కొడుకు మృతదేహంతో మూడురోజులు | Father Spent Three Days With Son Dead Body In Mancherial, More Details Inside | Sakshi
Sakshi News home page

కొడుకు మృతదేహంతో మూడురోజులు

Published Wed, Apr 30 2025 10:06 AM | Last Updated on Wed, Apr 30 2025 10:42 AM

Father spent three days Son dead body

చనిపోలేదని.. పడుకున్నాడని తండ్రి సమాధానం

మతిస్థిమితం లేని తండ్రి ఆస్పత్రికి తరలింపు 

మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూ­డు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్‌ఐ ప్రవీణ్‌­కుమార్‌ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.

ఈయనకు కుమా­రుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగ­రేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీ­కొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారా­యణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీ­వల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆది­వారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకు­న్నా­రు. అప్పటి నుంచి బయటకు రాలేదు. 

మంగళ­వారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించ­గా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించా­డు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడు­కుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్ని­స్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పా­రు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్ర­భు­త్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement