సైట్. ఇతర వెబ్సైట్లతో పోలిస్తే, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటం, ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాని రీతిలో ఉంది. రూ.100 ఫీజు అనేది నామమాత్రపు రుసుం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మ్యాచ్ఫైండర్ వెబ్సైట్లో అధునాతన టెక్నాలజీని వినియోగించి, అద్భుతమైన ఆప్షన్లతో మెరుగైన సేవలు అందించబడుతున్నాయి. ఈ వెబ్సైట్లో ఉన్న ఎక్స్లెంట్ ప్రొఫైల్స్ కారణంగా తమకు అత్యంత నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల మీ జీవితానికి సరైన భాగస్వామిని పొందవచ్చు, భాగస్వామితో ఎలాంటి సమస్యలు లేని జీవితం గడపవచ్చు. దీంతోపాటుగా సంబంధిత వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్, వారి ఆసక్తులు, ఆహారపు అలవాట్లు సహా అనేక ఇతర అంశాలు వెబ్సైట్లో పొందుపర్చబడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లికాని వారు తమ జీవితానికి తగిన భాగస్వామిని మ్యాచ్ఫైండర్.ఇన్లో పొందవచ్చు. కులం, మతం, భాష, సమాజం వంటి అంశాలకు అతీతంగా అందరికీ ఉపయుక్తంగా నిలిచే వెబ్సైట్ ఇది. నూతనంగా ఏర్పాటు చేయబడిన మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్లో లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వినియోగదారులు సేవలు పొందిన అనంతరం వారి సంతృప్తి స్థాయి పెరుగుతుంది. మ్యాచ్ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ను అత్యంత సుశిక్షితులైన ఎగ్జిక్యూటివ్లు నిర్వహిస్తూ వినియోగదారులతో అన్ని భాషల్లోనూ ఆత్మీయ సంభాషణలు చేయగలుగుతారు. ఈ ఎగ్జిక్యూటివ్లు ఓపికగా వినియోగదారుల అభిప్రాయాలు వినడం, సరైన స్పందన ఇవ్వడం అనే లక్షణాలతో పాటుగా మంచి వ్యవహారిక నైపుణ్యాలు, ఉత్తమమైన నిర్వహణ సంబంధ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నవారు. వినూత్నమైన ఈ రూ.100 సభ్యత్వ రుసుం ప్లాన్.. తొలిసారిగా వినియోగదారుల కోసం ప్రవేశపెట్టబడింది. వివాహ సంబంధాల విషయంలో తమకు సరైన వారిని ఎంచుకునేందుకు మెరుగైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్లాన్ వినియోగించుకునేందుకు రూ.100 చెల్లించడం వల్ల, సంబంధిత వ్యక్తి తమకు ఆసక్తి ఉన్న వారి యొక్క ప్రొఫైల్, సంప్రదించాల్సిన వివరాలు పొందవచ్చు. ఈ సభ్యత్వానికి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ పరిమితి ముగిసిన అనంతరం వినియోగదారుడు సంస్థను సంప్రదించి టాప్-అప్ సేవలు పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాల్సిన వారు చేయాల్సిందల్లా కేవలం మ్యాచ్ఫైండర్ వెబ్సైట్ (matchfinder.in) లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ ప్లాన్ కొనుగోలు చేయడమే. అనంతరం తమకు నచ్చిన ప్రొఫైల్ను సంప్రదించవచ్చు. మ్యాచ్ఫైండర్ యొక్క ఈ రెండు ఆవిష్కరణలు నిర్వహణ సంబంధమైన మెరుగైన సేవల అందించడమే కాకుండా వినియోగదారులకు ఆర్థికంగా కూడా భారం కాకుండా ఉపయోగపడతాయి. వివాహ సంబంధాల పరిశ్రమలో ఈ నిర్ణయాలు కొంగొత్త మార్పులకు వేదికగా నిలుస్తాయి. మ్యాచ్ఫైండర్ యొక్క ఈ నూతన టెక్నాలజీ వల్ల వినియోగదారులకు గొప్ప సేవల అనుభూతి రావడమే కాకుండా రాబోయే కాలంలో మ్యాచ్ఫౌండర్కు చెందిన ఖాతాదారుల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ రానుంది. ఈ కొత్త రూ.100 మెంబర్షిప్ ప్లాన్ వల్ల వివాహ సంబంధమైన పరిశ్రమలో అధిక చార్జీల భారం మోపే విధానానికి తెరపడనుంది. అంతేకాకుండా గతంలోనే చూసిన, పదే పదే కనిపించే ప్రొఫైళ్లను తిరిగి వీక్షించాల్సిన ఇబ్బంది కూడా తప్పుతుంది’’ అని రత్తయ్య ఈ సందర్భంగా తెలిపారు. మ్యాచ్ఫైండర్ గురించి.. మ్యాచ్ఫైండర్, భారతదేశంలో అందుబాటు ధరల్లో వివాహ సంబంధ సేవలు అందిస్తున్న వెబ్సైట్. తెలుగు, బెంగాళీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ వంటి బహుళ భాషల్లో సేవలు అందిస్తోంది. భారతదేశంలోని దాదాపు 2000 పైచిలుకు సామాజికవర్గాలకు చెందిన వధూవరులకు చెందిన సమాచారం కలిగిన సురక్షిత వేదిక. ఈ సైట్లోకి సైన్ అప్ అవడం ఉచితం. వివాహ సంబంధాల పరిచయాలతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్ మరియు పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మ్యాచ్ఫైండర్ అందిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతామని సంస్థ స్పష్టం చేస్తోంది. ప్రతిరోజూ మరియు వారానికోమారు వివాహ సంబంధమైన సమాచారం అందించడం, సమగ్రమైన మరియు సింగిల్ పేజ్ రిజిస్ట్రేషన్ వంటి ఇతర వాల్యూ అడిషన్లను సైతం సైట్ అందిస్తోంది. ♦ (అడ్వర్టోరియల్) -
కేపీహెచ్బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు
కేపీహెచ్బీకాలనీ: కేపీహెచ్బీ పోలీసులతో కలిసి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ రోడ్ నంబర్–1లోని ఎమ్ఐజీ–59లోని ఫ్లాట్ నంబర్–202లో యూనివర్సల్ హెయిర్ అండ్ స్పా నిర్వహిస్తున్నారు.ఆన్లైన్లో విటులను ఆకర్శించి వ్యభిచారం చేయిస్తున్నారు. మసాజ్ పేరుతో ఈ తతంగం నిర్వహిస్తున్నారు. విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆదివారం స్పాపై దాడి చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు యువతులను రెస్క్యూహోమ్కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ.1.36 లక్షల నగదు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
అప్పటి నుంచి సతీష్పై ద్వేషం పెంచుకున్న హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్ను హేమంత్ హత్య చేశాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రియురాలును దూరం చేస్తున్నాడనే భావనతోనే హేమంత్ సతీష్ను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. (చదవండి : సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య) ‘గత నెల 28న సాఫ్టవేర్ ఇంజనీర్ సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడు హేమంత్ను అరెస్ట్ చేశాం. విచారణలో సతీష్ స్నేహితుడు హేమంత్ పై అనుమానం వచ్చింది. దీంతో అతని ఇంటికి వెళ్లి చూశాం. హేమంత్ ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తాళం విరగొట్టి చూస్తే సతీష్ బాడీ ఇంట్లో ఉంది. దీంతో హేమంత్ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజాన్ని ఒప్పకున్నాడు. అప్పటి నుంచి సతీష్పై ద్వేషం పెంచుకున్నాడు సతీష్, హేమంత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. సతీష్ 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి , సాఫ్ట్ వేర్ సోల్యూషన్ లో కోచింగ్ ఇస్తున్నాడు. మరో వైపు హేమంత్ చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ మధ్యలోనే మానేసేవాడు. ఓ సందర్భంలో సతీష్ను హేమంత్ కలుసుకొని ఉద్యోగం ఇప్పించమని కోరారు. దీంతో తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత హేమంత్, సతీష్ భాగస్వాములుగా ఓ ఐటీ కంపెనీని నిర్వహించారు. ఈ సందర్భంగా 2016లో తన దగ్గర కోచింగ్ తీసుకొని తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న ప్రియాంకను సతీష్ హేమంత్కు పరిచయం చేశాడు. అంతకు ముందే సతీష్కు ప్రియాంకకు మధ్య సాన్నిహిత్యం ఉండేది. ప్రియాంక కేపీహెచ్బీలో హాస్టల్లో ఉండేది. కాగా కొద్ది రోజుల తర్వాత ప్రియాంకతో హేమంత్కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ విషయం హేమంత్ భార్యకు తెలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో హేమంత్, ప్రియాంక ఒక గది రెంట్కి తీసుకొని ఉంటున్నారు. గత మూడు నెలలుగా హేమంత్, ప్రియాంక ఒకే గదిలో ఉన్నారు. ఈ విషయం సతీష్కు తెలియడంతో హేమంత్ను హెచ్చరించాడు. ఆ అమ్మాయికి భవిష్యత్ ఉందని, ఆమెతో కలిసి ఉండొద్దని హేమంత్కు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే కంపెనీకి నష్టాలు రావడంతో జీతం కూడా తగ్గించాడు. అప్పటి నుంచి సతీష్పై హేమంత్ ద్వేషం పెంచుకున్నాడు. ప్రియాంక దూరం అవుతుందని, భావించి కక్ష పెంచుకొని సతీష్ను హత్య చేయాలని పథకం పన్నాడు. పక్కా ప్లాన్తో హత్య చేశాడు గత నెల 28న సతీష్ను హేమంత్ తన ఇంటికి ఆహ్వానించారు. పార్టీ చేసుకుందని చెప్పి నమ్మించి ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరు మద్యం సేవించారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో సతీష్ను దారుణంగా హత్య చేశాడు. సుత్తెతో సతీష్ తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం బాడీని కారులో తరలించాలని చూశాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. తిరిగి రూమ్లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నిందితుడు హేమంత్ అని తేల్చాం’ అని డీసీపీ మీడియాకు వివరించారు. -
వాళ్లకు వివాహేతర సంబంధం లేదు: హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు హేమంత్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణలో భాగంగా హేమంత్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సతీశ్ను తానే హతమార్చినట్లు అంగీకరించిన హేమంత్..ఈ హత్యతో ప్రియాంకకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా అందరూ భావిస్తున్నట్లుగా సతీశ్- ప్రియాంకల మధ్య వివాహేతర సంబంధం లేదని హేమంత్ తెలిపాడు. కాగా కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో సతీశ్ దారుణ పరిస్థితుల్లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వ్యాపార భాగస్వామి హేమంత్ అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చదవండి : సతీశ్ హత్యకేసులో కొత్త కోణాలు ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టగా సతీశ్, హేమంత్లకు పరిచయమున్న ప్రియాంక అనే అమ్మాయి కారణంగానే హత్య జరిగిందని భావించారు. ఏడాది కాలంగా భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్ను... ప్రియాంకతో సాన్నిహిత్యం తగ్గించుకోవాలని సతీశ్ హెచ్చరించినందుకే అతడి హత్య జరిగిందని అనుమానించారు. అదే విధంగా ఆర్థిక లావాదేవీల విషయంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఈ క్రమంలో సతీశ్ కాల్డేటా పరిశీలించిన అనంతరం హేమంత్ను అదపులోకి తీసుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహా పలు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం హేమంత్ నేరం అంగీకరించడంతో.. అతడికి ఎవరు సహకారం అందించారన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పోలీసుల అదుపులో నిందితుడు హేమంత్
-
పోలీసుల అదుపులో హేమంత్
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసు నిందితుడు హేమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో హేమంత్ను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. సతీష్ను తాను ఒక్కడినే హత్య చేశానని, ఇందులో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని హేమంత్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గత నెల 27న సతీష్ను హేమంత్ దారుణంగా హత్య చేశాడు. స్నేహితురాలు ప్రియాంకను హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సతీష్.. రాత్రి 8 గంటలకు హేమంత్ రూమ్కి వెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మాటల మధ్యలో ఆఫీస్లో పనిచేస్తున్న అమ్మాయితో హేమంత్కు ఉన్న అక్రమ సంబంధ విషయం చర్చకు వచ్చింది. అక్రమ సంబంధం మానుకోవాలని హేమంత్ను సతీష్ హెచ్చరించాడు. (చదవండి : సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు) దీంతో భయపడిన హేమంత్.. ఈ విషయాన్ని సతీష్ అందరికి చెబుతాడని, ఎప్పటికైనా తనకు అడ్డుతగులుతాడని భావించి హత్యకు కుట్ర పన్నాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో సతీష్ మెడ కోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలని భావించాడు. ప్యాకింగ్ కోసం బయటకు వెళ్లి నల్లటి కవర్లు కొన్నాడు. అనంతరం రూమ్లోకి వచ్చిన హేమంత్.. మృతదేహం కాలు నరకడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో భయపడి శవాన్ని అక్కడే వదిలి వెళ్లాడు. ఆ రోజు రాత్రంతా రోడ్లపైనే గడిపాడు. మరుసటి రోజు స్నేహితులతో గడిపాడు. అనంతరం హత్య విషయాన్ని తన సన్నిహితులకు చెప్పాడు. వారు పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చారు. కానీ హేమంత్ మాత్రం లొంగిపోకుండా బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. సతీష్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హేమంత్ కోసం ముమ్మరంగా గాలించారు. సోమవారం పోలీసులకు పట్టుబడిన హేమంత్.. నిజాన్ని ఒప్పకున్నాడు. హత్యతో తన ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని, ఒక్కడినే హత్య చేశానని హేమంత్ పోలీసులు ఎదుట ఒప్పకున్నాడు. -
సతీష్ హత్యకేసు : బయటపడుతున్న కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కోణాలు బయటపడుతున్నాయి. స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకనే హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సతీష్ కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే హత్య చేసిన రోజు హేమంత్ ఇంటికి సతీష్ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీష్ హాస్టల్ వద్ద డ్రాప్ చేసిన సీసీ పుటేజ్ను పోలీసులు సేకరించారు. ప్రియాంకను హాస్టల్లో డ్రాప్ చేసిన తర్వాత సతీష్ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది. (చదవండి : ఆమె’ కోసమేనా హత్య?) ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. గత నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే సతీష్ను హత్య చేయడానికి హేమంత్కు ఎవరు సహాయం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సతీష్ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టిస్తోన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసుకు సంబంధించి ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సతీష్, హేమంత్కు సన్నిహితంగా ఉంటున్న ఓ యువతికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్నేహితుల ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విభేదాలు ఉన్నట్లు ఆమె పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సతీష్ బాబు హత్య జరిగిన సమయంలో ఆమె కూడా హేమంత్తో ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితులు ఇద్దరు నెలకొల్పిన సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ యువతి ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెతో వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సన్నిహితంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం! ఇక పక్కా పథకం ప్రకారమే హేమంత్...సతీష్ను హతమార్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. ఈ నెల 27 రాత్రి...సంస్థ కార్యాలయంలోనే హేమంత్...సతీష్ను దారుణంగా హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య...ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా స్టేషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి..పరారయ్యాడు. అంతకుముందు రోజంతా...సతీష్ భార్య, స్నేహితులతోనే అతను కలిసి వున్నట్లు, తనకేమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న హేమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సతీష్ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్యకేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ స్నేహితుడు హేమంత్ పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు నిర్థారణకు వచ్చారు. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా స్నేహితుల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్లు ప్రియాంక పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...వాళ్లిద్దరూ బాల్య స్నేహితులు... చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసి ఏడాది క్రితమే వ్యాపారం ప్రారంభించారు. ఏమైందో ఏమో గానీ వ్యాపార భాగస్వామిగా ఉన్న స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేయడమేగాక ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్తో పార్శిల్ చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆ శవాన్ని ఇంట్లోనే వదిలేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. చదవండి: కేపీహెచ్బీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య ప్రకాశం జిల్లా, మార్టూరుకు చెందిన మైలా సతీష్బాబు (35), భీమవరానికి చెందిన హేమంత్ కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన సతీష్బాబు.. ఏడాది క్రితం హేమంత్తో కలసి కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్లో ఐటీ స్లేట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాప్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సతీష్బాబు తన భార్య ప్రశాంతితో కలసి మూసాపేట ఆంజనేయనగర్లో ఉంటున్నాడు. హేమంత్ కుటుంబం ఆల్వాల్లో నివాసం ఉంటుండగా, అతను కేపీహెచ్బీలోని 7వ ఫేజ్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఐటీ విద్యార్థులకు తరగతులు చెప్పే సతీష్ బాబు.. ఐటీ సంస్థ కార్యకలాపాలు చూసుకునేవాడు. బుధవారం రాత్రి క్లాస్ ముగిసిన అనంతరం కార్యాలయానికి వచ్చాడు. 10.30 గంటల ప్రాంతంలో తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. అర్ధరాత్రి దాటినా అతను ఇంటికి రాకపోవడంతో ప్రశాంతి అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. గురువారం అతని ఆచూకీ తెలియకపోవడంతో కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హేమంత్ సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో అనుమానం.. సతీష్ బాబుతో పాటు హేమంత్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావటంతో అనుమానం వచ్చిన ప్రశాంతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు హేమంత్ కోసం ఆరా తీయగా ఆచూకీ లభించలేదు. సెల్ఫోన్ టవర్ లొకేషన్ ద్వారా ఆధారంగా అతను కేపీహెచ్బీ 7వ ఫేజులో ఉన్నట్లు గుర్తించారు. హేమంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు దుర్వాసన రావడంతో తాళం పగులగొట్టి చూడగా సతీష్ దారుణంగా హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి ఉండటంతో పాటు కడుపు, కాళ్లపై కత్తిగాట్లున్నాయి. కుడికాలు మోకాలు వరకూ కట్చేసి ఉంది. ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, పొడవాటి టీవీ అట్టపెట్టెలు కనిపించాయి. మృతదేహంపై ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంది. దీంతో హేమంతే ఈ హత్య చేసి పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితమే ఆఫీస్ సమీపంలో ఇండిపెండెంట్ హౌస్ను అద్దెకు తీసుకోవడం మొదలు సతీష్ బాబును ఇంటికి రప్పించి హత్య చేసే వరకూ పథకం ప్రకారమే సాగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్య సమయంలో హేమంత్తో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
ఫోరమ్మాల్ ఫ్లైఓవర్పై ఆక్సిజన్ సిలీండర్ పేలుడు
-
ప్రాణం తీసిన ప్రేమ..
కేపీహెచ్బీకాలనీ: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు...పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు..యువతి తల్లిదండ్రులు మందలించినా తీరు మార్చుకోలేదు...చివరికి ఏమైందో అతడి సమక్షంలోనే ఓ యువతి విషం కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, మైసంపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాల లక్ష్మణ్, స్వరూప దంపతుల కుమార్తె సిద్దిరాల జ్యోతి (24) డిగ్రీ పూర్తి చేసింది. కేపీహెచ్బీకాలనీ నాలుగో ఫేజ్లో ఉంటూ బేగంపేట ప్రకాష్నగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఆపరేటర్గా పనిచేస్తోంది. డిగ్రీ చదువుతున్న సమయంలో తన స్నేహితురాలి సోదరుడు రాకేష్రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా రాకేశ్రెడ్డి ప్రేమిస్తున్నానంటూ జ్యోతి వెంటపడుతుండటంతో బాధితురలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె తండ్రి లక్ష్మణ్ రాకేష్రెడ్డి్డని పలుమార్లు మందలించాడు. అయినా రాకేష్రెడ్డి్డ తన వైఖరి మార్చుకోకపోగా జ్యోతికి పలుమార్లు ఫోన్చేసి వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి ఆమె కాలనీలోని తొమ్మిదో ఫేజ్లో ఉన్న పార్కుకు వచ్చింది. ఆ తర్వాత గంట సేపటికి జ్యోతి సెల్ నుంచే రాకేశ్రెడ్డి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి విషం తాగిందని అనుపమ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం అందించాడు. దీంతో వారు ఆసుపత్రికి చేరుకోగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. మంగళవారం మధ్యాహ్నం జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో జ్యోతి తల్లిదండ్రులు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు రాకేష్రెడ్డి్డని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జ్యోతి, రాకేష్రెడ్డి్డ మొబైల్ఫోన్లో జరిగిన సంబాషణలు, మెసేజ్లను పరిశీలిస్తున్నారు. కాగా రాకేష్ రెడ్డి కూల్డ్రింక్లో విషం కలిపి తాగించి జ్యోతిని హత్య చేశాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాలెన్నో? జ్యోతి మృతిపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జ్యోతి పార్కుకు రావాల్సిన అవసరం ఏముంది. స్వతహాగా వచ్చిందా..రాకేష్రెడ్డి ఒత్తిడిమేరకు వచ్చిందా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిద్దరి సెల్ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్లపై దర్యాప్తు చేపట్టారు. -
ఓ అమ్మ విజయం
సాక్షి, హైదరాబాద్: కొడుకు, కోడలు తనను తన ఇంటినుంచి వెళ్లగొడితే అందరిలాగా ఆ వృద్ధురాలు మౌనంగా ఉండలేదు. పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారు కూడా పట్టిం చుకోలేదు. అయినా.. బెదరలేదు. తన ఖర్మ అని వదిలేయలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులపై న్యాయ పోరాటానికి దిగారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కొడుకు, కోడలిపై ఆ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు జరపాలని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులను ఆదేశించింది. కొడుకు, కోడలి వద్దకు రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలిని తిరిగి చేర్చాలని, రక్షణ కల్పించాలని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఆదేశించారు. కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలోని శ్రీనిలయంలో ఉంటున్న తనను తన కొడుకు, కోడలు గెంటేయడమే కాకుండా, చంపేందుకు సైతం ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించేలా చూడాలంటూ వి.శివలక్ష్మీ కేపీహెచ్బీ పోలీసులకు గతేడాది అక్టోబర్ 31న రెండు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చారు. అయితే ఆ ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె కేపీహెచ్బీ పోలీసులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు విచారణ జరిపారు. శివలక్ష్మీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వృద్ధురాలని చూడకుండా కొడుకు, కోడలు ఇంటినుంచి బయటకు గెంటేశారని తెలిపారు. ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించారన్నారు. వారి తీరుపై ఫిర్యాదు చేయడమే కాకుండా తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం కింద రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదన్నారు. ఇకపై జాగ్రత్తగా చూసుకుంటాం కొడుకు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తండ్రి కొనుగోలు చేసిన స్థలంలో నిర్మించిన అపార్ట్మెంట్లో తమ కుటుంబానికి ఆరు ఫ్లాట్లు వచ్చాయని, ఇందులో తల్లితో పాటు తమ ఇద్దరు సోదరులకు సైతం వాటా ఉందన్నారు. ఇందులో రెండు ఫ్లాట్లు అమ్మేశామని, మిగిలినవి ఉమ్మడి కుటుంబంగా ఉన్న తల్లి, తమ సోదరుల పేర్లపైనే ఉన్నాయన్నారు. ఇకపై తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారన్నారు. పోలీసుల తరపు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ.. పిటిషనర్ ఫిర్యాదుల ఆధారంగా గతేడాది నవంబర్ 24న కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఆస్తి వివాదం కాబట్టి, సంబంధిత న్యాయస్థానంలో తేల్చుకోవడం ఉత్తమమన్నారు. తల్లిని ఇకపై జాగ్రత్తగా చూసుకుంటామన్న కొడుకు నిర్ణయాన్ని స్వా గతిస్తూ.. ఆమె ఇంటిని ఆమెకిచ్చేందుకు ఎటువంటి అడ్డంకులు సృష్టించబోరని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ వృద్ధురాలికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. -
చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని..
కేపీహెచ్బీకాలనీ: చెల్లికి పెళ్లి చేయలేకపోతున్నానని మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉ న్నాయి. అడ్డగుట్ట సొసైటీలో ఉంటున్న గోవింద్, లావణ్య(30) దంపతులు స్థానిక శ్రీరామ అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అయితే లావణ్య తన సోదరికి వివాహం చేయలేకపోతున్నాననే గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో మనస్తాపానికిలోనైన ఆమె ఈనెల 3న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెల్లించి..వంచించి..!
కేపీహెచ్బీకాలనీ: కరక్కాయపొడి పేరుతో వందలాదిమందికి టోకరా వేసిన ‘సాప్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్స్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ యజమాని మాటూరి దేవరాజు అనిల్కుమార్ పథకం ప్రకారమే రూ. కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. పెట్టుబడులు పెట్టిన వినియోగదారులతో పాటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిణులతో పదోన్నతులు, ప్రోత్సాహకాల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ యజమాని అందులో పనిచేస్తున్న ఉద్యోగిణులకు కూడా మొఖం చూపించకుండా జాగ్రత్త పడటం, మేనేజర్, కిందిస్థాయి ఉద్యోగిణులకు అన్ని కార్యకలాపాలు అప్పగించడం ఇందులో భాగమేనని పేర్కొంటున్నారు. కరక్కాయలను కొనుగోలు చేసి మోసపోయిన బాధితులు మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో కేపీహెచ్బీ పోలీస్స్టేషన్కు తరలివచ్చి ఫిర్యాదు చేశారు. రూ. వేలల్లో ఎర..రూ.కోట్లల్లో టోకరా సంస్థను స్థాపించిన ఆరు నెలల వ్యవధిలో మొదటి మూడు నాలుగు నెలల పాటు డబ్బులను తిరిగి చెల్లించిన సంస్థ ప్రతినిధులు జూన్, జులై మాసాల్లోనే రూ.లక్షల్లో డిపాజిట్ల రూపంలో సేకరించారు. చివరి నెలరోజుల్లోనే రూ.కోట్లతో ఉడాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన మహిళలకు మొదట్లో డబ్బులు తిరిగి చెల్లించి వారు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేలా ప్రోత్సహించారు. దీంతో పలువురు రూ.లక్షలు చెల్లించి క్వింటాల కొద్ది కరక్కాయలను కొనుగోలు చేశారు. పలువురి వద్ద డబ్బులు తీసుకొని కరక్కాయలను కూడా ఇవ్వలేదని సమాచారం. వరంగల్ జిల్లా, పోచమైదాన్ ప్రాంతానికి చెందిన మహిళలు, పొదుపు సంఘాలు భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలిపారు. వారు కరక్కాయ పొడిని సైతం తీసుకొని పోలీస్స్టేషన్కు వచ్చారు. అప్పులు చేసి కరక్కాయలు కొన్నామని, పోలీసులే తమను ఆదుకోవాలని బాధిత మహిళలు యాకూబీ, అక్తర్బీ, అసియా, సాబేరా, అహ్మదీ, మహాబూబీ, రెహానాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఆకర్షనీయమైన ప్రకటనలు ఇవ్వడంతో పలువురు నిరుద్యోగ యువతులను ఉద్యోగానికి కుదుర్చుకోవడంలోనే కుట్ర దాగిఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ముందస్తు శిక్షణ, ప్రాథమిక దశల పేరుతో ఉద్యోగినులను కరక్కాయ పొడి కొనుగోలు, విక్రయాలకు ప్రోత్సహించినట్లు సమాచారం. తమతోనూ పెట్టుబడులు పెట్టించినట్లు ఉద్యోగిణులు వాపోయారు. పథకం ప్రకారం ఉద్యోగిణుల సెల్నెంబర్లనే మోసాలకు వాడుకోవడం, వారి ద్వారానే పెట్టుబడులు రాబట్టడం గమనార్హం. ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీసులు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటుచేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆన్లైన్ యాడ్స్ పేరుతో మరో మోసం.... ఇంటివద్దనే రూ.పదివేలకు పైగా సంపాదించవచ్చునని పైన్మిత్రా ఆన్లైన్ సంస్థ ద్వారా యాడ్స్ ప్రమోషన్ పేరుతో ఒక్కో ప్రకటనకు రూ. 3వేలు వసూలు చేసి వాటిని ఆన్లైన్ మాద్యమాలలో పోస్టు చేసిన వారికి రోజుకు రూ.100 చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మవాణి అనే మహిళ రూ. 2లక్షలు మోసపోయినట్లు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పైన్ మిత్రా సంస్థపై కేసులు నమోదు చేశారు. పరారీలో నిందితులు.... యజమాని మూడు రోజులుగా అందుబాటులో లేకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో మేనేజర్ మల్లిఖార్జున్ కూడా కిందిస్థాయి ఉద్యోగులకు సమాచారం ఇచ్చి రెడ్ బస్ యాప్లో నెల్లూరుకు టికెట్ బుక్ చేసుకొని పరారైనట్లు తెలిసింది. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు బాధితులకు సమాచారం ఇచ్చి పోలీసుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు అనిల్కుమార్, మేనేజర్ మల్లిఖార్జున్ ఆచూకీ కనిపెట్టేందుకు కేసును సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల సదరు విభాగానికి బదిలీ అయిన కేపీహెచ్బీ అదనపు సీఐ గోపీనా«థ్ దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. -
కేపీహెచ్బీ కాలనీలో ఘరానామోసం
-
కరక్కాయలకు 40లక్షలు చెల్లించాడు..!
కేపీహెచ్బీకాలనీ: కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్లల్లో వసూలు చేసి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం కేపీహెచ్బీ సీఐ కుషాల్కర్ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్బీకాలనీ రోడ్డునెంబర్ 1లోని ఎంఐజి 1–165లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. ఆయుర్వేద మందుల తయారీకిగాను కరక్కాయ పొడిని కొనుగోలు చేస్తున్నట్లు, ఇంటివద్ద ఉండే మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోవచ్చునని పలు టీవీ చానళ్లలో 6309390734 ఫోన్ నంబర్తో సహా ప్రకటనలు ఇచ్చారు. దీంతో పలువురు సదరు నంబర్ను సంప్రదించగా కరక్కాయలను తామే అందిస్తామని కిలో కరక్కాయలకు రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, పొడిగా మార్చి తీసుకువస్తే అదనంగా రూ.300 లాభం కలిపి మొత్తం 1300 ఇస్తామని తెలిపారు. పొడి రూపంలో తీసుకు వచ్చిన కొందరికి రూ.1300 చొప్పున చెల్లించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంగా డిపాజిట్లు చేసి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంస్థ మేనేజర్ ముప్పాల మల్లిఖార్జున్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్ల రూపంలో రసీదులు సైతం ఇచ్చాడు. దీంతో అనేక మంది లక్షలు చెల్లించి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరుకుల బస్వరాజ్ అనే వ్యక్తి మొదట్లో రెండు వేలు వెచ్చించి రెండు కిలోల కరక్కాయలను కొనుగోలు చేశారు. అనంతరం పొడిగా మార్చి తీసుకురావడంతో అతనికి రూ.2600 ఇచ్చారు. దీనికితోడు సంస్థ పలు ఆఫర్లను ప్రకటించడం, డోర్ డెలివరీ పేరుతో సేవలను ప్రకటించడంతో అనేక మంది ఇళ్ల వద్ద ఉండే డిపాజిట్లు చెల్లించి కరక్కాయలను ఇళ్లవద్దకే తెప్పించుకున్నారు. బస్వరాజ్ అతని స్నేహితులు సుమారు రూ.40లక్షలు చెల్లించి కరక్కాయలను తీసుకొని పొడిగా మార్చి తీసుకువచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం అతడికి సోమవారం డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఉదయం సంస్థ హెచ్ఆర్ మేనేజర్ ప్రసన్న అతడికి ఫోన్చేసి తమ సంస్థలో కీలక పాత్రధారి మల్లిఖార్జున్ ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఉందని, అతను అందుబాటులో లేడని తెలిపింది. బాధితులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సమాదాధానం చెప్పేవారు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.5కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు ఉడాయించారని బాధితులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ కుషాల్కర్ ఉన్నతాధికారుల సూచనమేరకు అదనపు ఇన్స్పెక్టర్ గోపీనా«థ్కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. -
కేపీహెచ్బీలో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. డబ్బు ఆశ చూపి అమాయకులను వంచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కరక్కాయల పేరుతో అమాయలకు టోపీ పెట్టారు. కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. కేపీహెచ్పీ రోడ్డు నంబర్వన్లో జరిగిన ఈ ఘరానా మోసం గురించి పోలీసులకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. సాప్ట్ ఇంటిగ్రేట్ మల్టీటూల్ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్ఐఎంటీ) అనే సంస్థ కరకాయను తీసుకెళ్లి పౌడర్ చేసి అప్పగిస్తే వేయికి మూడు వందలు లాభం ఇస్తామంటూ స్థానికులను నమ్మించింది. యూట్యూబ్, యాప్లలో ప్రచారం చేసింది. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. మూడు వందలు లాభం వస్తుందన్న నమ్మకంతో చాలా మంది వేల రూపాయలు చెల్లించి భారీ మొత్తంలో కరక్కాయలు కొనుగోలు చేశారు. పొడి చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లేందుకు సదరు కంపెనీ ముందుకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారు బిచాణా ఎత్తివేసినట్టు తెలియడంతో బాధితులు హతాశులయ్యారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. వంచనకారులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. లక్షల్లో డబ్బులు కట్టాం.. కేజీ కరక్కాయ తీసుకెళ్లి పొడి చేసి ఇస్తే 1300 ఇస్తామని నమ్మించారని బాధితురాలు ఒకరు మీడియాతో చెప్పారు. తమతో పాటు తమ బంధువులు కూడా లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని వాపోయారు. తమను నమ్మించేందుకు మొదటి 15 రోజులు డబ్బులు బాగానే ఇచ్చారని తర్వాత నుంచి పత్తా లేకుండా పోయారని తెలిపారు. కరక్కాయ పొడికి ఆయుర్వేదంలో మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించిన యాడ్స్ యూట్యూబ్ పోస్ట్ చేస్తే డబ్బులు ఇస్తామని కూడా మోసానికి పాల్పడ్డారని మరో బాధితుడు వెల్లడించారు. -
కేపీహెచ్బీలో కోట్లలో మోసం..
-
క్షమించండి నాన్న..
హైదరాబాద్: ‘‘నాన్న.. నా కోసం చాలా చేశావ్... నువ్వు నాకు చాలా ఇచ్చావు. కానీ దానికి ఫలితం లేకుండాపోయింది. సారీ డాడీ. తాత, నానమ్మ, అమ్మ, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో డాడీ. తమ్ముడు ఏం అనుకుంటే అది చేయనివ్వు డాడీ’’అని 16 పేపర్ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలో హరిశ్రీటవర్స్లో నివాసముంటున్న భీమి రెడ్డి నాగరామిరెడ్డి కుమారుడు అభికుమార్రెడ్డి (17) మాతృశ్రీనగర్లోని చైతన్య కళాశాలలో ఐపీఎల్(1) ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కళాశాల రెండవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో కళాశాల యాజమాన్యం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగరామిరెడ్డికి సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభికుమార్రెడ్డి మృతిచెందాడు. అంతకుముందు తండ్రికి సూసైడ్ లెటర్ రాశాడు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు నాగరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. -
యువతి నగ్న ఫొటోలతో.. మరో వ్యక్తికి టోకరా
కేపీహెచ్బీకాలనీ : సెల్ఫోన్లో యువతి పేరుతో చాటింగ్ చేసిన ఓ యువకుడు ఓ మహిళ న్యూడ్ ఫొటోలను సేకరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రాజుయాదవ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ బెంజిసర్కిల్కు చెందిన నందిమల్ల గోపి నగరానికి వలసవచ్చి సూరారం కాలనీలో ఉంటూ ఫ్యాబ్రికేషన్ వర్కు చేస్తున్నాడు. ఇతరుల పేర్లతో తీసుకున్న సిమ్కార్డుల ఆధారంగా యువతి పేరుతో నిజాంపేట రోడ్డుకు చెందిన పేరిచర్ల శ్రీనివాసరాజుతో చాటింగ్ చేశాడు. సదరు యువతి నగ్న ఫోటోలను పోస్ట్ చేసి శ్రీనివాసరాజుతో కూడా అతని ఫొటోలను పోస్ట్ చేయించాడు. అనంతరం శ్రీనివాసరాజును బెదిరించి రూ.4.5 లక్షలు వై. రాణి అనే మహిళ అకౌంట్లో జమచేయించుకున్నాడు. అయినా బ్లాక్మెయిలింగ్ ఆపకపోగా రు.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.60 లక్షల నగదు, బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
‘ఓలా’ మోసాల నుంచి రక్షించండి
హైదరాబాద్: ఓలా క్యాబ్స్ మోసాల నుంచి రక్షించాలని కార్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్ల యజమానులతో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ తీవ్ర అన్యాయం చేస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలోని ఓలా క్యాబ్స్ కార్యాలయం వద్దకు చేరుకున్న కార్ల యజమానులు, బాధితులు సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు యత్నించగా అక్కడి బౌన్సర్లు వారిని అనుమతించలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓలా సంస్థ కిలోమీటరుకు రూ.17 ఇస్తామని, కస్టమర్ కారెక్కి దిగితే రూ.వంద ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి మూడు నెలలు మాత్రమే ఇచ్చిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత ఒక్కొక్కటిగా హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రస్తుతం కిలోమీటరుకు రూ.ఐదు చెల్లిస్తూ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దీంతో 14 గంటల పాటు డ్యూటీ చేసినా తిరిగి జేబులోంచి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు విచారం వ్యక్తం చేశారు. కారు రుణాలు చెల్లించలేక, కుటుంబాలను పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 30కి పైగా కేసులు పెట్టినా పోలీసులు ఓలా క్యాబ్స్పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బాధితుడు షేక్ సాజిద్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కోర్టు తీర్పునకు లోబడే ‘మెరీడియన్’ రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలో నిర్మించిన మెరీడియన్ అపార్ట్మెంట్స్లో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న మేరకు జరిపే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా కోర్టు వెలువరించే తదుపరి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి తనఖా పెట్టిన 24 ఫ్లాట్లతో పాటు ఖాళీగా ఉన్న 73 ఫ్లాట్లను సైతం ఎట్టి పరిస్థితు ల్లోనూ విక్రయించరాదని లోథా కన్స్ట్రక్షన్స్ను హైకోర్టు ఆదేశించింది. అనం తరం ఆ సంస్థ ఇచ్చిన హామీని నమోదు చేసుకుంటూ, లోథా దాఖలు చేసిన అప్పీళ్ల ను మూసివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోథా సంస్థ నిర్మించిన బెల్లేజా, మెరీడియన్ నివాస సముదాయాల మధ్య ఉన్న గోడ కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ లోథా కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఖాళీ ఫ్లాట్లను విక్రయించవద్దని ఆదేశాలిచ్చారు. గోడ కూల్చివేతపై యథాతథస్థితిని కొనసాగించాలన్నారు. ఈ ఆదేశాలపై లోథా సంస్థ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఎవరైనా కొనుగోలుదారు తమ ఫ్లాట్లను రిజిçష్టర్ చేయాలని కోరితే, అదే విషయాన్ని నోటీసు ద్వారా మెరీడియన్, బెల్లేజా నివాసితులకు తెలియజేయాలని లోథా సంస్థను ఆదేశించింది. రిజిస్ట్రేషన్లన్నీ కూడా కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ అప్పీళ్లను మూసివేసింది. -
ప్రాణం మీదికి తెచ్చిన జూదం
హైదరాబాద్: జూదమాడుతూ పోలీసుల కంటబడటంతో తప్పించుకోబోయి బాల్కనీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారి పడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీ ఎంఐజీ బస్స్టాప్ సమీపంలోని ఓ భవనం రెండో అంతస్తులో బుధవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు జూదమాడుతున్నారు. శబ్దాలు రావడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆ ఫ్లాట్కు వెళ్లి తలుపు తట్టారు. దీంతో ఒక వ్యక్తి డోర్ తీయగా, పేక ముక్కలు తీసివేసి అందరూ నిలబడ్డారు. అర్ధరాత్రి ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా భయాందోళనకు గురైన శ్రీనివాస్ (36), పి.శ్రీను(40)లు వెనుక వైపున్న బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జారి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. కాగా, మరో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న రూ.1,200 లను సీజ్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కుషాల్కర్ తెలిపారు. -
