దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి | Father Who Set The Son On Fire In Kukatpally | Sakshi
Sakshi News home page

దారుణం..కుమారుడికి నిప్పంటించిన తండ్రి

Jan 18 2021 1:51 PM | Updated on Jan 18 2021 4:08 PM

Father Who Set The Son On Fire In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. చరణ్‌ అనే పదేళ్ల యువకుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే కుమారుడు సరిగా చదువుకోవడం లేదని తండ్రి  అతనిపై పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. అంతేగాక కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్‌పై  టర్పెంటైల్‌ ‌పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్లో జరిగిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement