gang war
-
కృష్ణా జిల్లా యనమలకుదురులో గ్యాంగ్ వార్
-
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
యశవంతపుర: యువకునిపై కారు ఎక్కించి, తల్వార్లతో దాడి చేసిన ఘటన ఉడుపిలో జరిగింది. శుక్రవారం రాత్రి ఉడుపి శారద మండపం జంక్షన్లో రెండు గుంపుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. హైవే – 169లో ప్రజలు తిరుగుతున్న సమయంలో దుండగులు పెద్ద పెద్ద కత్తులతో వీరవిహారం చేశారు. సినిమాలో మాదిరిగా కార్లలో ఒకరినొకరు గుద్దుకుంటూ గొడవలు పడడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు. దగ్గర్లో అపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో చూసి ఇది ఉడుపియేనా, లేక ఇతర దేశమా? అని స్థానిక ప్రజలే నోటిమీద వేలు వేసుకొంటున్నారు. కాపు తాలూకాకు చెందిన గరుడ గ్యాంగ్ యువకులు ఒక కారు అమ్మకంపై మరో గుంపుతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. Very bad state of affairs Gang War at Udupi Incident happened recently late night, 2 groups fought on Udupi Manipal Highway near KunjibettuWhere is the younger generation heading ???Stringent action should be taken against all these culprits pic.twitter.com/EVAstmKumR— Dr Durgaprasad Hegde (@DpHegde) May 25, 2024 -
గ్యాంగ్స్టర్, లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్వార్ ముప్పు? భారీ పోలీసు బందోబస్తు!
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలోగల సంతోష్ మ్యారేజ్ గార్డెన్లో గ్యాంగ్స్టర్ కాలా జఠేడి, లేడీ డాన్ అనురాధల వివాహం నేడు (మార్పి 12) జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయితే గ్యాంగ్వార్ ముప్పును దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ గార్డెన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అతిథులను బార్ కోడ్ ద్వారా గుర్తించి, ప్రవేశం కల్పించనున్నారు. మ్యారేజ్ గార్డెన్లో పలు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మ్యారేజ్ హాల్ చుట్టూ ఉన్న రోడ్లను కూడా ఎప్పటికప్పుడు సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు ఈ వివాహంపై దృష్టి పెట్టాయి. గ్యాంగ్ వార్ ముప్పు దృష్ట్యా సంతోష్ గార్డెన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రెండు రోజుల క్రితం ఐదుగురు షూటర్లను పోలీసులు మ్యారేజ్ గార్డెన్ సమీపంలో అరెస్ట్ చేశారు. కాలా జఠేడికి పలు ముఠాల నుండి ముప్పు ఉంది. వాటిలో బంబిహా గ్యాంగ్ పేరు మొదట వినిపిస్తుంది. బంబిహా గ్యాంగ్కి చెందిన షూటర్లు కాలా జఠేడితో పాటు అతని గ్యాంగ్పై దాడి చేయడానికి నిత్యం వెదుకుతుంటారని పోలీసులు దగ్గర సమాచారం ఉంది. గ్యాంగ్స్టర్, లేడీ డాన్ల వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు అద్భుతమైన సోఫాలను ఏర్పాటు చేశారు. అతిథుల విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIDEO | Tight security for gangster Sandeep alias Kala Jathedi's marriage with "history-sheeter" Anuradha Choudhary alias 'Madam Minz' in #Delhi. The Delhi Police has made a strategic plan to avert any incident of gang-wars or possibility of Sandeep's escape from custody,… pic.twitter.com/9YQPB9950U — Press Trust of India (@PTI_News) March 12, 2024 -
తీహార్ జైల్లో ఘర్షణ.. గ్యాంగ్స్టర్ టిల్లు మృతి
ఢిల్లీ: రోహిణి కోర్టు కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి, గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియా Tillu Tajpuriya మృతి చెందాడు. తీహార్ జైల్లో జరిగిన గ్యాంగ్ వార్లో అతను చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణం పోయిందని వెల్లడించారు. తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్పూరియా తీవ్రంగా గాయపడ్డాడు. యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. పోలీసులు అన్ని ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. Delhi's Rohini court shootout accused jailed gangster Tillu Tajpuriya killed after he was attacked by rival gang members Yogesh Tunda and others in Tihar jail. He was taken to Delhi's Deen Dayal Upadhyay Hospital, where he was declared dead. Further investigation underway by… pic.twitter.com/70cVYUD0rk — ANI (@ANI) May 2, 2023 ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియానే. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. ఇదీ చదవండి: సంచలనంగా చనిపోయిన వ్యక్తి లేఖ! -
ఖైదీల ఘర్షణ.. సిద్దు హత్య కేసు నిందితుల హతం
ఛండీగఢ్: సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. జైలు ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్ టార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు ఆదివారం ఐదుగురు ఖైదీల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో మన్దీప్ సింగ్ అలియాస్ తుపాన్ ఆఫ్ బటాలా, మన్మోహన్సింగ్ అలియాస్ మోహ్న ఆఫ్ బుద్లానాలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మరో ఖైదీ కేశవ్ ఆఫ్ బతిండాకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్కు చెందిన వాళ్లని, సిద్దు హత్యకేసులో నిందితులుగా ఉన్నారని ఎస్ఎస్పీ గుర్మిత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. తుపాన్ మూసేవాలా హత్య కేసులో షూటర్లకు వాహనాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక పంజాబీ యువగాయకుడు సిద్దూ మూసేవాలా.. 2022, మే 29న కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. అంతకు ముందురోజే ఆయనకున్న సెక్యూరిటీని పంజాబ్లో కొలువు దీరిన మాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఆయనపై దుండగులు. -
Rajasthan: పట్టపగలే గ్యాంగ్స్టర్ దారుణ హత్య
జైపూర్: రాజస్థాన్లో గ్యాంగ్ వార్.. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే హైప్రొఫైల్ గ్యాంగ్స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. ఇంటి ముందే నలుగురు దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. శనివారం ఉదయం 9.30గం. ప్రాంతంలో సికార్ నగరం పిప్రాలి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి.. రాజు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. షెకావతి ప్రాంతానికి చెందిన మరో గ్యాంగ్తో రాజుకి వైరం ఉందని, బహుశా ఆ ముఠానే ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హత్య తర్వాత గాల్లోకి కాల్పులు జరుపుతూ జనాలను భయపెట్టుకుంటూ ముందుకు వెళ్లింది ఆ ముఠా. అయితే.. Gang war in Sikar, Rajasthan. Gangster Raju Theth shot dead. Earlier Raju Theth had enmity with the Anandpal gang, according to sources currently Anandpal gang and Bishnoi gang were together. Sikar police is investigating the matter. pic.twitter.com/ZLkkcNshRH — Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022 ఇక ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు తానే బాధ్యుడినంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించుకోవడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినే అంటూ అతను పరిచయం చేసుకున్నాడు. ఆనంద్ పాల్ సింగ్, బల్బిర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు ప్రకటించుకున్నాడు రోహిత్. గ్యాంగ్స్టర్ రాజు(పాత చిత్రం) ఆనంద్పాల్ గ్యాంగ్కు చెందిన బనుదా.. జులై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇదిలా ఉంటే.. థెట్ వర్గీయులు అతని మరణానికి సంఘీభావంగా స్థానికంగా దుకాణాలు మూయించేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేపడతామని పోలీసులను హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం -
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో గ్యాంగ్ వార్
-
సింగర్ సిద్ధూ హత్య కేసు: కీలకంగా మారునున్న సెల్ఫీ!
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్లో సిద్ధూ ఎస్యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆ సీసీ ఫుటేజ్లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. (చదవండి: యస్.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు) -
సింగర్ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. ఇదొక ప్రతీకార హత్యే అని వెల్లడించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్, పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటిదాకా(గురువారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టి ఉంటుందని బిష్ణోయ్ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ హత్యలో తన ప్రమేయం లేదని, తీహార్ జైల్లో ఉన్న తాను కనీసం తన ఫోన్ను కూడా ఉపయోగించడం లేదని బిష్ణోయ్ వెల్లడించాడు. అంతేకాదు సిద్ధూ హత్యను జైలులోని టీవీ ద్వారానే తెలుసుకున్నా అని బిష్ణోయ్ తెలిపాడు. ఇదిలా ఉంటే పంజాబీ పాపులర్ సింగర్ సిద్ధూ.. మే 29న మాన్సా జిల్లాలో ఘోరంగా హత్యకు గురయ్యాడు. ఆ వెంటనే పోలీసుల అనుమానం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మీదకు మళ్లింది. ఆ మరుసటి రోజే.. జైల్లో తనకు భద్రత కల్పించాలంటూ పటియాలా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు లారెన్స్ బిష్ణోయ్. సింగర్ సిద్దూ హత్యలో కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రమేయం ఉందని తేలింది. బ్రార్.. బిష్ణోయ్ గ్యాంగ్లో కీలక సభ్యుడు కూడా. బిష్ణోయ్ సోదరుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో సిద్దూ మేనేజర్ షగన్ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ ఘటన తర్వాత షగన్ప్రీత్.. విదేశాలకు పారిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో సిద్ధూనే షగన్ప్రీత్కు సహకరించి ఉంటాడని బిష్ణోయ్ అనుచరులు నమ్మారు. అందుకే నాలుగు రోజులు రెక్కీ వేసి మరీ సింగర్ సిద్ధూని కిరాతకంగా కాల్చి చంపారు. సిద్ధూ కుటుంబానికి సీఎం పరామర్శ సింగర్ సిద్ధూ మూసే వాలా కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్మాన్ పరామర్శించారు. శుక్రవారం మన్సా జిల్లా మూసే గ్రామానికి వెళ్లి.. సిద్ధూ కుటుంబాన్ని ఓదర్చారు. దారిపోడవునా.. నిరసనకారులు సీఎం కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఎలాగోలా సిద్ధూ ఇంటికి చేరారు సీఎం భగవంత్. ఈ సందర్భంగా.. తమకు న్యాయం చేయాలని సిద్ధూ కుటుంబం సీఎంని కోరింది. చదవండి: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? -
Sidhu Moose Wala: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా?
పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు. వీఐపీ కల్చర్కు ముగింపే పలికే క్రమంలో భాగంగా.. భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. సిద్ధూ మూసే వాలా నిర్లక్ష్యమే అతని ప్రాణం తీసినట్లు తేలింది. పంజాబ్ మనసా జిల్లా మూసేవాలాకు చెందిన సిద్ధూ.. ఆదివారం గ్యాంగ్ వార్కి బలయ్యాడు. 29 ఏళ్ల ఈ యువ ర్యాపర్ గ్యాంగ్స్టర్లను ప్రొత్సహించేలా ర్యాప్లకు కడుతుంటాడు. అంతేకాదు మరణించే వరకు పలు వివాదాలు, కేసులతోనూ వార్తల్లో నిలిచాడు అతను. సిద్ధూ మూసే వాలాతో పాటు 424 మందికి పంజాబ్ ప్రభుత్వం శనివారం వీఐపీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే.. కొందరికి మాత్రం పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోలేదు. సిద్ధూకి నలుగురు భద్రతా సిబ్బంది ఉండగా.. ఇద్దరిని మాత్రమే వెనక్కి తీసుకుంది పంజాబ్ పోలీస్ శాఖ. అంతేకాదు అతనికి బుల్లెట్ వెహికిల్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కానీ, సిద్ధూ సిబ్బందిని, బుల్లెట్ఫ్రూఫ్ బండిని ఉపయోగించుకుండా.. తన ఇద్దరు స్నేహితులతో సాధారణ వాహనంలో బయటకు వెళ్లాడు. అదే అతని ప్రాణం తీసింది. జహవర్కే గ్రామం వద్ద వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగలు. దీంతో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్.. ఈ దాడికి కారణమని పోలీసులు నిర్ధారించారు. లారెన్స్ బిష్ణోయ్ ఈ హత్య కుట్రలో భాగం అయ్యాడు అని పంజాబ్ డీజీపీ వీకే భర్వా మీడియాకు వెల్లడించాడు. బిష్ణోయ్ అనుచరుడు గ్యాంగ్స్టర్ గోల్డీ బార్ ఈ హత్యకు కారకుడయ్యి ఉంటాడని చెప్తున్నారు. కిందటి ఏడాది జరిగిన విక్కీ మిద్ధుఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విక్కీ హత్య కేసులో మూసే వాలా మేనేజర్ షగన్ప్రీత్ పేరు ప్రముఖంగా వినిపించింది. #WATCH | Punjab: A CCTV video shows two cars trailing Sidhu Moose Wala's vehicle moments before he was shot dead in Mansa district. pic.twitter.com/SsJag33XHb — ANI (@ANI) May 30, 2022 ఇక సిద్ధూ మూసే వాలా హత్య కేసు దర్యాప్తునకు ఒక సిట్ బృందం ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. సిద్ధూ మూసే వాలా అసలు పేరు సుభ్దీప్ సింగ్ సిద్ధూ. చిన్నవయసులోనే స్టార్ డమ్ దక్కింది అతనికి. అదే సమయంలో వివాదాలు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. గన్ కల్చర్తో పాటు గ్యాంగ్స్టర్లను హీరోలుగా అభివర్ణిస్తూ ర్యాప్ సాంగ్స్ కట్టాడు అతను. అంతేకాదు నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అతని ఆల్బమ్స్ మొత్తం హింసను ప్రేరేపించేవిగా ఉండేవి. అభ్యంతరకర కంటెంట్తోనూ విమర్శలు ఎదుర్కొన్నాడు అతను. సిక్కు తెగ వీరుల్ని అవమానించేలా ఉండడంతో క్షమాపణలు చెప్పాడు కూడా. ఇక లాక్డౌన్ టైంలో తన సెక్యూరిటీ సిబ్బంది దగ్గరి తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చినందుకు ఆర్మ్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం.. కేసులు నమోదు అయ్యాయి. ఆ టైంలో అరెస్ట్కు బయపడి కొన్నాళ్లపాటు పరారీలో ఉన్నాడు అతను. ఆపై బెయిల్ దొరికాక బయటకు రాగా.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులోనే ఉంది ఇంకా. సిద్ధూపై ఇంకా నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల ముందు 2021లో కాంగ్రెస్లో చేరిన సిద్ధూ మూసే వాలా.. ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఆప్ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయాడు. సిద్ధూ మృతి కాంగ్రెస్ కీలక నేతలతో పాటు అతని అభిమానులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఉపసంహరణే ఒక ప్రాణం బలి తీసుకుందంటూ ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. దయచేసి సంయమనం పాటించాలని, దోషులు ఎంతటి వాళ్లైనా వదిలే ప్రసక్తే లేదని పిలుపు ఇచ్చాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. I am Shocked and Deeply saddened by the gruesome murder of Siddhu Moosewala. Nobody involved will be spared. My thoughts and prayers are with his family and his fans across the world. I appeal everyone to stay calm. — Bhagwant Mann (@BhagwantMann) May 29, 2022 -
Hyderabad: మద్యం మత్తులో గ్యాంగ్వార్
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్రూంను ఏర్పాటు చేసి మినీబార్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్వార్కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్
-
హైదరాబాద్లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో శనివారం అర్థరాత్రి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. గంజాయి, మద్యం మత్తులో ఇరువర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. హాకీస్టిక్, రాడ్లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!
#MonkeyVsDoge: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో.. నెటిజన్లు ఎలా స్పందిస్తారో తెలియదు! ఎక్కడ ఏ ఘటన చోటుచేసుకున్నా తమదైనశైలిలో కామెంట్లు, మీమ్స్ తయారు చేసి సంఘటనలను ట్రెండింగ్లోకి తీసుకువస్తారు. విషాద ఘటనలైనా సరే గ్రూప్లుగా మరీ కామెంట్లు చేస్తూ ఆ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తారు. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం! కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. కానీ అన్ని జీవులకు పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. శనివారంమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్న వార్తలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ట్విటర్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. #MonkeyVsDoge అనే హ్యాష్ ట్యాగ్తో గ్రూప్లుగా మారీ నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తయరు చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన చాలా విషాదకరమైనప్పటికీ దేశవ్యాప్తంగా నెటిజన్లు ‘మంకీ గ్రూప్ వర్సెస్ డాగ్ గ్రూప్’ గా మారీ కామెంట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్లో ఉంది. గతంలో కుక్కలు కోతులను వెంటపడిమరీ చంపాయని.. దీంతో పగపట్టిన కోతులు ఫ్యాక్షన్ సినిమా తరహాలో గుంపులుగా చేరి కుక్కలను చంపడం ప్రారంభించాయని స్థానికులు తెలిపారు. Monkeys when they are going to Dog areas #MonkeyVsDoge pic.twitter.com/oIFIkZhuuc — Mr X (@tweets_of_X) December 18, 2021 The Biggest reason behind #MonkeyVsDoge gangwar 😂😂😂😂😂😂😂 pic.twitter.com/98NnuPlftc — 𝗔ɴᴋɪᴛ ❁ (@FanOfMySellf) December 18, 2021 Bhai! Ye Billiyon ki Saajish hai bata raha hoon.#MonkeyVsDoge pic.twitter.com/aYtoVu1caP — Ankush (@_James_Bong) December 18, 2021 #MonkeyVsDoge https://t.co/QduTYnHIzq pic.twitter.com/c78WHkSVEx — सिया 🥀 || (@HayeSiyapa) December 18, 2021 Dogs vs Monkeys #MonkeyVsDoge I support both of them check the next vid in the thread 🙏❤️ pic.twitter.com/vTl2sxKSES — Vishupedia (@vishupedia) December 18, 2021 Joe biden has decided to make a peace agreement between monke and doge Thanq biden 👏 #MonkeyVsDoge pic.twitter.com/oTGzAPnY3c — SM (@lolsaalam) December 18, 2021 -
కోర్టులో షూటౌట్; వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిల్లు తాజ్పూరియా ప్రస్తుతం తీహార్లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఉమాంగ్, వినయ్లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ గ్యాంగ్వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు? -
ఢిల్లీ గ్యాంగ్వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్వార్గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్గఢ్లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్వార్ టిల్లు తాజ్పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్గా చెప్పుకునే మరో గ్యాంగ్స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కోర్టులోనే రెండు గ్రూపుల కాల్పులు
-
లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్ గ్యాంగ్-జితేంద్ర గ్యాంగ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్ చేసుకున్న సునీల్ గ్యాంగ్.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్ దాదా మోస్గ్ వాంటెడ్ క్రిమినల్. 2016లో పోలీస్ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్ స్టర్పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి #WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J — ANI (@ANI) September 24, 2021 -
సినిమాను తలపించే రీతిలో.. హిజ్రాల గ్యాంగ్వార్
అనంతపురం క్రైం: హిజ్రాలు రెడ్డెక్కారు. ఆధిపత్య పోరులో ప్రాంతాల వారీగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఇందులో అనంతపురానికి చెందిన ఒకరు తీవ్రంగా గాయపడగా... దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ వద్ద హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో మన విజయం ట్రాన్స్జెండర్ అసోసియేషన్ మయూరి ఆధ్వర్యంలో ఈ నెల 28న హిజ్రాలు ఉలిగమ్మ ఉత్సవం నిర్వహించారు. వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, బళ్లారి ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది హిజ్రా లతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి 120 మంది హాజరయ్యారు. హైదరాబాద్కు చెందిన సునితా నాయక్ అలియాస్ అక్తార్భాను ఆధ్వర్యంలో నడిచే సంఘానికి ఇకపై డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక, ఏపీకి చెందిన హిజ్రాలు నిర్ణయించగా, హైదరాబాద్ హిజ్రాలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వాదన చేసుకున్నారు. ఉత్సవం అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ఆశా, వీనా, ఆర్థన, గీతమ్మ తదితరులు అర్ధరాత్రి వేళ అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు వాదులాట జరగ్గా... అనంతపురం హిజ్రా రుక్సానా అలియాస్ శర్మాస్పై వారంతా దాడి చేశారు. దీనికి నిరసనగా గురువారం కలెక్టరేట్ ముందు పలువురు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. బంగారం, డబ్బులు లాక్కున్నారని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి, టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హిజ్రాలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధిపత్య పోరుతోనే సమస్య తలెత్తిందని, విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
వనస్థలిపురంలో గ్యాంగ్ వార్ కలకలం
-
బెజవాడలో మరో గ్యాంగ్వార్!
సాక్షి, విజయవాడ: నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్వార్ తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేదారేశ్వరపేట ఖుద్దూస్నగర్కు చెందిన షేక్ నాగుల్మీరా(మున్నా), రాహుల్ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన రాహుల్తో పాటు అయోధ్యనగర్కు చెందిన వినయ్ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్మీరా వర్గానికి చెందిన ఈసబ్, సాయికుమార్ తదితరులు అయోధ్యనగర్ బసవతారకనగర్ రైల్వే క్యాబిన్ సమీపంలో వినయ్, రాహుల్ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. పరస్పర దాడులు తర్వాత ఇరువర్గాలు బయటకు రాలేదు. (గ్యాంగ్వార్.. రౌడీషీటర్పై హత్యాయత్నం) ఇదిలా ఉండగా అయోధ్యనగర్కు చెందిన పుట్టా వినయ్ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్నగర్కు చెందిన షేక్ నాగుల్మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్ ఈసబ్ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టా వినయ్ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్మీరా, ఈసబ్, సాయికుమార్, సాయిపవన్, కంది సాయికుమార్లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నామని, దాడి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్ నాగుల్మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఖుద్దూస్నగర్కు చెందిన రాహుల్, పటమటకు చెందిన సాయికిరణ్, అయోధ్యనగర్కు చెందిన పుట్టా వినయ్, వికాస్ అనే యువకులను అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో అయిదుగురు కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
హైదరాబాద్: పాతబస్తీలో గ్యాంగ్ వార్
-
గ్యాంగ్వార్.. రౌడీషీటర్పై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పడమట గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురి అరెస్టు
సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్, అజయ్, శంకర్, మస్తాన్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్లోని 26 మందిని, సందీప్ గ్రూప్లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్కు చెందిన రౌడీ షీటర్ అనంత్ కుమార్పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్లోని మరో 18 మందిని సస్పెక్ట్ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్ ఫైట్లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చదవండి: విశాఖలో మరో గ్యాంగ్వార్ కలకలం -
విశాఖలో మరో గ్యాంగ్వార్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో జరిగిన ఈ గ్యాంగ్వార్ లో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీతానగరం ఆర్హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. అదే వేడుకలకి వచ్చిన వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గందవరపు తరుణ్ తో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఒకరిప్తె ఒకరు దాడులకు దిగారు. (విశాఖ గ్యాంగ్వార్.. పోలీసులు సీరియస్) సంతోష్పై 12 కేసులు.. కత్తులతో రెండు వర్గాలు పరస్పరం దాడులకి ప్రయత్నించారు. సబ్బవరం మండలంలో జరిగిన వివాదమే దాడులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక,పెదగంట్యాడ, సబ్బవరం మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెటిల్మెంట్లు చేయడం కత్తులతో దాడులు చెయ్యడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ అలవాటుగా చెబుతున్నారు. ఒక్క న్యూపోర్టు పోలీసు స్టేషన్ లోనే 12 కేసులున్నట్లు సిఐ ప్తెడిపు నాయుడు తెలిపారు. అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్ బిటెక్ చదివాడు. హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫేక్ కాల్స్ చేసిన విషయంలో కేసులు నమోదయ్యాయి... అలాగే తరుణ్పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
గ్యాంగ్ వార్ కేసులో పురోగతి
సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్కు సంబంధించిన కేసులో పోలీసులు పట్టు బిగుస్తున్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా ఇది వరకే గ్యాంగ్ లీడర్ పండుతో పాటు రెండు గ్రూపులకు చెందిన 33 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. పరారిలో ఉన్న మిగతా 15 మంది నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. -
బెజవాడ గ్యాంగ్వార్ : పండు అరెస్ట్
సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో గాయాలు అవ్వడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీస్ ప్రొటక్షన్ మధ్య అతడికి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కుదటపడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వద్ద నుంచి తోట సందీప్ హత్యకు వినియోగించిన రెండు కత్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. (చదవండి : బెజవాడలో అలజడి) కాగా ఇప్పటికే ఈకేసులో ఇరు వర్గాలకు చెందిన 33 మందిని పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులపై రౌడీ షీట్లు తెరవనున్నారు. నేరచరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగరబహిష్కరణ చెయ్యాలని నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండి : పండు.. మామూలోడు కాదు!) -
వీధి యుద్ధాలకు దిగితే కఠిన శిక్షలు
-
గ్యాంగ్ వార్ : పండు తల్లిపైనా కేసు!
సాక్షి, అమరావతి : వీధి యుద్ధాలకు దిగితే కఠిన శిక్షలు తప్పవని డీసీపీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. గ్యాంగ్ వార్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, త్వరలోనే కేసును పూర్తిస్థాయిలో ఛేదించి నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటువేస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పండు గ్యాంగ్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశాము. సందీప్ టీంలో 15 మందిని రిమాండుకు పంపాము. రెండు గ్యాంగుల్లోని సభ్యులతో సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశాము. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు ప్రత్యేక బృందాలు నిందితులకోసం గాలిస్తున్నాయి. ( బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. మరో ముందడుగు ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ లీడర్ పండు డిశ్చార్జ్ అవగానే అదుపులోకి తీసుకొంటాము. కుమారుడి నేర ప్రవృత్తిని ప్రోత్సహించిన పండు తల్లిపైనా కేసు నమోదు చేశాము. పండు, సందీప్ల కాల్ డేటా కూడా సేకరించాము గొడవ జరిగే ముందు ఇద్దరూ పదిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. పండునుంచి సందీప్కు ఆరు కాల్స్, సందీప్ నుంచి పండుకి నాలుగు కాల్స్ వెళ్లాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలతో పాటు డీల్ మాట్లాడిన నాగబాబునూ విచారిస్తున్నాం’’ అని అన్నారు. -
బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. మరో ముందడుగు
సాక్షి, కృష్ణా: జెజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పోలీసులు మరో తొమ్మిది మంది వీధి రౌడీలను బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో పండు గ్యాంగ్కి చెందినవారు ఐదుగురు, సందీప్ బ్యాచ్కి చెందినవారు నలుగురు ఉన్నారు. ఇప్పటికే రెండు గ్యాంగ్లకు చెందిన 24 మందిని పోలీసులు రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు పోలీసు బృందాలు కేసు మూలాలను అన్వేషిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే గ్యాంగ్ లీడర్ పండుని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. పండు విచారణలో సందీప్ హత్య వెనక ఉన్న కారణాలను పోలీసులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబసభ్యుల ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సీన్ రీ కన్స్ట్రక్షన్లో కీలక విషయాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు వీధి రౌడీలకు నగర బహిష్కరణ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
గ్యాంగ్వార్పై పోలీసుల కఠిన చర్యలు..
-
గ్యాంగ్వార్: వారిపై నగర బహిష్కరణ వేటు
సాక్షి, అమరావతి: బెజవాడ్ గ్యాంగ్వార్లో పాల్గొన్న కొందరిపై నగర బహిష్కరణ వేటు పడనుంది. అలాగే గ్యాంగ్వార్కు కారకులైన మాజీ రౌడీïÙటర్ సందీప్, మణికంఠ అలియాస్ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్ పెట్టనున్నారు. ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీïÙట్ ఓపెన్ చేశారు. గ్యాంగ్వార్పై పోలీసుల కఠిన చర్యలు.. విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్వార్ను తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఇరు గ్రూపులకు చెందిన సభ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు రౌడీ మూకలు యువకులతో కలిసి అలజడి రేపడాన్ని క్షమించరాని నేరంగా భావించి గ్యాంగ్వార్లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్ను ఉపయోగించబోతున్నారు. ►విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 417 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ►శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్లు 497 మంది ఉన్నారు. ►ఇప్పటికే 7 మందిపై నగర బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ►తాజాగా సందీప్, పండుల మధ్య జరిగిన గ్యాంగ్వార్ నేపథ్యంలో మరికొందరిపై నగర బహిష్కరణ వేటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. చదవండి: యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్ పండు తల్లిపై రౌడీషీట్.. మాజీ రౌడీషీటర్ సందీప్పై మణికంఠ అలియాస్ పండును దాడికి ప్రోత్సహించిన కారణంగా అతని తల్లి కోడూరి పద్మావతిని సందీప్ హత్యా నేరం కేసులో నాల్గో ముద్దాయిగా చేరుస్తూ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. రౌడీషీట్ ఓపెన్ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు అయింది. మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది. అలాగే పీడీ యాక్ట్ కూడా పద్మావతిపై పోలీసులు పెట్టనున్నారు. దీంతోపాటు పద్మావతి గత చరిత్ర, ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆమెకు నేరప్రవృత్తి ఉన్నట్లు రుజువైతే నగర బహిష్కరణ వేటు వేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతున్న జల్లెడ.. ఇక ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 10 మంది నిందితులతోపాటు సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. సందీప్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్ అమరావతి: మాజీ రౌడీషీటర్ తోట సందీప్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పదకొండు రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంగతి విదితమే. ఈ గ్యాంగ్వార్లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ హర్షవర్థన్రాజు ఆ వివరాలను వెల్లడించారు. ►గ్యాంగ్వార్లో సందీప్ తరఫు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీసీపీ చెప్పారు. ►వారి నుంచి రెండు పట్టా కత్తులు, ఒక నేపాల్ కత్తి, రెండు రాడ్లు, కర్ర, బేడ్లు, ఆరు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ►నిందితుల్లో సందీప్ సోదరుడు తోట జగదీష్ అలియాస్ బాలు, మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్కుమార్, ఆకురాతి వెంకట శివరఘునాథ్, పంది విజయప్రసాద్లు ఉన్నారు. వీరిలో కిరణ్, రఘునాథ్లపై మంగళగిరి పోలీసుస్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. ►వీరితోపాటు యర్రంశెట్టి రాము, చింతా సాంబశివరావు, చందా రామ్ నితిన్, జక్కా రత్నసాయిలు, పెనమలూరుకు చెందిన కందెల శివరామకృష్ణ, యనమలకుదురుకు చెందిన బోడా శివ, తాడిగడపకు చెందిన కన్నా సునీల్లు ఉన్నారన్నారు. చిన్ననాటి స్నేహితులు.. వీరిలో చాలా మంది సందీప్కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు. సెంట్రల్ ఏసీపీ నాగరాజురెడ్డి, పటమట, పెనమలూరు సీఐలు సురేష్రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్
సాక్షి, విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్వార్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఘటన మూలాలపై ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. నిందితులను స్పాట్కు తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కేసును కొలిక్కి తెచ్చేందుకు ఆరు ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. కేసు దర్యాప్తు అత్యంత గోప్యంగా సాగుతోంది. ఇప్పటికే సందీప్, పండు గ్యాంగ్లకు చెందిన 24 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన స్ట్రీట్ ఫైటర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్) గుంటూరు ఆసుపత్రి నుంచి పండు డిశ్చార్జ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. బెజవాడ రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రౌడీ దర్బార్ ల ద్వారా నేరగాళ్లలో పరివర్తనకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఆయుధాలతో కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’) -
యువతి కోసం గ్యాంగ్ వార్
సాక్షి, గుంటూరు: గుంటూరులో ఆదివారం రాత్రి గ్యాంగ్వార్ కలకలం సృష్టించింది. ఒక యువతి కోసం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో రెండు గ్రూపులుగా విడిపోయి, ఘర్షణకు దిగడంతో అలజడి వాతావరణం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు, విశ్వసనీయ సమాచారం మేరకు.. గుంటూరు రూరల్ చౌడవరం సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో వసంతరాయపురానికి చెందిన ప్రణయ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని బృందావన్ గార్డెన్స్కు చెందిన ఒక విద్యార్థిని అతడికి స్నేహితురాలు. ఆమెకు ఇన్స్ట్రాగామ్లో అకౌంట్ ఉండటంతో, కృష్ణనగర్కు చెందిన ఆవుల దివేష్ అలియాస్ సన్ని మేసేజ్లు పంపుతుండేవాడు. సన్నీ పంపుతున్న మేసేజ్ల విషయాన్ని సదరు విద్యార్థిని ప్రణయ్కు చెప్పడంతో సాంతికేతిక మాధ్యమాల ద్వారా ఇద్దరి మధ్యా వివాదం నెలకొంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ..ఇద్దరూ ఫోన్ నంబర్లు పంపుకున్నారు. విషయంపై తేల్చుకుందాం రమ్మంటూ..డొంకరోడ్డు వద్ద ముందుగా ప్రదేశాన్ని ఖరారు చేసుకున్నారు. డొంక రోడ్డు 6వ లైను వద్ద రెండు వర్గాలు కలిపి సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు, యువకులు చేరడంతో అక్కడ స్థానికులు కేకలు వేశారు. అక్కడ నుంచి పిచ్చుకులగుంట వద్ద బాహాబాహీకి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అరండల్పేట స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్, ఎస్హెచ్వో బత్తుల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందిని ఘటన స్థలానికి పంపేసరికి ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులతో పాటు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సమాచారం వేగవంతంగా తెలియడం, సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో ఎటువంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఘర్షణకు వచ్చిన వారిలో గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ఒక స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ కుమారుడు ఉన్నట్లు సమాచారం. చదవండి: గ్యాంగ్ వార్: ఇప్పుడు దృష్టంతా ఆ సమాచారం పైనే! ఘర్షణ జరిగిన ఘటన స్థలంలో స్థానికుడిని విచారిస్తున్న ఏఎస్పీ గంగాధరం ముమ్మర దర్యాప్తు యువతి విషయంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరండల్పేట పీఎస్లో ఉన్న విద్యార్థులు, యువకులను సోమవారం అడిషనల్ ఎస్పీ డి. గంగాధరం, వెస్ట్ డీఎస్పీ బి.వి. రామారావు, స్టేషన్ ఎస్హెచ్వో బత్తుల శ్రీనివాసరావు విచారించారు. ఘర్షణలకు కారణమైన వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణ చేపట్టారు. యువతి విషయంలోనే ఘర్షణ లేక..ఇతరత్రా ఏమైనా ఉన్నాయా... ఘర్షణ సమయంలో ఉన్న విద్యార్థులు కాకుండా, ఇతరత్రా ఉన్న యువకులపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది యువకులు ఇన్నోవా..మరికొంత మంది ద్విచక్ర వాహనాలపై పిచ్చుకులగుంట వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఏఎస్పీ గంగాధరం స్పష్టం చేశారు. కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిపై విచారణ జరుగుతోందని తెలిపారు. చదవండి: గ్యాంగ్వార్కు స్కెచ్ వేసింది అక్కడే! -
గ్యాంగ్వార్: పోలీసుల అదుపులో రౌడీషీటర్లు..
సాక్షి, విజయవాడ: నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాంగ్వార్ మూలాలపై పోలీసులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. స్టీట్ఫైట్లో పాల్గొన్న వారి నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు, మరో పదమూడు మందిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వాడిన ఆయుధాలు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వివరాలను సీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించనున్నారు. (ఇప్పుడు దృష్టంతా కాల్డేటా పైనే!) పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీల్ కుదిర్చిన నాగబాబులను పోలీసులు విచారిస్తున్నారు. గ్యాంగ్వార్ ఘటనకు సంబంధించి కాల్డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. (గ్యాంగ్వార్ కేసు కొలిక్కి!) -
గ్యాంగ్వార్: వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
గ్యాంగ్ వార్: ఇప్పుడు దృష్టంతా ఆ సమాచారం పైనే!
సాక్షి, అమరావతి: విజయవాడలోని పటమట తోటవారి వీధిలో ఇటీవల జరిగిన గ్యాంగ్వార్ లింక్లపై పోలీసులు ముమ్మరంగా శోధిస్తున్నారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలోని 6 టీమ్లు ప్రత్యేకంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. గ్యాంగ్వార్ ఘటనకు సంబంధించి కాల్డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. తొలుత మాజీ రౌడీషీటర్ తోట సందీప్ దగ్గర కోడూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు అనుచరుడుగా ఉండేవాడు. సందీప్ చేసే సెటిల్మెంట్లలో పండు చురుగ్గా పాల్గొనేవాడని పోలీసుల విచారణలో తేలింది. చదవండి: గ్యాంగ్వార్లో వారి ప్రమేయం లేదు ఇలా చాన్నాళ్లపాటు వీరిద్దరు కలిసి సెటిల్మెంట్లు చేశారు. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో సందీప్ బ్యాచ్ నుంచి పండు బయటకొచ్చి వేరే గ్రూపు పెట్టాడు. పండుతో సఖ్యతగా ఉండే సందీప్ బ్యాచ్లోని కొంతమంది అతని వెంట వచ్చారు. సందీప్తోనే శతృత్వా న్ని పెంచుకున్న పండు ఆయన గ్యాంగ్లో ఇతర సభ్యులతో మాత్రం విరోధం పెట్టుకోలేదు. అవసరమైనప్పుడు ఇరు గ్యాంగ్ల సభ్యులు కలుసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవ డం వంటివి జరిగాయని పోలీసులు ధృవీకరిస్తున్నారు. సందీప్, పండులు గ్యాంగ్వార్కు కొన్ని రోజుల కిందట మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు కిరణ్కుమార్, రఘునాథ్ అలియాస్ ఏవీఎస్లతోపాటు మరికొందరు యువకులతో కలిసి తాడేపల్లి మండలం కుంచినపల్లి, మంగళగిరి మండలం కురుగల్లు గ్రామాలకు వెళ్లి సెటిల్మెంట్లలో పాల్గొన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. చదవండి: గ్యాంగ్వార్కు స్కెచ్ వేసింది అక్కడే! ఈ వ్యవహరంపై పూర్తిస్థాయిలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సందీప్పై దాడిచేసిన కేసులో నిందితుడైన రేపల్లె ప్రశాంత్ గుంటూరులోని ఓ ప్రైవేటు యూనివర్సీటిలో చదువుతున్నాడు. ఇతను ఆ యూనివర్సిటీలో జరిగే వ్యవహారాలను పండు దృష్టికి తీసుకురావడం, ఆ తర్వాత మంగళగిరి బ్యాచ్ను రంగంలోకి దించడంలో కీలకపాత్ర పోషించేవాడని పోలీసుల వద్ద సమాచారం ఉంది. మొత్తం మీద సందీప్, పండు వ్యవహారాలపై అధికారులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ గ్రూప్ సభ్యుల కాల్డేటాను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ కాల్డేటా ఆధారంగా ఈ గ్రూపులతో ఎవరెవరికి లింక్లు ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించారు. వీటి ఆధారంగా దర్యాప్తు మరింత సమగ్రంగా జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చదవండి: గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు -
గ్యాంగ్ వార్ కేసులో కొత్తకోణం
-
గ్యాంగ్వార్లో వారి ప్రమేయం లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని ఏడు సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్వార్కు దారి తీసిందని విజయవాడ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్వార్కు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏం జరిగిందంటే.. ►యనమలకుదురుకు చెందిన ప్రదీప్రెడ్డి, కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్ ఇద్దరు కలిసి యనమలకుదురులోని 7 సెంట్ల స్థలంలో రూ.1.50 కోట్ల అంచనాతో 14 ఫ్లాట్ల గ్రూప్ హౌస్ నిర్మాణం 2018లో చేపట్టారు. ►ఇందుకుగానూ ప్రదీప్రెడ్డి, శ్రీధర్ మొదట రూ.40 లక్షల చొప్పున రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. తర్వాత ప్రదీప్రెడ్డి నుంచి డబ్బు ఇవ్వకపోవడంతో శ్రీధర్ మిగతా రూ.70 లక్షలు వెచ్చించి 2019లో నిర్మాణాన్ని పూర్తిచేశారు. అయితే ఇద్దరి వాటా కింద రావాల్సిన ఫ్లాట్లన్నింటినీ శ్రీధరే తన పేరిట ఉంచుకోవడంతో వివాదం మొదలైంది. ►దీంతో బట్టు నాగబాబు అలియాస్ చిన్న నాగబాబును ప్రదీప్రెడ్డి ఆశ్రయించి తన వాటా తనకు ఇప్పించాలని కోరాడు. మే 29న ప్రదీప్రెడ్డి, శ్రీధర్లను నాగబాబు పంచాయితీకి పిలిచాడు. ►ఈ పంచాయితీకి తోట సందీప్, కోడూరి మణికంఠ అలియాస్ పండులను కూడా నాగబాబు పిలిచాడు. ►ఆ తర్వాత తాను మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లిన చోటుకి నువ్వెందుకొచ్చావు అని పండును సందీప్ ఫోన్లో నిలదీశాడు. తీవ్రస్థాయిలో బెదిరించడంతో ఇరువురు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చదవండి: పండు.. మామూలోడు కాదు! ఇంటికెళ్లి గొడవ.. ►అదేరోజు అర్ధరాత్రి ఇదే విషయంపై పండును స్వయంగా అడగడానికి తోట సందీప్, అతని సోదరుడు జగదీష్తోపాటు మరికొంత మంది అనుచరులతో పండు ఇంటికెళ్లి అతని తల్లితో గొడవ పడి వెళ్లిపోయారు. ►సందీప్ ఇంటికొచ్చి తన తల్లితో గొడవపడిన విషయం తెలిసి పండు 30వ తేదీన ఉదయం పటమటలో సందీప్ నిర్వహిస్తున్న శివబాలాజీ స్టీల్స్ దుకాణం వద్దకు వెళ్లి.. ఆ సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న సాగర్, రాజేష్ను కొట్టి గాయపరిచాడు. ►ఈ విషయం తెలుసుకున్న సందీప్ పండుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో చివరకు ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ►ఆపై సాయంత్ర 4.30 గంటల సమయంలో పటమట తోటావారి వీధిలోని గ్రేస్ చర్చ్ వద్ద గల ఖాళీ ప్రదేశంలో సందీప్, పండులకు రెండు గ్రూపులు సమావేశమయ్యారు. ►ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన కారం కళ్లలో చల్లి.. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ►ఈ గ్యాంగ్వార్లో తోట సందీప్, కోడూరి మణికంఠలు తీవ్రంగా గాయపడగా వారి అనుచరులు వారిని ఆస్పత్రులకు తరలించారు. ►తోట సందీప్ పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31వ తేదీ సాయంత్రం 5.50 గంటల సమయంలో మృతి చెందాడు. పండు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ►ప్రత్యక్ష సాక్ష్యులు, సీసీ టీవీ ఫుటేజీ, సెల్ఫోన్ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాం. ►ఈ కేసులో కొట్లాటకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఉన్నవారందరిపై రౌడీషీట్స్ తెరిచామని సీపీ స్పష్టం చేశారు. చదవండి: గ్యాంగ్వార్కు స్కెచ్ వేసింది అక్కడే! రౌడీ కార్యకలాపాలపై నిఘా.. ►గ్యాంగ్వార్కు సంబంధించి వరుసగా రెండు రోజులపాటు ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపై పోలీసులకు సమాచారం లేదు. కోవిడ్ విధుల్లో ఉన్న కారణంగా రౌడీషీటర్లపై నిఘా పెట్టలేదు. కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేదు. ఇకపై విజయవాడలోని రౌడీషీటర్లపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. అయితే ఈ గ్యాంగ్వార్కు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు వీళ్లను వాడుకున్నట్లు తెలుస్తోంది. కులం, వర్గం, పారీ్టలు అని చూడకుండా తప్పుచేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిందితుల వివరాలు.. రేపల్లె శ్రీనివాస్(సనత్నగర్), ఆకుల రవితేజ(యనమలకుదురు), పందా ప్రేమకుమార్, పందా ప్రభుకుమార్ (పటమట), బాణావత్ శ్రీను నాయక్(రామలింగేశ్వర నగర్), ఎల్ వెంకటేశ్(పటమట), బూరి భాస్కరరావు(సనత్నగర్), పి.సాయిప్రవీణ్ కుమార్(తోటావారి వీధి), పొన్నాడ సాయి, సిర్రా సంతో‹Ù, యర్రా తిరుపతిరావు (పటమట), ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్(యనమలకుదురు). స్వాధీనం చేసుకున్న ఆయుధాలు.. కొబ్బరి బొండాల కత్తి, పొడవాటి కత్తి, స్నాప్ కట్టర్, కోడి పందేలకు వినియోగించే కత్తి, ఓ రాడ్డు, ఫోల్డింగ్ బ్లేడ్లు, నాలుడు బ్లేడ్లు, మూడు బైక్లు. -
గ్యాంగ్వార్కు స్కెచ్ వేసింది అక్కడే!
ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రమైన మంగళాద్రి... చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన పట్టణం... రాను రాను హత్యా రాజకీయాలు, రౌడీ షీటర్లకు నిలయంగా మారిపోతోంది. గడిచిన ఏడేళ్లలో మూడు కిరాయి హత్యలు, వేర్వేరు నేరాలతో పాటు పలుచోట్ల అల్లర్లు సృష్టించడానికి, కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు మంగళగిరిలో ఉన్న రౌడీషీటర్లు బ్లేడ్బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా వర్గాలు పట్టించుకోకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, తాడేపల్లిరూరల్: తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు ‘ఏ’ గ్రేడ్ రౌడీషీటర్లను, ఆ రౌడీషీటర్లు బ్లేడ్ బ్యాచ్నీ, గంజాయి బ్యాచ్నీ పెంచి పోషిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన గ్యాంగ్వార్ వెనుక మంగళగిరికి చెందిన ఒక చిట్ఫండ్ ఫైనాన్స్ కంపెనీ వ్యాపారి హస్తం ఉంది. విజయవాడ గ్యాంగ్వార్లో మృతి చెందిన మాజీ రౌడీషీటర్ తోట సందీప్ను చంపితే తమను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, ఆ భయాన్ని ఆధారం చేసుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెటిల్మెంట్లు చేయొచ్చన్న ఆలోచనతో మంగళగిరికి చెందిన కిరణ్, ఏవీఎస్, తంబి అనే రౌడీషీటర్లను ఉసిగొల్పి వీరి వద్ద ఉన్న సుమారు పదిమందిని విజయవాడ పంపి ఆ గ్యాంగ్వార్లో పాల్గొనేలా చేశారు. మణికంఠ అలియాస్ పండు మంగళగిరిలో ఐదు రోజుల పాటు ఉండి ఈ గ్యాంగ్వార్కు వ్యూహరచన చేశాడు. ఇదే సమయంలో పండు టిక్టాక్లో ఒక భయంకరమైన వీడియోను అప్లోడ్ చేసి, తాము హత్య చేయబోతున్నామనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇంత జరుగుతున్నా ఇక్కడ పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. గతంలో కిరణ్ అన్నయ్య హేమంత్ను వర్గపోరులో భాగంగా అతి దారుణంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రాళ్లతో కొట్టి చంపారు. అదే బాట ఎంచుకున్న కిరణ్ తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చిన్న ల్యాండ్ సెటిల్మెంట్లో నలభై, యాభై వేల కమీషన్ కోసం ఈ హత్యకు పాల్పడ్డాడు. ఏవీఎస్, మణికంఠ(పండు) తాడేపల్లిలో మకాం వేసిన సందీప్ విజయవాడలో వెలివేసిన చెందిన వెల్లంకి సందీప్ అలియాస్ పెద్దబాండు, అతని అనుచరుడు గుర్రాల కళ్యాణ్ అలియాస్ చిన్నబాండు తాడేపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రజలను తమ బ్లేడులతో భయభ్రాంతులకు గురిచేసేవారు. యాభై రూపాయలు ఇవ్వలేదని తాడేపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్లో ఒక వ్యక్తిపై బ్లేడ్తో దాడికి పాల్పడ్డారు. క్యారంబోర్డు ఆకర్షణతో... టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్, ప్రస్తుత రౌడీషీటర్ యువకులను సన్మార్గంలో నడపడానికి కారంబోర్డు ఏర్పాటు చేశాడని బయటకు ప్రచారం చేస్తూ లోపల మాత్రం భవిష్యత్తులో తాను చేయబోయే భూకబ్జాలకు, ఫైనాన్షియల్ వసూళ్లకు సిద్ధం చేశాడు. కిరణ్ కూడా సదరు రౌడీషీటర్ ఈ మధ్య కాలంలో జైలుకి వెళ్లే వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తూ కరుడుగట్టిన నేరస్తుడు అయ్యాడు. ప్రేమ వ్యవహారంలో జోక్యం విజయవాడలో పలు కళాశాలల్లో విద్యార్థుల మధ్య జరిగే ముక్కోణపు ప్రేమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కిరణ్, ఏవీఎస్. తంబి, రవి, వంశీ తదితరులు సెటిల్మెంట్లు చేస్తూ విద్యార్థులను సైతం బెదిరించి వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. విజయవాడ కళాశాలల్లో జరిగిన ఈ ప్రేమ వ్యవహారాలను మణికంఠ కిరణ్ వద్దకు పంపడంతో కిరణ్ రౌడీయిజం గురించి ఆనోటా ఈనోటా బహిర్గతం అయింది. చదవండి: ‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’ భూకబ్జాలకు వీరే నాంది తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్ చేసిన భూకబ్జాలకు వీరిని కాపలా పెట్టి భూములను ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు లేదా కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల విలువైన భూమిని కేవలం పాతిక లేదా ముప్ఫై లక్షల రూపాయలు ఇచ్చి భూమిలో ఉన్న రెండో వ్యక్తిని దౌర్జన్యంగా బయటకు పంపించి ఆ భూమిని తన సొంతం చేసుకున్నాడు. సెటిల్మెంట్ అయిన తర్వాత వీరికి పదో పరకో ఇచ్చి సదరు ఫైనాన్షియర్ చేతులు దులుపుకొనేవాడు. వీరి ఆగడాలు ఎక్కువ అవడంతో నిదానంగా తన కార్యాలయం నుంచి బయటకు పంపించి ఏమీ తెలియనట్లు పెద్దమనిషిలా వ్యవహరించడం గమనార్హం. చదవండి: గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు విజయవాడ నేరస్తులంతా ఇక్కడే 2007లో పోలీసులకు సైతం ఐపీ పెట్టి కాల్వలోకి కారును తోసేసి చనిపోయినట్లు సృష్టించిన ప్రముఖ నేరస్తుడి దగ్గర్నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాల కోసం యాచకులను సైతం వదలకుండా దాడులకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతంలో నేరస్తులను కూడగట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి శివారు ప్రాంతాలైన పాత రైల్వేగేటు ప్రాంతంతో పాటు హాయ్ల్యాండ్ వెనుక ప్రాంతం, అమరావతి టౌన్షిప్, చినకాకాని గ్రామానికి, రైల్వే ట్రాక్ మధ్య, తాడేపల్లిలోని మహానాడు, సుందరయ్య నగర్, పుష్కరఘాట్లు, ఐఓసీ ఎదురుగా ఉన్న వెంచర్లు, విజయవాడ క్లబ్ వెనుక ఉన్న కృష్ణానది తదితర ప్రాంతాల్లో స్థలాలు మారుస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సందీప్ హత్య చేసే ముందు కుంచనపల్లి గ్రామంలో కూడా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు వీరిపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని నేరస్తుల బారి నుంచి కాపాడుతారో లేదో వేచిచూడాలి. -
గ్యాంగ్ దాడిలోనే సందీప్ చనిపోయాడు
-
‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’
సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్ లీడర్ పండుతో సహా 13 మంది స్ట్రీట్ ఫైటర్స్ని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని.. త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వెల్లడించారు. (గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు) సీపీ తిరుమలరావు మాట్లాడుతూ.. ‘పండు గ్యాంగ్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్ చనిపోయాడు. గతంలో పండు, సందీప్ మంచి స్నేహితులు. ల్యాండ్ సెటిల్మెంట్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రదీప్రెడ్డి, శ్రీధర్రెడ్డి మధ్య అపార్ట్మెంట్ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. (పండు.. మామూలోడు కాదు!) దీంతో పండుకు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్ ఫోన్లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్మెంట్కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్ బెదిరించాడు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్ షాపుకు వెళ్లారు. సందీప్ షాపులో ఉన్న అనుచరుడిని పండు గ్యాంగ్ కొట్టింది. మాట్లాడుకుందాం అని పిలుచుకుని.. 30వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి చాలామంది గాయపడి ఉన్నారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. గ్యాంగ్ వార్లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు’అని కమిషనర్ హెచ్చరించారు. (చదవండి: గ్యాంగ్వార్ కేసు కొలిక్కి!) -
ఆదిలాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం
-
మళ్లీ గ్యాంగ్‘వార్’
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్లో మళ్లీ గ్యాంగ్వార్ చోటుచేసుకుంది. రెండేళ్ల కిందట కత్తులతో దాడికి పాల్పడిన గ్యాంగ్ మళ్లీ ఘర్షణకు దిగింది. ఈ సంఘటన ఆదిలాబాద్లో మరోసారి గ్యాంగ్వార్ను తేటతెల్లం చేస్తుంది. సామాన్య ప్రజానికానికి ఆందోళన కలిగిస్తుంది. ఓ వ్యక్తిపై మంగళవారం దాడికి పాల్పడిన సంఘటనలో టీఆర్ఎస్ కౌన్సిలర్ సహా 12మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ సురేష్ కథనం ప్రకారం.. ఈ నెల 2న రాత్రి 8.40గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన సిల్వర్ శ్రీనివాస్ ఇంటికి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతితో సహా పలువురు వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను పట్టణ శివారు ప్రాంతంలో తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. బాధితుడు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 307 సెక్షన్ కింద బుధవారం కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతి, వసీమ్, శివ, బబ్లు, మహేందర్, కిరణ్, ఎరవేన శివ, జి.గంగన్న, సాయి, మరో ముగ్గురుపై కేసు నమోదైంది. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలతోనే.. సిల్వర్ శ్రీనివాస్, రఘుపతి ఒకప్పుడు స్నేహితులు. గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు రావడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి తీసుకెళ్లి గాయత్రి గార్డెన్ వైపు తీసుకెళ్లి దాడికి దిగినట్లు బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మావలలోని ఓ ఫామ్హౌస్కు తీసుకెళ్లి నిర్భందించినట్లు పేర్కొన్నాడు. వారి నుంచి తప్పించుకొని పోలీస్స్టేషన్కు చేరుకున్నట్లు సంఘటన జరిగిన తీరును పోలీసులకు వివరించినట్లు పేర్కొంటున్నారు. శ్రీనివాస్పై దాడికి పాల్పడటం వెనుక సరైన కారణం తెలియరావడం లేదు. పాత కక్షలతోనే దాడికి దిగి ఉండవచ్చనే చర్చ సాగుతోంది. కాగా రఘుపతితోపాటు వసీమ్, పలువురు రెండేళ్ల కిందట ఓ వ్యక్తిపై భూ వివాదం విషయంలో కత్తులతో దాడి చేసిన ఘటనలో అప్పట్లో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. వీరు కొన్ని రోజుల పాటు పరారీలో ఉండగా, తర్వాత బెయిల్ తీసుకొని పోలీసుల ముందు హాజరయ్యారు. ఆ ఘటన మరవక ముందే మరోసారి గ్యాంగ్వార్ పట్టణంలో సంచలనం రేపుతోంది. -
కాలేజి గ్రౌండ్లో గ్యాంగ్ వార్
-
గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగరంలోని పటమట డొంక రోడ్డులో ఆదివారం జరిగిన గ్యాంగ్వార్ ఘటనలో మాజీ రౌడీషీటర్ సందీప్పై మారణాయుధాలతో దాడికి పాల్పడిన 13 మంది నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పండుపై దాడికి పాల్పడ్డ తోట సందీప్ వర్గానికి చెందిన మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆధిపత్య పోరే కారణం.. యనమలకుదురులో ఓ అపార్ట్మెంట్కు సంబంధించి పంచాయతీ జరుగుతున్న చోటకు మణికంఠ అలియాస్ కేటీఎం పండు రావడం జీర్ణించుచుకోలేకపోయిన సందీప్.. అదే రోజు పండుతో ఫోన్లో తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. పండు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఫోన్లోనే ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం గ్యాంగ్వార్కు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆదివారం ఉదయమే పండు ఓ ముప్పై మందికిపైగా యువకుల్ని వెంటేసుకొని వచ్చి పటమట డొంకరోడ్డులోని సందీప్ షాప్ వద్ద దాడికి యత్నించగా.. ఆ సమయంలో రహదారిపై బ్లూకోట్స్ సిబ్బంది సైరన్ మోగిస్తూ రావడంతో చాలా మంది పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పలాయనం చిత్తగించారని సమాచారం. పరస్పర సవాళ్ల నేపథ్యంలో సాయంత్రం చర్చి వెనుక ఉన్న ఖాళీ స్థలానికి చేరుకుని ఒకరిపై ఒకరు రాడ్లు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల అదుపులో పండు గ్యాంగ్.. సందీప్ మృతికి కారణమైన పండుతోపాటు అతని గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. గ్యాంగ్వార్లో తీవ్రంగా గాయపడిన పండు ప్రస్తుతం గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతనిని పోలీసులు ఇప్పటి వరకు విచారించలేదు. పండు కోలుకోగానే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నారనేది సమాచారం. పండు గ్యాంగ్లో పటమట, సనత్నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు అల్లరిచిల్లరిగా తిరిగేవారని, పండు నిత్యం వీళ్లకు అవసరమైనవి సరఫరా చేస్తుండటంతో అతను ఏ పని చెప్పినా ముందూ వెనుక చూడకుండా రంగంలోకి దిగేవారని పోలీసుల విచారణలో గుర్తించారని తెలుస్తోంది. గ్యాంగ్ సభ్యులపై ఐపీసీ 143, 148, 302, 307, 324 సెక్షన్లతోపాటు కోవిడ్–19 చట్టానికి సంబంధించిన 188, 269 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పండు పోస్ట్ చేసిన టిక్ టాక్ వీడియోల పై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. పండుపై సినిమాల ప్రభావం, బెజవాడ రౌడీగా ఎదగాలన్న ఆలోచనా ధోరణే గ్యాంగ్ వార్ కి దారితీసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ గ్యాంగ్లో ఇద్దరు రౌడీషీటర్లు.. పండు ముప్పై మందికి పైగా యువకుల్ని వెంటేసుకొని రావడంతో సందీప్ కూడా తన అనుచరులతోపాటు మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు మేకతోటి కిరణ్కుమార్, ఆకురాతి వెంకట రఘునాథ్ అలియాస్ ఏవీఎస్లను కూడా గ్యాంగ్వార్కు పిలిపించారు. వీడియో ఫుటేజీలో వీరిని గుర్తించిన పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సందీప్ తరఫున గ్యాంగ్వార్లో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సెటిల్మెంట్ల అడ్డా.. పటమట భూ తగాదాలు.. కుటుంబ కలహాలు.. కాల్మనీ కేసులు.. క్రికెట్ బెట్టింగ్లు.. కళాశాల గొడవలకు సంబంధించి నగరంలో ఎలాంటి సెటిల్మెంట్లకైనా పటమటే అడ్డా. బెజవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడలో జరిగిన వివాదాలన్నింటిలోనూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కొందరి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆదివారం మృతి చెందిన మాజీ రౌడీషీటర్ సందీప్ కూడా రియల్టర్ నాగబాబు ఓ అపార్ట్మెంట్ వివాదంలో పంచాయతీకి తీసుకెళ్లగా.. అది కాస్త గ్యాంగ్వార్కు దారితీసింది. నాగబాబు ఎవరంటే.. పటమటకు చెందిన నాగబాబు ఓ సాధారణ రియల్టర్. చిన్న స్థలాలు కొని ప్లాట్లు వేసి విక్రయిస్తుంటాడు. ఇతనికి టీడీపీ ముఖ్య నాయకులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో స్థల వివాదాలు అధికం. నాగబాబు దృష్టికి భూ వివాదాలు రాగానే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, నగర టీడీపీ ముఖ్య నేతల వద్ద పంచాయతీ పెట్టించేవాడు. నాయకులు సెటిల్మెంట్లు చేయడం ప్రతిఫలంగా నాగబాబుకు ఎంతో కొంత కమీషన్ ముట్టజెప్పేవారని సమాచారం. ఇలా చిన్నచిన్న పంచాయతీలతో వచ్చే కమీషన్తో పబ్బం గడుపుకునే నాగబాబు తర్వాత జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తూర్పు, మధ్య నియోజకవర్గ ముఖ్యనేతలు, తెలుగుయువత జిల్లా నాయకుని సహాయ సహకారాలతో స్వయంగా పంచాయతీలు చేసే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది. సందీప్, పండులు పావులుగా.. తను సొంతంగా పంచాయతీలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి సందీప్, పండులను నాగబాబు ఉపయోగించుకుంటూ వచ్చారని పోలీసుల తాజా పరిశీలనలో వెల్లడైందని సమాచారం. నాగబాబు ఏదైనా పంచాయతీ చేస్తే స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రౌడీïÙటర్లను రంగంలోకి దించేవాడని, ఈ గ్యాంగ్లను, ముఖ్యంగా యువతను తీసుకొచ్చే పనిని సందీప్, పండులకు అప్పగించేవాడని పోలీసులు గుర్తించారు. తెలుగు యువత జిల్లా నాయకుడు దిశానిర్దేశం చేయడం, నాగబాబు అమలుచేసే వాడని తెలుస్తోంది. గత వారం కూడా ఇలాగే యనమకుదురులోని ధనేకుల శ్రీధర్, ప్రదీప్రెడ్డిలకు చెందిన అపార్ట్మెంట్ పంచాయతీకి నాగబాబు సందీప్ను తీసుకెళ్లగా.. పండు కూడా ప్రదీప్రెడ్డి తరఫున వెళ్లడం జరిగింది. నాగబాబు, సందీప్లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. దీంతో పండుకు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్ ఫోన్లో బెదిరించే యత్నం చేశాడు. మాటామాటా పెరగడం.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో చివరకు గ్యాంగ్ వార్కు దారితీసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
సందీప్ని పక్కా పథకంతోనే హత్య చేశారు
సాక్షి, విజయవాడ : పటమటలో ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్వార్లో రౌడీషీటర్ సందీప్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సందీప్ భార్య తేజస్విని, తల్లి పద్మావతి సాక్షి టీవీతో ముచ్చటించారు. సందీప్ భార్య తేజస్విని మాట్లాడుతూ.. ' సందీప్ను పక్కా పథకంతోనే హత్య చేశారు. లాండ్ సెటిల్మెంట్ గొడవకు సందీప్ కి సంబంధం లేదు. సందీప్ హత్య వెనుక ఉన్న కుట్రను పోలీసులు చేధిస్తారన్న నమ్మకం మాకు ఉంది. కాగా గొడవకు ముందు రోజే సందీప్ను ఫోన్లో బెదిరించారు. తర్వాత ఫోన్ లిప్ట్ చేయకపోవడంతోనే సందీప్ కోసం ఐరన్ షాపు దగ్గరకు పండు బ్యాచ్ వచ్చారు. ఆ సమయంలో సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న గుమస్తాపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. గొడవ పెంచటం ఇష్టం లేక పోలీసులకు పిర్యాదు చేయలేదు. నీ కుటుంబాన్ని అంతంచేస్తానని సందీప్కు ఫోన్ చేసి బెదిరించారు. సందీప్ను మాట్లాడుకుందాంరా అంటూ పడమటకు పిలిచి దారుణంగా హత్య చేశారు. సందీప్ మంచితనం, సేవాగుణం చూసి ప్రేమ వివాహం చేసుకున్నా.. సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి..సందీప్ మృతికి కారణమైన వారందరినీ శిక్షపడే వరకు పోరాడుతా ' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు) సందీప్ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. ' సందీప్ మరణానికి కారణమైన పండును కఠినమైన శిక్ష పడాలి. సందీప్ కాలేజి రోజులనుంచే యూత్ లీడర్ గా పని చేశాడు. అందువల్లనే మా అబ్బాయికి యూత్లో ఫాలోయింగ్ ఉంది. సందీప్ వివాదాలకు వెళ్లే వాడు కాదు.. నా కొడుకు మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరినీ పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా' అంటూ తెలిపారు. (బెజవాడ గ్యాంగ్వార్ కేసులో పురోగతి) -
బెజవాడ గ్యాంగ్వార్ కేసులో పురోగతి
సాక్షి, విజయవాడ : బెజవాడ గ్యాంగ్వార్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్ట్రీట్ ఫైటర్స్ వేటలో వేగం పెంచారు. కొంతమంది గ్యాంగ్ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం కూపీ లాగుతున్నారు. స్ట్రీట్ ఫైట్తో భయానక వాతావరణం సృష్టించిన జులాయిలపై రౌడీ షీట్ తెరిచే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలు సైతం గ్యాంగ్వార్ కారణాలపై మూలాల్లోకి వెళ్లి మరీ విచారిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ( పండు.. మామూలోడు కాదు! ) కాగా, డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్వార్ను పోలీసు కమిషనర్ తీవ్రంగా పరిగణించడంతో.. సందీప్ మృతితో నిందితులు అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో పాటు కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే డొంకరోడ్డులో పండు గ్యాంగ్ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే 21 మందిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు) -
పండు.. మామూలోడు కాదు!
సాక్షి, అమరావతి: ‘కత్తితో గొంతు కోస్తున్నప్పుడు స్.. స్.. స్.. స్.. అనే ఓ సౌండ్ వస్తది సామి. అది వినడానికి సమ్మగా ఉంటుంది సామీ..’ ఇది ఓ సినిమా డైలాగ్. ఇదే డైలాగ్ను తన హావభావాలతో అనుకరిస్తూ మణికంఠ అలియాస్ కేటీఎం పండు ఇటీవల టిక్టాక్ వీడియో చేసిన తీరు అతనిలోని క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాగే మరో వీడియోలో ‘విజయవాడ మొత్తానికి మొగుడిలా బతకడానికి పెద్దగా ఆలోచించాలి’ అంటూ పేర్కొనడం కూడా అతనిలోని గ్యాంగ్లీడర్ మనస్థత్వాన్ని వెల్లడిస్తోంది. ఇలాంటి ఆలోచనలు, డైలాగులు మణికంఠపై తీవ్ర ప్రభావమే చూపాయని చెప్పొచ్చు. తల్లి అండదండలతో.. సనత్నగర్లోని రామాలయం వీధిలో పండు తల్లి పద్మ, ఆమె బంధువులు కలిసి ఐదు కుటుంబాలు వరకు నివసిస్తున్నాయి. గత 40 ఏళ్లుగా వాళ్లు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.. మొదటి నుంచి స్థానికంగా గొడవలు పడటం.. కేసులు పెట్టడం.. పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం వీరికి అలవాటు. నగరంలో కాల్మనీ వ్యాపారం బాగా పెద్ద ఎత్తున జరుగుతున్న రోజుల్లో పండు తల్లి రూ. 15ల వడ్డీతో అప్పులు ఇచ్చి వసూళ్లు చేసేదని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే దాడులు చేసి మరీ వసూలు చేసేదని కూడా తెలుస్తోంది. అలాగే తన కొడుకు ఎక్కడైనా గొడవ పడినా తల్లి వెనకేసుకొచ్చేదని సమాచారం. 2012లో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో కొట్లాట కేసులో పండుపై కేసు నమోదైంది. అలాగే 2017లో పటమట పోలీసుస్టేషన్ పరిధిలో మరో కొట్లాట కేసు నమోదైంది. కృష్ణలంకలోనూ ఇదే తరహా కేసు పండుపై 2019లో నమోదైంది. ఈ మూడు కేసుల సందర్భంలోనూ పండు తల్లి పద్మనే అన్ని దగ్గరుండి చూసుకున్నదని పండు స్నేహితులు పేర్కొంటున్నారు. చదవండి: సందీప్కు టీడీపీ నేతల అండదండలు.. చుట్టూ స్నేహితులు.. నిత్యం హంగామా తల్లి పద్మ అండదండలతో పండులో విచ్చలవిడితనం పెరిగిపోయింది. నిత్యం తన చుట్టూ పది మంది స్నేహితులు, బ్లేడ్బ్యాచ్ సభ్యులతో హంగామా సృష్టించేవాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో పండు అతని స్నేహితులు ఆ వీధిలోకి వస్తే ఎవరూ బయటకొచ్చేవారు కాదని, అలాగే పండు కుటుంబసభ్యులు ఉంటోన్న ఇళ్లవైపునకు వెళ్లే ధైర్యం కూడా చేసేవారు కాదని సమాచారం. పండు చుట్టూ ఉండే స్నేహితులు, బ్లేడ్బ్యాచ్ సభ్యులు గంజాయి, మద్యం మత్తులోనే ఉండేవారని తెలుస్తోంది. పోలీసుల అదుపులో 21 మంది.. డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్వార్పై పోలీసు కమిషనర్ తీవ్రంగా పరిగణించడంతో నిందితుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. సందీప్ మృతితో నిందితులు అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే డొంకరోడ్డులో పండు గ్యాంగ్ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే 21 మందిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్ -
బెజవాడ గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు
-
గ్యాంగ్ వార్ : వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన గ్యాంగ్ వార్కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతోపాటుగా, వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తొలుత సందీప్, పండులు సన్నిహితులైనప్పటికీ.. విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్లుగా విడిపోయారు. వీరిద్దరు కూడా టీడీపీకి చెందిన ఓ నాయకుడికి ముఖ్య అనుచరులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : బెజవాడలో అలజడి) మరోవైపు గుంటూరు జిల్లాలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో సందీప్, పండు వర్గాల జోక్యం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బెజవాడలో ల్యాండ్ సెటిల్మెంట్లకు గుంటూరు నుంచి యువకులను, గుంటూరులో ల్యాండ్ సెటిల్మెంట్లకు బెజవాడ యువకులను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇలా చేయడం ద్వారా బయటి వ్యక్తులను గుర్తుపట్టే అవకాశం ఉండదని వారు భావించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ వార్లో రెండు జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నట్టుగా ఆధారాలు సేకరించారు. అలాగే సందీప్, పండులకు ఉన్న టిక్టాక్, ఫేస్బుక్ అకౌంట్ల ఫాలోవర్స్ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా, శనివారం పటమటలో జరిగిన గ్యాంగ్ వార్లో సందీప్ మృతిచెందగా, పండుతో పాటుగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పండు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. (చదవండి : బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్) -
బెజవాడ గ్యాంగ్వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్
సాక్షి, విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్ వార్లో మృతిచెందిన రౌడీషీటర్ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. (సందీప్కు టీడీపీ నేతల అండదండలు..) రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సందీప్కు టీడీపీ నేతల అండదండలు..
సాక్షి, అమరావతిబ్యూరో: బెదిరింపులు.. సెటిల్మెంట్లు.. రౌడీషీటర్ల నిత్య కృత్యాలు. అనుకున్నది చేసేందుకు వారు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్నా పంథాను మార్చుకోవడం లేదు. వివాదాల్లో ఉన్న భూములు, కాలనీలు, వీధుల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ ఫ్లాట్లు, శివార్లలోని రూ. కోట్ల విలువైన స్థలాల క్రయ విక్రయాల్లో వీరు జోక్యం చేసుకుంటున్నారు. భౌతిక దాడులకు గబడుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. పటమట, కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, సింగ్నగర్ ప్రాంతాల్లోవీరి అరాచకాలు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శన. తాజాగా శనివారం పటమటలో జరిగిన గ్యాంగ్వార్లో ఒక మాజీ రౌడీషీటర్ ఆదివారం మరణించడం నగరంలో కలకలం రేపుతోంది. (టీడీపీ,జనసేన భూ వివాదం: ఒకరి మృతి) ఏం జరిగిందంటే.. ⇔ నగరానికి చెందిన ధనేకుల శ్రీధర్, ప్రదీప్రెడ్డిలు యనమలకుదురులో ఒక స్థల యాజమానితో కలిసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద 14 ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. ⇔ ప్రదీప్రెడ్డి తన వాటాలో భాగంగా రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొన్నాళ్లకు అతను అగ్రిమెంట్ నుంచి తప్పుకున్నాడు. అయినా ధనేకుల శ్రీధర్ ప్రాజెక్టుకు ఆపకుండా పూర్తి చేశారు. ⇔ ఇటీవల ప్రదీప్రెడ్డి శ్రీధర్ను కలిసి తాను పెట్టుబడిగా పెట్టిన రూ. 40లక్షలకు వడ్డీ కలిపి రూ. 50 లక్షలు ఇ వ్వాలనికోరగా, అంతఇవ్వలేనని శ్రీధర్ తేల్చిచెప్పాడు. ⇔ దీంతో ప్రదీప్ స్పందన కార్యక్రమంలో శ్రీధర్పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు దీనిని కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ⇔ ఎలాగైనా తన డబ్బును రాబట్టుకోవాలని భావించిన ప్రదీప్రెడ్డి పటమటలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కుమారుడిని కలిసి విషయం తెలియజేయగా.. ఇరువర్గాలను పిలిచి సెటిల్ చేయమని అతను తన అనుచరుడికి పని అప్పగించాడు. ⇔ దీంతో అతను సందీప్ అనే ఓ మాజీ రౌడీషీటర్, నేర చరిత్ర ఉన్న పండు అలి యాస్ మణికంఠ అనే ఇద్ద రితో కలిసి తాడేపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీధర్, ప్రదీప్రెడ్డిలను పిలిచి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. ⇔ ఈ నేపథ్యంలో పండు, సందీప్ మధ్య వాటాల పంపకంలో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అదే రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో పండు ఇంటికెళ్లిన సందీప్ అతని తల్లితో గొడవపడ్డాడు. ⇔ ఆ తెల్లవారే శనివారం ఉదయం సందీప్కు చెందిన ఐరన్ షాపుకెళ్లిన పండు అక్కడ పనిచేసే వ్యక్తిని గాయపరచడంతో వివాదం చినికి చినికి గాలివానాల మారి చివరకు రెండు వర్గాలు విడిపోయి గ్యాంగ్వార్కు దారితీసింది. ⇔ సాయంత్రం విజయవాడ పటమట పప్పులమిల్లు సెంటర్ సమీపంలోని మైదానంలో ఇరువర్గాలు కత్తులు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ⇔ ఈ వార్లో సందీప్, పండులు ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో సందీప్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పండును గుంటూరు జీజీహెచ్కు స్నేహితులు తరలించారు. ⇔ సందీప్ మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆదివారం చికిత్స పొందుతూ మరణించాడు. పండు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు మృతదేహం తరలింపు.. ఆటోనగర్: సందీప్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులుబందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాపకింద నీరులా.. ఒకప్పుడు గ్రూపు తగాదాలు.. గ్యాంగ్ వార్లతో అట్టుడికిన బెజవాడలో గత కొన్నేళ్లుగా ప్రశాంత వాతావారణం నెలకొంది. రాజకీయ వర్గాల మధ్య వివాదాలు కూడా బాగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించాయి. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం పుణ్యమా అని నగరంలో మళ్లీ చాపకింద నీరులా రౌడీయిజం విస్తరించింది. కోవిడ్ విధుల్లో పోలీసులు.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గత రెండు నెలలుగా కమిషనరేట్ పరిధిలోని పోలీసులు నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రౌడీమూకలు కొందరు సెటిల్మెంట్లు చేసున్నట్లు తెలుస్తోంది. సందీప్కు టీటీపీ నేతల అండదండలు పటమట(విజయవాడ తూర్పు): ఇరువర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తోట సందీప్ గత దశాబ్ద కాలంగా టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు మహానాడు కార్యక్రమ సమయంలో భారీస్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించేవాడు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 వరకు నగరంలోని తూర్పు, సెంట్రల్, పెనమలూరు నియోజకవర్గాలలో సెటిల్మెంట్లను జోరుగా సాగించేవాడు. దీనికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారం మెండుగా ఉండేది. విజయవాడ రెండో డివిజన్ మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ కుమారుడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దేవినేని చందు సాన్నిహిత్యం తోడవ్వటంతో నేరాల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలోనే వీఎంసీ ఎన్నికల్లో పోటీకి సందీప్ భార్య తేజశ్విని 3వ డివిజన్కు కార్పొరేటర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రతిపాదించారు. అయితే సందీప్ కుటుంబానికి పెనమలూరు మండలం యనమలకుదురులో ఓటు ఉండటంతో ఇక్కడ పోటీ చేయటానికి వీలుకాదని తేల్చారు. -
బెజవాడ గ్యాంగ్ వార్పై మంత్రి సీరియస్
సాక్షి, విజయవాడ: నగరంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న శ్రీనివాస్ నగర్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత టీడీపీ పాలనలో విజయవాడలో రౌడీ పాలన సాగిందని మంత్రి మండిపడ్డారు. ఇకపై నగరంలో వారి ఆటలు సాగవన్నారు. పటమటలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన తోట సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. (బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్) -
టీడీపీ,జనసేన భూ వివాదం: ఒకరి మృతి
-
బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్
-
టీడీపీ,జనసేన భూ వివాదం: ఒకరి మృతి
సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పటమటలో ఆదివారం జరిగిన ఇరువర్గాల పరస్పర దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంగా మొదట అంతా భావించారు. మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్మెంట్లో భాగంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. (రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్ ట్రైన్లు) ఒకే ల్యాండ్ విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ల్యాండ్ దక్కించుకునేందుకు హత్యలకు ఇరువర్గాలు స్కెచ్ వేశాయి. రాజీ ముసుగులో ప్లాన్ అమలుకు రెండు గ్రూపులు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్తోనే కత్తులు,కర్రలతో వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. టీడీపీకి చెందిన తోట సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తింపు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. దాదాపు 30 మంది ఘర్షణకు పాల్పడినట్టు గుర్తించారు. (చంద్రబాబుపై కేసు నమోదు) భూ వివాదంలో ఒకరు మృతి.. టీడీపీ, జనసేన మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. రూ.2 కోట్ల స్థలం విషయంలో చెలరేగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
కత్తులతో విద్యార్థుల వీరంగం
-
బెజవాడలో కత్తులతో విద్యార్థుల వీరంగం
సాక్షి, విజయవాడ: బెజవాడలో కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా చెలరేగిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడే దాకా వెళ్లింది. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దాడిలో గాయపడిన వారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గ్యాంగ్వార్లో రాజకీయ పార్టీ నేతల అనుచరులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం -
పాతబస్తీలో గ్యాంగ్వార్.. రాళ్ల దాడి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో నగరంలోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. స్థానిక భవానీ నగర్లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాళ్లు పెద్ద ఎత్తున రువ్వకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (కరోనా కలవరం : వీడని విషాదం) స్థానికల సమాచారం ప్రకారం బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
చిన్న గొడవ పెద్దదై..
-
తలలు ఓ చోట, మొండాలు మరోచోట..
రియో డి జెనిరో : బ్రెజిల్లోని ఆల్టామిరా జైలులో రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ నరమేధానికి దారి తీసింది. జైలు గార్డులను ఓ గదిలో బంధించిన అనంతరం ఖైదీలు పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో సుమారు 57 మంది మరణించారు. ప్రత్యర్థుల దాడిలో 16 మంది తలలు తెగిపడగా.. మరికొంత మంది అగ్నికి ఆహుతి అయ్యారు. కాలిపోయిన శరీర భాగాలు, తల లేని మొండాలతో జైలు శ్మశానాన్ని తలపించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా పాత కక్షలతోనే జైలులో గ్యాంగ్వార్ జరిగినట్లు జైలు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు, బ్రెజిల్ అధ్యక్షుడు జాయర్ బోసా నారు(63) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ దాడికి గల కారణాలు అన్వేషించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక బ్యాంకు దొంగతనాలు, సెల్ఫోన్ల స్మగ్లింగ్, తుపాకులు, డ్రగ్స్ రవాణా తదితర నేరాల్లో అరెస్టైన దాదాపు సుమారు 7 లక్షల యాభై వేల మంది బ్రెజిల్ (ఖైదీలను కలిగి ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే మూడో స్థానం )జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడే గ్రూపులుగా ఏర్పడిన ఖైదీల్లో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే వ్యక్తులు తమ గ్రూప్ సభ్యుడికి సౌకర్యాలు అందించేందుకు, ప్రత్యర్థి గ్యాంగుల నుంచి తమ వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా బ్రెజిల్ జైళ్లలో రక్తపాతం జరుగుతూనే ఉంది. అయితే నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేసేలా తీసుకువచ్చిన బిల్లు కాంగ్రెస్లో ఇంతవరకు ఆమోదానికి నోచుకోకపోవడం గమనార్హం. -
పట్టపగలు.. నడిరోడ్డు మీద
న్యూఢిల్లీ : పట్టపగలు.. జనంతో కిక్కిరిసిన రోడ్డు మీద రెండు గ్యాంగ్లు పరస్పరం కాల్పులతో బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాత నేరస్తులు మృతి చేందారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నవడా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గెహ్లోత్, వికాస్ దళాల్ రెండు వేర్వేరు గ్యాంగ్లు నడుపుతూ నేరాలకు పాల్పడుతుంటారు. వీరి మీద ఢిల్లీ, హరియాణాలో గతంలోనే హత్యా, కిడ్నాప్, దొంగతనం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రెండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ జరిగింది. ప్రవీణ్ గెహ్లోత్ ప్రయాణిస్తున్న కారును మరో గ్యాంగ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు తమ కారుతో అడ్డగించడమే కాక కాల్పులకు తెగబడ్డారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఢిల్లీలో రెండు గ్యాంగ్లు పరస్పరం కాల్పులు దాంతో ప్రవీణ్ గెహ్లోత్ కూడా కాల్పులు ప్రారంభించాడు. నడి రోడ్డు మీద.. జనం చూస్తుండగానే దాదాపు 15 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగలు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్రో స్టేషన్కు సమీపంలోనే పోలీసులు ఉండటంతో.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందుతులు అక్కడి నుంచి పారరయ్యారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరస్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. రెండు గ్యాంగ్ల మీద కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. దలాల్ 2018 హరియాణా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని వచ్చాడని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. -
నమస్తే పెట్టలేదని బైక్కు నిప్పు..!
బంజారాహిల్స్: తనకు నమస్తే పెట్టలేదని...తనను గౌరవించడం లేదని... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకుడు ఓ యువకుడి ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో టీఆర్ఎస్ రహ్మత్నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వార్డు కమిటీ సభ్యుడు అరుణ్కుమార్ను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి, బాధితుడు పి.ఉమాకాంత్ తెలిపిన మేరకు.. రహ్మత్నగర్ సమీపంలో నివసించే ఉమాకాంత్(20) శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో సోమాజిగూడలోని తన పాన్షాప్ను మూసేసి రహ్మత్నగర్ నల్లపోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే తన స్నేహితుడు రాహుల్ ఇంటికి వచ్చి బైక్ను పార్కింగ్ చేశాడు. అదే సమయంలో స్థానిక టీఆర్ఎస్ నేత అరుణ్ ఆ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఉమాకాంత్ తనకు నమస్తే పెట్టకుండానే తనను పలకరించకుండా వెళ్ళడమే కాకుండా ఆ ప్రాంతానికి ఎవరెవరినో తీసుకొస్తున్నాడని అరుణ్ కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో అరుణ్ కర్ర తీసుకొని కొట్టడానికి వస్తున్నాడంటూ రాహుల్ చెప్పడంతో ఉమాకాంత్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఉమాకాంత్ తన స్నేహితుడైన దుర్గకు సమాచారం ఇచ్చాడు. కొద్ది సేపటికే అరుణ్ తన వాహనంలో ఉన్న పెట్రోల్ను సీసాలో నింపి ఉమాకాంత్ బైక్(టీఎస్ 09 ఈడబ్లు 5219)పై పోసి నిప్పంటించాడు. అదే సమయంలో అక్కడికి ఉమాకాంత్, దుర్గ ఇద్దరూ చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న అరుణ్ దుర్గను తన్నాడు. అరుణ్ సోదరుడు అనిల్, మహేష్లు అక్కడికి చేరుకొని దుర్భాషలాడారు. కర్రతో కొట్టేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఇలా ఉండగా గొడవ జరుగుతున్న సమయంలో అదే దారిలో వెళ్తున్న రౌడీషీటర్ బిల్లా పవన్ గమనించి వెంటనే రహ్మత్నగర్ పోలీస్ అవుట్పోస్ట్లో ఉన్న కానిస్టేబుల్ బాలకృష్ణకు సమాచారం ఇచ్చారు. నైట్ డ్యూటీలో ఉన్న అదే సెక్టార్ ఎస్ఐ శేఖర్ అప్రమత్తమై అక్కడి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని అందరినీ అవుట్పోస్టుకు తరలించారు. అయితే పోలీసుల సమక్షంలోనే అరుణ్తో పాటు ఆయన సోదరుడు అనిల్, మహేష్లు బండబూతులకు దిగారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలన్నీ అర్ధరాత్రి సోషల్మీడియాలో వైరల్ కాగా అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా ఉధ్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై దూకుడు, అసభ్యకరపదజాలం సైతం వీడియోల ద్వారా బయటకు పొక్కింది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు ఘటనపై విచారణ చేపట్టారు. తనపై అరుణ్ కత్తితో దాడి చేసి చంపుతానని బెదిరించాడని ఆయన సోదరుడు అనిల్, మహేష్లు బెదిరించారంటూ ఉమాకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్పై ఐపీసీ సెక్షన్ 435, 323, 506, రెడ్విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. అరుణ్ను అరెస్ట్ చేశారు. మిగిలినవారి ప్రమేయం ఎంత వరకు ఉన్నదానిపై విచారణ చేపడుతున్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్కె. బాలకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పోలీసు విధులకు ఆటంకపరిచిన ఘటనపై కూడాదృష్టిసారిస్తామన్నారు. ఈ ఘటనతో స్థానికంగా పోలీసులు పెట్రోలింగ్ పెంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
చంపుతానంటూ పోలీసుల ఎదుటే వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో అర్థరాత్రి గ్యాంగ్వార్ కలకలం రేపింది. కాలాపత్తర్ ఘటన మరిచిపోకముందే రహమ్మత్ నగర్లో మరో ఘటన వెలుగుచూసింది. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో రెండు గ్రూపులుగా విడిపోయిన యువకులు రెచ్చిపోయారు. ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. ఓ యువకుడి బైక్ను సైతం తగులబెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రహమ్మత్ నగర్ వాసులైన అరుణ్, ఉమాకాంత్ గ్యాంగ్ల మధ్య నిన్న అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఉమాకాంత్ అనే యువకుడు నమస్తే పెట్టకపోవటంతో అరుణ్ అనే యువకుడు అతడిపై ఆగ్రహించాడు. ఉమాకాంత్ అండ్ గ్యాంగ్ను తీవ్రంగా మందిలించాడు. దీంతో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమాకాంత్కు చెందిన బైక్ను అరుణ్ సహచరులు తగులబెట్టారు. దీనిపై ఫిర్యాదు చేయటానికి ఉమాకాంత్ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అక్కడికి కూడా వచ్చిన అరుణ్! ఉమాకాంత్ను చంపుతానంటూ పోలీసుల ఎదుటే బెదిరించాడు. దీంతో జూబ్లిహిల్స్ పోలీసులు అరుణ్పై కేసు నమోదు చేశారు. నాపై పెట్రోల్ పోసి తగులబెట్టాలని చూశాడు : బాధితుడు అరుణ్కు నమస్తే పెట్టలేదనే కోపంతోనే తనపై క్షక్ష్య కట్టారని బాధితుడు ఉమాకాంత్ తెలిపాడు. అందులో భాగంగానే రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో తనను చంపేందుకు అరుణ్ అతని అనుచరులు యత్నించారని చెప్పాడు. తనపై పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకొని, బైక్ వదలి పారిపోయినట్లు వెల్లడించాడు. దీంతో తన బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. నాకు ప్రాణహాణి ఉంది, పేద కుటుంబం.. నాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను సేవ్ చేయడానికి వచ్చిన పవన్ అనే వ్యక్తిపై రౌడి షీట్ బుక్ చేస్తున్నారని తెలిపాడు. హంగామా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అర్థరాత్రులు ఎవరైనా హంగామా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకంటామని ఏసీపీ ఏఎస్ రావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది రెండు గ్రూపుల మధ్య గొడవ కాదని, ఇద్దరు వ్యక్తుల గొడవని చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. -
అర్థరాత్రి జూబ్లీహిల్స్లో గ్యాంగ్వార్
-
గ్యాంగ్వార్కు యువకుడి బలి
రాజేంద్రనగర్: చిన్న విషయంలో మాటామాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రాజేంద్రనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన జాకీర్ ఈ నెల 25వ తేదీ సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో నదీమ్ (25), రహీమ్ తమ బంధువుల విందుకు హాజరై వెళ్తున్నారు. వీరిద్దరూ జాబేర్ ఇళ్లు ఎక్కడని అక్కడ కూర్చున్న వారిని అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. తనపై దాడి చేస్తున్నారంటూ తన స్నేహితులకు ఫోన్లో జాకీర్ సమాచారం అందించాడు. వెంటనే మరో ఐదు మంది యువకులు హాకీ స్టిక్స్, మారణాయుధాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు అప్పటికే యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆ వచ్చిన స్నేహితులు నదీమ్, రహీమ్పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కిందపడ్డ నదీమ్పై దాడి చేసి పక్కనే ఉన్న గనెట్ రాళ్లను వేశారు. వెంటనే వారందరూ పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నదీమ్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి నదీమ్ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబసభ్యులు మృతదేహ నికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా రాజేంద్రనగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. -
విద్యార్థుల గ్యాంగ్ వార్
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): ఆడుతూ..పాడుతూ చదువుకోవాల్సిన వయసులో స్కూల్ విద్యార్థులు గ్యాంగులుగా ఏర్పడి తోటి వారిపై దాడిచేసి గాయపరచిన ఘటన విజయవాడ వన్టౌన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్కు నాయకుడిగా చెప్పుకుంటున్న విద్యార్థి తన స్నేహితుల సాయంతో షార్ప్నర్ బ్లేడ్తో దాడిచేసి ఐదుగురు విద్యార్థుల చేతులను గాయపరిచాడు. వన్టౌన్ కేటీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ఈ ఘటన కొద్దిరోజుల కిందట చోటుచేసుకుంది. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని స్నేహితుల వద్ద చెప్పాడు. ఆ మాట చివరకు స్కూల్లో అందరికీ తెలియడంతో బాలిక చదువుతున్న తరగతిలోని విద్యార్థులు ఆ బాలుడిని ప్రశ్నించారు. అంతే కాకుండా విషయాన్ని 9వ తరగతి స్కూల్ టీచర్కు తెలియజేశారు. ఈ విషయంపై విద్యార్థిని మందలిండచంతోపాటు మరో మారు ఇటువంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తన ప్రేమ వ్యవహారం బయటకు రావడానికి కారణమైన 8వ తరగతి విద్యార్థులపై కక్షతో 9వ తరగతి విద్యార్థి ఓ గ్యాంగ్ను తయారు చేశాడు. 8వ తరగతి విద్యార్థులను పట్టుకుని చేతులపై షార్ప్నర్ బ్లేడ్ సాయంతో గాయపరిచారు. విషయం ప్రిన్సిపాల్కు చేరడంతో గ్యాంగ్ను ఏర్పాటు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఓ విద్యార్థి తండ్రి ఘటనపై ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొత్తపేట ఎస్ఐ తిరుపతిరావు స్కూల్కు వచ్చి ఆరా తీశారు. అయితే ఘటనపై పోలీసులకు రాత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో మరో మారు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి తెలిపినట్లు కొత్తపేట సీఐ జె.మురళీకృష్ణ చెప్పారు -
ఢిల్లీలో గ్యాంగ్వార్.. ముగ్గురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ తుపాకి కాల్పులతో దద్దరిల్లింది. పట్టపగలే నడి రోడ్డుపై రెండు ముఠాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు ముఠా సభ్యులు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సోమవారం ఉదయం 10 గంటలకు రెండు గ్యాంగ్లు వాహనాల్లో వచ్చాయి. ఉదయం 10.15 గంటల సమయంలో ఒకేసారి రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్న ఓ స్థానిక మహిళకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు ముఠా సభ్యులు కూడా ఈ కాల్పుల్లో మృతి చెందారు. కాగా కాల్పులకు పాల్పడిన ముఠాలు గోగి గ్యాంగ్, టిల్లు గ్యాంగ్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు టిల్లు గ్యాంగ్ సభ్యులుగా గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
రాజంపేటలో గ్యాంగ్ వార్ !
ఒకప్పుడు శివ సినిమాలో హీరో నాగార్జున తన ప్రత్యర్థులను సైకిల్కు ఉండే చైన్ లాగి కొట్టడం అప్పల్లో ఒక క్రేజ్.. ఇప్పుడు యువత విద్యార్థి దశలో డస్టర్గాడ్ ,«ఆధునికమైన కత్తులు లాంటి పరికరాలను ఆన్లైన్లో బుక్చేసుకొని తమ బ్యాగు, జేబులో పెట్టుకొని తిరగడం ఒక ఫ్యాషన్గా మారింది. విద్యార్థులు గ్యాంగ్లీడర్లను ఆశ్రయిస్తూ గ్రూపు తగాదాలతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. రాజంపేట : పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలో మూడు నుంచి నాలుగు గ్యాంగ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్లో ఖాళీగా ఉన్న యువత, మరికొంతమంది ఎన్ఆర్ఐ కుటుంబాలకు చెందిన వారు, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఖరీదైన బైకుల్లో తిరుగుతూ ప్రేమవ్యవహారాలు, వివాహేతర సంబం«ధాలు, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, హెరాయిన్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. గ్యాంగుల్లో ఉన్న విద్యార్థులు, యువకులు ఆన్లైన్లో డస్టర్గాడ్తో నూతనంగా వచ్చిన పరికరాలను అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత పోలీసులపై ఉందని పలువురు పేర్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణంలో సంచలనం కలిగించిన ఇంజినీరింగ్ విద్యార్థి సోముసాయి హత్యకు సూత్రధారులెవరనే అంశంపై ఇప్పుడు భిన్నకథనాలు ప్రచారంలో ఉన్నాయి. హత్య ఒకరి వల్ల కాదని కనీసం ఐదుమందిపైకి పైగా ఇందులో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య గ్యాంగ్వార్ పనేనా?.అమ్మాయితో సంబంధాల వ్యవహారమా ? బ్యాచ్ల మధ్య తగదాలా అనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఒకరిని తప్పించేందుకు అధికారపార్టీ ఎన్ఆర్ఐ నేత ఒకరు ఉన్నతాధికారి నుంచి పోలీసులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. పట్టణ సీఐ ఏమంటున్నారంటే... సోముసాయి హత్యకేసులో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఇద్దరు ఉన్నట్లు పట్టణ సీఐ యుగంధర్ ‘సాక్షి’కి తెలిపారు. నిందితునిగా ఉన్న వంశీ పట్టుబడితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. హత్య కేసులో ఎవరున్నా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
నడిరోడ్డుపై భయానక వాతావరణం..
-
పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థుల బీభత్సం
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా పెనమలూరులో నడిరోడ్డుపై విద్యార్థులు గురువారం బీభత్సం సృష్టించారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగానే విద్యార్థులు రెండు వర్గాలుగా ఏర్పడి పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డుపై కర్రలు, రాళ్ళతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థుల తలలు పగిలాయి. రాళ్ళు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ బయట వున్న సెంట్రీలు సైతం స్టేషన్ లోకి పరుగులు తీశారు. చుట్టూ పక్కల నివాసాల వారు భయంతో తలుపులు వేసుకుని ఇళ్ళలోనే వుండిపోయారు.ఈ మొత్తం వ్యవహారంను చిత్రీకరిస్తున్న మీడియా రెండు గ్యాంగ్లోని విద్యార్థులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మీడియా కెమేరా ద్వంసం కాగా, ఇద్దరు మీడియా ప్రతినిధులకు దెబ్బలు తగిలాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగానే బీభత్సకాండ జరుగుతున్నా, స్టేషన్ నుంచి పోలీసులు బయటకు రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్కు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలే దాడికి కారణమని తెలుస్తోంది. ఓ విద్యార్థి హాస్టల్ నిర్వాహకులకు డబ్బులు బకాయి పడటంతో నిన్న(బుధవారం) సదరు విద్యార్థిని హాస్టల్ నిర్వాహకులు చితకబాదారు. బాధితుడు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుల పక్షాన జిల్లాకు చెందిన ఓ మంత్రి అండగా వుండటంతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజీ చేసుకోవాలంటూ సదరు విద్యార్థిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థికి అండగా కొందరు విద్యార్థులు పెనమలూరు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు హాస్టల్ నిర్వాహకులకు మద్దతుగా మరికొందరు అక్కడకు రావడంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ సాక్షిగా పరస్పరం దాడి చేసుకున్నారు. -
నెత్తురు చిందించిన కత్తుల పోరాటం!
-
రైల్వే స్టేషన్లో విద్యార్థి గ్రూపుల గ్యాంగ్వార్..!
సాక్షి, చెన్నై: విద్యార్థి గ్రూపుల దాడులతో చెన్నైలో ఓ రైల్వే స్టేషన్ అట్టుడికింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన చెన్నై శివారులోని అంబత్తూరు-కొరట్టూరు నడుమ పట్టరైవాకంలో చోటుచేసుకుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. కొందరు విద్యార్థులు కత్తులు ప్రదర్శిస్తూ.. మరో వర్గం విద్యార్థులను వెంబడించి మరీ దాడులు చేశారు. ఈ ఘటనతో అదే రైల్లో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యార్ధుల పరస్పర దాడులతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ఈ దాడుల అనంతరం విద్యార్ధులు అదే రైల్లో వెళ్లిపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దాడులు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడులను తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డు చేసిన వారిని నుండి వీడియోలు తీసుకుని.. ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన సదరు మూకను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. విద్యార్ధు గ్రూపుల గ్యాంగ్వార్ ఘటన చెన్నైలో కలకలం రేపుతోంది. -
నడిరోడ్డుపై గ్యాంగ్వార్.. హడలెత్తిన జనం!
-
కాచిగూడలో నడిరోడ్డుపై గ్యాంగ్వార్.. హడలెత్తిన జనం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నడిరోడ్డుపై రెండు గ్యాంగ్లు తలపడ్డాయి. పరస్పరం గొడవకు దిగి పిడిగుద్దులు విసురుకున్నాయి. ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుంటూ రెండు గ్యాంగ్లోని సభ్యులు పిచ్చిగా కొట్టుకున్నారు. నగరంలోని కాచిగూడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో నడిరోడ్డుపై ఈ గ్యాంగ్ వార్ తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను చూసి స్థానికులు, బస్తీవాసులు హడలిపోయారు. ఒక బైక్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. చిన్న గొడవగా మొదలై.. దాడులు, ప్రతి దాడులు, ఇటుకలు, రాళ్లతో కొట్టుకోవడం వరకు వెళ్లిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. నడిరోడ్డుపై ఇంతపెద్ద గొడవ జరిగినా.. పోలీసులు పెట్టీ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ గ్యాంగ్వార్లో అంబర్పేట్కు చెందిన ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు పోలీసులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బైక్ విషయంలో ఈ గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో రౌడీషీటర్లు కూడా ఉన్నారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఘటనలో రౌడీషీటర్లు ఎవరూ లేరని తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు తిరిగి రాజీ చేసుకున్నారని, దీంతో పెట్టీ కేసు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
నారాయణ కాలేజ్లో గ్యాంగ్వార్
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్వార్ జరగడం కలకలం రేపుతోంది. నిక్ నేమ్తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనకు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాంగ్వార్
గుంటూరు రౌడీల గ్యాంగ్వార్ ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరం మళ్లీ రౌడీషీటర్ల ఆధిపత్య పోరుతో అట్టుడుకుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కిరాతక హత్యలకు కూడా వెనుకాడకపోవడంతో నడిరోడ్డుపై రక్తచారికలు తరచూ కన్పిస్తున్నాయి. దీనికి ఆదివారం రాత్రి అరండల్పేటలో జరిగిన రౌడీషీటర్ వాసు హత్యే ఓ ఉదాహరణ. ఒక ఏడాది ముగిసేలోపే 10 హత్యలు జరిగాయంటే హింస తీవ్రత ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గ్యాంగ్వార్తో ప్రజాజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందే. సినీఫక్కీలో పక్కా స్కెచ్... గుంటూరు నగరం. రద్దీగా ఉండే అరండల్పేట ప్రాంతం. 12వ లైను. ఆదివారం రాత్రి 8.26 గంటల సమయంలో వందలాది మంది జనం చూస్తుండగా అన్వర్ బిర్యానీ పాయింట్ ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ బసవల భారతి వాసును ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. సినీఫక్కీలో స్కార్పియో వాహనంతో ఢీకొట్టి కిందపడిపోయిన వాసుపై ఐదుగురు వ్యక్తులు 30 సెకన్లలో 30 కత్తి పోట్లు పొడిచారు. ఘటనతో అక్కడ ఉన్న ప్రజలంతా కేకలు పెడుతూ పరుగులు తీశారు. అరండల్పేట పోలీస్ స్టేషన్కు ఎదురుగా నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య జరగడం చూస్తుంటే హంతకులకు పోలీసులంటే ఏమాత్రం భయం ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తపు చారికలెన్నో.. ⇒ గతేడాది డిసెంబరులో గుంటూరు అరండల్పేట 3/2లోని ఓ హోటల్ ఎదురుగా రాత్రి 8 గంటల సమయంలో రౌడీషీటర్ బొప్పన రవిని నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ⇒ 2016 డిసెంబరులో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న వల్లపు గోపి అనే వ్యక్తిని నగరంపాలెం పోలీసు స్టేషన్ ఎదురుగా ఆటోలో గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఎక్కించి గుంటూరు రూరల్ మండలం బుడంపాడు కాలువ వరకూ తీసుకెళ్లి హతమార్చారు. ఆదిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగినట్లు పోలుసులు గుర్తించారు. ⇒ ఈ మార్చి 6న నాగెండ్ల కల్యాణ్రామ్ అనే యువకుడిని ఆధిపత్య పోరులో భాగంగా ప్రత్యర్థులు మట్టుపెట్టారు. ⇒ కొన్నాళ్ల కిత్రం గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో ఆగంతకులు ముగ్గురు యువకులను దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. ⇒ మూడు నెలల క్రితం ఆంజనేయులు అనే రౌడీషీటర్ని ఏటుకూరు రోడ్డులోని చాకలికుంట సెంటర్లో ప్రత్యర్థులు నరికి చంపారు. ఇలా ఒక్క ఏడాదిలో 10 హత్యలు జరిగాయి. చోటా అనుచరులతో సెటిల్మెంట్లు.. గతంలో లిస్టులో మోస్ట్ వాంటెడ్గా రౌడీషీటర్లు బయటకు రాకుండా ఇప్పుడు చోటా అనుచరులకు బాధ్యతలు అప్పగించి వారిచేత సెటిల్మెంట్లు చేయిస్తున్నట్లు ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని పాతగుంటూరు, శ్రీనివాసరావుపేట వంటి ప్రాంతాల్లో హవా కొనసాగిస్తున్న రౌడీ షీటర్లు అధికార పార్టీ నాయకులతో తప్పించుకు తిరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. రౌడీషీటర్లు మాత్రం తమను పోలీస్ స్టేషన్లకు పిలిపించరాదంటూ అధికార పార్టీ నేతలతో పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కొందరు వైట్కాలర్ నేరస్థులైతే తమకు ప్రాణహాని ఉందని లైసెన్స్డ్ గన్ తీసుకునేపనిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతివారం రౌడీషీటర్లను పోలీసు స్టేషన్లకు పిలిచి వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి కదలికలపై పూర్తి నిఘా ఉంచాల్సిన పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి అని వేరే చెప్పనక్కర్లేదు. రౌడీషీటర్ల నగరం నుంచి బహిష్కరిస్తాం.. రౌడీషీటర్ బసవల వాసు హత్య ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని డీఎస్పీలు, సీఐలతో అత్యవసర సమావేశం నిర్వహించాం. రౌడీషీటర్ల భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేశాం. వారం రోజుల్లో నగరంలో రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేస్తాం. వారిని నగరం నుంచి బహిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నాం. సెటిల్మెంట్లు, దందాలు ఎవరినీ ఉపేక్షించం. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించాం. శాంతి భద్రతల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటాం. రౌడీషీటర్లను కట్టడి చేసి నేరాల పని పడతాం. – అర్బన్ ఎస్పీ విజయారావు -
ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీ: దేశరాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ గ్యాంగ్స్టర్ను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మియన్వాలి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భూపేంద్ర అనే గ్యాంగ్స్టర్.. మిత్రుడు అరుణ్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ విజయ్తో కలిసి కారులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుల్దీప్ అనే మరో కానిస్టేబుల్ సైతం ఈ ఘటనలో గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.