ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యాయత్నం.. | Eight person suicide attempt in Madurai | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో 8మంది ఆత్మహత్యాయత్నం..

Published Sun, Sep 24 2017 10:00 PM | Last Updated on Mon, Sep 25 2017 2:09 AM

Eight person suicide attempt in Madurai

సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై యోగప్పనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని పక్కింటి వాళ్లు గుర్తించి, మధురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, వ్యాపారంలో నష్టాల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement