breaking news
father
-
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్పూర్ ఉదయ్రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్పాల్కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్జహాన్పూర్కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం. -
‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ కాంట్రాక్ట్ కిల్లర్ల సాయంతో భర్తను హత్య చేసింది. అయితే ఈ కేసులో ఆ మహిళ తొమ్మిదేళ్ల కుమారుడే సాక్షిగా నిలవడం విశేషం. అల్వార్లోని ఖేర్లి ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీరు అలియాస్ మాన్ సింగ్ జాతవ్ ఇంట్లో మృతి చెందాడు. అతని భార్య అనిత తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. అయితే వారి కుమారుడు పోలీసులకు ఇంటిలో జరిగిన విషయమంతా చెప్పడంతో 48 గంటల్లో నిజానిజాలు వెలుగు చూశాయి.పోలీసులకు ఆ పిల్లాడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజు రాత్రి అతని తల్లి ఇంటి ప్రధాన గేటును తెరచివుంచింది. ఇంతలో ఆ బాలుడు ‘అంకుల్’(కాశీరామ్ ప్రజాపతి) అని పిలిచే వ్యక్తితో పాటు నలుగురు ఇంటిలోనికి ప్రవేశించారు. తరువాత వారంతా కలిసి.. మంచంపై పడుకున్న వీరు ముఖంపై తలగడ అదిమిపెట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ పక్కనే నిద్రిస్తున్నట్లు నటించిన ఆ బాలుడు జరిగిన ఘటనను గమనించాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిత, కాశీరామ్ ముందుగానే వీరు హత్యకు ప్లాన్ చేశారు. తమ వివాహేతర సంబంధానికి వీరు అడ్డుగా ఉన్నాడని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు. అనిత స్థానికంగా ఒక చిన్న జనరల్ స్టోర్ నిర్వహిస్తుండగా, కాశీరామ్ కచోరీలు విక్రయిస్తుంటాడు. అతను తరచూ అనిత దుకాణానికి వస్తుండేవాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ దగ్గరయ్యారు. అనిత, కాశీరామ్లు.. కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.రెండు లక్షలు ఇచ్చి, వీరును హత్య చేయించారనే ఆరోపణలున్నాయి.వీరు మృతిచెందాక, అతను అనారోగ్యంతో మరణించాడని అనిత బంధువులకు చెప్పింది. అయితే వారు అనుమానంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీరు హత్యకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని 100 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్లను పరిశీలించారు. కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. అనిత, కాశీరామ్లతో పాటు కాంట్రాక్ట్ కిల్లర్లలో ఒకరైన బ్రిజేష్ జాతవ్ను అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’ -
కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో
రైల్వేస్టేషన్లో అప్రమత్తంగా ఉండాలని అటురైల్వే అధికారులు,ఇతరులు చెబుతూనే ఉంటారు. రైలు రన్నింగ్ లో ఉండగానే దిగేందుకు ఎక్కేందుకు ప్రయత్నించవద్దని, రైలు వస్తున్నపుడు ప్లాట్ఫాం కు దూరంగా ఉండాలనే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. చాలా మంది అప్రమత్తంగానే ఉంటారు. కానీ. ఒక్కోసారి ఊహించని పరిణామాలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. అలాంటి ఘటన ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అత్యంత సాహసంతో కన్నబిడ్డను కాపాడి సూపర్ హీరో అయిపోయాడో తండ్రి. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే. ఈ కథనం కూడా పూర్తిగా చదవాల్సిందే.రైల్వే స్టేషన్ అనగానే కొంతమందికి గాభరా. కొంతమందేమో చాలా లైట్ తీసుకుంటారు. అలా రైలు పట్టాల మీద ఉన్న కూడా ఒక ప్లాట్ ఫామ్ మీద మరోప్లాట్ ఫామ్ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఏ మాత్రం ప్రాణ భయం లేకుండా ఒక యువతి ఒక ప్లాట్ ఫామ్ మీద నుంచి మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే అటువైపు వేగంగా రైలు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచే లోపే ఆమె పట్టాలు, రైలుకి మధ్యలో ఇరుక్కపోయింది. దీన్ని గమనించిన ఆమె తండ్రి అంతే వేగంగా కదిలాడు. వెంటనే పట్టాల మీదకు దూకి ప్లాట్ ఫామ్ వైపు కిందికి దూకి కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. ఈ సమయంలో ట్రైన్ కూడా వేగంగా ముందుకు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ వారుకి ఎలాంటి గాయాలు కాకుండా భారీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కొంతమంది భావోద్వేగానికి గురై దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లిప్త పాటులో ప్రాణాలు పోయేవే. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్ వైరల్గా మారింది. లక్షల మంది షేర్ చేశారు. దాదాపు కోటి (9.7 మిలియన్లు) వ్యూస్ దక్కించుకుంది.Dad shields his daughter with his body after she stepped into a train’s pathpic.twitter.com/Blqs1UISc8— Interesting things (@awkwardgoogle) June 16, 2025కన్నబిడ్డకోసం తండ్రి చేసిన సాహసం, తండ్రి చూపిన ప్రేమను చూసి సూపర్ డాడ్ అంటూ పొగిడేస్తున్నారు. పిల్లల కోసం తల్లిదండ్రుల అసామాన్య త్యాగాలు అంటూ ఎమోషనల్ అవుతున్నారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు, "ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయని మరొకరు కామెంట్ చేశారు. "మరికొందరు మాత్రం ఇది అవసరమా, ఏదైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి? అంటూ మండిపడుతున్నారు.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడుఅసలు విషయం ఏమిటంటే..అయితే, ఈ సంఘటన జనవరి 27, 2020న ఈజిప్టులోని ఇస్మాయిలియాలో జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగినా రైల్వే ప్రయాణాల్లో మాత్రం అప్రమత్తత అవసరం అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. -
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి రమణ్ రాయ్ హండా తుదిశ్వాస విడిచారు. ఆయన 72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద వార్తను నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మృతిచెందారు. అంత్యక్రియలు జూన్ 18న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కాగా.. రమణ్ రాయ్ హండా బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు మామ అవుతారు. ఆయనకు భార్య కామినీ చోప్రా, కుమార్తెలు మన్నారా, మితాలి చోప్రా ఉన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక, పరిణీతి చోప్రాల అత్త కామిని చోప్రాను వివాహం చేసుకున్నారు.కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్", "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది. గతేడాది తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. అంతే కాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్-17లో టాప్-3 కంటెస్టెంట్స్లో ఒకరిగా నిలిచింది. -
‘తండ్రి’కి వందనం
పాములపాడు: ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం అర్హుల జాబితాలో తండ్రుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఈ జాబితా చూసిన వారు అవాక్కవు తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు గ్రామానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన జాబితాలో ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. మొత్తం 724 మంది పేర్లతో జాబితా ప్రదర్శించగా, ఇందులో 20 మంది లబ్దిదారులు తండ్రి పేర్లతో దర్శనమిచ్చాయి. మరో విచిత్రమేమిటంటే జాబితాలో వరుస నెం 93, 96 లో కేవలం ’ న’ అనే అక్షరం పేరుతో లబ్ధిదారుని పేరుగా చేర్చారు. ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాల్లో తేడాలు లబ్దిదారులకు సంబంధించిన జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల నంబర్లలో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తమ ఖాతాల్లో పథకం నగదు జమకాలేదని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా తొలిరోజే అమ్మఒడి నగదు పడిందని, అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.పేరు మారింది.. డబ్బులు రాలేదు తల్లికి వందనం జాబితాలో నా పేరు లేదు. నా భర్త నాగలోకేశ్ పేరు వచ్చింది. ఆధార్ నంబరు కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంకు ఖాతాలో పడతాయో తెలీదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో జాబితాలో ఇలా. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాలీశ్వరమ్మ, పాములపాడు, నంద్యాల జిల్లాఅర్థం కాలేదు తల్లికి వందనం అర్హుల జాబితాలో నా భార్య పి. వరలక్ష్మి పేరు లేదు. ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అనర్హుల జాబితాలోనూ లేదు. తీరా చూస్తే పిచ్చిగుంట్ల శివక్రిష్ణ అని నాపేరు వచ్చిoది. ఆధార్ నంబరు నాదే ఉంది. తల్లికి వందనం నగదు విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదు. – పిచ్చిగుంట్ల శివక్రిష్ణ, పాములపాడు -
నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒక్కరూ కాపురం చేయలేదు..!
కామారెడ్డి: డబ్బులు ఉన్నప్పుడు దుబార ఖర్చులు చేశారు. కాలక్రమేనా.. కనీసం టీ తాగటానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు. దానికి తోడు కొడుకు సతీశ్కు ఆరు నెలల క్రితం పక్షవాతం రావటంతో సేవలు చేయటానికి కూడా ఎవ్వరు లేకపోవడంతో.. 75 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక ఉన్నకాడికి సేవలు చేశాడు. చివరికి నీకు సేవలు చేయటం నాతో కావటం లేదు బిడ్డా... ఇక నేను ఏదైన మందు తాగి చచ్చిపోతాను అని తన అభిప్రాయాన్ని ఈ నెల 6 న కొడుకు సతీశ్తో చెప్పాడు. నీతోపాటు నేను కూడా అదే పని చేస్తా బాపూ అంటూ చెప్పి అదే రోజు విష గుళికలు తెప్పించుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్భండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరూ కలిసి విషగుళికలు మింగారు. ఇద్దరూ వాంతులు చేసుకోవటంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్సపొందుతూ సతీశ్ (32) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఆకుల చిన్న సాయిలు (75) ఆదివారం మృతి చెందాడు. రెండ్రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో మాణిక్భండార్ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు రూ. 90 లక్షలకు పైగా డబ్బులను సతీశ్ దుబారాగా ఖర్చు చేశాడు. తీరా చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండాపోయింది. పైగా సతీశ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక్క భార్య కూడా కాపురం చేయలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై గత సంవత్సం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల క్రితం సతీశ్కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు. డబ్బులు లేక ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
కూతురికి వాతలు పెట్టిన తండ్రి
సైదాబాద్(హైదరాబాద్): తెలిసో తెలియకో చిన్న పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు చీవాట్లు పెట్టడం సర్వసాధారణం. కానీ కన్నకూతురు తప్పు చేసిందో లేదో నిర్ధారించుకోకుండానే ఒక తండ్రి విచక్షణారహితంగా ముఖంపైన, చేతులపైన వాతలు పెట్టాడు. ఎంతగా అంటే ఆ చిన్నారి ప్రస్తుతం ఆసపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దాంతో తట్టుకోలేక పోయిన ఆ పాప తల్లి భర్తపైనే సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుబ్రమణ్యనగర్లో నివససించే ఆర్.హర్యా, జ్యోతి దంపతులు కూలి పనులు చేస్తుంటారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు (11) సంతానం. కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. ఎండాకాలం సెలవులు కావటంతో కుమార్తెను తల్లిదండ్రులు బిజినేపల్లి మండలం గంగారం గ్రామంలోని నానమ్మ ఇంటికి పంపారు. నెల రోజులు అక్కడే ఉన్న బాలిక ఈ నెల 6న తిరిగి ఇంటికి వచి్చంది. అదేరోజు రాత్రి హర్యాకు అతని తమ్ముడు గ్రామం నుంచి ఫోన్ చేసి సెలవుల్లో ఇక్కడికి వచ్చిన కుమార్తె ఒకరితో చనువుగా ఉందని చెప్పాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న తండ్రి హర్యా కోపోద్రిక్తుడై వంటింట్లోని అట్ల కాడను కాల్చి కుమార్తె ముఖం, చేతులపై వాతలు పెట్టాడు. దాంతో తీవ్రగాయాలైన ఆమెను తల్లి జ్యోతి ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది. తన మరిది చెప్పిన మాటలు విని..నిజానిజాలు తెలుసుకోకుండా కూతురిని గాయపరిచిన భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జ్యోతి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’
బెంగళూరు: ఆర్సీబీ జట్టు విజయోత్సవాల మాటేమోగానీ.. 11 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో తన ఒక్కగానొక్క కొడుకును పొగొట్టుకున్న తండ్రి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కొడుకు శవానికి పోస్ట్మార్టం వద్దని, అలాగే అప్పగించాలని వేడుకుంటూ మాట్లాడిన మాటలవి. ‘‘నాకు ఒక్కగానొక్క కొడుకు. 22 ఏళ్లు గారాభంగా పెంచుకున్నా. నాకు చెప్పుకుండా ఇక్కడికి వచ్చి వాడు ప్రాణం పొగొట్టుకున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరొచ్చి పరామర్శించినా నా కొడుకును బతికించలేరు. దయచేసి వాడి శరీరాన్ని ముక్కలు చేయకండి. అలాగే అప్పగించండి. మీకు దణ్ణం పెడతా..’’ అంటూ మీడియా ముఖంగా ఆయన కన్నీళ్లతో చేసిన అభ్యర్థన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. Credits: NDTVఅయితే అధికారులు ఆయన విజ్ఞప్తికి ఎలా స్పందించారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తొక్కిసలాట మృతదేహాలకు ఈరోజు(గురువారం) ఉదయం పోస్టుమార్టం(Postmortem) పూర్తిచేశారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించారు.18 ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. ఈ నేపథ్యంతో మరుసటిరోజే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సమీపంలో ర్యాలీ, విధాన సౌధలో ఆర్సీబీ జట్టుకు ప్రభుత్వం సన్మానం చేయాలని భావించింది. అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడం, అదే సమయంలో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరగడం, పోలీసులు వాళ్లను అదుపు చేయలేకపోవడంతో ప్రాణ నష్టం జరిగింది. ఇది కూడా చదవండి: భారత్-పాక్ వివాదంపై ట్రంప్-పుతిన్ చర్చ -
Jesus ఒక్కడే మీ తండ్రి
‘ఒక్కడే మీ తండ్రి’ అనునది అపొస్తలుల బోధ. వీరు యేసుక్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాలపాటు ఆత్మసంబంధ జ్ఞానాన్ని గ్రహించారు. పామరులైన వీరంతా దేవుని బోధలు ఎలా చేయాలో క్రీస్తు అను మెస్సీయ వద్దనే నేర్చుకొన్నారు. క్రీస్తును గూర్చి’ఈయనే నా ప్రియ కుమారుడు అంటూ దేవుడు ఆకాశం నుండి పలికిన మాటలను ఆ దేవుని గొప్ప స్వరాన్ని పలుమార్లు విన్నారు. దేవుని చేత పరము నుండి ఈ భూలోకమునకు పంపబడిన ‘పరలోక దేవుని అపొస్తలుడైన యేసు అసాధారణ బోధ’, ఆ యేసు క్రీస్తు చేత ఈ సర్వ లోకములోనికి పంపబడిన పన్నెండు మంది శిష్యులనబడిన ’క్రీస్తువారి అపొస్తలుల బోధ’, యెరూషలేములోని ఆదిమ సంఘముగా చెప్పబడే ‘క్రీస్తు ప్రభువు సంఘం చేత ప్రపంచ దేశాలకు పంపబడిన’ సంఘపు అపొస్తలుల ఉపదేశం’ అంతా ఒక్కటే. ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఇట్టి ఏకత్వం గల బోధ ఆనాడు భూలోకాన్ని తలకిందులు చేసింది. అపొస్తలులు మొదటగా చేసిన ప్రపంచ సువార్త పర్యటనలతోనే ప్రపంచాన్ని కదిలించారు. కారణం ఒక్కటే, ఎవరు ఏ మూలకు వెళ్ళి బోధించినా వారి వారి బోధలలో ఏకత్వం అనేది తేటగా పిరదర్శకంగా వెల్లడి కావడం. సత్యవాక్యమను సువార్తను ఇక్కడ పేతురు ప్రకటిస్తున్నా అక్కడ యోహాను వివరిస్తున్నా మరోచోట యాకోబు చెబుతూ ఉన్నా ఈ ముగ్గురి బోధలు ఒకేలా ఉండడం విశేషం. ఇదే అపొస్తలుల బోధనా విధానం ప్రత్యేకత. బోధలో ఏకత్వం లేదంటే, రాలేదంటే అది అపొస్తలుల బోధ కాదని సుస్పష్టంగా చాలా తేలిగ్గానే ఇట్టే చెప్పేయవచ్చు. ఇప్పుడైతే ఏ ముగ్గురి బోధలు విన్నా చదివినా బోధలు మూడు రకాలుగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని కలవరానికి గురిచేస్తూ ఏకత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయి. నేడు దేవోక్తులకు చోటివ్వని నాయకత్వాలు అంతటా ప్రబలుతున్నాయి. అందులో ఒకటి ‘నేను మీకు ఆత్మీయ తండ్రిని’ అనే నాయకత్వం. విస్తరించిన పచ్చని చెట్టువలె ఉన్న ఇలాంటి నాయకత్వాలు విచ్చిన్నమై పుచ్చిపట్టి నేలకూలడానికి అవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి (కీర్తన 37:35,36, 73:16–19). ఎందుకంటే, ఒకడు ఎన్నో ఆత్మలను రక్షించినా ఎంత ఆత్మ సంబంధిగా జీవించినా నెత్తిన తెల్లకీరిటం ఉన్నానూ అతడు ఆత్మీయ తండ్రి కాలేడు. యేసు అసాధారణ బోధ దీన్ని అనుమతించుట లేదు. ప్రభువైన క్రీస్తు ఇలా అంటున్నాడు. ‘పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును’(మత్త 15:13 ). దీని భావం ఏమంటే, వివిధ రకాల లేఖన విరుద్ధ కొత్త సిద్ధాంతాలు, నాయకత్వాలు, మానవ కల్పిత స్థాపిత సంఘాలు అనేవి సాటిలేని, ప్రత్యామ్నాయం లేని అపొస్తలుల బోధ ముందు అనగా, క్రీస్తు పరిశుద్ధులుగా పేర్గాంచిన అపొస్తలుల బోధ ముందు ఇవి నిలువలేవు. వ్యక్తుల బోధల ప్రతిభాపాటవాలు, ధన దాసత్వం, భక్తి హీనత వంటి అబద్ద బోధలు నాయకత్వాలుగా పరిణమిస్తూ చెలామణిలో ఉంటూ రాజ్యమేలుతున్నాయి. సత్యవాక్యం లోతుగా ఎరుగని కారణం చేతనే క్రై స్తవ్యంలో సత్య విషయమైన సత్య సంబంధిత ఈ ఆత్మ సంబంధ భావ దారిద్య్రం నేడు ఎందరినో పట్టి పీడిస్తోంది. ఆత్మీయ తండ్రిగా పిలిపించుకోవడం అనేది అది వ్యక్తులు సృష్టించుకొన్న వారి సొంత బోధ. పరలోక దేవుని అపొస్తలుడైన క్రీస్తు వారి అత్యున్నతమైన అసాధారణ బోధ ఏమంటే,‘మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు’ (మత్త 23 8, 9 ఎఫెసీ 4:6 ).– జేతమ్ -
ఇహలోక త్రిమూర్తులు ఎవరో తెలుసా?
ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, గురువు– ఈ క్రమంలో ఈ ముగ్గురికీ అత్యంత గౌరవనీయమైన, పూజనీయమైన స్థానం ఇవ్వబడింది. జన్మనిస్తుంది కనుక తల్లి, జన్మకు కారకుడై, బాల్య, యవ్వన దశలలో పోషణ భారాన్ని వహించి, రక్షణను కలిగిస్తాడు కనుక తండ్రి, విద్యాబుద్ధులు నేర్పి సత్కార్యోన్ముఖుడిని, ప్రయోజకుడిని చేస్తాడు కనుక గురువు... సదా పూజనీయులనే అభిప్రాయాన్ని పండితులు, పూర్వ సాహిత్యవేత్తలు ప్రజలకు కలిగించారు. ఈ భావాన్ని ధ్రువీకరించిన వ్యాసుడి మహా భారతం, తల్లిదండ్రులను, గురువును పూజించడం వలన సమకూరే అధ్యాత్మిక, పారలౌకిక ప్రయోజనాలను గురించి, అనుశాసనిక పర్వం, సప్తమాధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం ద్వారా, స్పష్టం చేసి చెప్పింది.యేన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిఃప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజితా.యేన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్ బ్రహ్మ పూజితమ్.ఒక వ్యక్తి తన తండ్రిని ప్రసన్నుడిని చేయడం ద్వారా ప్రజాపతినీ, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవినీ, తన గురువును తృప్తి పరచడం ద్వారా బ్రహ్మదేవుడినీ పూజించిన వాడు అవుతున్నాడు అని పై శ్లోకం భావం. అలా, ఏ వ్యక్తి తన తల్లిని, తండ్రిని, గురువును గౌరవించడం, ఆదరించడం అన్న మూడు ధర్మాలను శ్రద్ధగా ఆచరిస్తాడో, ఆ వ్యక్తికి అన్ని ధర్మాలూ సక్రమంగా నిర్వర్తించబడిన ఫలం దక్కుతుందని, అలా కాక ఏ వ్యక్తి ద్వారా ఈ మూడు ధర్మాలు సరిగా ఆచరించబడక, అనాదరించబడతాయో, ఆ వ్యక్తి నిర్వర్తించే యజ్ఞయాగాది క్రియల వలన సమకూరే ఫలములన్నీ నిరుప యోగంగా, నిష్ఫలములుగా మారిపోతాయని కూడా ఆ సందర్భంలోనే పై శ్లోకానికి కొనసాగింపుగా చెప్పబడింది. మిగతా జీవితం ఎలా గడిచినా, వృద్ధాప్యంలో మనిషి తన సంతానం సహా యాన్నీ, ఆసరానూ కోరుకుంటాడు. ఆ రోజులలో, తాను కని, ప్రేమగా చూసుకుంటూ పెంచి, పెద్దచేసిన తన సంతానం చేతిలోనే అగౌరవానికి, నిర్లక్ష్యానికి గురికావడాన్ని మించిన మానసిక క్షోభ మనిషికి వేరే ఉండదు. వృద్ధాప్యంలో ఏ వ్యక్తికీ ఆ బాధ కలగకూడదన్న సదుద్దేశంతో చేసిన నియమాలు, చెప్పిన విషయాలు పైవి. మానవీయమైన ఈ ధార్మిక విధిని పాటించని సమాజానికి ఆధ్యాత్మిక పురోగతిఉండగలదనుకోలేము. – భట్టు వెంకటరావు -
అమెరికా నుంచి వచ్చి కన్నకూతుళ్లే దహన సంస్కారాలు
పెనమలూరు(కృష్ణా జిల్లా): ఆప్యాయత, అనురాగాలతో అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణించడంతో కుమార్తెలే కుమారులై అంత్యక్రియలు జరిపించి రుణం తీర్చుకున్న ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో చోటుచేసుకుంది. పోరంకికి చెందిన కొడాలి వెంకటరత్నం (68)కి భార్య అరుణ కుమారి, కుమార్తెలు సంతోషి శ్రీదేవి ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా వెంకటరత్నం ఈనెల 11న మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న కుమార్తెలు అమెరికా నుంచి మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. వెంకటరత్నంకు కుమారులు లేకపోవటంతో అక్కాచెల్లెళ్లిద్దరూ శ్మశాన వాటికకు వెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. పెద్ద కుమార్తె సంతోషి తండ్రి చితికి నిప్పంటించింది. వెంకటరత్నం కుమార్తెలిద్దరినీ గ్రామస్తులు అభినందించారు. కౌలు రైతు బలవన్మరణం చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): వ్యవసాయం కలిసిరాక...సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనో వేదనకు గురై ఓ కౌలురైతు బలవన్మరణం పొందిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆళ్ల ఆదినారాయణ(45) తనకున్న అర ఎకరంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో మిర్చి, ఎకరం పాతికలో పసుపు, ఎకరంలో మొక్కజొన్న, మిగిలిన దాంట్లో వరి సాగు చేశాడు. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. మిరప, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆశించిన దిగుబడి రాకపోగా, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక మదనపడ్డాడు. ఏమి చేయాలో పాలు పోక సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోవటంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. -
కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్రెడ్డి అశోక్రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2025 (Indian Premier League 2025) సీజన్లో ఒక సంచలనం. చిచ్చర పిడుగు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి చర్రితను తిరగరాసిన అద్భుత ప్రతిభావంతుడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్. రికార్డు బద్దలు కొట్టేశాడు. అయితే ఎవరి విజయమైనా అంత సులువుగా రాదు. కష్టాలు కన్నీళ్లు, కఠోర శ్రమతో తన కలను సాకారం చేసు కోవాల్సిందే. అలా అద్భుత ఇన్నింగ్స్ తో స్టార్గా మారిపోయాడు వైభవ. తరువాత ఈ సందర్బంగా కల తీరింది. భయంలేదు అంటూ తన జర్నీ గురించి మాట్లాడిన తీరు అమోఘంగా నిలిచింది. వైభవ్ సక్సెస్ జన్నీ ఎలా సాగింది, దేశంలోని అత్యుత్తమ క్రికెటర్గా తీర్చిదిద్దేందుకు వైభవ్ కుటుంబం చేసిన త్యాగం, కృషి ఏంటి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.వైభవ్ తండ్రి త్యాగం, పట్టుదల14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, T20లలో అర్ధశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో యువ క్రికెటర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. కొడుకు కోసం స్వయంగా గ్రౌండ్, నాలుగేళ్ల క్రితం పొలం అమ్మేశాడువైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తన కొడుకు క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చడానికి నాలుగు సంవత్సరాల క్రితం తన వ్యవసాయ భూమిని అమ్మేశాడు. 2011 మార్చి 27న బిహార్లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ అంటే ఇష్టాన్ని, అతనిలోని ప్రతిభను తండ్రి , స్వయంగా క్రికెటర్ అయిన సంజీవ్ సూర్యవంశీ గుర్తించాడు. అంతే తనకున్న కొద్దిపాటి స్థలంలోనే వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంగా ఆయన చేతుల మీదిగా ఆ నేలను చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అదే అతని కరియర్కు నాంది పలికింది. తొమ్మిదేళ్లు నిండగానే సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు సంజీవ్. అంతేకాదు కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దాలన్న కోరిక, కొడుకు క్రికెట్ కలను సాకారం కావాలనే ఆశయంతో తన పొలాన్ని అమ్మేశారు. తండ్రి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు కొడుకు. రెండున్నరేళ్ల శిక్షణ తరువాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16లో సత్తా చాటాడు వైభవ్. అలాగే ప్రతి రోజు సమస్తిపూర్ నుండి పాట్నాకు 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరీ మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా శిక్షణలో మరింత రాటు దేలాడు. అలా గత ఏడాది ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎంపిక చేయడం వరకు అతని జర్నీ సాగింది. వైభవ్ తనకొడుకు మాత్రమే కాదని, మొత్తం బిహార్కు కొడుకునని సంతోషంగా ప్రకటించారు తండ్రి సంజీవ్. చదవండి : ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్డోరేమాన్ నుంచి 13 ఏళ్లకే కోటీశ్వరుడుగాతాను కష్టపడి పనిచేసి వైభవ్కు శిక్షణ ఇప్పించాననీ, ఎనిమిదేళ్ల వయస్సు నుండి, క్రికెటర్ కావాలనే తన కలను సాధించేందుకు చాలా కష్టపడ్డాడంటూ కొడుకు పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు సంజీవ్. చిన్నపుడు డోరేమాన్ చూసేవాడు.. ఆ తరువాత క్రికెట్ ఒకటే.. అదే అతని ప్రాణం. ఎనిమిదేళ్లకే U-16 జిల్లా ట్రయల్స్లో రాణించాడన్నారు. క్రికెట్ కోచింగ్ కోసం సమస్తిపూర్కు తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడినంటూ ఆయన తన శ్రమను గుర్తు చేసుకున్నారు. తన శ్రమ, త్యాగం వృధా కాలేదు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైభవ్ను క్రికెటర్గా చూడాలన్న ఆశయంకోసం వ్యవసాయ భూమిని అమ్మేశాను.ఇప్పటికీ ఆర్థిక సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు.𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗He announced his arrival to the big stage in grand fashion 💯It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2— IndianPremierLeague (@IPL) April 29, 2025 IPL 2025 వేలం రెండవ రోజున, రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను రూ. 1.10 కోట్లు వెచ్చింది. ఈ ఎన్నిక అంత ఆషామాషీగా ఏం జరగలేదు. ఈ మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ నాగ్పూర్లో ఏర్పాటు చేసిన ట్రయల్స్ క్యాంప్లో సత్తా చాటుకున్నాడు. చిచ్చర పిడుగు సిక్సర్ల టాలెంట్ అప్పుడే బైటపడింది. ఇపుడు చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడి తన పేరును లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి తొలి బాల్ సిక్స్కొట్టి ఔరా అనిపించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. అతని దూడుకును గమనిస్తే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు రానున్నాయో అనిపించక మానదు. అందుకే యావత్ క్రికెట్ అభిమానులు ఆల్ ది బెస్ట్ అంటూ అభినందిస్తున్నారు. -
కొడుకులారా.. కొరివైనా పెట్టరా?
మానకొండూర్(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపారు. -
నువ్వన్నదే కరెక్ట్ నాన్నా.. మార్కులకన్నా లక్ష్యం మిన్న
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు శేఖర్ .. ఆ..అయింది..కానీ దానికి మార్కులు సరిపోవట.. దాని అంచనాకు సరిపడా రాలేదని ఏడుస్తూ బెడ్ రూములో కూర్చుంది.. ఎంత చెప్పినా వినదాయే మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ వంటింట్లోంచి చెప్పింది పావని..ఓహ్.. అలాగా అనుకుంటూ చిన్నారి స్వీటీ.. ఏం చేస్తున్నావ్.. మంచి మార్క్స్ వచ్చాయి కదా మరి నీ సేవింగ్స్తో నాకు పార్టీ ఇస్తాను అన్నావు మరి రెడీనా అన్నాడు శేఖర్..ఆ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు.. నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు..నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను.. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బుగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తోంది స్వీటీ.. అదేంటి తల్లీ నైన్టీ పర్సెంటేజీ వచ్చింది..అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే..ఇంకెందుకు బాధ..అంతకన్నా పైన క్లాస్ లేదుగా నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేశావు తల్లి.. ఆమాత్రం చాలు.. డోంట్ వర్రీ అంటూ తలనిమిరాడు.. లేదు నాన్నా నాకు అవమానంగా ఉంది..నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. ఇది నాకు చాలా ఇన్స్టాలింగ్ ..రేపు నేను వాళ్లకు ఎలా మొహం చూపాలి..ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ..బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు..అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్ గా మాట్లాడింది అనుకుంటూ..అదేం లేదు నాన్నా..నేను చెబుతాగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ .. పావనీ ఆ సూట్కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు.. తెస్తున్నా అంటూ ఈ తండ్రికూతుల్లకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతోంది అనుకుంటూనే ఫైల్ తెచ్చి ఇచ్చింది.కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చెయ్యి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక ఇదేంటి నాన్నా బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ.. అది నా టెన్త్ మార్కుల లిస్ట్..చూడు అన్నాడు .. చూసింది.. బొటాబొటి 38 మార్కులతో అన్నీ పాసైనట్లు ఉంది. చివర్న పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి నాన్నా మీరు జస్ట్ పాస్..థర్డ్ క్లాసులో పాసయ్యారా అని అబ్బురంగా.. అవునమ్మా అన్నాడు శేఖర్.. నెక్స్ట్ చూడు అన్నాడు.. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి.. అందులో 52 శాతం మార్క్స్.. అంటే సెకండ్ క్లాస్ వచ్చింది.. నాన్నా ఈసారి ఈ ప్రోగ్రెస్ పెరిగింది సుమీ అంది కూతురు మెచ్చుకోలుగా .. తరువాత చూడు అన్నాడు.. అందులో బీకాం..ఫస్ట్ క్లాస్ అని ఉంది.. నాన్నా ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ.. అవునమ్మా అన్నాడు శేఖర్..చూసావా బుజ్జి నేను థర్డ్ క్లాసులో పాసైనా నేను నీలాగా అవమానం అనుకోలేదు.. బతకడం వేస్ట్ అనుకోలేదు.. ఇంకా బాగా కష్టపడ్డాను..ఇంటర్లో సెకండ్ క్లాసు..డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసర్ అయ్యాను... నాకన్నా అప్పట్లో టెన్త్ ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచిలోనే క్లర్క్ గా చేస్తున్నారు ..దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు తల్లీ అన్నాడు.. ఆలోచించింది స్వీటీ.. మార్కులు ముఖ్యం కాదు.. కష్టపడి చదవాలి.. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తే నీలాగే మంచి పొజిషన్ కు చేరుకోవచ్చు.. అంది కాస్త స్థిమిత పడుతూ.. మరి ఇప్పుడేం చేద్దాం అంటావ్..అన్నాడు శేఖర్.. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు, అమ్మకు మంచి పార్టీ ఇస్తాను..ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీట్ కొడతాను..సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్ గా.. ఎస్..అదీ లెక్క.. ఆ స్పిరిట్ ఉండాలి.. పదా మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని..భార్యను తీసుకుని బయటకు బయల్దేరాడు..::సిమ్మాదిరప్పన్న -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఆస్తి ఇవ్వలేదని తలకొరివి పెట్టని కొడుకు.. తండ్రి అంత్యక్రియలు చేసిన కుమార్తె
జడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఇంటిని కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో.. ఓ కొడుకు తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో బంధువులు.. మృతుని చిన్నకుమా ర్తెతో కర్మకాండ జరిపించారు.నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైరయ్యాక.. మహబూబ్నగర్ పద్మావతి కాలనీలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. మాణిక్యరావు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిపించారు.భార్య గతంలోనే మరణించడంతో.. సొంత ఊరిలోని 15 ఎకరాల వ్యవసాయ పొలం, రూ.60 లక్షలు.. కొడుకు గిరీష్కు ఇచ్చి.. మహబూబ్నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పెద్ద కూతురు రాజనందిని పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మాణిక్యరావు అనారోగ్యానికి గురై మంగళవారం అర్ధరాత్రి చనిపోయారు. హైదరాబాద్లో ఉన్న గిరీష్కు సోదరీమణులు సమాచారం అందించారు. ఇంటిని తనకు ఇవ్వని తండ్రి అంత్యక్రియలకు రానని గిరీష్ వారికి తెగేసి చెప్పాడు. దీంతో చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టింది. -
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
టాలాంట్ చూపించడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Roll Rida (@rollrida) ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట. ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్ కిడ్..డ్డింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్ భయ్యా" అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివ్ ఆవిష్కరణను మెచ్చుకోగా, "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్కు చెందిన బైక్గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు. -
‘సందీప్ 26/11 బాధితుడు కాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చాడు’
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్తోపాటు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న రాణాను భారత్కు అమెరికా అప్పగించింది. ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా భారత్కు రానున్నాడనే సంగతి తెలుసుకున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్, ఎన్డీటీవీతో మాట్లాడుతూ ‘సందీప్ 26/11 బాధితుడు కాదు, అతను తన కర్తవ్యం నిర్వర్తించాడు’ అని అన్నారు. రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణమని, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులందరికీ ఇది ఒక ఆశాకిరణం’ అని ఆయన పేర్కొన్నారు. తహవ్వుర్ రాణా భారత్కు అప్పగించిన కారణంగా 26/11 దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో అతనికి గల సంబంధాలు బయటపడే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: 26/11 టార్గెట్లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర? -
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని బండరాళ్లు కొట్టాడు. మండుటెండలో పునాది రాళ్లను కొడుతూ అహర్నిశలు శ్రమించాడు. నాలుగు రాళ్లు సంపాదించి కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాలనే తపనతో ఆకలి దప్పికలు మరిచాడు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. విధి వక్రీకరించి మంచానపడ్డాడు. ఏనాడూ గడప దాటి ఎరుగని కుమార్తె.. నేడు తండ్రి వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ కోసం పలువురి ఇళ్లలో పనులకు వెళుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే తన తండ్రి మామూలు మనిషిగా మారుతాడని, అయితే వైద్యానికి అయ్యే ఖర్చు తమ తలకు మించిన భారం కావడంతో ఆపన్నహస్తమందించాలని నిరుపేద కుటుంబం వేడుకుంటోంది.ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లిపోగుల శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పునాదులకు అవసరమైన రాళ్లను కొడుతూ కుటుంబాన్ని శ్రీనివాసులు పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అరకొర సంపాదనలోనే దాచుకుంటూ వచ్చిన డబ్బుతో పెద్ద కుమార్తె శిరీషకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. చిన్న కుమార్తె జ్యోతిని పదో తరగతి వరకు చదివించగలిగారు. అపై చదువులకు పంపే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంచేశారు. సాధారణ జబ్బు కాదది నెల రోజుల క్రితం మహాశివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు శ్రీనివాసులు కుటుంబం సిద్ధమైంది. ఉదయం తలంటి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుని ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పరిస్థితి గమనించిన భార్య లక్ష్మికి, కుమార్తె జ్యోతి వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాసులుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమిస్తుండడంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డయాలసిస్ చేయడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఈ క్రమంలో ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ సోకి సెఫ్టిక్ కావడంతో పెద్ద గాయమైంది. దీంతో శ్రీనివాసులు కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటి వద్ద మంచానికే పరిమితం ఎడమ కాలికి కట్టు కట్టిన తర్వాత కర్నూలు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి డయాలసిస్ అవసరం కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే.. శ్రీనివాసులు పరిస్థితిని గమనించిన వైద్యులు డయాలసిస్ చేయడానికి సాధ్యం కాదని వెనక్కు పంపారు. అప్పటి నుంచి ఇంట్లోనే మంచానికే ఆయన పరిమితమయ్యాడు. ఈ మొత్తం ప్రక్రియలో ఇంట్లో చిన్న కుమార్తె పెళ్లికని దాచిన డబ్బు మొత్తం శ్రీనివాసులు చికిత్స కింద ఖర్చయి.. మరికొంత తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. నిరుపేద కుటుంబం కావడంతో రోజూ పనికి వెళితే తప్ప పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంటి వద్ద భర్తకు సపర్యలు చేయడంలోనే భార్య లక్ష్మికి సమయం సరిపోతోంది. దీంతో ఏనాడు గడప దాటి ఎరుగని చిన్న కుమార్తె జ్యోతి.. తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే తపనతో తొలిసారిగా ఇల్లు విడిచి బయట కూలి పనులకు సిద్ధమైంది. ఇంటింటికీ తిరిగి వారికి అవసరమైన పనులు చేసి పెట్టి, వారిచ్చిన కొద్ది పాటి డబ్బుతో తండ్రికి అవసరమైన మందులు, కాలికి డ్రస్సింగ్ చేసేందుకు అవసరమైన మందులు, డయపర్స్ కొనుగోలు చేస్తోంది. వీరి దుస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అప్పుడప్పుడు చిన్నపాటి సాయం అందిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపుతన తండ్రి మంచాన పడటంతో కుటుంబ పోషణ భుజాల మీదకు వేసుకున్న జ్యోతి ఇంటి పనులతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. అయితే తన సంపాదనతో తండ్రి ఆరోగ్యం ఎన్నటికీ బాగుపడదని గుర్తించిన ఆమె ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. తన తండ్రికి మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని దాతలను వేడుకుంటోంది. -
విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)
-
కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారుదీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.:: సిమ్మాదిరప్పన్న -
అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?
అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాంటి పనిచేసే కటకటాల పాలయ్యాడు. అంతేగాదు తన గర్ల్ఫ్రెండ్కి మరింత అసహ్యం కలిగేలా చేసుకున్నాడు.ఈ ఘటన తైవాన్లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల కోళ్ల పెంపకందారుడు ఎల్వీ 48 ఏళ్ల టాంగ్ అనే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ల బంధం 15 ఏళ్లు కొనసాగింది. అయితే ఎల్వీ ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబ తోడ్పాటుకు ఎటువంటి సహకారం లేకపోవడంతో విసిపోయిన టాంగ్ అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి ఆమె వేరుగా జీవిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్వీ, టాంగ్ని పదే పదే బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అక్కడితో ఆగక ఇక ఆమెను ఎలాగైనా.. తన వద్దకు రప్పించుకుని, కలిసే జీవించేలా చేద్దామనే దురుద్దేశంతో దురాగతానికి తెరతీశాడు. ఆమె తండ్రి సమాధి వద్ద ఉండే చితాభస్మాన్ని దొంగలించి ఆమె మనోవ్యధను కలిగిస్తే..కచ్చితంగా తన వద్దకు తిరిగి వచ్చేస్తుందని భావించాడు. కానీ అతడు ఒకటి తలిస్తే..విధి మరొకటి తలిచింది. అయితే ఇదంతా టాంగ్కు తెలియదు. అతడు తన తండ్రి చితాభస్మం నా దగ్గర ఉందని చెప్పినా..టాంగ్ అవన్నీ బెదిరింపులే అనుకుని కొట్టిపారేసింది. నమ్మను కూడా నమ్మలేదు. అయితే ఎలా దొంగలించానో..ఫోటోలతో సహా వివరంగా పంపించాడు. అప్పుడే ఆమె తన తండ్రి స్మశాన వాటికను సందర్శించి అసలు విషయం తెలుసుకుంది. ఇక టాంగ్ అతడిని క్షమించకూడదన్న పట్టరాని కోపంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వాళ్లువెంటనే రంగంలోకి దిగి విచారించగా..అతడే టాంగ్ తండ్రి చితాభస్మాన్ని అపహరించాడని తేల్చారు. అయితే అప్పటికే ఎల్వీ మనీలాండరింగ్కి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాడు. ఇక ఈ ఘనకార్యంతో ఎల్వీపై మరిన్ని అబియోగాలు మోపి అరెస్టు చేశారు. అలాగే అతడి నుంచి ఆమె తండ్రి చితాభస్మాన్ని కూడా స్వాధీన పర్చుకుని టాంగ్కి అప్పగించారు. ప్రేమతో మన నుంచి దూరమైన వాళ్ల మనుసుని గెలుచుకోవాలే గానీ ఇలాంటి పనులతో బలవంతంగా రప్పించుకుంటే..విధి సైతం సహకరించదు అంటే ఇదే కదూ..!.(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?) -
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది. ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది. ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్ అందరికి తెలియడం మొదలైంది. దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్ర్గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్ను కూడా ప్రదర్శించింది.ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్మోడల్ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్తో సమాధానమిస్తానంటోంది. (చదవండి: View this post on Instagram A post shared by The Better India (@thebetterindia)(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్బ్రాండ్! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..) -
తండ్రీకూతుళ్లను కలిపిన కాలం కథ
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.అస్సలు ఊహించలేదు..ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.కేత్కర్ తేరుకునేలోపే కాక్పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.నెటిజన్ల రియాక్షన్..హర్ష్ గోయెంకా పోస్ట్పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్గా స్పందించారు. At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.He hadn’t spoken to her in 5 years.Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025 -
మందలించాడని తండ్రిని హత్య చేసిన కూతురు
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
కన్న తండ్రి కర్కశత్వం.. ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో దారుణం జరిగింది. తండ్రి పిల్లి రాజు గణపతినగర్ లాకుల వద్ద తన ఇద్దరు పిల్లలు సందీప్, కారుణ్యలను కాలువలో పడేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో పదేళ్ల బాబు బయటపడ్డాడు. ఆరేళ్ళ పాప మృతదేహం లభ్యమైంది.తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. పిల్లల తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా పరారయ్యాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్ రిపేర్ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్ రిపేర్ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు.ఏష్బాగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ ఖాన్(18) బాగ్ ఫర్హత్ అఫజ్ పరిధిలోని ఓకాఫ్ కాలనీలో ఉంటున్నాడు. 12వ తరగతి పాసయిన సయీద్ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేదు. నాలుగు రోజులుగా అతని ఫోను చార్జింగ్ కావడంలేదు. దీంతో ఆ ఫోనును రిపేర్ చేయించేందుకు మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను ఫోను రిపేరు(Phone repair)కు చాలా ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పాడు. అయితే తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, ఆ ఫోనుకు రిపేర్ చేయించలేనని, కొత్తది కొనివ్వలేనని చెప్పడంతో సయీద్ కలత చెందాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..
లింగాలఘణపురం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయన తండ్రి అంత్యక్రియలకు కుల స్తులు దూరంగా ఉన్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురంలో గురువారం జరిగింది. విష యం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దయ్యాల భిక్షపతి (60) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.అతడి కొడుకు అనిల్ ఆరు నెలలక్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకొని జన గామలో ఉంటున్నాడు. కొంతమంది పాలి వారు, కుల పెద్దలు కొడుకు తలకొరివి పెట్టవద్దని, మృతుడి భార్య పెడితేనే వస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. విషయం తెలుసు కున్న ఎస్సై వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా కొంతమంది మాత్రం అంత్యక్రియలకు హాజరయ్యారు. -
కలికాలంలో.. ఓ తండ్రి విషాదగాథ!
తెలుగులో చంద్రమోహన్-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో.. తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి.. ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.హరేంద్ర మౌర్య(46).. మోరెనా టౌన్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కొడుకు. మార్చి 1వ తేదీన ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడాయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర.. ఎంత సేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు.. ఇంట్లో మనస్పర్థలవల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కలవాళ్లు.. సొంత తండ్రి, సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకోసాగారు. ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది.హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య ఆయన కాళ్లను పట్టుకుంటే.. ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా ఇద్దరు కూతుళ్లు కర్రలతో ఆయన్ని విచక్షణ రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతన్ని వారించి మరీ హరేంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో.. ఎవరు బయట పెట్టారో తెలియదుగానీ.. హరేంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. Note: కలవరపరిచే దృశ్యాలు ఉన్న కారణంగా.. వీడియోను అప్లోడ్ చేయలేకపోతున్నాంఈ వీడియో ఆధారంగా హరేంద్రది బలవన్మరణం కాదని.. అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డు చేసినట్లు ఉండగా.. పోలీసులు ఈ వీడియో ఆధారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
కుప్పంలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
రూ.10 కోసం తండ్రిని చంపి.. తలతో పోలీస్ స్టేషన్కు..
బారిపడా: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి 'గుట్కా' కొనడానికి తన తండ్రిని రూ.10 అడిగాడు. ఇవ్వడానికి నిరాకరించిన తండ్రిని తల నరికి చంపేశాడు. నిందితుడు.. తండ్రి తలను చందువా పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి లొంగిపోయాడు. మృతి చెందిన వ్యక్తిని బైధర్ సింగ్గా పోలీసులు గుర్తించారు.తల్లిదండ్రులు, నిందితుడికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అతని తల్లి అక్కడి నుంచి పారిపోయింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ చిన్న సమస్య హత్యకు దాని తీసిందని తెలిపారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న షివోన్ జిలిస్తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్ సంతానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్ భార్య షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు హార్ట్ సింబల్తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్, ఇప్పటికే తన స్పెర్మ్ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు. -
పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.దీంతో విసిగిపోయిన సాయికుమార్.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..
న్యూఢిల్లీ: ఆ కుటుంబంలోని వారంతా మహాకుంభ్లో స్నానం చేసేందుకు శనివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వారిలో ఏడేళ్ల బాలిక రియా కూడా ఉంది. రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తెల ఎలా ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని రియా తండ్రి ఓపిల్ సింగ్ మీడియాకు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముందుగా వారంతా 14వ నంబరు ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అయితే అక్కడి రద్దీని చూసి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోదామని అనుకున్నారు. దీంతో అతని భార్య, కుమారుడు ప్లాట్ఫారం నుంచి తిరిగి మెట్లు మీదుగా పైకి చేరుకున్నారు. వారి వెనుక ఓపిల్ సింగ్, అతని కుమార్తె రియా ఉన్నారు. ఇంతలో ఐదారువేల మంది పైనుంచి ఒక్కసారిగా ఒకరిని తోసుకుంటూ మరొకరు కిందకు దిగసాగారు. ఇంతటి రద్దీలో వారంతా ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో వారి కుమార్తె రియా కిందపడిపోయింది. ఆమె తలకు ఒక రాడ్డు బలంగా తగిలింది. వెంటనే రక్తం కారసాగింది. తొక్కిసలాట జరుగుతున్నా పోలీసులు అప్రమత్తం కాలేదు. నామమాత్రంగా విజిల్ వేసుకుంటూ వెళ్లిపోయారు.అంతటి రద్దీలో కుమార్తెను ఎత్తుకుని ఓపిల్ సింగ్తో అతని భార్య, కుమారుడు ఎలాగోలా కిందకు దిగి, రైల్వే స్టేషన్ బయటకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓపిల్ సింగ్ జేబులోని పర్సుతో పాటు మొబైల్ ఫోనును ఎవరో కొట్టేశారు. అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో ఓపిల్సింగ్ తన కుమార్తె రియాను తీసుకుని, ఆటోలో కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి రియాను పరీక్షించి, ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. తమ కుమార్తె చనిపోయాక ప్రభుత్వం ఇచ్చే రూ. 10 లక్షల పరిహారం ఎందుకుని ఓపిల్ సింగ్ మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు -
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్.. 13వ సంతానం?
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk)మరోసారి వార్తల్లో నిలిచారు. రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఇక, ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.క్లెయిర్ పోస్టుపై తాజాగా మస్క్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మస్క్.. Whoa అని కామెంట్స్ చేశారు. బిడ్డకు ఎవరు తండ్రి అని సమాధానం వచ్చేలా సెటైరికల్ పోస్టు పెట్టారు. ఇక, అంతకుముందు.. క్లెయిర్ తాను ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చానని.. ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.అయితే, బిడ్డ విషయం గురించి తామిద్దరం దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని.. కానీ, కొన్ని మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేశాయని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తానే స్వయంగా తన బిడ్డ గురించి చెప్పడానికి ముందు వచ్చానని చెప్పారు. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నానని.. తమ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దని కోరారు. దీంతో, ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Whoa— Elon Musk (@elonmusk) February 15, 2025ఇదిలా ఉండగా.. మస్క్పై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మస్క్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నారంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇక, ఎలాన్ మస్క్కు ఇప్పటికే 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేకపోగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎలాన్ కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.Alea Iacta Est pic.twitter.com/gvVaFNTGqn— Ashley St. Clair (@stclairashley) February 15, 2025纽约邮报挺厉害,2月15日采访了Ashley,详细回顾了她和马斯克交往怀孕生孩子的时间线:2023年5月•初次互动:Ashley St. Clair 在X(原Twitter)上与埃隆·马斯克开始互动。•私信联系:马斯克通过私信与她交流,话题从一张表情包(meme)开始。•对马斯克的印象:St. Clair… pic.twitter.com/2zndHn7IUG— 蔡子博士Chris (@caiziboshi) February 16, 2025 -
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్లో సెర్చ్ చేసి..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా, మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.యూట్యూబ్లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. -
రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్కు అండగా నిలుస్తున్నారు.ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి లా సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను..అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తోంది.. నాన్న ఉన్నారులే.. అన్ని చూస్కుంటారు.. అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది'.. నాకు ఈరోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది.. థ్యాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.కాగా..నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) -
ఆస్తి కోసం ఆగిన అంత్యక్రియలు
కొడకండ్ల: ఆస్తుల ముందు పేగుబంధం చిన్నబోయింది. సవతి తల్లి పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తేనే తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తానని కుమారుడు పట్టుబట్టడంతో 4 రోజులపాటు మృతదేహాన్ని ఫ్రీజర్లోనే ఉంచిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతుల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎలికట్టె యాదగిరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రేణుక కుమారుడు రమేశ్. రెండో భార్య పద్మకు కుమారుడు ఉపేందర్, కుమార్తె ఉన్నారు.యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా.. 5 ఎకరాలు మొదటి భార్య కుమారుడైన రమేశ్కు, 5 ఎకరాలు రెండో భార్య కుమారుడైన ఉపేందర్ కు పంచి, మిగిలిన ఐదు ఎకరాలు తనవద్దే ఉంచుకున్నాడు. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఉపేందర్ మైనర్ కావడంతో తల్లి పద్మ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. యాదగిరి తన పేరుపై ఉన్న ఐదెకరాల భూమిలో మూడెకరాలు అమ్మి కూ తురు వివాహం చేసి, రెండెకరాలు కట్నం కింద కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. మూడేళ్ల క్రితం కుమారుడు ఉపేందర్ మృతి చెందడంతో అతడి వాటాకు వచ్చిన ఐదెక రాల భూమిలో తల్లి పద్మ మూడు ఎకరాలు అమ్మి కూతు రుకు హైదరాబాద్లో ఇల్లు కొనిచ్చింది.యాదగిరి అనారోగ్యంతో ఈ నెల 10న మృతి చెందాడు. ఈ క్రమంలో మొదటి భార్య కుమారుడైన రమేశ్.. పద్మ పేరుపై ఉన్న రెండెకరాల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేయడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. దీంతో గ్రామంలోని పెద్ద మనుషులు కల్పించుకొని పద్మ పేరుపై ఉన్న భూమిని రమేశ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు గురువారం ఆమెను తహసీల్దార్ కార్యాలయానికి తీసు కొచ్చారు. తనను బలవంతంగా తీసుకొచ్చారని పద్మ ఆరో పిస్తూ తల తిరిగి పడిపోవడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.దీంతో ఇరువురు గ్రామానికి వెళ్లిపోయారు. అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు ఒత్తిడి తేవటంతో రమేశ్ కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు రాత్రి 7.30 గంటల సమయంలో ఇరువురి మధ్య అంగీకారం కుదిరి తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. పద్మ ఎకరన్నర భూమిని రమేశ్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయటంతో యాదగిరి అంత్యక్రియలు నిర్వహించారు. -
రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో
ప్రతిష్టాత్మక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ( UPSC ) పరీక్షలో విజయం సాధించడం అంటే సాధారణ విషయంకాదు. దానికి కఠోర సాధన పట్టుదల ఉండాలి. ఈవిషయంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా కథ చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.కోటి రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగ ఆఫర్ను కాదని తన తొలి ప్రయత్నంలోనే 2018 UPSC పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 1ని సాధించాడు. ఈ ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా : రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అదుర్స్!)ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు సివిల్స్కోసం ప్రిపేర్ అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఐఏఎస్ అధికారి కనిషక్ కటారియా. ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి అయిన ఆయన కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ సంపాదించి తన రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుడిగా ఎదిగాడు. ఆ తరువాత దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో సంవత్సరానికి కోటి రూపాయల జీతంతో ఉద్యోగ ఆఫర్ కూడా వచ్చింది. అయితే, వ్యక్తిగత లాభాల కంటే దేశానికి సేవ చేయాలనే కోరిక అతనిలో బాగా నాటుకుపోయింది. అందుకే ఆ ఆఫర్ను మరీ తన కలలసాకారంకోసం పరీక్షకు సిద్ధం అయ్యాడు.ఇదీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!దృఢ సంకల్పం, క్రమశిక్షణతో కూడిన అతని ప్రయత్నం వృధాకాలేదు. 2018లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంలో తన కృషి, పట్టుదలతోపాటు, కుటుంబ మద్దతు సహకారం చాలా ఉందని చెబుతాడు ఆనందంగా కనిషక్. స్పష్టమైన లక్ష్యం, సానుకూల మనస్తత్వంతో ఎలాంటి సవాళ్లనైనా అధిగమించివచ్చని నిరూపించాడు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.మరోవిశేషం.. కుటుంబానికి గర్వకారణమైన క్షణాలు కనిషక్ విజయగాథలో మరో ఆసక్తికర విషయం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. 2024 సెప్టెంబర్ 30ప రాజస్థాన్లోని భరత్పూర్లో డివిజనల్ కమిషనర్గా పదవీ విరమణ చేశాడు కనిషక్ తండ్రి సన్వర్ మల్ వర్మ. తండ్రి రాజీనామా ఉత్తర్వులపై సంతకం చేసింది మాత్రం కనిషక్. ఈ ప్రత్యేకమైన క్షణాలు ఆ కుటుంబానికి గర్వించ దగ్గ క్షణాలుగామారాయి. అంతేకాదు. కుటుంబం అందించిన సేవ ,అంకితభాం మరింత ప్రత్యేకంగా నిలిచింది.వ్యక్తిగత శ్రేయస్సు, సంపద కంటే సేవకు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం కనిషక్ను ప్రత్యేకంగా నిలిపింది. శామ్సంగ్లో డేటా సైన్స్లో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని తిరస్కరించి, సమాజంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలనే కోరికతో నడిచే సివిల్ సర్వీసెస్లో కెరీర్ను ఎంచుకోవడం విశేషం. దేశంకోసం దేశసేవకోసం ఆర్థికంగా గొప్ప అవకాశాన్నిఉద్యోగాన్ని వదులుకొని, అతను భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచాడు. కృషి, అంకితభావం, స్పష్టమైన దృక్పథం ఉంటే ఏ కల కూడా సాధించలేనిది లేదని మరోసారి నిరూపించాడు. -
అపుడు వాచ్మెన్గా, ఇపుడు దర్జాగా : శభాష్ రా బిడ్డా! వైరల్ స్టోరీ
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది. అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది.ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్మెన్గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్కు భార్యతో కలిసి గెస్ట్గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్మెన్గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్కి డిన్నర్కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025 “మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు. -
ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కూతురి వివాహం
యశవంతపుర: తండ్రి బైక్ ప్రమాదంలో చనిపోగా, పెళ్లిపీటలపై ఉన్న కూతురికి ఆ వార్త చెప్పకుండా పెళ్లిని పూర్తి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా తరీకెరెలో సోమవారం జరిగింది. ఏ తండ్రి అయినా తన కూతురు పెళ్లి ఆటంకాలు లేకుండా ఘనంగా జరగాలని కోరుకుంటాడు. అలాగే తండ్రి చేతుల మీదుగా వివాహం జరగాలని కూతురు ఆకాంక్షిస్తుంది. కానీ విధి నాటకంలో అంతా తారుమారైంది.పెళ్లి పత్రికలు పంచి వస్తుండగాతరీకెరెకి చెందిన చంద్రు కూతురు దీక్షిత అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం సాయంత్రం చంద్రు మరో ఇద్దరితో కలిసి పెళ్లిపత్రికలను పంచడానికి బైక్లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొనటంతో చంద్రు, జతలో వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలిసి బంధువులు విషాదంలో మునిగిపోయినా తల్లీ, కూతురికి చెప్పలేదు. ఆ వార్త తెలిసినా, మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పెళ్లి నిలిచిపోయి మరింత విషాదం ఏర్పడుతుందని భావించారు. అందుకే చివరి నిమిషం వరకు చంద్రు పెళ్లి పనుల్లో ఉన్నాడని చెబుతూ సోమవారం మూడుముళ్ల వేడుకను పూర్తి చేయించారు. తండ్రి స్థానంలో మరో వ్యక్తిని ఉంచి కన్యాదానం చేశారు. అక్షింతలు, అతిథుల భోజనాల తరువాత చంద్రు భార్య, కూతురికి ఈ చేదు వార్త చెప్పగానే వారు బోరుమంటూ రోదించారు. అప్పటివరకు ఉన్న పెళ్లి కళ దూరమైంది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులే అంత్యక్రియల పనులు పూర్తిచేశారు. -
కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటేకానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.సుమిత్కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది. View this post on Instagram A post shared by Sumit Dabas (@sumitdabas2020)తొలి అడుగుతొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.హేమంత్ అనే ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్సైజ్ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి. చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండికుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు. -
పెళ్ళి ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది.కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నాఇంకేం కావాలి. ఇదీ చదవండి: గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!‘సీతారాముల్లా ఉండండి!‘ అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? ‘పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!‘ అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు. -
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి : అంతలోనే కన్నతండ్రి కర్కశం
అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్గా,ఫ్యాషన్ క్వీన్లా శోభిత ధూళిపాళ)52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. -
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
మల్కాపురం: మృతి చెందిన కన్నతండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మల్కాపురంలో జరిగింది. గాంధీజివీధికి చెందిన చొప్పా సూరిబాబు (60) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవటం, అల్లుళ్లు ముందుకు రాకపోవడంతో దుఃఖాన్ని దిగమింగుకొని కన్నకూతురే దహన సంస్కరాలు నిర్వహించింది. ఈ హృదయ విదారక ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్టీసీ అద్దె బస్సుకు సూరిబాబు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకుంది. చిన్న బాస్ క్లాస్మేట్.. విశాఖ భూములపై ‘కిలాడీ’ కన్ను -
వివాహ రిసెప్షన్లో తండ్రి ప్రతిమ
సింగరేణి (కొత్తగూడెం): ఇంటిపెద్ద మృతి చెందితే చాలామంది ఇంట్లో ఫొటో ఏర్పాటుచేసి సరిపెట్టుకుంటారు. కానీ ఓ యువకుడు రూ.లక్షలు వెచ్చించి తన తండ్రి ప్రతిమ చేయించి సోదరి వివాహ రిసెప్షన్ వేదికపై ఏర్పాటుచేసి మమకారాన్ని చాటుకున్నాడు. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసిన పెరికం బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కుమార్తె స్నేహకు యాజమాన్యం కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగావకాశం కల్పించింది. ఆమెకు శ్రీరాంపూర్ ఏరియాలో అండర్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న అవినాష్ తో పెళ్లి కాగా.. కొత్తగూడెంలో శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఈమేరకు ముంబైలో రూ.4 లక్షల వ్యయంతో వీల్చైర్లో కూర్చున్న రూపంలో చేయించిన బాలరాజు విగ్రహాన్ని వేదికపై ఏర్పాటుచేయగా.. స్నేహ దంపతులతో పాటు ఆమె సోదరుడు, తల్లి ఫొటోలు దిగారు. తండ్రి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలనే భావనతో విగ్రహాన్ని తయారుచేయించినట్లు కుటుంబీకులు తెలిపారు. -
అనకాపల్లి జిల్లాలో దారుణం.. కొడుకును చంపిన తండ్రి
-
జింక్ మైదానం నుంచి ఎంసీజీ సెంచరీ వరకు...
సాక్షి, క్రీడావిభాగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం...మరో 25 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉంది. కానీ కొడుకు భవిష్యత్తు కోసం దానిని వదిలేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. దానికి ఎంత ధైర్యం కావాలి? తన అబ్బాయి ఆటపై ఎంత నమ్మకం ఉండాలి. విశాఖపట్నానికి చెందిన ముత్యాల రెడ్డి కి ఆ నమ్మకం ఉంది. అందుకే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.మున్ముందు ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయని తెలిసినా అన్నింటినీ తట్టుకునేందుకు రెడీ అన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన కొడుకు టెస్టు క్రికెటర్గా మారి ఎందరో కలలు గనే మెల్బోర్న్ మైదానంలో సెంచరీ సాధించిన క్షణం ఆయన ఆనందం కన్నీళ్లుగా మారి కనిపించింది! తన కష్టం ఫలించిన రోజు ఆ పుత్రోత్సాహం గురించి చెప్పేందుకు ఎన్ని విశేషణాలు కూడా సరిపోవేమో. ఆరేళ్ల వయసులో మొదలైన నితీశ్ రెడ్డి క్రికెట్ ఆట 12 ఏళ్లు వచ్చే సరికి పూర్తి స్థాయి క్రికెటర్గా మారాలనే కల వైపు అడుగులు వేసింది. ఏసీఏకు చెందిన కడప అకాడమీలో అండర్–14 విభాగంలో శిక్షణకు ఎంపికైన తర్వాత గమ్యంపై మరింత స్పష్టత వచ్చేసింది. ఇదే సమయంలో ముత్యాల రెడ్డి అనూహ్యం నిర్ణయం తీసుకున్నాడు.ఉద్యోగరీత్యా రాజస్తాన్కు బదిలీ కాగా...అలా వెళితే తన కొడుకును తీర్చిదిద్దడం కష్టమవుతుందని ఆయన భావించాడు. అందుకే హిందుస్తాన్ జింక్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయంలో కొడుకు కోసం కేటాయించేశాడు. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్లో రికార్డు స్థాయిలో ఏకంగా 1237 పరుగులు చేయడటంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 176.71 సగటుతో 4 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో చేసిన ఆ పరుగులు బీసీసీఐ ఉత్తమ ఆటగాడి అవార్డును అందించాయి. నాగాలాండ్తో జరిగిన పోరులో 366 బంతుల్లో 60 ఫోర్లు, 7 సిక్స్లతో చేసిన 441 పరుగులు నితీశ్ ధాటిని చూపించాయి. అలా మొదలైన ప్రస్థానం అండర్–19 జట్టుతో పాటు ఆ తర్వాత ఆంధ్ర సీనియర్ టీమ్లో కూడా అవకాశం కల్పించాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ దూకుడును అభిమానులంతా చూశారు. గత రంజీ ట్రోఫీ సీజన్లో ఆంధ్ర తరఫున 25 వికెట్లు తీయడంతో అతని బౌలింగ్ పదును కూడా సెలక్టర్లకు అర్థమైంది. అందుకే జాతీయ జట్టులో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నితీశ్ తాజా ప్రదర్శన టెస్టు జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేయడం ఖాయం. ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో కూడా ఈ అబ్బాయి అద్భుతాలు చేయడం ఖాయం. -
కాలం మారింది.. నాన్నను మార్చింది
నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న -
కొడుకును చంపితే భార్య తిరిగొస్తుందని..
తాండూరు రూరల్: అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు కన్న కొడుకునే హత్య చేసేందుకు యత్నంచాడు ఓ తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హన్మంత్కు తాండూరు మండలం మల్కాపూర్కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్ ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మల్కాపూర్లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్న హన్మంత్ రెండేళ్ల నుంచి శరణమ్మను వేధిస్తున్నాడు. దీంతో ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్లను తీసుకొని కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. భార్య వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు ముగిశాక శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. ఎలాగైనా భార్యను ఇంటికి రప్పించాలని, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్ను హత్య చేస్తే భార్య వస్తుందని హన్మంత్ కుట్ర పన్నాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లి కత్తితో కుమారుడి మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక బాలుడు గట్టిగా అరవడంతో ఇంటి పక్కనే ఉన్న అశోక్తోపాటు మరికొందరు వచ్చి తలుపులు పగలగొట్టి అరవింద్ను కాపాడారు. విషయం పోలీసులకు తెలియజేయడంతో ఎస్ఐ విఠల్రెడ్డి బాలుడిని తాండూరు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్యం బాగున్నట్లు తెలిపారు. హన్మంత్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఇదేం విచిత్రం.. 138 మందికి ఒక్కడే తండ్రి..
ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్లోని ముజఫర్పూర్లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.బిహార్లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్ బ్లాక్లోని బూత నంబర్ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్ అంకిత్గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
కుటుంబంలో విషాదం..బాధలో హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
తండ్రిపై దాడి చేసిన కుమారులు
-
ఏడేళ్లు దూరమైన నాన్న.. కూతుళ్ల కన్నీళ్లు
-
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.10 రోజుల క్రితమే కులదీప్కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’ -
ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు
నాగోల్: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు.ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన గోగికర్ బల్వీర్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరటంతో బల్వీర్ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్ను హెచ్చరించాడు.పగ పెంచుకొని పక్కా ప్లాన్తో కాల్పులుఆరు నెలల క్రితం బల్వీర్ తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్.. వారి సమక్షంలో బల్వీర్కు కౌన్సిలింగ్ ఇచ్చి పింపించారు. ఆనంద్ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.దీంతో పగ పెంచుకొన్న బల్వీర్ ఆనంద్ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్గన్, షార్ట్ గన్తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్గన్తో లీగల్ పోలీస్, లీగల్ పోలీస్ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి తన బైక్పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్ను అరెస్టు చేసినట్లు సరూర్నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్గన్, షార్ట్గన్ (పిస్టల్), బైక్, సెల్ఫోన్ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. -
ఎంత పనిచేశావ్ నాన్న.. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో
సిద్దిపేట : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ భర్త తన ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించే తేలు సత్యం ముదిరాజ్ (48) తేలు శిరీష (26) భార్యభర్తలు. వాళ్లిద్దరికి అశ్వన్ నందన్(7), త్రివర్ణ (5) ఇద్దరు పిల్లలు. కానీ విధికి ఆ చింతలేని కుటుంబాన్ని చూసి కన్నుకుట్టింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు చిచ్చు పెట్టాయి. దీంతో రెండో భార్య తేలు శిరీష కొన్నినెలల క్రితం భర్త సత్యంను వదిలి పుట్టింటికి వెళ్లింది.పలు మార్లు కాపురానికి రావాలని కోరినా.. శిరీష కనికరించలేదు. దీంతో మనోవేధనకు గురైన సత్యం ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తాను ప్రాణాలు తీసుకుంటే పిల్లలు అనాధలవుతారని భావించిన సత్యం.. తన పిల్లలు (రెండో భార్య పిల్లలు) అశ్వన్ నందన్, త్రివర్ణలతో కలిసి సిద్దిపేట చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.తండ్రి పిల్లలు కలిసి చింతల చెరువులో దూకడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతల చెరువులో దూకి బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ముగ్గురి ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మహారాష్ట్ర ఎన్నికలు: పూజా ఖేద్కర్ తండ్రి అఫిడవిట్లో.. మరో సందేహం?
ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.2024 లోక్సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు.దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
నాన్న కూచులు
వెనకటి తరంలో పిల్లలకు తండ్రి దగ్గర అంత చనువుండేది కాదు. వారికి ఏం కావాలన్నా అమ్మతో రికమెండ్ చేయించుకోవాల్సిందే. నాన్న వస్తున్నాడంటే ఎక్కడి ఆటలు అక్కడ ఆపేసి వచ్చి పుస్తకాలు ముందరేసుకుని చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాళ్లు. అయితే ఆ తరం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు అమ్మ కన్నా నాన్నతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. తమకు కావలసిన వాటిని నాన్నతోనే అమ్మకు రికమెండ్ చేయించుకుంటున్నారు. మీ పిల్లలు కూడా అలాగే చేస్తుంటారా?నాన్నలుప్రాక్టికల్చాలా విషయాలలో అమ్మలకన్నా నాన్నలు ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటారు.ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. చిన్నారుల చిన్ని జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, సవాళ్లనుప్రాక్టికల్గా ఏ విధంగా చూడాలో వివరిస్తూనే, వాటిని అధిగమించేందుకు సాయం చేస్తారు. అంతేకాదు, దేనినైనా రెండు వైపుల నుంచి ఏ విధంగా ఆలోచించాలో తండ్రులే పిల్లలకు నేర్పుతారు. నాన్న దగ్గరుంటే నిశ్చింతపిల్లలకు ఏమైనా సమస్య అంటే తోటి పిల్లల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా నాన్నతో చెబుతా’ అని వారికి వార్నింగిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నాన్నే హీరో. సర్వశక్తిమంతుడు. నాన్నకు చెబితే ఏ పని అయినా తేలిగ్గా అయిపోతుందని, దానికి తిరుగుండదని వాళ్ల భావన. అందుకే నాన్న వాళ్లకొక నిశ్చింత.ఆటలు... పాటలుచాలామంది నాన్నలు ... పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా సరదాగా ఉంటారు. కొత్త కొత్త ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ ఆడడంలో మెలకువలు చెప్పి సాయం చేస్తుంటారు. అమ్మలతో పోల్చితే ఆటల విషయంలో ఆంక్షలు తక్కువ. తమని ఒంటరిగా పంపడానికి భయపడుతుంటే స్కూల్లో టీచర్లు ప్లాన్ చేసే టూర్లకు, ఎక్స్కర్షన్లకు అమ్మలకు నచ్చజెప్పి ఒప్పించి మరీ వాళ్లకు కావలసినంత పాకెట్ మనీ ఇచ్చి సాగనంపుతారు. ఆంక్షలు తక్కువఅమ్మతో పోల్చితే నాన్న దగ్గర ఆంక్షలు తక్కువ... ఉదాహరణకు అబ్బబ్బా.. ఆ షూస్ విప్పకుండా అలా లోపలికి వచ్చేస్తావెందుకు... ఛీ.. యూనిఫారమంతా ఇంకు పూసేసుకున్నావు... దీనిని బాగు చేసేదెలా? తీసుకెళ్లిన ఫుడ్డంతా బుద్ధిగా తినకపోయావో.... ఇంకేం లేదు.. ఈ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే ఊరుకోను... ఇటువంటి ఆంక్షలు నాన్నల దగ్గర ఉండవు.నాన్నంటే ఓ సాహసంపిల్లలకు నాన్నంటే నిజంగా ఓ అడ్వెంచర్. గోడలెక్కడం, చెట్లెక్కడం, గంతులు పెట్టడం... సైకిల్ మీద సవారీలు, కారు, బైకు డ్రైవింగ్ నేర్పించడం... ఇలా కొత్తగా ఏదైనా చెయ్యడం... లాంటివాటికి నో చెప్పక సై అంటారు. తండ్రితో తీపి జ్ఞాపకాలుసెలవులొస్తే బయటికి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం, సినిమాలకు, జూలకి తీసుకెళ్లడం, కోరిన చోటుకు తీసుకెళ్లి దిగబెట్టి రావడం... ఇలాంటి జ్ఞాపకాలెన్నో తండ్రులతో బిడ్డలకు ముడిపడి ఉంటాయి. అందువల్ల నాన్నంటే వాళ్లకు చాలా ఇష్టం.నాన్న... నవ్వురస భరితంచాలామంది తండ్రులు పిల్లలతో హాయిగా జోకులు వేస్తుంటారు. లేదంటే చిన్న చిన్న కామెడీ సీన్లు కూడా సృష్టిస్తుంటారు. ఏం చేసినా, పిల్లలు హాయిగా నవ్వుకునేలా చేస్తారు. గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని తమ జోకులు, కామెడీ సీన్లతో తేలిగ్గా మార్చేసి, నవ్వుల పువ్వులు విసురుతారు. రోల్ మోడల్స్పిల్లలందరికీ నాన్నలే వాళ్ల రోల్ మోడల్. జీవితంలో ఎదురయే సమస్యలు, సవాళ్లను తట్టుకుని దృఢంగా ఎదిగే నాన్నలు తమను తాము రోల్మోడల్స్గా మలచుకుంటారు. పిల్లలతో గాఢానుబంధాన్ని ఏర్పరుచుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా ఎలా నెరవేర్చుకోవాలో పిల్లలకు నేర్పకనే నేర్పుతారు. ఇక్కడ మనం నాన్న గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం... అలా అని అందరి నాన్నలూ అలా ఉండకపోవచ్చు. ఉండాలనీ ఏం లేదు. కాకపోతే పూర్వం కన్నా పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఇప్పటికాలం పిల్లలు నాన్నలతో ఫ్రీగా ఉంటున్నారు. నాన్నలు కూడా గాంభీర్యాన్ని విడిచిపెట్టేశారు. నాన్నలతో గాఢమైన బంధం ఉండే కూతుళ్లు ఎందరో ఉన్నారు. అలాగే అమ్మలను రోల్మోడల్స్లా తీసుకునే కొడుకులూ ఉన్నారు. తండ్రి వస్తుంటే... చేస్తున్న చిలిపి పనులు ఆపేసి తటాలున తలుపు చాటున దాక్కునే పిల్లలు ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించట్లేదు. తండ్రులు కూడా పిల్లలకేసి ఉరిమి చూడటం లేదు. పిల్లల అల్లరిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమతో ్రపోత్సహిస్తున్నారుభారతీయ యోగాకు పెద్దపీట అమెరికా వ్యాప్తంగా దాదాపు 6,000 భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఇవి అమెరికా సంయుక్త దేశాల రెస్టారెంట్ మార్కెట్లో దాదాపు 1 శాతం వాటాను ఆక్రమించడం విశేషం. ఇక మిషెలిన్ గైడ్ రెస్టారెంట్లలో భారతీయ రుచులను కోరుకుంటున్న వారు మూడు శాతంపైనే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారతీయ యోగా... యోగులు, రుషులు మనకందించిన అపూర్వ విజ్ఞానమిది. ఇప్పుడీ విజ్ఞానం విదేశీయులను విస్మయపరుస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యాల సాధనకు దీన్ని మించిన సాధనం లేదని పాశ్చాత్యులు భావిస్తున్నారు. 2023 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న మొత్తం యోగా స్టూడియోల సంఖ్య 36,000 పైమాటే!అమెరికాలో లాయర్లో 1.3 శాతం మంది, జర్నలిస్టుల్లో దాదాపు మూడుశాతం మంది భారతీయ సంతతికి చెందినవారే.డాలర్లు కురిపిస్తున్న ఇండియన్ సినిమాలు2015 నుంచి 2023 మధ్య వివిధ బాషలకు చెందిన 96 భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలయ్యాయి. నార్త్కరోలినాప్రాంతంలో ఇండియన్ సినిమాకు మంచి మార్కెట్ ఉంది. ఈ కారణంగానే ఇక్కడ విడుదలైన ఒక్కో సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్లకు తక్కువ వసూళ్లను రాబట్టలేదు. మొత్తంగా చూస్తే వీటివిలువ 340 మిలియన్ల అమెరికన్ డాలర్లుస్పెల్ బీ లోనూ మన కూనలదే హవాస్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో భారతీయ సంతతి విద్యార్థుల హవా కొనసాగుతోంది. ఆ ఏడాది విజేత బృహత్ సోమ సహా భారతీయ సంతతి విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఈ పోటీల్లో 2000 నుంచి 2023 వరకూ మొత్తం 34 మంది విజేతలుగా నిలవగా వారిలో 28 మంది మన విద్యార్థులే కావడం మనందరికీ గర్వకారణం. -
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
హోం మంత్రి అమిత్ షాకు కోల్కతా డాక్టర్ తండ్రి లేఖ
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
కూతురంటే ఎంత ప్రేమో.. 70ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్
భువనేశ్వర్ : ఉద్యోగ విరమణకాగానే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలం గడపాలనుకునేవాళ్లనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. కన్నబిడ్డ దూరమై మిగిల్చిన విషాదం ముందు.. వయసు మీదపడి ఓపిక తగ్గే తరుణంలో ఉరకలేసే ఉత్సాహంతో నీట్ యూజీ 2020 ఫలితాల్లో ర్యాంక్ను సాధించారు. ఎంబీబీఎస్ విద్యార్థిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. త్వరలో డాక్టర్గా విధులు నిర్వహించనున్నారు.ఒడిశాకు చెందిన 64ఏళ్ల జే కిషోర్ ప్రధాన్ ఎస్బీఐ బ్యాంక్లో ఉన్నత ఉద్యోగం. ఇద్దరు కవలలు. అందమైన కుటుంబం. ఏచీకూ చింతాలేదు. ఎందుకో ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.మలిదశలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న కుమార్తెను దూరం చేసింది. ఆ తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. ఇంటి వెలుగులను ఒకేసారి ఆర్పేసి చీకట్లు మిగిల్చింది.అదుగో అప్పుడే తనలాగే మరో ఆడబిడ్డ తండ్రికి గుండె కోత మిగిల్చకూడదనుకున్నారు. డాక్టర్గా సేవలందించాలని దీక్షబూనారు. ఎస్బీఐ అసిస్టెంబ్ బ్యాంక్ మేనేజర్గా పదవీ విరమణ చేసినా డాక్టర్గా సేవలందించాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనిలో పడ్డారు. దృఢ సంకల్పంతో ఓ వైపు విద్యార్థి, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే పెద్దగా ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తన కలల ప్రయాణాన్ని ప్రారంభించారు.కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దేశంలోనే అత్యంత కఠినమైన నీట్ పరీక్షల్లో ఉత్తర్ణీత సాధించాలనే లక్ష్యం ముందు అవి చిన్నవిగా కనిపించాయి. ముందుగా నీట్ యూజీ 2020 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పోటీ పడ్డారు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యారు. మొక్కవోని దీక్షతో అనేక సవాళ్లను అధిగమించారు. చివరికి అనుకున్నది సాధించారు.నీట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR)లో ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వచ్చే ఏడాది డాక్టర్గా ప్రజా సేవ చేయనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డబ్బు మీద ఆశలేదు. దూరమైన నా కుమార్తె కోసం నేను బతికి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను’అని వ్యాఖ్యానించారు. ‘దేశ వైద్య విద్యా చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. ఇంత వయస్సులో వైద్య విద్యార్థిగా అర్హత సాధించి ప్రధాన్ ఆదర్శంగా నిలిచారు’ అని విమ్స్ఆర్ డైరెక్టర్ లలిత్ మెహెర్ ప్రధాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.👉చదవండి : ‘మేం ఏపీకి వెళ్లలేం’ -
చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య
తాడ్వాయి: ‘డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ’ అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు. భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో వి షాదఛాయలు అలుముకున్నాయి. శనివారం దస రా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు వి ఘ్నేశ్(6), అనిరుధ్రెడ్డి(4)కి కొత్త డ్రెస్లు వేయించి తన బైక్పై శమీ పూజకు తీసుకెళ్లాడు. అతడి భార్య అపర్ణ ఇంటి వద్దే ఉన్నది. రాత్రయినా వారు తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్రెడ్డి ఫోన్, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. మోటార్లు వేసి నీటిని ఖాళీ చేయడంతో బావిలో శ్రీనివాస్ రెడ్డి మృతదేహం లభించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకులు, భర్త మృతదేహాన్ని చూసి అపర్ణ రోదన మిన్నంటింది. తన బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని ఆమె రోదించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నారులు విఘ్నేశ్, అనిరుధ్రెడ్డి ప్రతి రోజూ అమ్మవా రి మండపానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారని గ్రామస్తులు రోది స్తూ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయ్గావ్కు చెందిన శ్రీనివాస్రెడ్డి పదేళ్ల క్రితం ఇల్ల రికం వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
పండగపూట విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి..
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం నందివాడలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు, తండ్రి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తండ్రి శ్రీనివాస్రెడ్డి తీసుకెళ్లగా, రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆయనకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిప్ట్ చేయలేదు. మళ్లీ అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లలు, తండ్రి మృతదేహాలు కనిపించాయి. తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: వారే లేని.. నేనెందుకని.. -
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
ఛతర్పూర్: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ, ఎన్సీఈఆర్టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితేడాక్టర్ రాఘవ్ పాఠక్ కుమార్తె ఎన్సీఈఆర్టీ బోర్డు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలో హిందీ మీడియంలో మూడవ తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి సంబంధించిన పర్యావరణ సబ్జెక్ట్లోని 17వ లెసన్ ‘చిట్టీ ఆయీ హై’ పేరుతో ఉంది. ఇందులో రీనా అనే అమ్మాయి తన స్నేహితుడైన అహ్మద్ను సెలవుల్లో అగర్తలాకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ రాస్తుంది. ఈ లేఖ చివరిలో ‘నీ రీనా’ అని రాస్తుంది. దీనిని గుర్తించిన డాక్టర్ రాఘవ్ పాఠక్ ఈ లెసన్ ‘లవ్ జిహాద్’ మాదిరిగా ఉందని ఆరోపించారు. అలాగే ఈ లేఖ లవ్ జిహాద్కు ఊతమిస్తుందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి లేఖ రాయడం, పైగా చివరిలో ‘నీ రీనా’ అని రాయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను చదివిన పిల్లల మదిలో లవ్ జిహాద్పై ఆకర్షణ పెరుగుతుందని, భవిష్యత్తులో లవ్ జిహాద్ లాంటి ఘటనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ లాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తుండగా, ఎన్సీఈఆర్టీకి చెందిన ఈ పుస్తకం లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నట్లున్నదని ఆయన ఆరోపించారు.ఈ పుస్తకంలోని 17వ లెసన్లో అహ్మద్- రీమా లేఖను తక్షణం మార్చాలని లేదా తొలగించాలని తాను కోరుకుంటున్నానని, తన కుమార్తె ఈ లెసన్ చదివాక ఆమె మనసులో ఎలాంటి తప్పుడు భావన తలెత్తకూడదని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయమై ఖజురహో పోలీసు అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ పర్యావరణ పుస్తకంలోని ఒక లెసన్ లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును సీనియర్ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర -
కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!
‘కనేది ఆమె అయినా అతడికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టంగా మారింది. కాబట్టి ఈ రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాల్సిన పరిస్థితి. ఇలాంటి సరికొత్త ఆలోచనకు నాంది పలకక తప్పని పరిస్థితి. అందువల్ల మహిళలకు ఇచ్చినట్లే కాబోయే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిందే. అయితే ఈ పెటర్నటీ సెలవులు ఉండి ఉన్నట్లుగా ఉన్నాయంతే. చాలా కంపెనీలు సరిగా ఇవ్వనే ఇవ్వడం లేదు. ఈ విషయమై లండన్లో పెద్ద ఎత్తున అసంతృప్తి నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. యూకే అంతటా పురుషుల విగ్రహాలు బేబీ క్యారియర్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఓ చిన్న శిశువు బొమ్మ పురుషుడి మెడకు చుట్టి ఉంచినట్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు ప్రపంచమంతటా హాట్టాపిక్గా నిలిచాయి. అందుకు కారణం పెటర్నటీ సెలవులు. కాబోయే తండ్రులకు సెలవులు ఇవ్వాలని చెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ది డాడ్ షిఫ్ట్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంతేగాదు కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం అనే విషయంపై అంతా దృష్టి సారించేలా ఈ విధంగా చేస్తున్నారు అక్కడ. పితృత్వ సెలవులు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?, వారి పాత్ర కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? అని నొక్కి చెప్పేలా అడుగడుగున ఇలాంటి పురుష విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంతేగాదు నిరసనకారులు తమ అభ్యర్థనలతో యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్కు బహిరంగ లేఖను కూడా అందించారు. నిజానికి యూకే రెండు వారాల పితృత్వ సెలవును అందిస్తుంది. అంతేగాక వారానికి సుమారు రూ. 20,300 చెల్లిస్తోంది కూడా. అయితే బెల్జియం వంటి యూరోపియన్ దేశాలు మాత్రం ఈ పెటర్నటీ సెలవల్ని 20 రోజులకు పెంచింది. అంటే..యూరోపియన్ పార్లమెంట్ ఆదేశాల ప్రకారం ఫిన్లాండ్లో తల్లిదండ్రులిద్దరికీ 160 రోజులు వేతనంతో కూడిన సెలవులందిస్తోంది. అయితే మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు పితృత్వ సెలవులపై తప్పనిసరి చట్టం లేదు. కానీ 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) నిబంధనల ప్రకారం, పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పితృత్వ సెలవులకు అర్హులు. ఈ విషయంపై ఇదివరకటి రోజల్లో అంతగా ప్రామఖ్యత లేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సెలవులు తప్పనిసరి అని చెప్పొచ్చు. కాన్పు సమయంలో అమ్మ కాబోతున్న మహిళల్లో సైతం ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇప్పుడూ ఎవరికీ వారే అనే యమునా తీరే అన్నట్లుగా న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటప్పుడూ భర్త తోడు ఉండాలి. దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలను ఎలా పంచుకోవాలో తెలియడమే గాక ఓ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.(చదవండి: మరోసారి హాట్టాపిక్గా మార్లిన్ మన్రో జీవితం..!) -
తండ్రి కన్నుమూత, కన్నీరుమున్నీరైన గాయకుడు (ఫోటోలు)
-
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
శోకసంద్రంలో మలైకా అరోరా, తరలి వచ్చిన బీటౌన్ పెద్దలు (ఫొటోలు)
-
Kolkata: సీఎం మమత చేసిందేమీ లేదు: బాధితురాలి తండ్రి
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితురాలి తండ్రి పడుతున్న ఆవేదనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.ఆ వీడియోలో బాధితురాలి తండ్రి సీఎం మమతా బెనర్జీపై పలు ఆరోపణలు చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి రోదిస్తూ ‘ఈ కేసులో సీఎం (మమతా బెనర్జీ) పాత్రపై మాకు సంతృప్తి లేదు. ఆమె ఏ పనీ చేయలేదు. ఈ ఘటనలో డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈ సంవత్సరం దుర్గాపూజను ఎవరూ జరుపుకోరని మేము భావిస్తున్నాం. ఎవరైనా సంబరాలు చేసుకున్నా వారు ఆనందంగా జరుపుకోలేరు. ఎందుకంటే అందరూ బెంగాల్ ప్రజలే, దేశం నా కూతురిని తన కూతురిగా భావిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: సుప్రీం డెడ్లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్టర్లుకాగా ఈ ఘటనను అనువుగా మలచుకుని కేంద్రం తమపై కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో కొన్ని వామపక్ష పార్టీల ప్రమేయం కూడా ఉందన్నారు. అన్నారు. రాష్ట్ర సచివాలయం నబన్నలో జరిగిన పరిపాలనా సమీక్షా సమావేశంలో మమత మాట్లాడుతూ బాధితురాలి తల్లిదండ్రులకు తాను ఎప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. పొరుగు దేశంలో నెలకొన్న గందరగోళాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, భారత్, బంగ్లాదేశ్లు వేర్వేరు దేశాలన్న విషయాన్ని వారు మరిచిపోయారని మమత పేర్కొన్నారు. #WATCH | West Bengal | Kolkata's RG Kar Rape and murder incident | Victim’s father breaks down, says, "...We are not satisfied with the role of the CM (Mamata Banerjee) in the case...She did not do any work...The incident which occurred with my daughter, we have been saying this… pic.twitter.com/u65SQrE2Ma— ANI (@ANI) September 11, 2024 -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తండ్రి పూనమ్ చంద్ యాదవ్(100) కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉజ్జయినిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.తన తండ్రి మృతి గురించి సీఎం మోహన్ యాదన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘పూనంచంద్ యాదవ్ జీ మరణం నా జీవితంలో ఒక పూడ్చలేని నష్టం. నా తండ్రి నేర్పిన నైతిక విలువలు, సూత్రాలతో నేను గౌరవప్రదమైన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. మీ జ్ఙాపకాలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి’ అని పేర్కొన్నారు.దీనికి ముందు తన తండ్రి పూనమ్ చంద్ యాదవ్ మరణ వార్త విన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భోపాల్ నుండి ఉజ్జయిని చేరుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పూనమ్ చంద్ యాదవ్ అంత్యక్రియలను బుధవారం ఉజ్జయినిలో నిర్వహించనున్నారు. కాగా పూనమ్ చంద్ యాదవ్ మృతికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. -
తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో కుమారుని మృతి
బివార్: విధి రాతను ఎవరూ తప్పించలేరని అంటారు. కొన్ని ఉదంతాలు చూసినప్పుడు ఇది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది. రాజస్థాన్లోని బివార్ జిల్లాలో గల జాలియా గ్రామంలో విధి ఆడిన వింత నాటకం స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి మృతదేహాన్ని స్మశాన వాటికవరకూ తీసుకెళ్లిన కుమారుడు హఠాత్తుగా కన్నుమూశాడు.వివరాల్లోకి వెళితే జాలియా గ్రామంలోని బ్రహ్మపురి ప్రాంతంలో నివసిస్తున్న రాధాకృష్ణ నాగ్లా అనే వృద్ధుడు మృతిచెందాడు. తండ్రి మరణంతో అతని కుమారుడు మహావీర్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. బంధువుల సహాయంతో తండ్రి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లాడు. తండ్రి చితికి నిప్పు పెట్టేంతలో స్పృహ తప్పిపడిపోయాడు. అతనిని గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహావీర్ ప్రసాద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులంతా షాకయ్యారు. చివరికి వారే తొలుత రాధాకృష్ణకు, ఆ తరువాత మహావీర్ ప్రసాద్కు అంత్యక్రియలు నిర్వహించారు. మహావీర్ ప్రసాద్ సోదరుడు రాజ్ కుమార్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పుడు రాధాకృష్ణ, మహావీర్ ప్రసాద్లు మృతిచెందడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి అనాథగా మారింది. -
హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్లో తండ్రిని..!
జపాన్కి చెందిన ఓ కుర్రాడు తన తండ్రిని వెతుకుతూ భారత్లోకి వచ్చాడు. తండ్రి జాడ కోసం అనువణువు గాలించి మరీ వెతికి పట్టుకున్నాడు. అదీకూడా 19 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంటే ఆ అనందం వేరేలెవెల్. మాటలకందని ఆ ఆనందం ఊహకందని నమ్మలేని నిజంలా అనిపిస్తుంది. అలాంటి సంఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సుఖ్పాల్ సింగ్ థాయిలాండ్లో జపనీస్ మహిళ సాచీని కలుసుకున్నాడు. 2002లో ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. టోక్యో సమీపంలో చిబాకెన్లో ఆమెతో కలిసి నివశించాడు. కొన్నాళ్లకే వైవాహిక బంధంలో సమస్యలు వచ్చి విడిపోయారు. అప్పటికే వారికి రెండేళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అయితే రిన్ తన తల్లి సాచీ వద్దే పెరిగాడు. 2007లో భారత్కు తిరిగివచ్చిన సుఖ్పాల్కు కొడుకు లేదా భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం జపాన్లో ఉంటున్న రిన్ తన తండ్రిని కలవడానికి ఇటీవలే పంజాబ్ వెళ్లాడు. కేవలం అలనాటి తండ్రి ఫోటో, అడ్రస్ సాయంతో అవిశ్రాంతంగా ఆచూకీ కోసం వెతికాడు. చివరికి తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సుఖ్పాల్ సింగ్ మాట్లాడుతూ..తన ఫోటో సాయంతో ప్రజలందర్ని అడుగుతూ వస్తూ తనని కనుక్కున్నాడని అన్నారు. తన కొడుకుని కలవడం నిజంగా నమ్మలేకున్నా. ఇది ఒక కలలా ఉంది. నా కొడుకుని కలవాలని చాలసార్లు అనుకున్నా కానీ అది సాధ్య పడదని వదిలేశాను. ఇలా తన కొడుకే తనని వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు ." సుఖ్పాల్ సింగ్. ఇక రిన్ జపాన్లోని ఒసాకా యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్లో కుటుంబ వృక్షం అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లివైపు కుటుంబసభ్యులే తెలుసు తప్ప తండ్రి గురించి ఏం తెలియదని గ్రహించి..రిఎలాగైనా కలుసుకోవాలనే సంకల్పం మొదలయ్యింది రిన్లో. తన తండ్రి ఆచూకీ కోస గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు వివరించాడు. ఆగస్టు 15 కల్లా తండ్రి ఉన్న ప్రదేశానికి చేరకున్నాడు. చివరికీ ఆగస్టు 18 నాటికి తన తండ్రిని కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. What a moment ❤️ Sukhpal Singh and his Japanese son Rin Takahata reunited after 19 years when Rin, inspired by a college assignment, traced his father to Amritsar, India. Rin was welcomed warmly by Sukhpal and his current family. pic.twitter.com/KExVBl6wwY— Akashdeep Thind (@thind_akashdeep) August 24, 2024 (చదవండి: నటి ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
అసోం అత్యాచార ఘటన: ‘నా బిడ్డను చూసి తల్లడిల్లిపోయా’
దిస్పూర్:అసోంలోని నాగావ్ జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. బాధితురాలు ప్రస్తుతం నాగావ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణం జరిగిన అనంతరం ఆమెను నిందితులు రోడ్డు పక్కన వదిలేశారు. ఆమె స్పృహ కోల్పోయి స్థానికులకు కనిపించగా ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్పందించారు. గౌహాతిలో పనిచేస్తున్న ఆయన సమాచారం అందగానే తమ గ్రామానికి వచ్చారు. తన కూతురుకు ఇలా జరగటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నేను నా కూతురును చూసినప్పడు ఆమె కనీసం మాట్లాడలేకపోయింది. ఈ దారుణ ఘటనతో మా గ్రామంలోని ప్రజలంతా తీవ్రమై భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. లేదంటే.. తమ ఆడపిల్లలకు కూడా ఇలాంటివి జరుగుతాయనే భయంతో జనం బతకాల్సి వస్తుంది’’ అని అన్నారు.మరోవైపు.. ఈ ఘటనలో అరెస్టైన ప్రధాన నిందితుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈ కేసులో శుక్రవారం పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటన స్థలానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకొని ఓ చెరువులో దూకాడు. దీంతో వెంటనే పోలీసులు రెండు గంటల పాటు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్వప్ననీల్ వెల్లడించారు. -
మా డాడీ మీద కేసు పెట్టమన్న బుడ్డోడు
-
Bangladesh: షేక్ హసీనా తండ్రి విషయంలోనూ..
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి సైన్యం ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.బంగ్లాదేశ్లో ఈ విధమైన తిరుగుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 1975లో కూడా ఇదేవిధంగా జరిగింది. నాటి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా తండ్రి, ఆమె సోదరులు హతమయ్యారు. అయితే షేక్ హసీనా ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె బంగ్లాదేశ్కు దూరంగా ఇతర దేశాలలో సుమారు ఆరేళ్ల పాటు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె భారతదేశంలో కూడా చాలా కాలంపాటు ఉన్నారు.అది 1975వ సంవత్సరం.. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్మీ యూనిట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. కొంతమంది సాయుధులు షేక్ హసీనా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులను, సోదరులను దారుణంగా హత్యచేశారు. అయితే ఆ సమయంలో షేక్ హసీనా తన భర్త వాజిద్ మియాన్, చెల్లెలు పాటు యూరప్లో ఉన్నందున ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.ఈ ఘటన అనంతరం షేక్ హసీనా కొంతకాలం జర్మనీలో ఉండి భారత్కు వచ్చారు. నాడు భారతదేశంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనా 1981లో బంగ్లాదేశ్కు తిరిగి చేరుకున్నారు. ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. దీని తరువాత షేక్ హసీనా 1986 సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే 1996 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2001 వరకూ ప్రధాని పదవి చేపట్టారు. అలాగే 2009 నుంచి 2004 వరకూ కూడా షేక్ హసీనా ప్రధాని పదవిలో ఉన్నారు. -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
బాలిక ఆచూకీ ఆలస్యం కావడంతో బాలిక తల్లిదండ్రుల ఆవేదన
-
అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో
పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి సాగనంపడం అనేది భావోద్వేగంతో కూడిన సందర్భం. పెళ్లికి నిశ్చితార్థం మొదలు, ఆ మూడు ముళ్లూ పడివరకు, ఇక అమ్మాయి అప్పగింతల సమయంలో ఆ ఉద్విగ్న క్షణాలు కన్నీటి పర్వంత మవుతాయి. నిరుపేదైనా, కుబేరుడైనా ఈ అనుభవం తప్పదు. పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ ముద్దుల తనయ రాధికమర్చంట్ మధ్య ఇలాంటి భావోద్వేగ క్షణాలు నమోదైనాయి. మర్చంట్, అంబానీ కుటుంబాలు నిర్వహించిన గ్రహ శాంతి పూజ సందర్భంగా వీరేన్, కాబోయే వధువు రాధికను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ వెడ్డింగ్కు ముందు అనంత్ అంబానీకూడా తన కాబోయే భార్యను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా ఇద్దరు పారిశ్రామికవేత్తలువియ్యమందుకునే ముహూర్తం మరికొద్ది గంటల్లో రానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో ఈ రోజు (జూలై 12) వివాహం జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు ఇప్పటికే ముంబై చేరుకుంటున్నారు. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) -
ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం
-
రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల...
ముంబయి: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం(జులై 8) ఉదయం 9.30 గంటలకు దూసుకొస్తున్న లోకల్ రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు వదిలారు. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ట్రాక్పై నిల్చున్నపుడు రైలు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతి చెందిన వారిలో తండ్రి హరీశ్ మెహతా(60), కొడుకు జే(35)గా గుర్తించారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘నాన్న అంటే జీవితం..నాన్నే ధైర్యం’ : వైరల్ వీడియో
జోరుగా కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగి పారుతున్న నదులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో ప్రమాదంలో చిక్కుకుంది. పుణేలోని లోనావాలా ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన దృశ్యం విషాదాన్ని నింపింది. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో తన బిడ్డలను అత్యంత సాహసోపేతంతో తండ్రి కాపాడుకున్న వైనం విశేషంగా నిలిచింది. ఇది ఎక్కడ, ఎలా జరిగింది అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. నాన్న పక్కనుంటే అలలైనా తలవొంచాల్సిందే అనే క్యాప్షన్తో లక్నోకు చెందిన శ్యామ్ యాదవ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కూడ తండ్రి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కమెంట్స్ చేశారు. తండ్రి అన్న పదం వినగానే శక్తి వస్తుంది. ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన గొప్ప శక్తి లేదు అని ఒకరు వ్యాఖ్యానించారు. శక్తివంతమైన అలలు వచ్చినపుడు నాన్న అయినా ఏమీ చేయలేడు. అత్యుత్సాహ ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని మరొకరు కమెంట్ చేశారు.पिता साथ है, तो लहरों की क्या औकात pic.twitter.com/fqTjEXUZtr— Shyam Yadav (@shyamyadav2408) July 5, 2024 -
కన్న పిల్లలను చితకబాదిన తల్లి.. వీడియో తీసిన తండ్రి
ముంబై: మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ తల్లి కనికరం లేకుండా తన ఇద్దరు పిల్లలపై ఇష్టానుసారంగా చేయి చేసుకుంది. కన్న ప్రేమను మరిచి బెల్టుతో కొడుకు, కూతురిని చితకబాదింది. పిల్లలు దెబ్బలతో అల్లాడిపోతుంటే, ఈ తతంగాన్నంతా తండ్రి తన ఫోన్లో వీడియో తీస్తూ.. భార్యను ఆపకపోవడం కొసమెరుపు.ముంబైలోని వాన్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళ తన కూతురు, కొడుకును తీవ్రంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తూ, కొట్టవద్దని తల్లిని వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. అయినా ఆగని ఆ మహిళ వారిని చెంపదెబ్బలు, బెల్టుతో చితకబాదింది. ఇక ఆ ఘోరాన్ని ఆపాల్సింది పోయి.. ఈ దృశ్యాలను కన్న తండ్రి వీడియో తీశాడు. వీడియో రికార్డ్ చేయమని తన భర్తను ఆమె కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి వివాహిత తన పిల్లలపై ఈ విధంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.వీడియో వైరల్ అవ్వడంతో రిటైర్డ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్జె కథవాలా ఈ వ్యవహారంపై బాలల రక్షణ హక్కుల కమిషన్కు లేఖ రాశారు. తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముంబై పోలీసు కమిషనర్కు కూడా లేఖ రాశారు.చర్య తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఒక కాపీని పంపినట్లు రిటైర్డ్ జడ్జి కథవాలా తెలిపారు.మరోవైపు భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్కు పిలిపించి, తల్లిదండ్రులు.. పిల్లల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వీడియో 2022 సంవత్సరానికి చెందినదని, ఇప్పుడు బయటపడిందని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పిల్లలిద్దరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించారు. -
కొత్త పెళ్లికూతురు సోనాక్షి ‘ఫ్యామిలీ’ విశేషాలు, సల్మాన్తో లింకేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. చాలా సింపుల్గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి. రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్గా నిలుస్తోంది. సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎవరీ రతాన్సీ?ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు రతాన్సీ.ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం 2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు.ఇక్బాల్ రతాన్సీ కుటుంబంరతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్గా పేరొందింది.సల్మాన్ ఖాన్తో ఇక్బాల్ రతాన్సీ బంధంఇక్బాల్ , సల్మాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్ను బాలీవుడ్లో నోట్బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. -
కుటుంబాన్ని మింగేసిన అగ్ని కీలలు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. మంటలు భారీగా చెలరేగడంతో 13 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోనికి తీసుకువచ్చాయి. ఈ ఘటన గ్వాలియర్లోని బహోదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్నగర్లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో విజయ్ అలియాస్ బంటీ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు దీనిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు.అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే విజయ్, అతని కూతుళ్లు అన్షిక అలియాస్ మినీ (15), యాషిక అలియాస్ జీసస్ (14) సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన భవనంలో కింది అంతస్తులో ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉంది. దీంతో వారు ఇంటిలో నుంచి బయటకు రాలేకపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసింది. ఈ భవనపు కింది భాగంలో డ్రై ఫ్రూట్స్ దుకాణం, రెండవ అంతస్తులో ఒక గొడౌన్ ఉంది. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
శాలిగౌరారం: కన్న తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతిచెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. మనిమద్దె గ్రామానికి చెందిన అంతటి శంకరయ్య(72)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను అనారోగ్యం బారిన పడి ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. చిన్న కుమారుడు రాంబాబు(34) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శంకరయ్య, అతడి భార్య మనిమద్దె గ్రామంలోనే ఉంటున్నారు. శంకరయ్య అనారోగ్యంతో మూడు నెలలుగా మంచం పట్టి ఆదివారం మృతిచెందాడు. తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న రాంబాబు హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మృతదేహాన్ని చూసినప్పటి నుండి శంకరయ్య తీవ్ర మనోవేదనతో రోదిస్తూ ఉన్నాడు. బంధువులు, ఎంత నచ్చజెప్పినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలో తండ్రి శంకరయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేక సాయంత్రం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెంటనే రాంబాబును నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. అక్కడ రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి రాంబాబు మృతదేహాన్ని మనిమద్దెకు తీసుకురాగా మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి పెంకుటిల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని ఆ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న తండ్రి, ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
ఐసీయూలో వెంటిలేటర్పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్లాల్గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
Father's Day 2024: స్టార్ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)
-
ఇద్దరితో సహజీవనం.. అడ్డుకున్న తండ్రిని హత్య చేసిన కూతురు
-
Happy fathers day 2024 లవ్లీ డాడీతో సెల్పీ పంపండి, సాక్షితో సెలబ్రేట్ చేసుకోండి!
నాన్న త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ప్రత్యేకంగా ప్రతి యేడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటాం. అంటే ఏడాది జూన్ ఆదివారం 16న ఫాదర్స్ డే. ప్రతీ ఫాదర్స్ డే రోజు లవ్లీ డాడీని అనేక బహుమతులతో సర్ప్రైజ్ చేస్తారు కదా. ఈ ఏడాది మాత్రం సాక్షి. డాట్కాంతో స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఎలా అంటారా? సింపుల్.. నిస్వార్థంగా ఆకాశమంత ప్రేమను పంచే మీ డాడీతో ఒక సెల్ఫీ తీసుకోండి. సాక్షి డాట్.కామ్కు ఈ కింద ఫోటోలో ఉన్న నెంబరుకు వాట్సాప్ చేయండి...హ్యాపీ ఫాదర్స్ డే! -
తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్
లోక్సభ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికనబరిచింది. ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ తదితర నటులతో పాటు బాలీవుడ్ నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా పోటీ చేశారు. ఆయన బీహార్లోని భాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ చేతిలో శర్మ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.తన తండ్రి ఓటమిపై నేహా శర్మ ఆవేదనతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని కవితారూపంలో రాశారు. తన కుటుంబం తదుపరి అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె దానిలో పేర్కొన్నారు.‘ఇది మాకు కష్టమైన రోజు. మేము అన్నివిధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఆయనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. మేము తదుపరి దశలో సాగే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఓటమితో కుంగిపోకుండా ఎప్పుడూ ముందుకు సాగాలని మనం గుర్తుంచుకోవాలి. పర్వతంలా ధృడంగా నిలవాలి. సింహంలా గర్జించాలి. నిర్భయంగా నిలబడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని నేహాశర్మ రాశారు. ఆమె భాగల్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన తండ్రి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నేహా శర్మ తెలుగులో రామ్చరణ్ సరసన ‘చిరుత’ సినిమాలో నటించారు. -
విడాకుల మహోత్సవం
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.అనిల్ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024 -
Pune Porsche Crash: మైనర్ తప్పిదం.. తండ్రి అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
టీడీపీ గుండాలు ప్రాణం తీశారు!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు. -
‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్ కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్షీట్.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ మార్క్షీట్ను @desi_bhayo88 పేరిట సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్ కావాలని చెప్పారని రాశారు. Pitaji ki marksheet mil gayi 😂 pic.twitter.com/3dXn0yKJh1— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024 -
ఆన్లైన్ గేమ్లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి
కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ గేమ్లు వద్దన్నా విననందుకు.. కన్న కొడుకునే తండ్రి కడతేర్చిన దారుణ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. చేతికొచి్చన ఒక్కగానొక్క కొడుకును తండ్రే పొట్టన పెట్టుకోవడంపై గ్రామస్తులు విస్మయానికి లోనయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి–శ్రీనివాస్కు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా, కొడుకు పెరుమాండ్ల శివసాయి(21) హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో శుభకార్యం కోసం బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. కాగా, హైదరాబాద్ వెళ్లి ఆన్లైన్ గేమ్లు ఆడి డబ్బులు పోగొట్టొద్దని, ఇక్కడే ఉండాలంటూ తరచూ తండ్రీకొడుకుల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో భూమి అమ్మాలని శివసాయి ఒత్తిడి తెస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది కారం చల్లాడు. తీవ్రగాయాలతో శివసాయి మంచంపైనే మృతిచెందగా తండ్రి కొత్తపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఉపాధి పనులకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్ ప్రత్యర్థిగా షారూఖ్ తండ్రి.. నాడు ఏం జరిగింది?
రాజకీయాల్లోకి సినీతారలు ప్రవేశించడం కొత్తవిషయమేమీ కాదు. అయితే వారు రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారనేది ఆసక్తికర అంశం. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆ తరువాత ఏం జరిగింది? హిందీ నటుడు షారూక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ స్వాతంత్ర్య సమరయోధుడు. నాడు ఆయనకు కాంగ్రెస్లో పలువురు సన్నిహిత మిత్రులు ఉండేవారు. స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీర్ తాజ్ మహ్మద్కు లభించింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 1957లో దేశంలో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో తాజ్ మహ్మద్ గుర్గావ్ లోక్సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నాటి కాంగ్రెస్ దిగ్గజ నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్కు ప్రత్యర్థిగా ఎన్నికల రణరంగంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాటి ఎన్నికల్లో భారత తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్ అమోఘ విజయం సాధించారు. జనసంఘ్ అభ్యర్థి మూల్ చంద్ రెండో స్థానంలో నిలిచారు. తాజ్ మహ్మద్ జాతీయవాద నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరుడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో తాజ్ మహ్మద్ చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. పెషావర్లో పెరిగిన తాజ్ మహ్మద్ న్యాయశాస్త్రం చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. 1947లో భారత్-పాక్ విభజన సమయంలో తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉన్నారు. కారవాన్లో ప్రచురితమైన ఇరామ్ అఘా నివేదిక ప్రకారం విభజన అనంతరం పాక్ ప్రభుత్వం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తాజ్ మహ్మద్ అనుచరులను బ్లాక్ లిస్ట్లో చేర్చింది. నాటి నుంచి తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉండిపోయారు. -
కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపులు తీస్తా...
పాపన్నపేట (మెదక్): వేధింపులతో విరక్తి చెంది కన్న తండ్రినే కిరాతకంగా చంపాడు ఓ కుమారుడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సంగం ప్రేమానందం (42), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు సందీప్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతుండగా, కూతురు 9వ తరగతి, చిన్న కుమారుడు ప్రవీణ్ 7వ తరగతి చదువుతున్నారు. ప్రేమానందం మద్యానికి అలవాటు పడి, భార్యను అనుమానిస్తూ తరచూ కొడుతుండేవాడు. 10 రోజుల కిందట అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం ప్రేమానందంకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వారి కుటుంబంలో సఖ్యత కుదరలేదు. బుధవారం మళ్లీ గొడవ జరగడంతో తల్లి సుగుణమ్మ, పెద్ద కుమారుడు సందీప్ కలిసి రోకలి బండతో ప్రేమానందం మోకాళ్లు విరగ్గొట్టి నడవడానికి రాకుండా చేసి తల్లిగారింటికి వెళ్లిపోయారు. అయితే శనివారం మళ్లీ సందీప్ ఇంటికొచ్చేసరికి ప్రేమానందం తన తండ్రి ప్రసాద్, పక్కింటి వారితో మాట్లాడుతున్నాడు. వెంటనే సందీప్ తాత ప్రసాద్ను, పక్కింటి వారిని ఇంట్లో నుంచి బయటకు పంపి తలుపులు గడియపెట్టాడు. లేవలేని స్థితిలో ఉన్న తండ్రి ప్రేమానందంను కరెంట్ హీటర్తో విచక్షణా రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు. చుట్టు పక్కలవారు తలుపులు తీయమని బతిమిలాడినా ‘కొన ఊపిరితో ఉన్నాడు.. ప్రాణం పోయాకే తలుపులు తీస్తానంటూ’ ఆగ్రహంతో ఊగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చున్నీతో ఉరి వేసి తండ్రిని హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరేశ్, క్లూస్ టీం తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి, సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సందీప్ ఇటీవల పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించగా,కొద్ది తేడాతో అవకాశం పోయినట్లు తెలిసింది. -
తండ్రి యూనిఫాంలోనే విధుల్లోకి లెఫ్టినెంట్ ఇనాయత్
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి మిలిటరీ యూనిఫాం ధరించి విధుల్లో చేరారు లెఫ్టినెంట్ ఇనాయత్ నాట్స్. సుమారు 20 ఏళ్ల క్రితం జమ్మూకశ్మీర్లో అసువులు బాసిన తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తాననే సంకేతా లందించడం విశేషంగా నిలిచింది. కేవలం మూడేళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన ఇనాయత్ తండ్రిపై ప్రేమను, అంతకుమించిన దేశభక్తిని చాటుకున్న క్షణాలు ఉద్వేగాన్ని నింపాయి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో లెఫ్టినెంట్గా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్కు ఆమె తన తండ్రి యూనిఫాం ధరించి అక్కడున్న వారందరినీ ఆశ్యర్యపరిచారు. ఆర్మీ డాటర్ లెఫ్టెనెంట్ ఇనాయత్ వాట్స్కు స్వాగతమంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. తండ్రి యూనిఫారం ధరించిన వాట్స్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. తల్లి శివాని వాట్స్ కూడా ఆమె పక్కన నిలబడి ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. “𝐀𝐥𝐥 𝐟𝐨𝐫 𝐒𝐮𝐩𝐫𝐞𝐦𝐞 𝐒𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐡𝐞𝐫 𝐟𝐚𝐭𝐡𝐞𝐫”#OTAChennai #PassingOutParade Inayat was barely three years, when she lost her father Major Navneet Vats in a counter insurgency operation. More than two decades later, she gets commissioned into… pic.twitter.com/AiIBUpfc1J — Army Training Command, Indian Army (@artrac_ia) March 9, 2024 కాగా ఛండిగఢ్కు చెందిన నవ్నీత్ వాట్స్ 3 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్లోని 4వ బెటాలియన్లో విధులు నిర్వర్తించే వారు. 2003, నవంబర్లో శ్రీనగర్లో ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నవ్నీత్ అమరుడయ్యారు. ఈ సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలను ప్రదర్శించిన మేజర్ నవ్నీత్ వాట్స్కు కేంద్రం శౌర్య పురస్కారాన్ని ప్రకటించింది. ఇనాయత్ వాట్స్ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2023 ఏప్రిల్లో ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో చేరారు. -
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని...కోపంతో తండ్రి...
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం అనే గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలంలోని సీతారామపురం గ్రామానికి చెందిన కందుల వంశీ, అదే గ్రామానికి చెందిన అత్తి శ్రావణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి శ్రావణి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహంతో వంశీ ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి శ్రావణిని ఎత్తుకెళ్లారు. -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్పూర్లోని శంకర్గఢ్కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్గఢ్లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
మన్సూరాబాద్/హయత్నగర్: మద్యం తాగి కుటుంబ పరువు తీస్తున్నాడని కలత చెందాడో..ఆస్తి తగాదాలు ఉన్నాయో తెలియలేదు కానీ..ఓ తండ్రి కన్న కొడుకును కడతేర్చాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్గౌడ్ గత కొంత కాలంగా మునగనూరులోని రామాంజనేయకాలనీ రోడ్నెంబర్–7 స్వంత ఇంటిలో నివాసం ఉంటూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాస్గౌడ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వినయ్ (28) ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లికను ప్రేమించి పెళ్లి చేసుకుని సమీపంలోని ఓ ఇంట్లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల పాప రక్షిత ఉంది. ఇటీవల కొద్ది కాలంగా వినయ్ తరచుగా మద్యం తాగి తండ్రి శ్రీనివాస్గౌడ్ నివాసానికి వచ్చి వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. వ్యాపారం చేసుకుంటా..ఆస్తిలో తన భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అలాగే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. చేసేది లేక శ్రీనివాస్గౌడ్ రూ.500 మద్యానికి ఇచ్చాడు. అనంతరం వినయ్ మద్యం తెచ్చుకుని తాగి మరింతగా ఇంట్లో గొడవకు దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్గౌడ్ అక్కడే ఉన్న ఇనుప పారతో వినయ్ తలపై గట్టిగా బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై వినయ్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని కూడా తెలుస్తోంది. హయత్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శ్రీనివాస్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే బుందేల్ఖండ్ పరిధిలోని సాగర్లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగాల్సివుంది. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్కు గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ నేపధ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొని, ముక్తిధామ్లో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. హరిశ్చంద్ర అహిర్వార్ బంధువు ఛోటాలాల్ అహిర్వార్ మాట్లాడుతూ కుమార్తెలు తమ తండ్రికి హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. హరిశ్చంద్ర అహిర్వార్ తన ఏడుగురు కుమార్తెలకు వివాహాలు చేశారని, ఇంకా రోష్ని, గుడియాలకు వివాహాలు చేయాల్సివుందని అన్నారు. -
వేధింపులు తాళలేక... కుమారుడిని దారుణంగా చంపిన తండ్రి
శామీర్పేట్: మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం వేధిస్తుండటంతో కుమారుడిని కన్న తండ్రే హత్య చేసిన సంఘటన ఆదివారం జొనోమ్వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, శామీర్పేట మండలం, లాల్గడి మలక్పేట గ్రామానికి చెందిన కొరివి మంజుల రాంచందర్ దంపతులకు ఇద్దరు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన పెద్ద కొడుకు నరేష్ (27) డబ్బుల కోసం ప్రతి రోజు తల్లిదండ్రులను వేధించడమేగాక దాడి చేసేవాడు. ఈ నెల 11న ఉదయం రూ. 10 వేలు ఇవ్వాలంటూ తండ్రి రాంచందర్తో నరేష్ గొడవపడ్డాడు. అతడి వైఖరితో విసిగిపోయిన రాంచందర్ పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి నరేష్ ను గ్రామంలోని మర్లల్ల బావి సమీపంలోకి తీసుకెళ్లాడు. నరే‹Ùకు మద్యం తాగించి అతడు మత్తులోకి జారుకోగానే గొంతుపై కాలితో తొక్కి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి అక్కడినుంచి వెళ్లి పోయాడు. కాగా ఈ నెల 21న అతడి తల్లి మంజుల కుమారుడు కనిపించడం లేదని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తండ్రి రాంచందర్ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
US: ట్రంప్ను తెగ తిట్టిన తండ్రి ఆత్మ.. ఏఐ వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. అధ్యక్ష పదవికి పోటీ పడేవారిని ఎన్నుకునేందుకుగాను రెండు ప్రధాన పార్టీల ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రచారంలో డీప్ ఫేక్ ఆడియో, వీడియోల బెడద అభ్యర్థులకు ఎక్కువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా సృష్టించే ఈ ఫేక్ ఆడియో, వీడియోల ట్రెండ్ను తమకు అనుగుణంగా మలుచుకునే నేతలు కూడా లేకపోలేదు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన ఆడియో, వీడియోలను కూడా డీప్ ఫేక్ అని తప్పించుకునే నేతలూ ఉన్నారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుంటారు. అయితే తాజాగా యాంటీ ట్రంప్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన లింకన్ ప్రాజెక్ట్ రూపొందించిన ఆసక్తికర ఏఐ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ట్రంప్ నాన్న ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ తన కొడుకు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న అవలక్షణాలన్నింటినీ చెబుతూ తిడుతుంటుంది. ఫ్రెడ్ ట్రంప్ తిడుతుండగా డొనాల్డ్ ట్రంప్ జీవితంలోని పలు సందర్భాలకు చెందిన వీడియో క్లిప్పులు ప్లే అవుతుంటాయి. ‘డొన్నీ(డొనాల్డ్ ట్రంప్) నువు చేసిన వ్యాపారాలన్నీ చెత్త. కనీసం క్యాసినో ఆడి కూడా నువు డబ్బులు సంపాదించలేకపోయావ్. ఎన్నోసార్లు దివాళా తీసిన నిన్ను నేనే బయటపడేశాను. నువ్వు నా పేరు పెట్టుకున్నందుకు నేను సిగ్గు పడుతున్నాను. నువ్వొక బోరింగ్ మనిషివి. ఆడవాళ్లు నిన్ను ఎందుకు వదిలేస్తారో అందరికీ తెలుసు. పోర్న్ స్టార్లకు డబ్బులిస్తావు. నీ పిల్లలు కూడా నిన్ను అసహ్యించుకుంటారు. నేను సృష్టించిన ట్రంప్ బ్రాండ్ నీ వల్ల చెత్తగా మిగిలిపోయింది. అసలు నా కొడుకు ఇంత దారుణంగా ఎలా తయారయ్యాడు. నువ్వు ఇప్పటివరకు జైలుకు వెళ్లకుండా బయట ఉన్నావంటే అది నీ అదృష్టమే. నేను చనిపోయి 30 ఏళ్లయింది. ఇప్పటికీ నిన్ను చూసి సిగ్గు పడుతున్నాను’ అని ఫ్రెడ్ ట్రంప్ ఆత్మ కొడుకు ట్రంప్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఈ వీడియో ఏఐ ద్వారా సృష్టించిందని లింకన్ ప్రాజెక్ట్ బహిరంగంగానే ఒప్పుకుంది. ఈ వీడియో సరికాదని ట్రంప్ ఇప్పటికే ఖండించారు. ఇదీ చదవండి.. పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర స్పెషల్ గిఫ్ట్
పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నారు. క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. క్రికెటర్ సర్ఫరాజ్లో విశ్వాసాన్ని నింపింనందుకు అతని తల్లిదండ్రులను అభినందనల్లో ముంచెత్తారు. అనుకున్నది సాధించేంతవరకు నమ్మకాన్ని కోల్పోకూడదనే స్పూర్తి నిచ్చారు అంటూ వారిని ప్రశంసించారు. ఈ సందర్బంగా నౌషాద్ మాటలు, సర్ఫరాజ్ బ్యాటింగ్ వీడియోను షేర్ చేశారు. ఒక బహుమతిని కూడా ప్రకటించారు. విశ్వాసాన్ని కోల్పోవద్దు....కఠోర శ్రమ, ధైర్యం, సహనం..ఇంతకంటే గొప్ప లక్షణాలు ఏముంటాయి ఒక తండ్రి పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు. అందుకే స్పూర్తిదాయకమైన తండ్రి నౌషద్ ఖాన్కు థార్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా. ఇది తనకు గౌరవం ఈ బహుమతిని ఆయన స్వీకరిస్తానని విశ్వసిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. “Himmat nahin chodna, bas!” Hard work. Courage. Patience. What better qualities than those for a father to inspire in a child? For being an inspirational parent, it would be my privilege & honour if Naushad Khan would accept the gift of a Thar. pic.twitter.com/fnWkoJD6Dp — anand mahindra (@anandmahindra) February 16, 2024 జెర్సీ నంబర్ 97తో బరిలోకి సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలోనే ఇంగ్లండ్తో గురువారం రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. భారత వెటరన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతడికి అరంగేట్రం క్యాప్ అందించిన సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్, సర్ఫరాజ్ భార్య భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించినవ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జెర్సీ నంబర్ 97 సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ కూడా క్రికెటర్. తన కలను నెరవేర్చుకునే ఆశయంలో భాగంగా కుమారుడికి శిక్షణ ఇచ్చాడు. ఇక 97 విషయానికి వస్తే మూడో టెస్టుకు ముందు మాట్లాడుతూ జెర్సీ నంబర్ 97 విశేషాలుతెలిపాడు. తండ్రి పేరులోని నౌ అంటే తొమ్మిది, షాద్ నుంచి 7 తీసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఇటీవల అండర్-19 ప్రపంచకప్లో ఆడిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ జెర్సీ నంబర్ కూడా 97 కావడం విశేషమే మరి. -
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
కొడుకును ఎలా కాపాడుకున్నాడంటే..?
-
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. సీమంతం ఫోటో వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాగా.. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్. నిఖిల్ తన ట్విటర్లో రాస్తూ.. 'నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. 'హ్యాపీడేస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నిఖిల్. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఇలా ఒక సినిమా కోసం హీరోలు ఇంతలా శ్రమించడం చాలా అరుదు. నిఖిల్కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా.. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv — Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024 -
లేటు వయసులో గర్ల్ఫ్రెండ్తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్
హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో లేటు వయసులో తండ్రి కావడంపై స్పందించారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న నీరో , గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్తో కలిపి గత ఏడాది ఏప్రిల్లో 79 ఏళ్ళ వయసులో ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా చూసినపుడు చాగా తనకు సంతోషంగా ఉంటుదని, ఈ వయసులో సాధ్యమైనంత ఎక్కువ సమయం పాపతో గడపాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. “I'm an 80-year-old dad, and it's great. And I want to be around for as long as I can to enjoy it.” Robert De Niro gets emotional talking about his baby daughter during an interview with AARP. pic.twitter.com/C1PHzxetnP — AP Entertainment (@APEntertainment) January 25, 2024 ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో మరో అవార్డు అందుకున్నాడు. రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే మోడల్-నటి టౌకీ స్మిత్తో జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. దీంతో పాటు రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్తో కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్ , నీరోకు పాప గియా పుట్టింది. -
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
‘స్పెర్మ్ డొనేషన్’తో జన్మించిన ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి?
లోకంలోని ప్రతీ చిన్నారి తన తల్లిదండ్రుల అండ కోరుకుంటుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలల జీవితంలో ఎప్పుడూ శూన్యం తాండవమాడుతుంటుంది. అట్లాంటాకు చెందిన టిఫనీ జీవితంలో కూడా అటువంటి శూన్యతే ఏర్పడింది. ఆమె తన నాలుగేళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇదే విషయాన్ని ఆమెకు తరచూ చెప్పేది. అయితే ఆమెకు చాలాకాలానికి తండ్రి గురించిన నిజం తెలియడంతో నివ్వెరపోయింది. మిర్రర్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ తన నిజమైన తండ్రిని మిస్సయ్యింది. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. తరువాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరయ్యింది. అయితే తన అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది. 2018లో టిఫనీ 36వ పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది. టిఫనీ ఇన్నాళ్లూ ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో, అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది. తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది. అంతే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని, తన తల్లి ఎవరినుంచో స్పెర్మ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థం అయ్యింది. టిఫనీ తల్లి మొదటి భర్త.. టిఫనీని సొంత కూతురులా చూసుకున్నాడు. టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. టిఫనీ 1982లో జన్మించింది. ఇటీవల టిఫనీ డీఎన్ఏ పరీక్ష చేయించుకుంది. దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది. అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా, ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు. ఇదేవిధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి. ప్రస్తుతం టిఫనీకి 41 ఏళ్లు. 17 ఏళ్ల క్రితం టిఫనీకి వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. -
హనుమాన్ పార్ట్-2 కాదు.. ఏకంగా సినిమానే: ప్రశాంత్ వర్మ తండ్రి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్ను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. (ఇది చదవండి: మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!) ఆయన మాట్లాడుతూ.. 'హనుమాన్ తీసినోడు మా అబ్బాయే. నా లైఫ్లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అనుభవం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ పార్ట్-2 కాదు. హనుమాన్పై ఏకంగా సినిమానే వస్తది.' అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అభినందించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. Proud Moment for Prasanth Varma Family #HanuMan 👏👏 Bro @PrasanthVarma, you achieved your dream. You made your father proudly say he is my son 🥹@tejasajja123 #HanuManRAMpage @NirvanaCinemas pic.twitter.com/JjHeyfqdcy — EPIC (@Koduri_526) January 13, 2024 -
నాన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న హీరోలు..!
-
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
Prabhu Deva: తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో ప్రభుదేవా కుటుంబం (ఫోటోలు)
-
HYD: నాన్న కాదు.. నయ వంచకుడు!
మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావి-వరుసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసి కఠిన శిక్షలు విధించినా కీచకుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇలాంటి అమానవీయ ఘటనే వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కసాయిగా మారి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చెప్పినా తల్లి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహితునికి బాధితురాలు దగ్గరైంది. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఓ యువకుడు కూడా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. బీహర్కు చెందిన ఓ కుటుంబం కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్దే ఉంటోంది. కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేసి.. ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఈ విషయం తల్లికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. గతేడాది దీపావళికి బిహార్కు వెళ్లివస్తుండగా.. రైలులో అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోష్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకున్నారు. అతడు బడంగ్పేట గాంధీనగర్లో ఉంటున్నట్లు చెప్పాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం అతడు కుత్బుల్లాపూర్లో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్కి పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్కు ఫోన్చేసింది. రవి సాయంతో సంతోష్ వద్దకు వెళ్లింది. మరుసటిరోజు ఇంటికి వెళ్లాలని ఆమెకు ప్రేమికుడు చెప్పాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లకుండా తనకు ఉద్యోగం ఇప్పించాలని వెంట వచ్చిన రవిని కోరడంతో.. అతడు అమీన్పూర్లో తన గదికి తీసుకెళ్లాడు. ఈ నెల 29న మద్యం మత్తులో రవి ఆమెపై లైంగిక దాడి చేశాడు. రవి చిత్రహింసలు భరించలేక ఆమె సికింద్రాబాద్కు పారిపోయింది. కుటుంబీకులకు ఫోన్చేసి సికింద్రాబాద్ స్టేషన్ రావాలని చెప్పింది. వారు రావడంతో జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దర్యాప్తులో పోలీసులకు తన తండ్రి చేసిన అఘాయిత్యాన్ని కూడా ఆ బాలిక వివరించింది. దీంతో బాలిక తండ్రితో పాటు ఆ యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: నాన్నా.. నేనేం పాపం చేశాను! -
రైతుబిడ్డకు గెలిచినా ఆనందం లేకుండా చేశారు: ప్రశాంత్ తండ్రి ఆవేదన
రైతుబిడ్డగా బిగ్బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!) అరెస్ట్పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!) -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు
సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో జరిగింది. కొంతకాలం నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్ హైదరాబాద్ పారిపోయాడు. శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు. అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్ తన స్వస్థలం మెట్పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా -
ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కిషన్ స్వరూప్ శర్మ.. జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో శుక్రవారం అర్థరాత్రి ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు చేసి, చికిత్సనందిస్తోంది. శుక్రవారం సీఎం భజన్లాల్ శర్మ పుట్టినరోజు.. అదే రోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సీఎం భజన్లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ శుక్రవారం తన కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఆయన భరత్పూర్ నుంచి జైపూర్ వచ్చారు. అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా! -
శవంతోనే మూడు రోజులు
అన్నానగర్: తండ్రి చనిపోయాడని తెలియక మూడు రోజులపాటు మృతదేహంతోనే ఉన్న యువకుడి ఉదంతం కలకలం రేపింది. మదురైలోని విల్లాపురానికి చెందిన జగదీశన్(74) జ్యోతిష్యుడు. ఇతని కుమారుడు కార్తీక్ శ్రీనివాసన్(35) మానసిక వ్యాధిగ్రస్తుడు. కూతురు షర్మిల(44)కు వివాహమై భర్తతో కలిసి విల్లాపురం ప్రాంతంలో ఉంటోంది. జగదీశన్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉంటున్నాడు. దీంతో షర్మిల తన తండ్రికి, మానసిక వికలాంగుడైన తమ్ముడికి భోజనం పెడుతోంది. గత 10న తండ్రి వద్దకు భోజనం ఇవ్వడానికి వచ్చింది. ఆ తరువాత భోజనం ఇవ్వడానికి రాలేదు. జగదీశన్ తన ఇంటి గ్రౌండ్ఫ్లోర్లో రెండు షాపులను అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం అతని ఇంటిలో నుంచి దుర్వాసన వెదజల్లింది. ఆ ఇంటి నుంచి జగదీశన్ గానీ, అతని కొడుకు గానీ బయటకు రాకపోవడంతో బయటి వారికి అనుమానం కలిగింది. దీంతో చూసేందుకు పైకి వెళ్లారు. జగదీశన్ మరణించి అతని శరీరం కుళ్లిపోయింది. అతని శరీరం పక్కనే కార్తీక్ శ్రీనివాసన్ ధ్యానం చేస్తూ ఉన్నాడు. వెంటనే అవనియాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి జగదీశన్ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నారు. జగదీశన్ చనిపోయి మూడు రోజులు అయ్యిందని, తండ్రి చనిపోయాడన్న విషయం తెలియక మానసిక అనారోగ్యంతో ఉన్న కొడుకు మృతదేహం దగ్గరే ఉన్నాడని వెల్లడించారు. గత మూడు రోజులుగా కార్తీక్ శ్రీనివాసన్ ఇంటిలో ఉన్న ఆహారం మాత్రమే తింటున్నాడు. అతని పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. జ్యోతిష్యుడి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఇదేందిది.. ఈ వారసుడు కథ సినిమాను మించిపోయిందే!
మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో అందరినీ ఆశ్చర్యపరిచే ఉదంతం వెలుగు చూసింది. 28 ఏళ్ల క్రితం తప్పిపోయి, ఎక్కడో ఉన్న కుమారుడు అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అతని స్థానంలో 12 ఏళ్ల క్రితమే ఒక అపరిచితుడు వారి కుమారుడినంటూ వారి ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కుమారుడు తాను కొన్నేళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నానని కుటుంబసభ్యులకు తెలిపాడు. తాను హరిద్వార్లో సన్యాసుల మధ్య ఉంటున్నానని, తన పేరును కళ్యాణ్ గిరి మహారాజ్గా మార్చుకున్నానని తెలిపాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి, తాను మీ ఇంటి మనిషినేనని చెప్పడంతో వారంతా తెగ ఆశ్చర్యపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఇంతకాలం తమ ఇంటిలోని మనిషిలా ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను వారికి అసలు విషయాన్ని చెప్పాడు. సినిమా కథను తలపించే ఈ రియల్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఖాండ్వా జిల్లాలోని ఖల్వా గిరిజన డెవలప్మెంట్ బ్లాక్లోని కలాం ఖుర్ద్ గ్రామంలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. 28 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కథలో ట్విస్ట్ 12 ఏళ్ల క్రితం అంటే 2011లో చోటు చేసుకుంది. వారి ఇంటికి వచ్చిన ఒక సన్యాసి తాను 16 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ కుమారుడిని అని చెప్పుకున్నాడు. అప్పటి నుంచి అంటే గత 12 ఏళ్లుగా ఆ కుటుంబంతోపాటు ఉంటున్నాడు. అయితే ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత అసలు కొడుకు ఇంటికి రావడంతో నకిలీ కొడుకు బండారం బయటపడింది. 12 ఏళ్లుగా వారి ఇంట్లో ఉంటున్న వ్యక్తి.. ఇన్నాళ్లూ నాలుగు రోజులు ఇంట్లో ఉంటూ, కొన్ని రోజులు బయట సన్యాసి వేషంలో తిరుగుతూ వచ్చాడు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అయితే 28 ఏళ్ల తరువాత నిజమైన కుమారుడు తిరిగి రావడంతో.. అంతవరకూ కుమారునిగా నటించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఫోనులో అతనితో మాట్లాడగా.. ఇన్నాళ్లూ వారి ఇంటిలో ఏర్పడిన లోటును తీర్చేందుకే తాను వారితో కొడుకునని చెప్పానని, ఇప్పుడు వచ్చిన వ్యక్తే అసలైన కుమారుడు అని చెప్పాడు. ఇది కూడా చదవండి: ఈ వీడియో చూస్తే.. గాడిద అంటూ ఎవరినీ నిందించరు! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ 83వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12 న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం. పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ (బారామతి)లో సీనియర్ అధికారి. గోవింద్రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదా బాయి వామపక్ష భావాలు కలిగిన కలిగిన రాజకీయ, సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ. రాజ్కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకే ఆరోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. ‘మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా, నాన్నకు దూరంగా ఉండేవాళ్లం. చదువులో నా రికార్డు సరిగా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్టు కార్డుపై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మెట్రో రెయిలింగ్పై మహిళ హైడ్రామా.. మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
జర్నలిస్టు సౌమ్య హత్య కేసు: 15 ఏళ్లు పోరాడిన తండ్రి మృతి
న్యూఢిల్లీ: అరవై ఏళ్ల వయసులో కూతురు హత్యకు గురైంది. 2008లో కూతురు చనిపోయిన తర్వాతి రోజు నుంచి ఆ తండ్రి దినచర్య పూర్తిగా మారిపోయింది. కూతురిని చంపిన వారికి శిక్ష పడేందుకు 15 ఏళ్లు ప్రతిరోజు ఆయన శ్రమించాడు. ఎక్కడా అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగాడు. చివరకు ఈ ఏడాది నవంబర్ చివరిలో తన కూతురును చంపిన నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష పడేలా చేశాడు. విషాదమేంటంటే కూతురు 41వ జయంతికి ముందు రోజు శనివారం ఆ 82 ఏళ్ల తండ్రి కన్నుమూశాడు. ఢిల్లీలోని ఓ న్యూస్ ఛానల్లో విధులు ముగించుకుని సొంత కారులో ఆలస్యంగా ఇంటికి వస్తున్న టీవీ జర్నలిస్టు సౌమ్యను 2008 సెప్టెంబర్ 30న నలుగురు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.ఈ కేసు విచారణ 15 ఏళ్ల పాటు నడిచింది. రెండు వారాల క్రితమే కోర్టు నలుగురు నిందితులకు శిక్ష విధించింది. నిందితులను దోషులుగా నిరూపించడం వెనుక సౌమ్య తండ్రి విశ్వనాథన్ తీవ్ర కృషి ఉంది. 15 ఏళ్ల పాటు రోజు పొద్దున్నే లేచి కూతురు హత్య కేసు ఫాలోఅప్ చేయడమే ఆయన పని. అయితే అనుకున్నది సాధించి కూతురును చంపిన వారికి శిక్ష వేయించిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కన్ను మూయడం పలువురి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్ -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఉరేసుకున్న కొడుకు.. కొడుకు కోసం తండ్రి!
ధరూరు: ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని తట్టుకోలేక ఓ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరులో చోటుచేసుకుంది. వివరాల్లో వెళ్తే.. మండల కేంద్రంలోని కుర్వవీధికి చెందిన గడ్డమీది నర్సింహులు (65), దౌలమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 5న వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు దేవార్జున్ (25).. అదే రోజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. నెలన్నర రోజులుగా కొడుకు చనిపోయిన బాధలో ఉన్న నర్సింహులు.. గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సొరంగం నుంచి బయటపడ్డ కొడుకును చూడకుండానే తండ్రి మృతి
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా దుమారియా బ్లాక్కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు. భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ‘మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని’ తెలిపారు. బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. ‘భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడని, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని’ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ -
ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు. ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్లో సంభాషించారు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
తాజ్ సందర్శకునికి గుండెపోటు.. సీపీఆర్ ఇచ్చి కాపాడిన కుమారుడు!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. అయితే వెంటనే స్పందించిన అతని కుమారుడు సీపీఆర్ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే ఒక వృద్ధుడు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు. అతను తాజ్మహల్ కాంప్లెక్స్ లో గుండెపోటుకు గురయ్యాడు. అతని కుమారుడు వెంటనే తండ్రికి సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని ఈ వీడియో తెలియజేస్తోంది. సీపీఆర్తో కోలుకున్న బాధితుడిని తక్షణం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండెపోటుకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య సహాయం అందేలోగా సీపీఆర్ చేయడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. బాధితుని శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్ సహాయ పడుతుంది. తద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. आगरा ➡ताजमहल के अंदर CPR देते का लाइव वीडियो वायरल ➡पर्यटक को सीपीआर देते का लाइव वीडियो हुआ वायरल ➡ताजमहल देखने आए पर्यटक को आया था हार्ट अटैक ➡काफी देर तक CPR देने के बाद पर्यटक की लौटी जान ➡ताजमहल परिसर के अंदर वीडियो प्लेटफार्म का मामला.#Agra pic.twitter.com/hRxTtDwXIu — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 15, 2023 -
పిల్లలకు ఆ తండ్రి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.?
-
పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం
చెన్నై: తమిళనాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న దుండగులు పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. అలీగఢ్లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్కు నష్టం ఏమిటి? -
పండుగ వేళ విషాదం..! రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు..
సాక్షి, వరంగల్: పండగకు ఇంటికి వస్తున్న తండ్రీకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో జరిగింది. ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న(50)కు కూతురు అనూష(33) ఉంది. పండుగ నిమిత్తం కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజు.. హైదరాబాద్ నుంచి తొర్రూరు చేరుకున్నారు. తొర్రూరు బస్టాండ్లో ఉండగా వెంకన్న బైక్పై వెళ్లి వారిని తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ వైపు నుంచి వస్తున్న కారు కిష్టాపురం క్రాస్ వద్ద బైక్ను ఢీకొంది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన అనూష, రాజును తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనూష చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పండగపూట ఆ కుటుంబలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం!!
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు కాగా.. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగం డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, దర్శకనిర్మాతలు సంతాపం ప్రకటించారు. కాగా.. గోపాలకృష్ణన్ భౌతికకాయానికి టుటికోరిన్ జిల్లాలోని వారి స్వగ్రామం కాచనవెల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు హరితో పాటు గోపాలకృష్ణన్కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2002 తమిళ చిత్రం 'తమిజ్'తో అరంగేట్రం చేసిన దర్శకుడు హరి.. తన 21 సంవత్సరాల సినీ జీవితంలో అనేక కమర్షియల్ హిట్లను అందించారు. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. -
దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి పెద్ద కర్మ (ఫోటోలు)
-
దిల్ రాజు తండ్రి శ్యామ్సుందర్ రెడ్డి అంత్యక్రియలు (ఫోటోలు)
-
కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత!
తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజును పరామర్శించారు. (ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం) దిల్ రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో దిల్ రాజ్కు ధైర్య చెబుతూ కనిపించారు. దీంతో తన బాధను ఆపుకోలేకపోయిన దిల్ రాజ్.. ప్రకాశ్ రాజ్ను పట్టుకుని బోరున విలపించారు. దిల్ రాజు ఇంటికెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాంసుందర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి.. కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) -
పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఆయన 21వ శతాబ్దంలో రష్యాను ముందుకు నడిపిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్ లా కోర్సు పూర్తిచేసి, సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో చిన్న ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించి దేశ అధ్యక్షుని హోదాకు చేరుకున్నారు. పుతిన్ 1952, అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్ (నేటి సెయింట్ పీటర్స్బర్గ్)లో జన్మించారు. పుతిన్ తండ్రి కర్మాగారంలో పనిచేసేవాడు. తల్లి వీధులు ఊడ్చే పని చేసేది. పుతిన్ తన 12 సంవత్సరాల వయస్సులో జూడో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పుతిన్ కళాశాలలో చదువుతున్న సమయంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యునిగా చేరారు. 1991లో ఆ పార్టీ రద్దు అయ్యే వరకు సభ్యునిగా కొనసాగారు. కళాశాల చదువు తరువాత పుతిన్ సోవియట్ యూనియన్ గూఢచార సంస్థలో చిన్న పోస్ట్లో చేరారు. అనంతరం అదే కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరుకున్నారు. పుతిన్ 1991లో కేజీబీకి రాజీనామా చేశారు. అప్పుడే అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది. మేయర్ కార్యాలయంలో విదేశీ సంబంధాల కమిటీకి ఎన్నికయ్యారు. తరువాత దాని అధిపతి అయ్యారు. 1994, 1996 మధ్యకాలంలో సెయింట్ పీటర్స్బర్గ్లో అనేక ప్రభుత్వ పదవులను నిర్వహించారు. 1996లో పుతిన్ మాస్కో వెళ్లారు. అక్కడ అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ పరిపాలనలో భాగమ్యారు. యెల్ట్సిన్ రాజీనామాకు ముందు పుతిన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్, రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నారు. 1999లో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. యెల్ట్సిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పుతిన్ అధికారికంగా దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పుతిన్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తొలుత 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2008 నుండి 2012 వరకు పుతిన్ నాటి అధ్యక్షుడు దిమిట్రీ మెద్వెదేవ్ దగ్గర ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: మార్స్ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది? -
మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!
అభినయ .. ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో నేనింతే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది-2, సీతారామం చిత్రాల్లో నటించింది. ఇటీవలే రిలీజైన విశాల్ మూవీ మార్క్ ఆంటోనీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అభినయ సినిమాల్లో తన టాలెంట్ను నిరూపించుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన తండ్రితో కలిసి హాజరైంది. ఆమె తండ్రి అభినయ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభినయకు వినపడదు.. అంతే కాదు మాట్లాడలేదు కూడా.. కేవలం సైగల ద్వారానే తన భావాలను వ్యక్తం చేయగలదు. (ఇది చదవండి: సడన్గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అభినయ తండ్రి ఆనంద్ మాట్లాడుతూ.. 'నా కూతురిని మొదట మోడలింగ్ రంగంలో తనను వాళ్ల అమ్మనే చాలా బాగా చూసుకుంది. నేను చాలా కంపెనీల వద్దకు వెళ్తే నాపై కొప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నారు. అతనేమైనా పిచ్చోడా అన్నారు. కానీ నేను దేవుడిపై భారం వేశాను. మాకు గాడ్ ఎవరంటే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. మా అమ్మాయి ఇంత అందంగా పుట్టినా.. దేవుడు ఈ ప్రాబ్లమ్ ఇచ్చాడే అనుకున్నాం. మూడేళ్ల వరకు తాను నడవలేదు. చివరికీ హ్యాండీక్యాప్ అనుకున్నాం. ఈ రోజు ఏ స్థాయిలో ఉన్న తను అందరితో కలిసిపోతుంది. ' అని అన్నారు. అభినయ మాట్లాడుతూ..'తన తల్లిదండ్రులు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. అన్నింటిలోనూ నన్ను నడిపించేది అమ్మ, నాన్నే. నాకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. నా కుటుంబ సభ్యుల సహకారం జీవితంలో మరిచిపోలేను. మా నాన్నే నా జీవితం. మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీ సంభాషణలు జరుగుతాయి. నాకు, నాన్నకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఎప్పడు ఉంటుంది. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎంతో సరదాగా ఉండేది. అప్పుడప్పుడు నువ్వే నా భర్త అనేదాన్ని. తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా' అని అన్నారు. విశాల్తో అభినయ పెళ్లి? ఈ వార్త విని షాకింగ్ గురైనట్లు అభినయ వెల్లడించింది. నేను ఆయనను చూసి నవ్వడం వల్లే ఇలాంటి వార్తలొచ్చాయి. ఒక ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ దీని గురించి అడిగింది. ఏదో యూట్యూబ్లో చూసి ఆమె అలా మాట్లాడింది. కానీ నాకు ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా తల్లిదండ్రులే నాకు అన్నీ కూడా. నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని షేర్ చేయాలి. రిలేషన్లో విలువలు ఉండాలి. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తానని అభినయం అంటోంది. (ఇది చదవండి: టాలీవుడ్ హీరో నవదీప్కు ఈడీ నోటీసులు) -
కుమార్తెకు డర్టీ వాటర్ బాటిల్ గిఫ్ట్.. తండ్రి చెప్పే ‘జీవిత సత్యం’ ఇదేనట!
ఒక యువతి తన పుట్టినరోజున తన తండ్రి ఎటువంటి విచిత్రమైన బహుమతి ఇచ్చాడో ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన తండ్రి తనకు మురికి నీటితో నిండిన బాటిల్ను బహుమతిగా ఇచ్చాడని తెలిపింది. అలాంటి బహుమతి ఇవ్వడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. ట్వట్టర్(ఎక్స్) యూజర్ ప్యాట్రిసియా మౌ తన పోస్టులో ‘ఈ సంవత్సరం నా పుట్టినరోజున, మా నాన్న నాకు మురికి నీటి బాటిల్ను బహుమతిగా ఇచ్చారు. నేను తమాషాకు చెప్పడం లేదు’ అని పేర్కొంది. ఇలాంటి బహుమతి పొందడం ఇదేమీ మొదటిసారి కాదని కూడా ఆమె చెప్పింది. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు అనేక బహుమతులు ఇచ్చారు. వాటిలో ప్రథమ చికిత్స కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్సైక్లోపీడియా, కీ చైన్ మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఇచ్చిన బహుమతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేం. ఆ మురికి నీటి బాటిల్ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మురికి నీటితో కదులుతున్న బాటిల్ మన జీవితం లాంటిది. అయితే జీవితంలో మనం మన మనసును స్థిమితపరచుకున్నప్పుడు మనలోని మలినాలు 10 శాతం కంటే దిగువకు చేరుతాయి. మురికితో నిండిన బాటిల్ను స్థిరంగా ఉంచినప్పుడు ఇదే తెలుస్తుంది. సరిగ్గా ఇటువంటి దృక్ఫధాన్ని మనం కలిగివుండటం అవసరం అని ఆమె పేర్కొంది. ఆమె ఈ పోస్ట్ను అక్టోబర్ 2 న పోస్టు చేశారు. వైరల్గా మారిన ఈ పోస్టు ఇప్పటివరకూ 1.2 మిలియన్కు మించిన వీక్షణలు దక్కించుకుంది. ఈ పోస్ట్కు 5,900కు పైగా లైక్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘ఈ జీవిత పాఠాన్ని సేవ్ చేసుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం? For my birthday this year, my dad gifted me a dirty bottle of water. Not kidding. In the past he’s gifted me: a first aid kit, pepper spray, an encyclopedia, a key chain, dedicated a book he wrote to me, etc. good ol dad gifts. He told me this years gift was extra special as… pic.twitter.com/N56AiGgErJ — Patricia Mou (@patriciamou_) October 2, 2023