kudbullapur
-
గాయత్రి మిస్సింగ్ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : కుత్బుల్లాపూర్లో సంచలనం సృష్టించిన గాయత్రి (19) మిస్సింగ్లో కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు తన కోసం వెతకొద్దంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(19) బుధవారం తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీ చేయగా ఆమె రాసిన లేఖ లభించింది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో 19 ఏళ్ల యువతి అదృశ్యం
-
హైదరాబాద్లో 19 ఏళ్ల యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : మార్కెట్కు వెళ్లి వస్తానని చెప్పి ఓ 19 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్కు చెందిన గాయత్రి(19) తను పనిచేసే సూపర్ మార్కెట్కు వెళ్తున్నానని బుధవారం మధ్యాహ్నాం ఇంటి నుంచి బయలు దేరింది. సాయంత్రం అయినా యువతి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కుత్బుల్లాపూర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నందనగర్లోనో ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.