కేపీహెచ్బీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : కేపీహెచ్బీలోని రోడ్డు నెంబర్ 5 లో మేఘనా హాస్టల్లో గురువారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరిజంన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. -
మసాజ్ సెంటర్పై దాడి: ఆరుగురి అరెస్ట్
హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలోని గ్రీన్స్పా మసాజ్ సెంటర్పై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా కస్టమర్, నలుగురు మహిళలతోపాటు నిర్వాహకురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6,300 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచార గృహంపై దాడి : ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్ఓటీ పోలీసులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ వసంతనగర్లోని ఓ ఇంటిలో నిర్వాహకుడు చైతన్య అనే వ్యక్తి విటులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి చైతన్యతో పాటు ఓ మహిళ, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, రూ.11,720 నగదును స్వాధీనం చేసుకుని కేపీహెచ్బీ పోలీసులకు అప్పగించారు. -
కేపీహెచ్బీ కాలనీలో దొంగల బీభత్సం
హైదరాబాద్ : కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఒకేరోజు మొత్తం 7 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కేపీహెచ్బీ ఏడో ఫేజ్లో తాళం వేసున్న ఒక ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని ప్రగతినగర్లోని ఓ ఇంట్లో రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు అందుబాటులో లేకపోవడంతో.. ఎంత మొత్తం చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రాలేదు. శనివారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజిల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
పార్క్లో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసంతనగర్ పార్క్లో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీఆర్ఎస్ అసంతృప్తి నేతపై కాంగ్రెస్ కన్ను
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కేపీహెచ్బీ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత సురేష్రెడ్డిని రంగంలోకి దించే అవకాశాలున్నాయని సమాచారం. కార్పొరేటర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం అడుసుమిల్లి వెంకటేశ్వరరావుకు ప్రకటించటంతో జనగామ సురేష్రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తనకంటూ సురేష్రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన సేవలను గుర్తించకపోటంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే అదనుగా ఆయనకు తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చి రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. -
కేపీహెచ్బీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కూకట్పల్లి: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని కేపీహెచ్బీ కాలనీ టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ భవనం ఎదుట రోడ్డును ఆక్రమించుకొని ఉన్న నిర్మాణాలను బుధవారం అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డుపై నిర్మించుకున్న సుమారు 70 గుడిసెలను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నపలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా చెప్తున్న బేఖాతరు చేస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. -
నగరంలో ఐసీసీ ప్రపంచకప్ ప్రదర్శన
కేపీహెచ్బీ కాలనీ: నగరంలో సోమవారం ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. టోర్నీ గ్లోబల్ స్పాన్సర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఫోరం మాల్లో ఈ ట్రోఫీని ప్రదర్శించారు. కప్ను చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ విజయాన్ని కాంక్షిస్తూ 30 అడుగుల పొడవైన బ్యాట్పై పలువురు అభిమానులు సంతకాలు చేశారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ శశికిరణ్, ఆర్ఆర్ఎం అచింట్ రాణే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ఈ ట్రోఫీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, నోయిడాల్లో ట్రోఫీని ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రపంచకప్ జరుగుతుంది. -
క్లోన్ ఫెస్ట్...
కేపీహెచ్బీ కాలనీలోని సుజనా ఫోరం మాల్లో నిర్వహించిన క్లోన్ ఫెస్టివల్ శనివారం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలను వీక్షించి సరికొత్త అనుభూతికి లోనయ్యారు. ఈ నెల 23 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన క్లోన్ ఎఫైర్లో భాగంగా అంతర్జాతీయ కళాకారులు విచిత్ర వేషాలతో వినూత్నంగా ప్రదర్శించిన నాట్యం పిల్లల మోముల్లో నవ్వులు పూయించింది. - కేపీహెచ్బీ కాలనీ -
ఎల్కెజి విద్యార్ధిని చితకబాదిన టీచర్
-
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్
తరగతి గదిలో తెలుగు మాట్లాడినందుకు పిల్లలను చితకబాదిన సంఘటనను ఇంకా రాజధాని వాసులు మర్చిపోకముందే కూకట్పల్లి ప్రాంతంలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వికాస్ భారతి పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఎల్కేజీ చదువుతున్న ఓ విద్యార్థిని టీచర్ చితకబాదేశారు. దాంతో ఆ చిన్నారికి కంటిమీద గాయం అయ్యింది. ముందురోజు ఇచ్చిన హోం వర్కును ఎందుకు చేయలేదంటూ టీచర్ కొట్టినట్లు విద్యార్థి, ఇతర విద్యార్థులు కూడా చెప్పారు. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను ఇలా గాయాలయ్యేలా కొడతారా అంటూ విద్యార్థి తల్లిదండ్రులు, మరికొందరు వికాస్ భారతి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. -
గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్రెడ్డి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీలోని మూడవఫేజ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్లను పంచలేదన్నారు. కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
-
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ వాస్తవానికి గత నెల 31వ తేదీ నుంచే కనిపించడం లేదు. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయమై అతడి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అతడి స్నేహితుల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన కాలేజి యాజమాన్యంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.