పాతబస్తీలో గ్యాంగ్‌వార్‌.. రాళ్ల దాడి | Gang War In Old City Police Case Files | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో గ్యాంగ్‌వార్‌.. రాళ్ల దాడి

May 4 2020 10:49 AM | Updated on May 4 2020 11:03 AM

Gang War In Old City Police Case Files - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో నగరంలోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. స్థానిక భవానీ నగర్‌లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాళ్లు పెద్ద ఎత్తున రువ్వకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (కరోనా కలవరం : వీడని విషాదం)

స్థానికల సమాచారం ప్రకారం బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement