old city
-
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వివాహిత ఆత్మహత్య
-
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
HYD: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని దివాన్దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా, అబ్బాస్ టవర్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో భవనం నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు.. పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి.ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్షాహీల నుంచి ఆసఫ్జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్ఏఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్గంజ్, ఫలక్నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్హుస్సేన్, దారుల్ఫా జిగ్జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్చౌక్లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
ఒకవైపు కూల్చివేతలు.. మరోవైపు పరిహారం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులు పట్టాలెక్కి పరుగులు తీస్తున్నాయి. మెట్రో రూట్లో కూల్చివేతలు ఊపందుకున్నాయి. మీరాలంమండి నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న మార్గంలో కూల్చివేతలు చకచకా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం (Metro Route) నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ (JBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్కారిడార్ (Green Corridor) అందుబాటులోకి రానుంది. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు తొలగించాల్సిన 1,100 ఆస్తులను అధికారులు ఇప్పటికే గుర్తించారు.41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లింపు...భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ (HAML) చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 41 మందికి రూ.20 కోట్ల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పాతబస్తీలో గుర్తించిన 1100 ఆస్తులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. గజానికి రూ.81 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణంలో మతపరమైన, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి (NVS Reddy) తెలిపారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరానికి కొత్త సొబగులు సమకూరనున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుకానున్నాయి. కాలుష్యరహితంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు చార్మినార్ సందర్శన ఒక ప్రత్యేకత. మెట్రో రాకతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఆస్తులను కోల్పోవడంపై విచారం మరోవైపు దశాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న, ఉపాధి పొందుతున్న భవనాలు, షాపులను మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా కోల్పోవడం పట్ల పాతబస్తీ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులను కోల్పోవడం బాధగానే ఉన్నప్పటికీ పాతబస్తీ అభివృద్ధి దృష్ట్యా అంగీకరిస్తున్నట్లు మీరాలంమండికి చెందిన ఇబ్రహీం అనే ఛాయ్ దుకాణదారు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న వస్త్ర, కిరాణా దుకాణాలు, హోటళ్లు కనుమరుగు కానున్నాయి.చదవండి: మరో రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు -
Hyderabad: దుమ్ములో బంగారం కోసం వెదుకులాట
చార్మినార్: మట్టిలో మాణిక్యాలేమో కానీ.. పాతబస్తీలో ఏళ్ల తరబడి ఓ కుటుంబం మట్టిలో బంగారం, వెండిని వెదుకుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాల్లో మట్టిని ఏకం చేసి అందులో ఏమైనా చిన్న చిన్న తుకడలు (ముక్కలు) దొరుకుతాయేమోననే ఆశతో వడపోస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి కంటికి కనిపించని సూక్ష్మంగా పౌడర్ తరహాలో కూడా దొరుకుతుందని చెబుతున్నారు. మట్టిలో నుంచి వడపోత ద్వారా మట్టి లాంటి పసుపు, తెలుపు రంగు పౌడర్ రూపంలో బంగారం, వెండి లభిస్తుందంటున్నారు. పాతబస్తీ కేంద్రంగా... నిజాం కాలం నుంచి పాతబస్తీలోని చార్మినార్ పరిసరాలు బంగారు, వెండి ఆభరణాల క్రయ విక్రయాలకు పెట్టింది పేరు. ఆభరణాల దుకాణాలతో పాటు ఆర్డర్లపై ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాలు కూడా ఇక్కడి గల్లీల్లో అధికంగా ఉన్నాయి. దాదాపు 250–300 వరకూ దుకాణాలున్నాయి. కొనుగోలుదారుల ఆర్డర్ మేరకు దుకాణ దారులు అర్చుల రూపంలో వసువు తయారీకి బంగారం అందజేస్తారు. తరుగు, మజూరీ నుంచే... ఆభరణాల తయారీ సమయంలో ముద్ద లాంటి బంగారపు కడ్డీనీ కరిగించి, మరిగించి ఆభరణాలను తయారు చేస్తారు. ఇలా చేసే క్రమంలో సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువుల రూపంలో బంగారం కింద పడి దుమ్ము, మట్టిలో కలుస్తుంది. దీన్నే బంగారపు షాపుల వారు తరుగు కింద లెక్కగడతారు. (తరుగు అంటే వేస్టేజ్, మజూరీ అంటే చేత కూలి) ఈ రోజువారీ తయారీ ప్రక్రియలో వందల సంఖ్యలో బంగారపు వస్తువులు తయారవుతుంటాయి. ఈ క్రమంలో తయారీ దారులు ఎక్కువ శాతం ఆ రజన్లోని ప్రధాన భాగాన్ని వారే వడపోసుకుంటారు. వారు కూడా సేకరించలేని రేణువులనే వడపోతకు అప్పగిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ.. ఈ ప్రకియ్ర కోసం ముందుగా డబ్బులు చెల్లించి మట్టి, చెత్త సేకరిస్తారు. గుల్జార్హౌజ్–కాలికమాన్ వద్ద ఈ బంగారం, వెండి వడపోత కార్యక్రమం ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగుతుంది. లాల్దర్వాజకు చెందిన విజయ్ కుటుంబం దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురానాపూల్కు చెందిన ప్రెమ్కుమార్ చార్మినార్, కాలికమాన్, గుల్జార్హౌజ్, మామాజుమ్లా పాఠక్, కోకర్వాడి, రికాబ్గంజ్, ఆనంద్గల్లి, ఘాన్జీబజార్ తదితర ప్రాంతాల్లోని ఖార్ఖానాల నుంచి ఈ చెత్తను వడపోస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కోసారి బంగారం దొరికినా, దొరక్కపోయినా నెలవారీ డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే..అణువణువూ గాలించాలి.. వడపోత సమయంలో అణువణువూ జాగ్రత్తగా శోధించాలి. చివరికి అయస్కాంతంతోనూ వేరు చేస్తాం. ఈ పౌడర్ను మళ్లి వేడి చేసి చిన్న ముద్దలాగా తయారు చేస్తాం. ఒక్కో రోజు పావు గ్రాము నుంచి అర గ్రాము వరకూ దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం గ్రాము రూ.7500..అదృష్టం బాగుంటే ఒక గ్రాము జమవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా తులం (10 గ్రాములు) లభిస్తే..దుకాణాల యజమానులు వచ్చి ఇది మాదే అని లాక్కుపోతారు. – ప్రేమ్ కుమార్, పురానాపూల్ -
ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బరుద్దీన్ తో మాట్లాడా: CM Reventh
-
ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాదన్నపేటలో ఓ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలకు తోడుగా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజిన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తుంది. -
Hyderabad: పాత బస్తీలో మెట్రోరైలు పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ వాసుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ల తర్జనభర్జనలు..ప్రభుత్వ నిర్ణయాల అనంతరం ఇక్కడ మెట్రో రైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు చారిత్రక పాతబస్తీలో మెట్రో పనులు మొదలయ్యాయి. మెట్రో రూట్లో రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ లైన్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో పాతబస్తీలో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ పనులను సకాలంలో పూర్తి చేసి మెట్రో నిర్మాణ పనులను పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్మెట్రో రైల్ కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలియజేస్తున్నట్లు హెచ్ఏఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్రెడ్డి చెప్పారు. సుమారు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తుల సేకరణ పనులు వేగవంతమయ్యాయన్నారు. త్వరలో పరిహారం చెల్లింపు... భూసేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గుర్తించిన 1100 ఆస్తులలో 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ను మెట్రోరైల్ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ మేరకు ఆయన వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ వివిద దఫాలుగా విడుదల చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ను కూడా జారీ చేశారు. వాటిలో 200 ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సేకరించిన వాటికి పరిహారం చెల్లించి కూల్చివేతలు చేపట్టనున్నారు. దీంతో మెట్రో రైలు మార్గ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానుకూలంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎండీ వివరించారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన, చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్ధవంతమైన ఇంజినీరింగ్ పరిష్కారాలతో పరిరక్షిస్తుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. పర్యాటకంగా మరింత ఆకర్షణ... మెట్రో రైల్ రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుంది. ఇప్పటికే జాతీ య, అంతర్జాతీయ పర్యాటకులు చార్మినార్ సహా పలు ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు పాతబస్తీని సందర్శించే అవకాశం ఉంది. అటు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి, ఇటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాతబస్తీకి రాకపోకలు సాగించనున్నారు. -
Old City Metro Rail: అనగనగా మెట్రో..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్పై లీ అసోసియేషన్ సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్ మెట్రో భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్ రెడ్డి ఏం చెప్పారంటే.. ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు.. గత ఏడేళ్లలో నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జూబ్లీ బస్టేషన్–ఎంజీబీఎస్ మూడు కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. జాయింట్ వెంచర్.. ⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్లను ఎంపిక చేశాం. ఇది మొత్తం 6 కారిడార్లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్సిటీ మెట్రోకు సర్వే పనులు ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్ వెంచర్. ఈ ప్రాజెక్టు డీపీఆర్ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్లలో చేపట్టనున్న 76.4 కి.మీ. కారిడార్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీపీ వంటి మల్టీ లేటరల్ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. భూసేకరణ వేగవంతం... ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. 3 కోచ్లు.. 35 కి.మీ వేగం.. ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్కు 3 కోచ్లు ఉంటాయి. గంటకు 35 కిలోమీటర్ల సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్ఫాంలు మాత్రం 6 కోచ్లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు. -
కేంద్రం అనుమతిస్తేనే.. మెట్రో రెండో దశకు కదలిక
హైదరాబాద్ మెట్రో రెండో దశకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం అనుమతి తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆమోదం కీలకంగా మారింది. మొదటి దశ ప్రాజెక్టు అనంతరం రెండో దశకు ప్రణాళికలను రూపొందించినప్పటికీ.. ఇప్పటికే తీవ్ర జాప్యం నెలకొంది. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాప్యం కారణంగా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. నగరంలో రెండోదశ ఏడెనిమిదేళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం గమనార్హం. కేబినెట్ ఆమోదంతో ఒక అడుగు ముందుకు పడింది కానీ ఇప్పుడు కేంద్రం అనుమతితో పాటు నిధుల కేటాయింపే కీలకంగా మారింది. 2029 నాటికి పూర్తయ్యే అవకాశం.. భాగ్య నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ అనివార్యంగా మారింది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు తీస్తోంది. నిత్యం సుమారు 5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే 8 లక్షల మంది మెట్రోల్లో పయనించే అవకాశం ఉంది. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు చేపట్టిన మెట్రో మొదటి దశ నిర్మాణానికి రూ.22 వేల కోట్ల వరకు ఖర్చు కాగా, ప్రస్తుత రెండో దశకు రూ.24, 269 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్ను రూపొందించింది. 5 కారిడార్లలో 76.4 కిలో మీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్రం సకాలంలో అనుమతించి నిధులు కేటాయిస్తే 2029 నాటికి రెండో దశ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం జరిగితే ఈప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లనుంది. రానున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆమోదంతో పాటు నిధుల కేటాయింపు తప్పనిసరి.9వ స్థానానికి.. మెట్రో రెండో దశలో ఆలస్యం కారణంగా ఢిల్లీ తర్వాత రెండో స్థాననంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయినట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి పెద్ద నగరాలతో పాటు, పుణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ను అధిగమించాయి. రెండో దశ నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాల్సిన ఎంజీబీఎస్– ఫలక్నుమా మార్గం నిలిచిపోయింది. ప్రస్తుతం దాన్ని రెండో దశలో కలిపి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్!ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం మెట్రో రెండో దశతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా భావించి కార్యాచరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.24.269 కోట్లలో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. మిగతా 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు.5 కారిడార్లలో రెండో దశ..నాగోల్– శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ) రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ (11.6 కి.మీ) ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) మియాపూర్–పటాన్చెరు (13.4కి.మీ) ఎల్బీనగర్–హయత్ నగర్ (7.1 కి.మీ.) -
Nimrah Cafe: సిటీ స్పాట్స్.. సెల్ఫీ షాట్స్
మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్ సిటీ సెల్ఫీ స్పాట్స్గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్కు హాట్స్పాట్స్గా మారాయి..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్ను చూడాలనే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్ సెల్ఫీ స్పాట్గా చార్మినార్ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్ ఒకటి. ఓల్డ్సిటీ షాపింగ్ అంటే లక్షల క్లిక్కులే.. ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్మంటుంటాయి. చింత చెట్టు కింద సెల్ఫీ.. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్గంజ్లోని ఉస్మానియా హాస్పిటల్కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు. ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్లు కూడా సెల్ఫీ స్పాట్లుగా మారాయి. మిడ్ నైట్ స్పాట్.. నిమ్హ్రా చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా ది బెస్ట్ సెల్ఫీ స్పాట్గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇదే కేఫ్లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్పోర్ట్ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ట్రెండ్. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్ తదితర ఫుడ్ స్పాట్లు సెల్ఫీ స్పాట్లుగా మారాయి.మొదటి ‘సెల్ఫీ’.. సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్ వెబ్సైట్లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. -
గిరాకీ బంగారమాయెనే
చార్మినార్: నగరంలో 400 ఏళ్ల కిందట బంగారం వ్యాపారం అంటేనే పాతబస్తీ. నిజాం కాలం నుంచి పాతబస్తీలో కొనసాగుతున్న బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు ప్రస్తుతం కష్టకాలమొచి్చంది. ఇక్కడి వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అసలే బాటిల్ నెక్ రోడ్లు.. దీనికి తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీలో బంగారం వ్యాపారం తగ్గింది. చిన్న వ్యాపారులు రూ.50 లక్షల నుంచి.. పెద్ద పెద్ద షోరూం వ్యాపారులు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఇక్కడి వ్యాపారులకు మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పాతబస్తీలోని దుకాణదారులు తమ వ్యాపారాలను నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాన సమస్య పార్కింగే.. పాతబస్తీలో ద్విచక్ర వాహనాల పార్కింగ్తో పాటు కార్లు, భారీ వాహనాలకు పార్కింగ్ సమస్య, నిత్యం ట్రాఫిక్ రద్దీ పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. వీటిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటు పడుతున్నాయంటున్నారు. పార్కింగ్ అందుబాటులో లేకపోవడమే కాకుండా నిత్యం వాహనాల రద్దీతో పాటు రోడ్లపై నెమ్మదిగా కదిలే వాహనాలు పాతబస్తీలోని బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు అడ్డుగా మారాయి. నిజాం కాలం నుంచి.. ఒకప్పుడు చార్మినార్ పరిసరాల్లో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేసుకోవడానికి నిజాం సర్కార్లో అప్పటి నిజాం స్వయంగా కొంత మందిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. నిజాం కాలం నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్, కాలికమాన్, చార్కమాన్, ఘన్సీబజార్, శాలిబండ, సిద్ధి అంబర్ బజార్ తదితర ప్రాంతాల్లో దాదాపు 300 వరకు దుకాణాలుండేవి. ప్రస్తుతం 50 నుంచి 100 దుకాణాలకు తగ్గిపోయాయి. వీరంతా నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసి ఇవ్వడానికి పనిచేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలి మదీనా నుంచి చార్కమాన్–చార్మినార్ వరకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు ఇటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో పాటు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. – నాగ్నాథ్ మాశెట్టి, గుల్జార్హౌస్/బషీర్బాగ్ -
హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో బ్యాంకును బురిడీ కొట్టించి రూ.175 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు సహకరించారు. జాతీయ బ్యాంక్లో 6 బ్యాంక్ అకౌంట్లను ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వారి ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు సైబర్ కేటుగాళ్లు జరిపారు.హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారు.హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపారు. 600 కంపెనీలకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లు లింక్ చేశారు. సైబర్ నేరగాళ్ల డబ్బులకు ఆశపడి ఆటోడ్రైవర్లు అకౌంట్లు తెరిచారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. -
పాతబస్తీ మెట్రోకు భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్మెంట్ కోసం భూసేకరణకు హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దారుషిఫా నుంచి శాలిబండ వరకు.. మొదటి దశలోని మూడో కారిడార్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను స్వీకరించనున్నారు. ⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్ల కారిడార్తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఈ అలైన్మెంట్ ఉంటుంది. ⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవ్పల్లి మీదుగా ఎయిర్పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు -
పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. భారీగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అయిదు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తోంది. భవనంలో ఉన్నవారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. చుట్టుపక్కలా ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. -
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
-
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
-
HYD: అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి, పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పాతబస్తీలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశనగర్లో సోఫా తయారీ గోదాంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సోఫా తయారీ గోదాం ఉండటంలో మంటలు భవనం పైఅంతస్తులోకి వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలు ఫస్ట్ ఫ్లోర్కు వ్యాపించండంతో భవనంలో నివాసం ఉంటున్న 25 మంది మంటల్లో చిక్కుకుపోయారు.అనంతరం, స్థానికులు మంటలు అర్పే ప్రయత్నం చేయగా కొందరు మంటలను నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్, నాగరాణి దంపతులు, శివప్రియ, హరిణి గాయపడ్డారు. ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ(10) మృతిచెందింది. ఇక, ఘటనలో మరో ఎనిమిదికి గాయాలు కావడంతో వారికి చికిత్స జరుగుతోంది. కాగా, భవనం మొదటి అంతస్తులో సోఫాల తయారీ గోడౌన్ ఉంది. రెండు, మూడు అంతస్తుల్లో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భవనాన్ని మంటలు చుట్టు ముట్టడంతో ఓ వ్యక్తి తప్పించుకునేందుకు పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.భవనం కింద భాగంలో ఫోమ్ మెటిరియల్ నిల్వ ఉంచడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలతో పాటు పొగలు దట్టంగా అలుముకోవడంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో భవనం మొత్తం కాలిపోయింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలు చెలరేగుతూరే ఉన్నాయి. గోడౌన్ యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు. -
పోలీస్ స్టేషన్ లో రీల్స్..
-
Insta Reels: పోలీస్ స్టేషన్ను వదల్లేదు!
హైదరాబాద్, సాక్షి: సోషల్ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ను వదల్లేదు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్స్టా రీల్ చేశాడు. పీఎస్ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్గ్రౌండ్లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad's Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024 -
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం..కత్తితో ప్రేమోన్మాది దాడి
-
అందుకే శ్రావ్యపై మణికంఠ దాడి: ఛత్రినాక ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని.. మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమెను వెంబడించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది. ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు శ్రావ్య స్వస్థలం వరంగల్. పదిహేనేళ్ల కిందట నగరానికి వచ్చిందామె. దాడికి పాల్పడ్డ నిందితుడు మణికంఠకు శ్రావ్యకు దూరపు బంధువు. ఇదిలా ఉంటే.. శ్రావ్యకు 2019లో వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఆ పిటిషన్ నడుస్తోంది. ఈ క్రమంలో.. మణికంఠ శ్రావ్యకు దగ్గరయ్యాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. విడాకుల వ్యవహారం తేలేంత వరకు ఆగమని శ్రావ్య అతన్ని కోరింది. ఆపై తల్లితో కలిసి ఎస్ఆర్టి కాలనీకి నివాసం మార్చిందామె. ఈలోపు.. శ్రావ్య గత కొంతకాలం మణిని దూరం పెడుతూ వచ్చింది. అయితే మరొకరితో చనువుగా ఉంటోందని మణికంఠ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. దీంతో మణికంఠ కోపం పెంచుకున్నాడు. ఈ ఉదయం జిమ్కు వెళ్లి వస్తున్న శ్రావ్యను ఫాలో అయ్యాడు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య ఫోన్ కాల్లో ఉంది. దీంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్ తో ఆమెపై దాడి చేశాడు. దీంతో శ్రావ్య ఛాతి భాగం, మొహంపై గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు నిందితుడు మణికంఠను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందడంతో శ్రావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగింది అని ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
400 సీట్లలో బీజేపీ గెలవాలి.. అందులో హైదరాబాద్ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లోనూ విజయపథంలో తీసుకువెళ్తున్న నరేంద్ర మోదీని మూడో సారి ప్రధానిని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత గెలుపు కోసం బుధవారం రాత్రి పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలవాలని, అందులో హైదరాబాద్ సీటు తప్పనిసరిగా ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రజా కార్లు హైదరాబాద్ను ఏలుతున్నారనీ, ఈ సారి బీజేపీకి మంచి అవకాశం ఉందని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గెలుపుతో ఈ రజాకార్ల పాలన నుంచి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న అమిత్షా తాము అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేయా లని పిలుపునిచ్చారు. అప్పుడే హైదరాబాద్ ప్రజలను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. అప్పటికే సమయం రాత్రి పదిగంటలవడంతో అమిత్షా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. ముందుగా మాధవీలత మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ, ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో ఈసారి తప్పకుండా పాతబస్తీలో బీజేపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఇక్కడ అణిచివేతకు గురవుతున్న ప్రజలందరిలోని ఆవేశం ఓటు కింద మారాలని పిలుపునిచ్చారు. మహంకాళీ అమ్మవారికి అమిత్ షా పూజలు బుధవారం రాత్రి 9.24 గంటలకు అమిత్షా లాల్దర్వాజా మహంకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి ఐదు నిమిషాల పాటు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివాదం చేస్తూ..విజయ సంకేతం చూపుతూ.. పూజల అనంతరం అమిత్ షా 9.31 గంటలకు ప్రచార ర థం ఎక్కి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ..లాల్ దర్వాజా నుంచి వెంకట్రావ్ స్కూల్, లాల్ దర్వాజ్ మోడ్, సుధా టాకీస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోలో కమలనాధులు కదం తొక్కారు. వందేమాతరం...భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు అమిత్షాపై పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయన ఒక చేత్తో విజయ సంకేతం, మరో చేత్తో కమలం పువ్వును చూపిస్తూ ముందుకు సాగారు. సుమారు 25 నిమిషాల పాటు ఓపెన్టాప్ జీప్పై నిలబడి రోడ్ షో నిర్వహించారు. యాకుత్పుర, చాంద్రా యణగుట్ట, చార్మినార్, బహదుర్పుర, మలక్పేట్, ఘోషామహల్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఈ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాజ్పేయి తర్వాత.. షానేపాతబస్తీలో బీజేపీ అభ్యర్థుల తరపున గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి ప్రచారం చేయగా, ఆ తర్వాత దేశ హోంశాఖామంత్రి హోదాలో అమిత్షా ఇక్కడికి రావడం విశేషం. ఎంఐఎంకు కంచుకోటలా ఉన్న పాతబస్తీలో అమిత్షా రోడ్ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణులోŠల్ జోష్ నింపింది. కాగా, అమిత్షాకు పలువురు ముస్లింలు మర్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలకడం విశేషం. ఇక నిన్న మొన్నటి వరకు ఎడమొఖం.. పెడముఖంగా ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి ప్రచారం నిర్వహించడం గమనార్హం. -
HYD: గన్తో కాల్చుకుని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ రివాల్వర్తో కాల్పుకుని ఆర్ఎస్ఐ బాలేశ్వర్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాగా, బాలేశ్వర్ నాగర్ కర్నూల్కు చెందిన వ్యక్తి అని తెలిసింది. వివరాల ప్రకారం.. అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్ఎస్పీ రిజర్వ్ ఎస్ఐగా కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆదివారం ఉదయం తన సర్వీర్ రివాల్వర్తో తనను తానే కాల్చుకుని బాలేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. బాలేశ్వర్ మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామన్నారు. -
పాతబస్తీపై ఫోకస్!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. 2050 విజన్తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్నుమా ఫారూక్నగర్లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్లో ఎక్కడెక్కడో మెట్రోరైల్ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్బీనగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే.. మెట్రోరైల్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా. చంచల్గూడ జైలును తరలిస్తాం చంచల్గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్క్వార్టర్స్ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. డ్రోన్ సర్వే... ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది. ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నుమా స్టేషన్లు ఉంటాయి. -
HYD: కిడ్నాప్నకు గురైన పాప సేఫ్..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్లో జహీరాబాద్లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్ చేసిన మహిళను సహనాజ్ఖాన్గా గుర్తించారు. బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ మహిళ జహీరాబాద్లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్కు అప్పగించారు. -
పాతబస్తీలో 9నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం
-
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
పాతబస్తీ: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా గతంలోనూ షానవాజ్ ఇంట్లో ఐటీ దాడులు చేసింది. అయితే ఆ సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. తాజాగా ఆయన్ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. -
ఓల్డ్ సీటీలో ఎంఐఎం నేతలు అరెస్ట్
-
పాతబస్తీ బడా వ్యాపారులు టార్గెట్ గా ఐటీ సోదలు
-
పాతబస్తీలో బడా వ్యాపారులే టార్గెట్గా ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కింగ్స్ గ్రూప్ ఓనర్ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటి అధికారుల దాడులు చేపట్టారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాడ్యుర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్పై ఐటీ సోదాలు జరుపుతున్నారు. హోటల్ యజమాని శేఖర్ గౌడ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి కాగా.. యజమాని ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు మరుతాయని ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం. చదవండి: సోనియా దీవిస్తే సీఎం అవుతా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
అర్థరాత్రి ఓల్డ్ సిటీలో సందడి చేసిన మంత్రి కేటీఆర్
-
నా భార్య తల నరికేస్తామన్నారు
కరీంనగర్టౌన్: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఏయ్ బండి సంజయ్.. పాతబస్తీలో సభ పెట్టాలనే ఆలోచన విరమించుకోకుంటే నీ భార్య తల నరికి నీకు గిఫ్ట్గా ఇస్తాం. నీ ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేస్తాం..’అంటూ బెదిరించారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది’అని సంజయ్ పేర్కొ న్నారు. ఆదివారం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్స్లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా తాను గెలిచానంటే అది కార్యకర్తలతోనేనని అన్నారు. ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ అంతా తిరిగి పేదల పక్షాన పోరాడానని, ఫాంహౌస్కు పరి మితమైన కేసీఆర్ను ధర్నా చౌక్కు గుంజుకొచ్చానని పేర్కొ న్నారు. కాగా, ధర్మం కోసమే పోరాడే మరో నాయకుడు రాజాసింగ్ ఏడాదిపాటు బీజేపీకి దూరమైనా.. చంపుతామని కొందరు బెదిరించినా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదని సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్. విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు వాయిదా
సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్ 1వ) తేదీన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. -
పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. ఇద్దరు అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టారు అధికారులు. ఐఎస్ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తమిళనాడులో కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలో వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్ సానుభూతి పరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్లోని పాతబస్తీ, మలక్పేట, టోలీచౌకీ సహా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక, హైదరాబాద్లో నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. 2022లో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్కు సంబంధించి ఎన్ఐఏ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #WATCH | NIA conducts raids at 30 locations in both Tamil Nadu and Telangana in ISIS Radicalization and Recruitment case. The raids are underway in 21 locations in Coimbatore, 3 locations in Chennai, 5 locations in Hyderabad/Cyberabad, and 1 location in Tenkasi. (Visuals from… pic.twitter.com/KcCiO7SZ6u — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు -
హైదరాబాద్లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం ఒక్క రోజే రెండు హత్యలు వెలుగు చూశాయి. పటాన్చెరు పరిధిలోని ఇస్నాపూర్ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన నదీమ్ అహ్మద్(27)గా గుర్తించారు. టోలిచౌకిలో నివసిస్తున్న నదీమ్.. సంగారెడ్డిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్నాపూర్ వద్ద గొడవ జరగడంతో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు కొసి చంపినట్లు తేలింది. .మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్ అహ్మద్గా గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం జహీరాబాద్లో జరిగిన విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహమ్మద్ నిందితుడిగా ఉన్నాడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా ఏడుగురు నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం -
HYD: కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకులు హల్చల్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. హైస్పీడ్లో దూసుకెళ్లారు. ఈ క్రమంలో కిలోమీటర్ మేర వాహనాలను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. వివరాల ప్రకారం.. మీర్చౌక్లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. హైస్పీడ్లో కారు నడుపుతూ వాహనాలకు ఢీకొడుతూ ముందుకు సాగారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం, స్థానికులు కారును వెంబడించి వాహనాన్ని ఆపి యువకులకు దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇది కూడా చదవండి: ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి -
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహిళకు షాకిచ్చిన బ్యూటీపార్లర్
-
పాతబస్తీలో అంబారీపై ఊరేగిన అమ్మవారు (ఫొటోలు)
-
లాల్దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్లో లాల్దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని -
హైదరాబాద్లో లాల్దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ‘‘రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు మాజీ క్రికెటర్ మిథాలిరాజ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటున్నాయి. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
Hyderabad Bonalu: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహదూర్పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాల్పుల కలకలం
-
ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే ఎలా పెరిగాయి?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్గా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, బండి సంజయ్ బుధవారం కరీంనగర్లో టీటీడీ ఆలయ భూమిపూజకు హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అంటకాగే పార్టీ ఎంఐఎం. పాతబస్తీని ఎందుకు ఎంఐఎం అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయి. దమ్ముంటే ఎంఐఎం అన్ని చోట్లా పోటీ చేయాలి. డిపాజిట్ కూడా రాదు. నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకుల మాటలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందనడం హాస్యాస్పదమన్నారు. మేము అడిగిన ఒక్క పని కూడా బీఆర్ఎస్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్లో పొలిటికల్ పంచాయితీ.. -
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
-
కేసీఆర్ హింసించే పులకేశి: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఉగ్రనేత ఒవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడు. టెర్రరిస్టులకు సపోర్టు చేస్తానని గతంలో ఒవైసీ ప్రకటించారు. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజ్లిస్ ఆశ్రయమిస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్లో పట్టుబడ్డారు. ఐఎస్ఐ లాంటి సంస్థలకు పాతబస్తీలో షెల్టర్ ఇస్తున్నారు. అధికారం కాపాడుకోవాలనే తప్ప.. దేశ భద్రతపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు. అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకైక లక్ష్యం అధికారమే. శాంతిభద్రతలపై ఒక్క సమీక్ష కూడా కేసీఆర్ చేయడం లేదు. ఉగ్రవాదుల కదలికలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలి. భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ హింసించే పులకేశి. మేం సర్జికల్ స్టైక్ చేస్తామని చాలా మంది ఓవర్గా మాట్లాడారు. అందులో ట్విట్టర్ టిల్లు కూడా ఉన్నారు. ఓట్ల కోసమే అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీఎం కేసీఆర్ సలహాదారుగా తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం బెదిరిస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సోమేష్ కుమార్ను నియమించి అందుకే..’ -
సమస్యల వలయంలో దారుల్ షిఫా ఫుట్ బాల్ గ్రౌండ్
-
రంజాన్ కి ముస్తాబవుతున్న పాతబస్తి మీర్ ఆలం ఈద్గా
-
పాతబస్తిలో దారుణం
-
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్చైర్లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
హైదరాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
-
Hyderabad: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: మీర్చౌక్ ఏసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున పాతబస్తీ ఎతేబార్చౌక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు యువకులు ఓపెన్ టాప్ కారులో ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ అడ్డుకుని దానిని ఆపడానికి కారు ముందుకు వెళ్లాడు. దీనిని గమనించిన విధి నిర్వహణలో మీర్చౌక్ ఎస్సై వెంటనే స్పందించి తన పౌచ్లో ఉన్న గన్ను చేతిలోకి తీసుకుని కారు కిందకు దిగండి అంటూ బిగ్గరగా ఆరిచాడు. దీంతో ఎస్సై చేతిలో గన్ను చూసిన కారులోని యువకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్సై ఆవేశంతో ఆగ్రహంగా గన్తో యువకుల వద్దకు చేరుకోవడాన్ని చూసిన వాహనదారులు కొద్దిసేపు నిర్ఘాంత పోయారు. దీంతో సదరు యువకులు కారు దిగి తనిఖీలకు పూర్తిగా సహకరించారు. డిక్కీతో పాటు వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాతబస్తీలో ఓ ఎస్సై గన్ చూపించి సినిమా ఫక్కీలో హల్చల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాతబస్తీలో ఇప్పటి వరకు ఓ ఎస్సై గన్ చూపించి తనిఖీలు నిర్వహించిన సందర్భం, సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ జరగలేదు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ శబ్ధ కాలుష్యానికి పాల్పడిన వాహన యజమానికి మీర్చౌక్ పోలీసులు ఫైన్ విధించి పంపించారు. How can SI take out his service revolver gun to stop vehicle during cheking in mirchowk old city ? @CPHydCity @DCPSZHyd sir kindly take action on this... On small small issues a police officer can't take out his firearm @TelanganaDGP pic.twitter.com/SPWBZKphTk — Mohammed Inayath ulla sharief (@InayathShafi) December 27, 2022 చేతిలో వెపన్ తప్పులేదు: డీసీపీ సాయి చైతన్య వాస్తవానికి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించేటప్పుడు చేతిలో వెపన్లతో సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఎస్సై స్థాయి అధికారి వాహనాల తనిఖీల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ వెపన్ చేతిలోనే ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: కేసీఆర్ ఫాంహౌస్ సినిమా అట్టర్ఫ్లాప్) -
Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తుండగా.. పాతబస్తీలో ఇంకా పనులను కూడా ప్రారంభించకపోవడంపై నిరాశకు గురవుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మెట్రో పనులు పూర్తయ్యి ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. పాతబస్తీలో మెట్రో రైలు పనుల ఊసే లేదు. ఇటీవల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నూతనంగా నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన సైతం చేశారు. దీంతో ఇప్పట్లో పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరి»ౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్నుమా వరకు 6 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. మెట్రో రైలు పనులను ప్రారంభించడానికి ఒక దశలో ముందుకు వచ్చిన ప్రాజెక్టు అధికారులు అంచనా వ్యయం పెరిగిందని వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి పాతబస్తీలో మెట్రో రైలు పనుల కోసం రూ.500 కోట్ల నిధులను మంజూరు చేయించామని పేర్కొంటూ వెంటనే పనులు ప్రారంభించాలని రెండు నెలల క్రితం మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎండీని కలిసి కోరారు. అయినా.. పాతబస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాలేదు. ట్విటర్లో పోస్టుచేసి మరచిన కేటీఆర్.. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని గతేడాది మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను మరిచిపోయాడని పాతబస్తీ ప్రజలు అంటున్నారు. గతంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం అసెంబ్లీలో పాతబస్తీ మెట్రో రైలు ప్రస్తావన తెచ్చి.. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో పాతబస్తీ ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018లో అలైన్మెంట్ను పరిశీలించిన మెట్రో ఎండీ, ఎమ్మెల్యేలు.. 2018 ఆగస్టు 25న పాతబస్తీలో మెట్రో రైలు అలైన్మెంట్ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్) నుంచి ఫలక్నుమా వరకు మెట్రోరైలు పనులను చేపట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారుల బృందం పరిశీలించింది. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు ప్రారంభిస్తామని అధికారులు, ఎమ్మెల్యేలు అప్పట్లో తేల్చి చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. -
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
Hyderabad: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం.. వీడియోకాల్లో..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం జరిగింది. ప్రేయసితో వీడియోకాల్ మాట్లాడుతూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి పెళ్లికి దూరమవుతోందన్న బెంగతో మహ్మద్ తబ్రేజ్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనే వీరిరువురి వివాహం నిశ్చయమైంది. అయితే రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. దీంతో యువతితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?) -
పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ భార్య మృతి) -
మత్తిచ్చి.. రెండ్రోజులపాటు కీచకపర్వం!
డబీర్పురా: హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి సమీపంలోని ఓ మందుల షాప్కు వెళ్లిన మైనర్ బాలిక (14)ను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఏకంగా రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఉదంతాన్ని మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డబీర్పురా పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీర్చౌక్ ఏసీపీ ప్రసాద్రావు... డబీర్పురా ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు, ఎస్సైలతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. డబీర్పురా ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14) తొమ్మిదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి కాస్త అస్వస్థతకు గురికావడంతో మందులు తీసుకొచ్చేందుకు ఇంటి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో రెయిన్బజార్ షా కాలనీకి చెందిన సయ్యద్ నైమత్ అహ్మద్ (26), సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీ (20) క్వాలిస్ కారు (ఏపీ28 డీబీ 2729)లో అక్కడకు చేరుకున్నారు. సయ్యద్ రవిష్ స్కూల్ డ్రాపవుట్ కాగా సయ్యద్ నైమత్ సౌదీ అరేబియాలో కళ్లద్దాల దుకాణం నిర్వహిస్తూ ఇటీవలే నగరానికి వచ్చాడు. రవిష్ బాలికకు పరిచయస్తుడే. వారు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించుకొని తొలుత నాంపల్లిలోని సృజన ఇన్ లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం బాలికకు కూల్డ్రింక్లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మర్నాడు త్రీ క్యాజిల్స్ డీలక్స్ లాడ్జికి తరలించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి 12న అర్ధరాత్రి దాటాక డబీర్పురా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ నెల 14న బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు.. బాలిక తమ వద్దే ఉందని చెప్పి ఆమెను చాదర్ఘాట్–ఎంజీబీఎస్ నాలా వద్ద విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న డబీర్పురా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల ఫోన్ నంబర్ ఆధారంగా సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీలను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కిడ్నాప్, గ్యాంగ్రేప్ కేసులతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీల గదుల నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా, తమ కుమార్తె చేతిపై ఇంజక్షన్లు ఇచ్చిన గుర్తులు ఉన్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. -
పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేశాడో భర్త. రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న భార్యపై క్షుద్రపూజలు చేయించాడు. అయితే స్ధానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. పూజల స్థావరంపై దాడిచేసి దొంగ బాబాను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
మజ్లీస్కోటలో పాగా వేసేది ఎవరు? అక్బరుద్దీన్తో పోటీ అంత కఠినమా?
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు మారుతాయా? మజ్లీస్కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్కు దూరమైన కాంగ్రెస్ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్అభ్యర్థులు బరిలో దిగుతారా? కమలదళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్ హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేతలు. చార్మినార్, యాకుత్పుర , చంద్రాయణ గుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పుర, మలక్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మరో పార్టీ గెలవాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా తమ బలాన్ని చూపాలని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . నాంపల్లిలో టీఆర్ఎస్ నుంచి ఎవరంటే! నాంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపి నుంచి దేవర కరుణాకర్ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. చార్మినార్లో టీఆర్ఎస్ నుంచి లోధి చార్మినార్నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఉమా మహేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్నుంచి మహ్మద్ సలాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి టీ పిసీసీ సెక్రటరి షేక్ ముజబ్, బీజేపి నుంచి ఉమా మహేంద్రలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చాంద్రాయణ గుట్టలో అది అసాధ్యమా? చాంద్రాయణ గుట్ట సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది సయ్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది. హజరి, యూసఫ్లలో ఒకరు పోటీలో పక్కా! కార్వాన్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది అమర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది కౌసర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి కౌసర్, బీజేపి నుంచి అమర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అల్ హజరి, అప్సర్ యూసఫ్ జాహిలలో ఓకరు పోటీ చేసే అవకాశం ఉది. (చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్) సంతోష్ కుమార్కు మరో అవకాశం? మలక్ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బలాల 30 వేల మెజారిటితో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బలాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోకర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? యాకుత్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్అభ్యర్ది సామ సుందర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుందర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు . బహదూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం బహదూర్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బక్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బక్రీ , కాంగ్రెస్నుంచి కలీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు పెద్దగా ఆశలు లేనప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మజ్లిస్ను పాతబస్తికే పరిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాత బస్తిలో బోణీ కోట్టాలనే పట్టుదలనుకూడా ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రనగర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాతబస్తీ రాజకీయం రసకందాయంలో పడింది. (చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’) -
మరో వీడియో విడుదల చేసిన రాజాసింగ్.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండోసారి అరెస్ట్కు ముందు ఆయన స్పందిస్తూ.. వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: రాజాసింగ్కు ఊహించని షాక్.. ఇలా జరిగిందేంటి? ‘‘నేను మహ్మద్ ప్రవక్త గురించి వీడియోలో మాట్లాడానని కొందరు ఆరోపిస్తున్నారు. నేను వీడియోలో ఎక్కడా మహ్మద్ ప్రవక్త పేరును ప్రస్తావించలేదు. పాతబస్తీలో ఒవైసీ మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా తల నరుకుతామని నినాదాలు చేస్తున్నారు’’ అని రాజాసింగ్ అన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేసినవారిపై ఎన్ని కేసులు పెట్టారు అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. నన్ను ఇవాళ రాత్రి, లేదా తెల్లవారుజామున అరెస్ట్ చేస్తారనే సమాచారం అందింది. పాత కేసుల్లో అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. -
Hyderabad: పరేషాన్లో పాతబస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్!
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం వారం, పదిరోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతి రోజూ నగరానికి సంబంధించిన విషయాలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు పహారా పెంచడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఆంక్షలు విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకసారి ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఎలా ఇస్తారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్ను దగ్దం చేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు నడుమ రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. ఉత్కంఠతో మొదలై.. ప్రశాంతంగా ముగిసిన మునావర్ షో ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తత, అరెస్టుల నడుమ మునావర్ ఫారూఖీ ఆగస్టు 20న హైదరాబాద్లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీహెచ్పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఒకటి తర్వాత మరొకటి నగరంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కె.కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతల అరెస్టులు జరుగుతుండగానే... ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదల వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీనిపై పెద్ద స్థాయిలో నిరసనలు, కేసులు, అరెస్టు తదితరాలతో నగరం రణరంగంగా మారింది. దీనికితోడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోమవారం బీజేపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు, అరెస్టులపై బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి వరకు ఆందోళనలకు దిగాయి. ఇది సద్దుమణగక ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్గా మారింది. దీంతో నగర వ్యాప్తంగా నిరసనలు జరగడంతో పాటు ఆందోళనకారులు బషీర్బాగ్ పాత కమిషనరేట్ వద్దే ఆందోళనకు దిగారు. ఆపై రాజాసింగ్పై వరుస ఫిర్యాదులు, కేసుల నమోదు మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్కు సంబంధించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ సందర్శన సైతం రద్దయింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా నగరంలోని అనేక సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా అన్నట్లు మంగళవారం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. పాత కమిషనరేట్ వద్ద నిరసన ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ పక్క బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఆందోళనకారులు బషీర్బాగ్కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ వద్దకు వచ్చారు. రాజాసింగ్ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే అక్కడకు వచ్చిన ప్రత్యేక బలగాలు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నాయి. కేసుల మీద కేసులు రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ దక్షిణ మండలంలోని డబీర్పుర ఠాణాలో మొదటి కేసు నమోదైంది. ఆపై మంగళ్హాట్, షాహినాయత్గంజ్, బాలానగర్ సహా ఆరు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. 10 నిమిషాల 27 సెకన్ల నిడివితో ఉన్న రాజాసింగ్ వీడియోకు సంబంధించి మంగళ్హాట్ ఠాణాలో ఐపీసీలోని 153–ఎ, 295–ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉద్రిక్తత మధ్య అరెస్టు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ధూల్పేట్లోని రాజాసింగ్ ఇంటికి మంగళ్హాట్ పోలీసులతో పాటు నగర టాస్క్ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. వీరిని రాజాసింగ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, రాజాసింగ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. తన వీడియో రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నారు. అతికష్టమ్మీద రాజాసింగ్ను అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. నేరుగా బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ వద్ద నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మంగళవారం ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ నెలలో నూపుర్ శర్మ ఉదంతంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, రాజాసింగ్ వీడియోను బీజేపీ సీరియస్గా తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసే క్రమంలో ఎమ్మెల్యేపై చర్యలకు దిగింది. కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనల అనంతరం.. పోలీసుల వినతిని తిరస్కరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్ను మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. రాజాసింగ్ కోర్టులో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేకమంది కోర్టు వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ పరిసరాల్లోని చిరు వ్యాపారులతో దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. వదంతులు నమ్మొద్దు ‘రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశాము. చర్యలు తీసుకున్నాము. ఈ కేసులో ఓ లీగల్ అడ్వైజర్ను ఏర్పాటు చేశాం. ఎవరూ వదంతులు నమ్మవద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా సెన్సిటివ్ ఏరియాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను పెట్టాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు అనీ విజ్ఞప్తి చేస్తున్నాము. పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. పాతబస్తీ అంత కూడా ప్రశాంతంగా ఉంది. పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయి' అని సౌత్జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. దూసుకొచ్చిన ఆందోళనకారులు శాలిబండ చౌరస్తాలో రాజా సింగ్కు వ్యతిరేకంగా బుధవారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకారులు దూసుకొచ్చారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. నిరసన తెలుపుతూ శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమూహాన్ని శాలిబండ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పాతబస్తీలో హైటెన్షన్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాలిబండ, మొగల్పూర ఘటనలపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇప్పటికే మతపెద్దలతోనూ చర్చించారు. మరోసారి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ రివ్యూ పాతబస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7గంటలలోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్తో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాతబస్తీలో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. పలుచోట్ల పెట్రోల్ బంక్లు బంద్ చేయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్మార్చ్ నిర్వహించింది. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. -
పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు. చదవండి: ‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’ తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున గులాబీ పార్టీ కొందరు సిటింగ్లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది. -
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్కు బెయిల్ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొఘల్పురాలో పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ నుంచి గోషామహల్కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్ను అరెస్ట్ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్ కుటుంబమే లక్ష్యం?! -
హైదరాబాద్: ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం
-
హైదరాబాద్ యువకుల అనైతిక సంబంధం.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే..!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అయితే వీరిద్దరిలో ఒకరు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువకుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శాలిబండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిబండకు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో అతనికి మొఘల్పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో యువకులు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. 10 లక్షల ఆర్థిక సాయం అనంతరం శాలింబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు పీకల్లోడుతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిపులకు గురిచేశాడు. చదవండి: హైదరాబాద్లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం అప్పట్లో మొఘల్పురా పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వకపోవడంతో మొఘల్పురా వ్యక్తి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేగాక అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నైట్ బజార్.. ఫుల్ హుషార్.
చార్మినార్: పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో నిత్యం సందడి కనిపిస్తోంది. వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. రంజాన్ మాసంలోని చివరి ఘట్టమైన జుమ్మత్ ఉల్ విదా పూర్తి కావడంతో ముస్లింలు ఇక ఈద్–ఉల్–ఫితర్ పండగ కోసం సిద్ధమవుతున్నారు. పండగకు ఇంకా ఒకరోజే మిగిలి ఉండటంతో పాతబస్తీలో ఎటుచూసినా రంజాన్ పండగ సంతోషం కనిపిస్తోంది. నైట్ బజార్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2–3 గంటల వరకు కూడా కొనసాగుతోంది. (చదవండి: ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! ) -
బహదూర్పురా ఫ్లై ఓవర్ ప్రారంభం.. జూపార్కు టూరిస్టులకు ఇక సాఫీ ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: నగరం కోర్సిటీ వైపు నుంచి శంషాబాద్ విమానాశ్రయం, మహబూబ్నగర్ జిల్లా వైపు (పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే మీదుగా కాకుండా) రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగించేలా పాతబస్తీలో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్పురా ఫ్లైఓవర్ను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం ప్రారంభించారు. బహదూర్పురా జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్తో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి, జూపార్కు సందర్శించే టూరిస్టులకు సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని నిర్మించారు. ఫ్లై ఓవర్తోపాటు మీరాలం ట్యాంక్ వద్ద మ్యూజికల్ ఫౌంటెన్, ముర్గీచౌక్, మీరాలంమండి, సర్దార్ మహల్ ఆధునికీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటితోపాటు కార్వాన్ నియోజకవర్గంలో మూడు ప్రాంతాల్లో రూ.297 కోట్ల విలువైన సివరేజి పనులకు, కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల అంచనా వ్యయం దాదాపు రూ. 500 కోట్లు. బహదూర్పురా ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం: రూ. 69 కోట్లు పొడవు: 690 మీటర్లు వెడల్పు: 24 మీటర్లు క్యారేజ్వే: రెండు వైపులా(ఒక్కోవైపు 3లేన్లు) ► ప్రాజెక్టులో భాగంగా జరిపిన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ తదితరాలు కలిపితే మొత్తం వ్యయం రూ.108 కోట్లు. ► ట్రాఫిక్ చిక్కులు తప్పడంతోపాటు ప్రయాణ సమయం, వాహన.. ధ్వని కాలుష్యం, ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం వంటివి తగ్గుతాయి. ► ఫ్లై ఓవర్ కింద పచ్చదనం ప్రజలకు ఆహ్లాదం కలిగించనుంది. ► క్రాష్బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్ తదితర పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించినట్లు, పాతబస్తీలో ఈ టెక్నాలజీ వాడటం దీనితోనే ప్రారంభించినట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ దత్తుపంత్ తెలిపారు. పాతబస్తీలో పనులు.. కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పాత బస్తీలోనూ పలు పనులు చేపట్టారు. పాతబస్తీ వైపు ప్రయాణించే వారికి ఇప్పటికే ఏపీజీ అబ్దుల్కలాం ఫ్లై ఓవర్, బైరామల్గూడ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడం తెలిసిందే. కొత్తగా చేపట్టినవి.. ముర్గీచౌక్ (మహబూబ్చౌక్) ఆధునికీకరణ వ్యయం : రూ. 36 కోట్లు. మాంసం మార్కెట్గా పేరుగాంచిన ముర్గీచౌక్ కాంప్లెక్స్ను సంప్రదాయ డిజైన్ను మార్చకుండా అదనపు అంతస్తుతో ఆధునికీకరించనున్నారు. ప్లాజా ఎంట్రెన్స్ వరకు లైటింగ్, బెంచీలు, పచ్చదనం వంటివాటితో నవీకరించనున్నారు. ప్రదేశం చరిత్రను కాపాడుతూనే నగరీకరణకు అనుగుణంగా మార్చనున్నారు. మీరాలం మండి.. వ్యయం: రూ.21.90 కోట్లు అతి పెద్ద, పురాతన మీరాలం మండిని విక్రేతలకు తగిన ప్లాట్ఫారాలు, షెడ్లు, అంతర్గత రోడ్లు, నడక దారులు వంటి వాటితోపాటు ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆధునికీకరించనున్నారు. ఈ మార్కెట్లో 43 హోల్సేల్దుకాణాలతోపాటు దాదాపు 300 మంది విక్రేతలు ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నారు. సర్దార్మహల్.. వ్యయం : రూ. 30 కోట్లు వారసత్వ భవనమైన సర్దార్మహల్ను 1900 సంవత్సరంలో నిర్మించారు. శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ, ఆధునికీకరణలతో పాటు సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. మీరాలంట్యాంక్ మ్యూజికల్ ఫౌంటెన్.. వ్యయం: రూ. 2.55 కోట్లు జూపార్కు సందర్శకులకు మరో ఆకర్షణగా దగ్గర్లోనే ఉన్న మీరాలంట్యాంక్ వద్ద వినియోగంలోకి రానున్న మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ప్రత్యేక రంగుల లైటింగ్, మ్యూజిక్లతో పర్యాటకులను ఆకట్టుకోనుంది. ప్రతిరోజు సాయంత్రం 15 నిమిషాల వ్యవధితో రెండు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎస్సార్డీపీతో.. జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు వంటి పనులకు ప్రత్యేకంగా ఎస్సార్డీపీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఎస్సార్డీపీ మొదటిదశలో చేపట్టిన 47 నుల్లో దాదాపు 30 పూర్తయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వాటిలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లున్నాయి. మ్యూజికల్ ఫౌంటెన్.. డ్యాన్సింగ్ అదిరెన్ నగరవాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందజేసే అద్భుతమైన మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెన్ మంగళవారం ప్రారంభమైంది.పాతబస్తీ వాసులతో పాటు జూపార్కు సందర్శనకు వచ్చే పర్యాటకులకు దీంతో ఎంతగానో ఆహ్లాదం కలగనుంది. ఈ ఫౌంటెన్ ఒక వినూత్నమైన అనుభవాన్ని అందజేయనుంది. రంగు రంగుల హరివిల్లులతో మ్యూజికల్ ఫౌంటెన్ ఒకేసారి సంగీతాన్ని, డ్యాన్సింగ్ ఎఫెక్ట్ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థ ఆధునిక సాంకేతికత, సంగీతాలను మేళవించుకొని పని చేసేవిధంగా సాఫ్ట్వేర్ను రూపొందించారు. -
అర్థరాత్రి చార్మినార్లో సందడి చేసిన రాజమౌళి.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ చార్మినార్లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇంత సింపుల్గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్లో షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
హల్చల్ చేసిన పాతబస్తీ కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: భోలక్పూర్ కార్పొరేటర్ వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యునాని ఆస్పత్రి దగ్గర పార్కింగ్ విషయంలో సదరు కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫిర్యాదు అందిందని ఎస్సై సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కార్పొరేటర్ మాత్రం తగ్గలేదు. ఎస్సై మాటలు పట్టించుకోకుండా.. గట్టిగట్టిగా అరుస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్సైపై చిందులు తొక్కాడు. ఎస్ఐకి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. దమ్కీ ఇచ్చిన కార్పొరేటర్.. పత్తర్గట్టీ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రిగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భోలక్పూర్ కార్పొరేటర్ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం, ఆపై పోలీసులు కార్పొరేటర్పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కామెంట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్ ట్విటర్ ట్యాగులను జత చేసి మరీ ట్వీట్ చేశారు. Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK — Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022 -
హైదరాబాద్లో ఐసిస్ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సులేమాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్నుమా పరిధిలోని రైతు బజార్లో కొంతకాలంగా నివాసముంటున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా 2020లోనే పహాడీషరీఫ్లో సులేమాన్కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తరువాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతకాలం సైలెంట్గా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సోషల్ మీడియా వేదికగా సులేమాన్ ఏకంగా 20 ఖాతాలను తెరిచి యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నాడని పోలీసులు తేల్చారు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చదవండి: యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ -
తగ్గేదేలే.. అంతా మా ఇష్టం..
సాక్షి,చార్మినార్(హైదరాబాద్): పాతబస్తీలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతబస్తీలోని దక్షిణ మండలంలో చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, బహదూర్పురా నాలుగు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో రెండు, మూడు జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు వాహనాల రాకపోకలు జోరుగా కొనసాగుతాయి. అయితే కొంత మంది వాహనదారులు నిబంధనలు డోంట్ కేర్ అంటూ.. వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఉన్నా.. వారు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన కూడళ్లలో ఆశించిన మేరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడం, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఉండాల్సినప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ► అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లలో సైతం యువతీ, యువకులు రయ్.. మంటూ దూసుకెళ్తూ ఇతర వాహనదారులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. నంబర్ ప్లేట్ల మార్పులు.. ► పాతబస్తీలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చేస్తున్నారు. ► కొందరైతే ఉద్దేశపూర్వకంగా తమ నంబర్ ప్లేట్లను కనిపించకుండా సగం వరకు వంచేయడం, ఇంకొందరు విరగ్గొట్టడం, ప్లాస్టర్లు అతికించడం వంటివి చేస్తూ ఆర్టీఏ, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. (చదవండి: మరమ్మతు చేస్తుండగా కరెంట్ సరఫరా ) ప్రమాదాలు కొని తెచ్చుకునేలా.. ► అసలే ఇరుకు రోడ్లు.. ఆపై రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో స్పీడ్గా వాహనాలను నడపడానికి పాతబస్తీలో ఏ మాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు కుర్రాళ్లు రెట్టింపు ఉత్సాహంతో స్పీడ్గా ముందుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల బారీ నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు కలిగించరాదంటూ అవగాహన కల్పిస్తామన్నారు. పాతబస్తీలో కూడా ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, దక్షిణ మండలం -
తన వద్దకు రావొద్దంటూ.. ఆస్పత్రి భవనంపై నుంచి దూకిన బాలింత
సాక్షి, హైదరాబాద్: ప్రసూతి కోసం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన ఓ బాలింత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చార్మినార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన సంపూర్ణ(33) గత నెల 26వ తేదీన ప్రసవం కోసం పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. 29వ తేదీన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒక బాలుడు, ఒక బాలిక జన్మించగా ఇరువురు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళ ప్రసవించిన అనంతరం రెండు, మూడు రోజులుగా నిద్రలేని సమస్యతో ఏదో ఆలోచనతో బాధపడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. గురువారం ఆమె భర్త సంపూర్ణను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మానసిక ఒత్తిడితో ఉన్న ఆమె భర్తను చూసి మరింత ఒత్తిడికి గురై ఆసుపత్రి ఆవరణలోనే గట్టిగా ఆరుస్తూ తన వద్దకు రావొద్దంటూ.. వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గట్టిగా అరుస్తూ ప్రధాన గేటు వైపు నుంచి మొదటి అంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పటికే పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు ఆమె దూకడాన్ని గమనించి అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాపాడారు. స్వల్ప గాయాలకు గురైన ఆమెను ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, భర్తపై కోపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి -
పాతబస్తీలో పోలీసుల అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉత్తర ప్రదేశ్లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఓల్డ్ సిటీలో క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు కలగకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఇందుకోసం ఏకంగా 7వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత వార్త: ఒవైసీ కారుపై దుండగుల కాల్పులు.. ఒకరి అరెస్టు.. పిస్తోల్ స్వాధీనం -
‘అవ్వ’ హోటల్.. రూ. 25కే మీల్స్.. ఎక్కడో తెలుసా?
‘అవ్వ కావాలా.. బువ్వ కావాలా ఏదో ఒకటి ఎంచుకోమనే పదాన్ని సర్వసాధారణంగా క్లిష్ట సమస్యలొచ్చినప్పుడు వాడుతుంటాం.. కాకపోతే కర్నూలు నగర పాతబస్తీలో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. తన హోటల్లో సన్న బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కర్రి, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోంది. బయటి హోటళ్లలో మీల్స్ రూ. 60 నుంచి రూ. 90లకు విక్రయిస్తున్న ఈ కాలంలో అవ్వ వద్ద రూ.25ల ధరకే లభిస్తుండటం విశేషం. ఆశ్చర్యం వేస్తోంది కదూ! ఇది వాస్తవం. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె ఇలాంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇప్పటినుంచి కాదు.. ఓ పదహైదేళ్ల నుంచి! అలాగని ఆమె గొప్ప ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఓ సామాన్యురాలే. ఆకలిబాధేమిటో ఆకలిగొన్నవారికే తెలుస్తుందనే అనుభవాన్ని ఆమె స్వయంగా చవిచూసింది. భర్త మరణంతో తెలిసొచ్చిన ఆకలిబాధ.. ఈ అవ్వ పేరు కురువ లక్ష్మీదేవి. ఈమె భర్త కె.తిప్పన్న. సేంద్రీయ ఎరువుల వ్యాపారం చేసేవాడు. పశువుల పేడను ఆర్డరిచ్చిన రైతుల చేన్లకు లారీలో తరలించేవాడు. వీరిరువురికి యాభైఐదు ఏళ్ల క్రితం వివాహం అయింది. ఓ ఐదేళ్లకు కుమారుడు (కె.మద్దయ్య) పుట్టాడు. పెళ్లి చేసుకున్న పదేళ్లూ ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. విధి వక్రించడంతో ఆమెకు భర్త వియోగం కలిగింది. అప్పటినుంచి ఆ కుటుంబానికి అధోగతి పట్టింది. అప్పట్లో బుధవారపేట బ్రిడ్జీ స్థానంలో హంద్రీ నదిలో గచ్చు (ఇసుక, సున్నం, నీరు కలిపిన మిశ్రమం) గానుగలు ఉండేవి. ఇంటిగోడల నిర్మాణానికి, ప్లాస్టిరింగ్కు గచ్చునే వాడేవారు. అవ్వ మారెమ్మ గానుగలో పని కుదుర్చుకుంది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి రూ.50 మాత్రమే లభించేది. పెద్దపడఖానాలోని తన ఇరుకింటిలోనే జీవనం గడిపేది. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి పది పైసలు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్ పడిపోయింది. ఈమె ఉపాధి కోల్పోయింది. బొంగుల బజార్లోని జైనమందిరంలో నెలకు రూ. 900ల చొప్పున పని కుదుర్చుకుంది. అక్కడ పదహైదేళ్లు పనిచేస్తే జైనమత పెద్దలు జీతాన్ని రూ. 1500లకు పెంచారు.1994లో కుమారుడికి నగరానికే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది. హమాలీల ఆకలిబాధలు కలచివేశాయి.. అవ్వ మండీబజార్లో రూ.600తో ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కుమారుని సాయంతో మొదట ఉగ్గాని, బజ్జి వంటి టిఫిన్ పదార్థాలను విక్రయిస్తుండేది. మండీబజార్కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది. పప్పు వాసనకొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. మధ్యాహ్నం పూట వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదోరీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే సన్నబియ్యంతో అన్నం తయారు చేసి రూ. 10కే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రాసాగారు. అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించింది. నష్టం కలిగించిన వరద.. 2009లో నగరానికి వరదలు వచ్చాయి. వరద ప్రభావంతో నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, బ్యాళ్లు వంటివి పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను రూ. 15కు పెంచారు. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి షిఫ్ట్ అయ్యారు. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు.హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన బాటసారులు, నిరుపేదలు అందరు రాసాగారు. ఆమె అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది. భోజన సరఫరా వేళలను పెంచుతూ ఈ ప్రక్రియను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. బియ్యం ధర కేజీ రూ. 50 ఉండే ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ రూ.25కే భోజనం వడ్డిస్తుండటం గమనార్హం. రైతుబజార్ రైతులకూ ఉపయోగకరమే.. నగరంలోని సీక్యాంప్ రైతుబజార్కు కూరగాయలు తెచ్చే గ్రామీణ రైతులు తెల్లవారు జామునే సరుకులతో బయలుదేరి వస్తారు. వారు చద్దిమూట తెచ్చుకున్నా పాచిపోతుంటుంది. ఇక్కడ అవ్వ హోటల్ ఉందనే విషయం తెలుసుకుని వారూ ఉపయోగించుకుంటున్నారు. పేద సాదలే కాకుండా ఒకసారి రుచి చూసిన వారు మళ్లీమళ్లీ వస్తున్నారు. సేవతో సంతృప్తి: కురువ లక్ష్మీదేవి (అవ్వ) కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట నిజం. మేం కుటుంబ సభ్యులంతా కలిసి అన్నం పెట్టే మహాయజ్ఙాన్ని నడిపిస్తున్నాం. మేమే స్వయంగా నిర్వహించుకుంటాం కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. బ్యాళ్లు, నూనె వంటి ఇతర వస్తువులను కూడా టోకులో కొంటున్నాం. లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో (అంటే తక్కువ లాభంతో) పనిచేస్తున్నాం. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించినందుకు నాకు, మా కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్ చేసుకున్నా ఇంట్లో ఉండలేకపోయా. నా పేరుతోనే హోటల్ నడుస్తుంది – కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా. పడిదెంపాడు నుంచి వచ్చా: నాగరాజు, రైతు నేను పండించిన కూరగాయలను పడిదెంపాడు నుంచి తెచ్చా. నేను, నా భార్య ఉదయం నుంచి సాయంత్రం దాకా సీక్యాంప్ రైతుబజార్లో కూరగాయలు విక్రయించుకుని ఊరికి వెళుతుంటాం. మేం తెచ్చే కూరగాయలపై వచ్చే లాభం అంతంత మాత్రమే. హోటల్ భోజనం తినేంత స్థోమత ఉండదు. రోజూ మధ్యాహ్నం అవ్వ హోటల్కు వచ్చి తింటా. నా భార్యకు పార్సిల్ తీసుకెళతా. గోకులపాడు నుంచి వచ్చా: మద్దిలేటి, హమాలీ ఇక్కడ మండీబజార్లో హమాలీ పని చేయడానికి నేను ఎ.గోకులపాడు గ్రామం నుంచి వచ్చా. హమాలీ కార్మికుల ఒప్పందం ప్రకారం మాకు 24 గంటల షిఫ్ట్ ఉంటుంది. ఇరవైనాలుగు గంటల కాల వ్యవధిలో మూడుసార్లు తినాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజనం మాత్రం అవ్వ వద్ద తిని. మిగతా వేళల్లో టిఫిన్లతో గడుపుతుంటా. గొందిపర్ల నుంచి వచ్చా: రాజు, హమాలీ నేను హమాలీ పనిచేస్తుంటా. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే లారీల లోడ్ దింపడం, ఎక్కించడం నా పని. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి వస్తా. భోజనం తెచ్చుకుంటే చెడిపోద్ది. అవ్వ హోటల్ నాకు వరం. రూ.25 ఇచ్చి కడుపునిండా భోజనం చేస్తాను. ఇలాంటి హోటల్ లేకపోయింటే మా లాంటి పేదలు ఎనభై రూపాయలు చెల్లించుకోలేక పస్తులుండాల్సి వచ్చేది. -
హైదరాబాద్లో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బహదూర్పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ దారి మళ్లింపు కొనసాగుతుందని సంబందిత ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్యంసీ ప్రాజెక్ట్ విభాగం ఇంజినీరింగ్ అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్ ఆంక్షలపై ఆదేశాలు జారీ చేయగా..ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సైతం ఆదేశాలు జారీ చేశారు. గతకొంత కాలంగా బహదూర్పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ►అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ►ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాలపై 90 రోజుల పాటు ఆంక్షలు విధించనున్నారు. ►ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ►తొంబై రోజుల పాటు వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. ►కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతించడం లేదని...లైట్ మోటార్ వెహికిల్స్ను యధావిధిగా అనుమతించనున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ►ఆరాంఘర్ చౌరస్తా నుంచి బహదూర్పురా ద్వారా పురానాపూల్ చేరుకునే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ►బెంగుళూర్ హై వే కావడంతో ఈ రోడ్డులో టీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ►వీటికి తోడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలు నడుస్తుంటాయి. ►భారీ వాహనాలు బహదూర్పురా చౌరస్తా మీదుగా కాకుండా మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, మహబూబ్నగర్ క్రాస్ రోడ్డు, చాంద్రాయణగుట్ట, డీఎంఆర్ఎల్, మిధాని, ఐ.ఎస్.సదన్, సైదాబాద్, చంచల్గూడ ద్వారా నల్గొండ క్రాస్ రోడ్డుకు చేరుకునేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) ►కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎప్పటి లాగే పురానాపూల్ నుంచి ఆరాంఘర్ చేరుకోవచ్చు. ►పాతబస్తీలో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు ఆరాంఘర్ వెళ్లడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ►ఆయా వాహనాలు దారుషిపా, పురానీహవేలీ, బీబీబజార్ చౌరస్తా,షంషీర్గంజ్,ఫలక్నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి,చాంద్రాయణగుట్ట చౌరస్తా ద్వారా ఆరాంఘర్ చేరుకోవడానికి వీలుంటుందన్నారు. ►మరో మార్గమైన నల్లొండ క్రాస్ రోడ్డు ద్వారా ఆరాంఘర్ వెళ్లాల్సి ఉంటుందంటున్నారు. ►90 రోజుల పాటు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ►ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పురానాపూల్ నుంచి ఆరాంఘర్ వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ►బహదూర్పురా చౌరస్తా వద్ద జరిగే మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణ పనుల సందర్భంగా అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని ట్రాఫిక్ డీసీపీ... ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. -
పాతబస్తీపై ప్రత్యేక దృష్టి.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాటేలా..
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఎన్నెన్నో చారిత్రక కట్టడాలకు పునర్వైభవం కల్పించి హైదరాబాద్ నగర కీర్తిసిగలో వాటి ప్రాధాన్యత చెక్కు చెదరకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందించినప్పటికీ, పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటిని త్వరితంగా పూర్తిచేసేందుకు పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తున్న కులీకుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)కి పలు పనులు అప్పగించారు. వాటిని త్వరితంగా పూర్తిచేయడం ద్వారా పాతబస్తీలోని కట్టడాలు.. ముఖ్యంగా వారసత్వ కట్టడాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు త్వరితంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదవండి: ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్ తద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు పాతబస్తీకి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చినట్లవుతోందని అభిప్రాయపడుతోంది. అంతేకాదు.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వాటిని పునరుద్ధరించి, ఆధునీకరించడం ద్వారా పర్యాటకంగానూ ప్రజలను ఆకట్టుకోవచ్చుననేది ఆలోచన. ట్యాంక్బండ్ మీద విజయవంతమైన ఫన్డే–సన్డే కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద కూడా చేపట్టడంతో సాధించిన విజయంతో పాతబస్తీలోని అన్ని ప్రముఖ ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. చదవండి: ఫ్రెంచ్ తెలుగు భాష పరిశోధకుడితో కేటీఆర్ భేటీ పాతబస్తీ అభివృద్ధి, పర్యాటక ఆకర్షణలుగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, అవి పూర్తికాలేదు.ఆపనులు జీహెచ్ఎంసీ, తదితర సంస్థల పర్యవేక్షణ లో జరుగుతుండటంతో జీహెచ్ఎంసీలోనే పనుల ఒత్తిడి, తదితర కార్యక్రమాలతో పాతబస్తీ పనులు కుంటుపడుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. అంతేకాకుండా పాతబస్తీ కేంద్రంగా ఉన్న పాతబస్తీలోని ప్రజల మౌలిక సదుపాయాలు, పాతబస్తీ అభివృద్ధి పట్టించుకోవాల్సిన కుడాకు చేతినిండా పనిలేకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధిశాఖ కొన్ని ముఖ్యమైన పనులను జీహెచ్ఎంసీ నుంచి కుడాకు బదిలీ చేసింది. అంతేకాదు వాటిని దగ్గరుండి పూర్తిచేసేందుకు అవసరమైన ఇంజినీర్లు, ఇతరత్రా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్ మీద కుడాకు పంపించాల్సిందిగా ఆదేశించడంతో జీహెచ్ఎంసీ ఆమేరకు చర్యలు చేపట్టింది. సదరు పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల్ని సైతం జీహెచ్ఎంసీ బడ్జెట్నుంచి ఖర్చు చేస్తారు. ఇలా నిధులు, విధులు నిర్వహించే సిబ్బందిని కేటాయించడం ద్వారా పాతబస్తీలోని వారసత్వ, కళాత్మక భవనాలను, మార్కెట్లను వినూత్నంగా తీర్చిదిద్దనున్నారు. ఇవీ పనులు.. పాతబస్తీ ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, హౌసింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన కుడాకు విద్య, వినోదం, మార్కెట్ సదుపాయాల కల్పనవంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నామ్కేవాస్తేగా మారిన కుడాకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు, పాతబస్తీ అభివృద్ధి,సుందరీకరణపనులు త్వరితంగా చేసేందుకు దిగువ పనుల్ని అప్పగించారు. ► పాతబస్తీలోని వారసత్వ భవనాల పరిరక్షణ, పునరుద్ధరణ. ► పూర్తికావాల్సిన చార్మినార్ పాదచారుల పథకంలో మిగిలిన పనులు ► లాడ్బజార్ పాదచారుల పథకం ► సర్దార్మహల్ పునరుద్ధరణ, అభివృద్ధి, మ్యూజియం ఏర్పాటు ► మీరాలంమండి, ముర్గీచౌక్ ఆధునీకరణ, అభివృద్ధి పనులు ► మీరాలం చెరువు పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి డిప్యుటేషన్పై అధికారులు పనులు పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు బాధ్యతలప్పగించారు. వీరిలో కొందరిని జీహెచ్ఎంసీ నుంచి డిప్యుటేషన్ మీద కుడాకు బదిలీ చేశారు. కొందరికి జీహెచ్ఎంసీ బాధ్యతలతోపాటు అదనంగా కుడా పరిధిలోని పనుల బాధ్యతలు అప్పగించారు. -
ముస్లీం మతపెద్దలతో వైఎస్ షర్మిల సమావేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం ఓల్డ్ సిటీలోని మదర్స దరూల్ ఉలూమ్ రహ్మనియా తలాబ్ కట్ట వద్ద జమియతే ఉలేమయే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి ఘయస్ రహమాని సహబ్ని, జనరల్ సెక్రటరీ ముఫ్తి జుబేర్ ఖాస్మి సహబ్తో సమావేశమయ్యారు. వీరితో పాటు అన్ని జిల్లాల మత పెద్దల ఈ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ సయ్యద్ ముజ్తాబా అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ మహ్మద్ ఆయూబ్ఖాన్, యూత్ కోఆర్డినేటర్ సయ్యద్ అజీమ్ మొహియోద్దీన్, భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ మహ్మద్ అథర్, యూత్ స్టేట్ ఈసీ మెంబర్ అర్బాజ్ ఖాన్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’ -
ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. పాతబస్తీ అభివృద్ధికి ఏడేళ్లలో రూ. 14,887 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 3, 934 కోట్లు మాత్రమేనని అన్నారు. సోమవారం శాసనసభలో పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న విపక్ష నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క,, రాజాసింగ్తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాత నగరంలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి గతంలో ఎన్నడూ లేదన్నారు. చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా? పాత బస్తీ అభివృద్ధికి జీహెచ్ఎంసీ ద్వారా రూ. 9,899 కోట్లు,, వాటర్బోర్డు ద్వారా రూ. 3,784 కోట్లు కాగా, ఇతర ఐదు శాఖల నుంచి మరో 1,193 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. హైదరాబాద్ విస్తరించుకుంటూ పోతుందని, పాత నగరం 102 చదరపు కిలోమీటర్ల పరిధి ఉండగా, ప్రస్తుతం అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం 675 చ.కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. పెరిగిన హైదరాబాద్తో పాటు పాత నగరాన్ని కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద పాతబస్తీ రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 456 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లు తెలిపారు. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టు (సీఆర్ఎంపీ) కింద 154 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 118 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీ ల కింద ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అదనంగా రెగ్యులర్ రోడ్డు ఇంప్రూవ్మెంటు కింద మరో రూ. 63 కోట్లతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న రోడ్లకు భూసేకరణ కోసమే రూ. 494 కోట్లు ఖర్చు చేశామన్నారు. కొత్తగా 9 రహదారులను కూడా విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.మూసీ నది మీద 14 కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించామని, త్వరలో ఈ పనులు మొదలవుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది! నాలాల అభివృద్ధి పనులు గత సంవత్సరం వచ్చిన వరదలతో మూసీ వల్ల భవిష్యత్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా రూ. 19.30 కోట్లతో నిర్మించనున్నట్లు చెప్పారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ) కింద చార్మినార్ చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సర్ధార్ మహల్ అభివృద్ధి, కిల్వత్ దగ్గర మల్టీ లెవల్ పార్కింగ్ , లాడ్ బజార్కు మెరుగులు వంటి పనులు చేయాల్సి ఉందన్నారు. నాలాల అభివృద్ధి పనులు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) కింద చేపట్టినట్లు చెప్పారు. 10 కిలోమీటర్ల మురికినాలను విస్తరించే పథకం కింద ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల మేర 3వేల ఆక్రమణలను తొలగించామని, మరో 2 కిలోమీటర్ల విస్తరణ మిగిలి ఉందన్నారు. చదవండి: Telangana Assembly: ప్రతీకార రాజకీయాలను నమ్మం.. ప్రస్తుతం రూ. 242 కోట్లతో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు నడుస్తుందన్నారు. మొదటి దశలో రూ. 858 కోట్లు సిటీలో ఇందుకోసం వెచ్చిస్తుండగా, పాతబస్తీకే రూ. 261 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాతబస్తీలో నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం కింద పాతబస్తీలో 38,4/99 మంది స్ట్రీట్ వెండర్స్ను గుర్తించామని, వీరందరికి రూ. 10 వేల చొప్పున కేంద్రం రుణం ఇస్తుందని అన్నారు. వైద్యం, విద్యకు సంబంధించి ఎంతో చేశామని, బస్తీ దవాఖానాల ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచి్చనట్లు చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా పాతబస్తీలో ఆసుపత్రులలో ప్రసవాలు 68 శాతం పెరిగిందని అన్నారు. ఓల్డ్సిటీకి మెట్రో వస్తుంది... పాతబస్తీకి మెట్రోను తీసుకురావడంలో జరిగిన ఆలస్యానికి కోవిడ్ విజృంభన కారణమని మంత్రి కేటీఆర్ చెప్పారు. పాతబస్తీలో మెట్రోకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధ్యక్షతన ఓ కమిటీ వేశారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. త్వరలోనే మెట్రో పాతబస్తీలో పరుగులు పెడుతుందన్నారు. కుతుబ్షాహీ టూంబ్స్కు ప్రపంచ గుర్తింపు రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని , అదే తరహాలో హైదరాబాద్ నగరానికి కూడా ఓ అంతర్జాతీయ గుర్తింపు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కుతుబ్షాహీలకు చెందిన ఏడు సమాధులకు కూడా ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేందుకు , తద్వారా పర్యాటకంగా హైదరాబాద్ను ఉన్నత స్థితికి తీసుకురానున్నట్లు చెప్పారు. విపక్ష ఎమ్మెల్యే ఉన్నా... ములుగును జిల్లా చేశాం.. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కారు గుర్తు ఎమ్మెల్యేనా... కార్వాన్ ఎమ్మెల్యేనా అని చూడడం లేదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా కేంద్రం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా... ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగును జిల్లా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. -
Luqma Kitchen: ‘సింగిల్’ క్వీన్స్ సాధించిన సక్సెస్
బిజినెస్ అంటే వందల కోట్ల డబ్బులు సంపాదించడం కాదు... చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తేవడం, ఉపాధి కల్పించి సమాజంలో సంపదను సృష్టించడం. అందుకే వ్యాపార వర్గాలకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాయి. అయితే ఇక్కడ ఏ కార్పోరేట్ సంస్థ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం నుంచి సహాకారం అందలేదు. అయినా సరే చీకటి నిండిన జీవితాల్లో వెలుగు వచ్చాయి. ► పాతబస్తీకి చెందిన సలేహాకు ముగ్గురు పిల్లలు. ఉన్నట్టుండి భర్త విడాకులు ఇచ్చేశాడు. కనీసం భరణం కూడా ఇవ్వలేదు. అక్షర జ్ఞానం అసలే లేదు. ముగ్గురు పిల్లల పోషణకు టైలరింగ్ చేసినా అది కుటుంబ పోషణకు సరిపోలేదు. తన చేతి వంట బాగుంటదనే పేరు తప్ప ఆమెకంటే ప్రత్యేకతలు ఏమీ లేవు. ► భర్త చనిపోవడంతో ఉన్న కొడుకుతో పాటు అత్తమామలను బాగోగులు యాభై ఏళ్ల బదరున్సీసాపై పడ్డాయి. స్థానికంగా చిన్న హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఓ రోజు ఆ హోటల్లో దొంగతనం జరగడంతో.. అప్పులపాలై తిరిగి హోటల్ నిర్వహించలేని స్థితికి చేరుకుంది. సలేహా, బదరున్నీసా లాంటి మరో పదిమూడు మంది మహిళలది ఇంచుమించు ఇలాంటి కథలే. అందరి జీవితాల్లో కామన్ పాయింట్స్.. తోడుండాల్సిన భర్త అండగా లేకపోవడం, నిత్యం నరకం చూపించే భర్త నుంచి విడిపోవడం. మరోవైపు తిండికి బట్టకు విద్యకు తమపైనే ఆధారపడ్డ కుటుంబాలు. ఉమ్మడి శక్తి ఒంటరి మహిళ అంటే బలహీనం, కానీ అలాంటి ఒంటరి మహిళలు ఐక్యంగా మారితే, తమలో ఉన్న స్కిల్కి పదును పెడితే, దానికి వ్యాపార మెలకువలను అద్దితే వారి జీవితాల్లో వెలుగు నిండటమే కాదు, మరికొందరి కష్టాలు తీర్చేందుకు సైతం ఉపయోగపడింది. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ ఒంటరి మహిళల ఉమ్మడి శక్తికి ప్రతిరూపమే లుక్మా కిచెన్. లుక్మా అంటే నోరూరించే అనే తెలుగు పదానికి ఉర్థులో సమానార్థం వస్తుంది. సఫా సహకారంతో హైదరాబాద్లో పాతబస్తీలో పని చేసే సఫా ఎన్జీవో సంస్థ చేపట్టిన వివిధ కార్యకర్రమాల్లో సలేహా, బదరున్నీసా వంటి ఒంటరి మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. భర్త తోడుగా లేకపోయినా ఒంటరిగా కష్టాలు పడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఎంత కష్టం చేసిన వచ్చే ప్రతిఫలం అంతంతే. ఇలాంటి ఒంటరి మహిళలకు సఫా చేయూతను అందించి వారందరికి బ్యూటీషియన్, టైలరింగ్లలో శిక్షణ ఇచ్చారు. కమ్యూనిటీ కిచెన్ సఫా శిక్షణ కేంద్రంలో చాలా మంది తాము టైలరింగ్ , బ్యూటీషియన్ కోర్సులు చేయలేమని కాకపోతే చాలా బాగా వంట చేస్తామని చెప్పారు. ఇలా రుచికరమైన వంటలు చేసే వారికి ఒక్క తాటిపైకి తెచ్చి లుక్మా పేరుతో కమ్యూనిటీ కిచెన్ని 2019లో ప్రారంభించారు. ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఫోన్లోనే ఆర్డర్లు తీసుకుంటూ వ్యాపారం మొదలుపెట్టారు. కోవిడ్తో కోలుకున్నారు లుక్మా కిచెన్ ప్రారంభమైనా ఆర్డర్లు అంతంత మాత్రమే. తమ జీవితాలు వెలుగు నిండే రోజే లేదా అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా సంక్షోభం తలెత్తింది. హోటళ్లు మూతపడ్డాయి, బయట తిండి దొరకని పరిస్థితి, మరోవైపు పొట్ట చేతబట్టుకుని సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులు. ఈ విపత్కర పరిస్థితులు కొడిగట్టిపోతున్న లుక్మా కిచెన్కి ఊపిరి అందించింది. వలస కార్మికులకు భోజనం అందించేందుకు సిద్ధపడిన ఎన్జీవోలు, దాతలు లుక్మాను సంప్రదించారు. అలా చేతి నిండా పని దొరికింది. వారి వంటల గురించి నలుగురికి తెలిసింది. ఇంటి వంట సాధారణ హోటల్ ఫుడ్కు భిన్నంగా ఇంటి తరహా వంటలు అందివ్వడమే లుక్మాను ప్రత్యేకంగా నిలబెట్టింది. లుక్మా నుంచి ఫుడ్ కావాలంటే ఒక రోజు ముందుగానే ఆర్డర్ బుక్ చేసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆర్డర్ ప్రకారం పూర్తిగా ఇంటి తరహా పద్దతిలోనే వంటలు తయారు చేసి డెలివరీ ఇస్తారు. లుక్మాకు వచ్చే ఆర్డర్లలో ఎక్కువగా కిట్టీ పార్టీలు, బర్త్ డే, వెడ్డింగ్డే, గెట్ టూ గెదర్కి సంబంధించిన ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటి ఫుడ్ మాత్రమే కావాలనుకునే వారి నుంచి సైతం ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. లుక్మా స్పెషల్స్ లుక్మా కిచెన్లో హైదరాబాద్ స్పెషల్ వంటకాలైన ఖట్టీదాల్, బగార్ ఏ బైగన్, దమ్ కా కీమా, దాల్చా, ఆచారి చికెన్, తలావా ఘోష్, ఖుబూలీ, దస్తీరోటీ, మిర్చీకా సలాన్, షమీ కబాబ్, చికెన్ కట్లెట్స్, గిలే ఏ ఫిర్దౌస్, ఖుబాని కా మీఠా, డబుల్ కా మీఠా తదిరత రుచికరమైన వంటకాలు లభిస్తాయి. గాడిన పడ్డ బతుకులు ఒకప్పుడు టైలరింగ్ ఇతర చేతి వృత్తి పనులు చేసుకుంటూ నెలకు కేవలం రూ.5000 సంపాదించడమే వారికి చాలా కష్టంగా ఉండేది. లుక్మా వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత కడుపు నిండా తిండే కాదు వాళ్లింట్లో పిల్లల చదువులకు సైతం ఇబ్బంది లేని స్థితికి చేరుకున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ లుక్మా కిచెన్తో ఒకప్పటి తమ కష్టాలు తీరిపోయాయి ఇక రిలాక్స్ అవుదామనే ఆలోచనలో లేదు లుక్మా టీం. తమ వ్యాపారంలో వచ్చిన డబ్బులో సగం రా మెటీరియల్కు ఇచ్చేయగా, మిగిలిన దాంట్లో ముప్పై శాతాన్ని తమ వేతనంగా తీసుకుంటున్నారు. మిగిలిన 20 శాతాన్ని వ్యాపార విస్తరణ కోసం సేవ్ చేస్తున్నారు. ఇప్పటికే లుక్మా కిచెన్ నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. న్యూ సిటీకి వచ్చేస్తాం లుక్మా కిచెన్ ఓల్డ్ సిటీలో ఉన్నప్పటికీ ఆర్డర్లు ఎక్కువగా న్యూ సిటీ నుంచే వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల గచ్చిబౌలీలో కొలువైన ఐటీ ఎంప్లాయిస్ సైతం లుక్మా టేస్ట్కి ఫిదా అయిపోతున్నారు. అక్కడి నుంచి కూడా స్పెషల్ డేస్కి ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీంతో న్యూ సిటీలో రెండో బ్రాంచ్ ప్రారంభానికి రెడీ అవుతోంది లుక్మా టీం. అవకాశాన్ని అంది పుచ్చుకుని వ్యాపారం, స్టార్టప్లు ప్రారంభించాలంటే మంచి కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్య, లక్షల కొద్ది పెట్టుబడి అక్కర్లేదు. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న వారైనా సరై తమకున్న నైపుణ్యానికే కొంచెం ఓర్పు, మరికొంత నేర్పు జత చేస్తే చాలని నిరూపించారు. అక్షర జ్ఞానం లేకున్నా సరే సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి ఫోన్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించి కమ్మని వంటలు అందిస్తున్నారు. తమ కుటుంబ కష్టాలను గట్టెక్కించారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి : వర్కింగ్ విమెన్: మీకోసమే ఈ డ్రెస్సింగ్ స్టైల్ -
అన్నతో ఎంగేజ్మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్తో జల్పల్లి న్యూ బాబానగర్కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్లో జలాలుద్దీన్ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే షాహిన్కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పాతబస్తీలో ముజ్ర పార్టీ.. వీడియోలు లీక్
సాక్షి, హైదరాబాద్: ఒక పెళ్లి రిసెప్షన్లో ఏర్పాటు చేసిన ముజ్ర పార్టీ వీడియోలు లీక్ చేశాడనే కారణంతో ఫొటోగ్రాఫర్పై దాడి చేసిన ఘటన పాతబస్తీలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి రిసెప్షన్లో నజీర్ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. వీడియోలు బయటకు రావడంతో ఫొటోగ్రాఫర్పై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. దీంతో ఫొటోగ్రాఫర్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నజీర్, షేక్ సలాం, అబ్దుల్ రజాక్, ఫైజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
స్ట్రీట్ఫైట్: ఆ వ్యక్తి ప్రాణాలను తీసింది
హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్కు, ప్రత్యర్థులైన అజీబ్, ముజీబ్, కమ్రాన్లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: అత్తారింట్లో గొడవ: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో -
కరోనా.. పాతబస్తీలో క్యా కర్నా..!
చార్మినార్/గోల్కొండ: పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులతో పాటు స్థానికులు కోవిడ్ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. కరోనా వైరస్ భయం పర్యాటకుల్లో ఎక్కడా కనిపించడం లేదు. చాలా వరకు భౌతిక దూరంతో పాటు మాస్క్లు కూడా ధరించడం లేదు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు వినియోగ దారులతో కళకళలాడుతున్నాయి. వ్యాపారులు కూడా కరోనా జాగ్రత్తలు పాటించడం లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ► కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుందనే సమాచారంతో కొంత మంది భయాందోళనలు వ్యక్తం చేస్తుండగా...మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ► ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ► సందర్శకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, జూపార్కు తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ► దీంతో ఆయా పర్యాటక ప్రాంతాల వద్ద సందర్శకుల రద్దీ పెరుగుతోంది. ► చిరు వ్యాపారాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనల అమలు శూన్యం... గోల్కొండ: ప్రధాన మార్కెట్లలో కోవిడ్–19 నిబంధనలు అమలు కావడం లేదు. కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మెహిదీపట్నంలోని రైతుబజార్తో పాటు గుడిమల్కాపూర్లో కూరగాయల మార్కెట్, ఇంద్రారెడ్డి పూల మార్కెట్లో మచ్చుకు ఒక్క కోవిడ్–19 నిబంధన కూడా అమలు కావడం లేదు. మెహిదీపట్నంలోని రైతుబజార్కు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తున్నారు. అలాగే గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్కు కూడా పూలు, కూరయగాలు పండించే రైతులతో పాటు కమీషన్ ఏజెంట్లు, చిల్లర వ్యాపారాలు వస్తుంటారు. ► ప్రధాన మార్కెట్లలో మాత్రం అధికారులు కోవిడ్–19 నిబంధనలను అమలు చేయడం లేదు. ► గతంలో గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో పలువురు వ్యాపారులు కరోనా పాజిటివ్ బారినపడ్డారు. ► అయితే మార్కెట్ పాలక మండలి వారు మార్కెట్ను శానిటైజ్ చేసి మార్కెట్ కార్యాలయం వద్ద సెల్ఫ్ శానిటైజర్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ► అదే విధంగా మెహిదీపట్నం రైతుబజార్లో కూడా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ► సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రైతుబజార్లో వేల మంది కొనుగోలుదారులు ఉంటారు. ► రైతుబజార్కు ఉన్న రెండు గేట్లు వద్ద కూడా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ ఏర్పాట్లు లేవు. ► గేట్ల వద్దే అనుమతులు లేని కూరగాయలు, పండ్ల స్టాళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. ► విశాలమైన గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో కూడా కోవిడ్–19 అమలు కావడం లేదు. ► రాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ఇక్కడ హోల్ సేల్ వ్యాపారం జరుగుతుంది. ► కమీషన్ ఏజెంట్లు, రైతులు, కూలీలు వేల సంఖ్యలో ఉంటారు. ► కూరగాయల రిటెయిల్ మార్కెట్లు సైతం వందల స్టాళ్లు ఉన్నాయి. ► ఉదయం నుంచి రాత్రి వరకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. ► అదే విధంగా ఇంద్రారెడ్డి పూల మార్కెట్లో కూడా నిబంధనలు అమలు కావడం లేదు. ► కూరగాయల స్టాళ్లు, అందులో పనిచేసే సిబ్బంది, పూల రైతులు, రిటైల్ కొనుగోలుదారులు, రిటైల్ అమ్మకందారులు ఇలా మార్కెట్లో అర్ధరాత్రి వేల సంఖ్యలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. (చదవండి: ఏందీ కిరికిరి: ఒకటి పాజిటివ్.. మరొకటి నెగిటివ్) వ్యాపారులకు కరోనా పరీక్షలు తప్పసరి చేయాలి.. ప్రధాన మార్కెట్లోని వ్యాపారులకు కరోనా నిర్ధారణ టెస్టులు తప్పనిసరి చేయాలి. వ్యాపారులు సైతం పరీక్షలు చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి. –జి. ప్రహ్లాద్, గుడిమల్కాపూర్ -
పాతబస్తీ: వెంటాడి వేటాడి దారుణంగా..
చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో శుక్రవారం సాయంత్రం రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ను వెంటాడి వేటాడి హత్య చేశారు. ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ తెలిపిన మేరకు.. మైలార్దేవ్పల్లి ముస్తఫానగర్కు చెందిన అశ్రఫ్ కుమారుడు మహ్మద్ జాబేర్ (26) డెకరేషన్ పని చేస్తుంటాడు. నేరాలకు పాల్పడుతుండడంతో ఇతనిపై మైలార్దేవ్పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గతేడాది కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీషీటర్ షానూర్ ఖాజీ హత్య కేసులో ఇతడు ఏ–5గా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సిగరెట్ తాగేందుకు సిటీ ప్లాజా ఫంక్షన్హాల్ వద్దకు వచ్చాడు. ఈ సమయంలో నలుగురైదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో దాడి చేస్తారని గ్రహించిన జాబేర్ అక్కడినుంచి పరిగెత్తాడు. అయినప్పటికీ వదలకుండా నిందితులు అతన్ని అర కిలోమీటర్ మేర వెంటాడి కత్తులు, కోడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్, మైలార్దేవ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన స్థలం సరిహద్దులో ఉండడంతో ఫలక్నుమా, మైలార్దేవ్పల్లి పోలీసులు చాలా సేపటి వరకు తేల్చుకోలేకపోయారు. చివరకు ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షానూర్ ఖాజీ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య?
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. చిన్న పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఒక మహిళ 3ఏళ్ల బాలుడిని భవనం పైనుంచి కిందకు విసిరేసి హతమార్చింది. వివరాలు.. పాతబస్తీ పరిధిలోని భవాని నగర్కు చెందిన ఆయేషాకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.ఈ నేపథ్యంలో మంగళవారం తన మేనల్లుడిని ఇంటికి తీసుకువచ్చింది. కాసేపటికే ఆ బాలుడిని భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు విసిరేయడంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయేషాను అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఈ పని చేసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: దారుణం: తల చెరువులో.. మొండెం చెట్ల పొదల్లో -
పాతబస్తీ యువకుల షాన్ పహిల్వాన్..!
సాక్షి, చాంద్రాయణగుట్ట: దేశంలో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా పాతబస్తి పహిల్వాన్లు సత్తాచాటుతున్నారు. తరాలు మారినా కుస్తీ పోటీల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బార్కాస్, ఎర్రకుంట పరిసరాల్లో ఎటు చూసినా పహిల్వాన్లే దర్శనమిస్తుంటారు. పహిల్వాన్గా తయారు కావడానికి ఇక్కడి యువకులు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. ఉన్నత విద్యావంతులు సైతం ‘సై’ అంటుంటారు. ఇందుకు గాను ప్రతిరోజు గంటల తరబడి దంగల్లలో కఠోర శ్రమ చేస్తారు. బాల కేసరి, హైదరాబాద్ కేసరీ, రుస్తానా ఏ డక్కన్, రాజీవ్గాంధీ కేసరీ, సాలార్ కేసరీ, ఆంధ్ర కేసరి తదితర పురస్కారాలు దక్కించుకుంటున్న బార్కాస్ పహిల్వాన్లు కుస్తీ పోటీలకు ఇంకా ప్రాధాన్యం తగ్గలేదని నిరూపిస్తున్నారు. బార్కాస్ ప్రాంతానికి చెందిన కాలేద్ బామస్, అబ్దుల్లా బిన్ గౌస్, మహ్మద్ బిన్ గౌస్ ఆంధ్ర కేసరీ టైటిళ్లను సాధించారు. ఖాలేద్ బిన్ అబ్ధుల్లా మహరూస్, హబీబ్ అబ్ధుల్లా అల్ జిలానీ, అబ్దుల్లా బిన్ గౌస్, మహ్మద్ బిన్ ఉమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్, మహమూద్ ఖాన్ తదితర ప్రముఖ పహిల్వాన్లు బార్కాస్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. నేటికీ అదే ఆదరణ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మల్లయోధులకు ప్రజాదరణ ఎక్కువే. రాజుల కాలంలో కుస్తీ పోటీలను ప్రత్యేకంగా నిర్వహించే వారు. ప్రస్తుతం రాజ్యాలు..రాజులు లేకున్నా...కుస్తీ పోటీలకు ఆదరణ తగ్గలేదు. బార్కాస్లో మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిని ‘ పహిల్వాన్లు’గా పిలుస్తారు. పహిల్వాన్లకు శిక్షణ ఇచ్చేవారిని ‘వస్తాద్’ లు అంటారు. బార్కాస్లో మల్లయోధులకు శిక్షణ ఇచ్చే అకాడాలు(తాలీం) ఉన్నాయి. ఐదేళ్ల వయస్సు నుంచి వీటిలో శిక్షణ పొందవచ్చు. ఇక్కడి అకాడాలలో శిక్షణ పొందిన వారు నగరంలోనే కాక డిల్లీ, మహారాష్ట్ర, సంగ్లీ, జంషెడ్పూర్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో నిర్వహించి కుస్తీ పోటీల్లో సత్తా చాటారు. ఆంధ్ర కేసరి నుంచి స్థానికంగా నిర్వహించే కేసరీలలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచే.. ఉదయం 4.30 గంటల నుంచే పహిల్వాన్లు వ్యాయామాన్ని ప్రారంభిస్తారు. ఇందులో డన్ బైటక్, సఫట్, తాడు ఎక్కడం, మట్టి తవ్వడం ముఖ్యమైనవి. డన్బైటక్ వ్యాయామం ద్వారా కాళ్లు, చేతులు బలంగా తయారవుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తమ స్థాయికి తగ్గట్లు ఐదు వందల నుంచి వెయ్యి వరకు దన్ బైటక్లను కొడుతారు. తాడు ఎక్కడం ద్వారా చేతికి పటుత్వం లభిస్తుంది. దంగల్లో మట్టిని తోడడం ద్వారా పక్కటెముకలు, వెన్నపూస, భుజాలు ధృడమౌతాయి. పహిల్వాన్ మెనూ ఇదీ.. ⇔ పహిల్వాన్లు ప్రతి రోజు పాలల్లో బాదం, అక్రోడ్, పిస్తా, కర్బూజా, ఇలాచీ, కాలీమిర్చి తదితర డ్రైప్రూట్స్ నానబెట్టి పాలను చిలుకుతారు. ⇔ అనంతరం పాలను వడబోసి తాగుతారు. ఒక్కో çపహిల్వాన్ రోజూ లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలను స్వీకరిస్తారు. ⇔ వీటితో పాటు ఉదయం తాజా పండ్లు, కూరగాయలు మితంగా ఆహారాన్ని తీసుకుంటారు. ⇔ మధ్యాహ్నం వేళల్లో అరటి, పీచు కలిగిన పండ్లను, రాత్రి వేళల్లో మస్కా, నెయ్యితో చేసిన కూరగాయలు, అన్నం తింటారు. ⇔ ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటిస్తారు. నూనె పదార్థాలను తీసుకోరు. కేవలం నెయ్యితో చేసిన కూర లు మాత్రమే భుజిస్తారు. ⇔ ప్రతి ఫహిల్వాన్కు రోజు రూ.300–400ల వరకు ఆహారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా దంగల్.. మల్లయోధుల వ్యాయామం కోసం ప్రత్యేకంగా దంగల్ను ఏర్పాటు చేస్తారు. ఈ దంగల్లో ఎర్రమట్టిని వేసి ఆ మట్టిలో నెయ్యి, హారతి కర్పూరం, నిమ్మరసం, మంచినూనె, గంధం చెక్కల పౌడర్ తదితర వాటిని కలుపుతారు. శిక్షణ పొందే సమయంలో గాయపడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో శరీరం నుంచి వెలువడే చెమట కారణంగా వాసన రాకుండా కర్పూరం తదితరాలను వాడతారు. 12 ఏళ్లు కష్టపడ్డా.. 12 ఏళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని ఆంధ్ర కేసరీ టైటిల్ సాధించాను. 2004లో ఎల్బీ స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో గెలిచి ఆంధ్రకేసరీ అందుకున్నా. ప్రస్తుతం బార్కాస్లోనే బామస్ అకాడా ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇస్తున్నా. అకాడ ఆధ్వర్యంలో ఏటా కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. పహిల్వాన్గా రూపొందాలంటే కఠోర శ్రమ తప్పనిసరి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు గంటలు అకాడాలో గడపాల్సిందే. –ఖాలీద్ బామాస్, ఆంధ్రకేసరీ టైటిల్ విజేత పహిల్వాన్ కావాలని ఉంది.. చిన్నతనం నుంచి కుస్తీ పోటీలు చూస్తున్నా..పహిల్వాన్ కావాలన్న ఆశయంతో రహీంపురాలోని వ్యాయామశాలలో మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. బార్కాస్లో నిర్వహిస్తున్న పోటీల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నా. –రోహిత్ వాక్వాడే, పహిల్వాన్ -
16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల కింద తప్పిపోయిన ఓ బాలిక రాష్ట్ర పోలీసుల సాయంతో తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో 16 ఏళ్ల కింద ఓ బాలిక తప్పిపోయింది. అప్పట్లో ఆ బాలికను కొందరు చేరదీసి మియాపూర్ అనాథాశ్రమానికి పంపారు. ఆపరేషన్ స్మైల్–7లో భాగంగా అనాథాశ్రమంలోని చిన్నారుల వివరాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం పోలీసులు ఆరా తీశారు. హుస్సేనీ ఆలంలో మిస్సైన బాలికను గుర్తించారు. గతంలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారు ప్రస్తుతం ఎక్కడున్నారో గాలించారు. కర్నూలులో ఉన్న బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గురువారం అనాథాశ్రమానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలిక వారి కూతురేనని నిర్ధారించారు. 16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
కండల కోడి c/o ‘పాతబస్తీ
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండివంటలతోపాటు కోడి పందేలు.. ఇందుకోసం అవసరమయ్యే మేలు జాతి కోళ్లను హైదరాబాద్లోనూ పెంచుతున్నారు. పాతబస్తీలో పెంచే కోళ్లకు భలే డిమాండ్ ఉంది. సంక్రాంతికి 3–4 నెలల ముందు నుంచే ఇక్కడ పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాతబస్తీ పందెం కోళ్లు, వాటికి ఇచ్చే ఆహారం, పందేల కోసం ఇచ్చే శిక్షణపై సాక్షి ప్రత్యేక కథనం... జీవనశైలి ప్రత్యేకం... పందెం కోళ్ల పెంపకం, వాటి జీవనశైలి సాధారణ కోళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఎంపిక దగ్గర నుంచి ఆహారం, శిక్షణ వరకు అన్నీ విభిన్నంగా సాగుతాయి. పుంజులను బలంగా తయారు చేయడం కోసం వాటికి పౌష్టిక ఆహారం పెడతారు. ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నాలుగు నెలల కాలాన్ని వారాలుగా విభజించి పుంజులను బలంగా తయారు చేస్తారు. పందెం కోళ్ల ఆహార జాగ్రత్తలు చూస్తే కళ్లు తిరుగుతాయి. వెజ్, నాన్వెజ్ ఐటమ్స్తో కూడిన బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. కఠోర శిక్షణ... పండుగ నెల రోజుల ముందు నుంచి పందెం కోళ్లకు అసలైన ట్రైనింగ్ మొదలవుతుంది. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. పుంజుల గొంతులో ఏమైనా మలినాలుంటే వాటిని తొలగిస్తారు. ట్రైనర్ తన నోట్లో నీళ్లు పోసుకొని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. అటూఇటూ పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వేడి నీళ్లు, ప్రత్యేక షాంపూతో స్నానం చేయిస్తారు. రెండు గంటల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలవుతుంది. ఈసారి ఒక పుంజును మరో దానితో పోటీకి దింపుతారు. కొద్దిసేపు ఫైటింగ్ తర్వాత వాటికి స్పెషల్ మసాజ్ ఉంటుంది. అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. పెంపకందారులు వాటికి ప్రత్యేకంగా ప్రతిరోజూ పండుగ భోజనమే పెడతారు. ఒక్కో కోడిపై నెలకు రూ. 5 వేల నుంచి 6 వేల వరకు ఖర్చు అవుతుంది. పందెం కోళ్ల ధరలు రూ. వేలల్లో ఉంటాయి. అసీల్ రకం కోళ్ల ధర రూ. 50 వేల నుంచి 75 వేల వరకు ఉంటుంది. కొన్ని రకాల కోళ్లు రూ. లక్షపైన కూడా పలుకు తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుంజుల పెంపకం ఓ యజ్ఞంలా సాగుతుంది. కోళ్లను నిర్వాహకులు కంటికి రెప్పలా చూసుకుంటారు. పందెం కోళ్ల మెనూ ఇలా.. ► ఉదయం ఎండు ఖర్జూరం కిస్మిస్, మేకపాలు ► మూడు గంటలకోసారి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మిశ్రమం ► బియ్యం, రాగులు, మినప్పప్పు, శనగపప్పు, గోధుమ మిశ్రమం.. మధ్యాహ్నం మటన్ కైమా, సాయంత్రం స్నాక్స్గా జొన్నలు, కోడిగుడ్లు కోడిపుంజుల కసరత్తులు ఇవీ.. ► కండరాల బిగుతుకు రోజూ మార్నింగ్ వాక్ ► తిన్నది ఒంటికి పట్టేవిధంగా అటుఇటు పరుగెత్తించడం. చెరువులో ఈత కొట్టించడం ► వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో స్నానం ► అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ -
హైదరాబాద్లో కారు బీభత్సం..
సాక్షి, హైదారబాద్: పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్లో ఇంటి ముందు కూర్చోని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా రివర్స్లో వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. కాగా కారును మహిళ డ్రైవ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అక్కడికి డీసీపీని పంపింది సీఎం కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ దేవాదాయ భూమిని కాపాడాలని బీజేపీ ఆందోళన చేస్తుంటే తమ కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. మహిళలు అని కూడా చూడకుండా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఉప్పుగూడ ఘటనకు డీసీపీ పూర్తి బాద్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. డీసీపీని పంపింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆరోపించారు. కేసీఆర్ బయటకొచ్చి మట్లాడాలని సవాల్ విసిరారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహారించి, కబ్జాదారుకలు కొమ్ముకాస్తున్న డీసీపీపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్ట్ చేసిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తనను కూడా అడ్డుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే డీసీపీకి ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నారని, అందుకనే ఇష్టారీతిన వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అరెస్టులకు కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని చాలెంజ్ చేశారు. కాగా, పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి బుధవారం అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. -
పాతబస్తీ: 70 కోట్లు చేసే భూమిపై ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, 1951లో ఈ స్థలాన్ని దేవాదయశాఖ అధీనంలోకి తీసుకొని ఇప్పటివరకు 11 సార్లు వేలం పాట వేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఒకసారి వేలం పాట కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో వేలం పాటలో ధర తక్కువగా వచ్చిందని సీపీఐ నాయకులు దేవాదయ శాఖ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటి నుంచి రాని వ్యక్తి తాజాగా ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. నా భూముల్లో నేను నిర్మాణాలు చేసుకుంటుంటే స్థానికులు అడ్డు పడుతున్నారంటూ ఆ వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అర్డర్లు తీసుకొచ్చారు. దీంతో బుధవారం పోలీసులు పెద్ద ఎత్తున ఆలయస్థలం వద్దకు చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అక్కడకు చేరుకొని అడ్డుకోవడంతో ఘర్షణకు దారితీసింది. చదవండి: (నిజాంపేట్లో అపార్ట్మెంట్లకు ఏమైంది!) -
భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. గ్రేటర్ పీఠమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. విపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వని సీఎం కేసీఆర్ కేవలం పదిరోజుల్లోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ప్రచారంలో అభివృద్ధి మాట కన్నా.. ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధమే ఎక్కువగా సాగింది. గల్లీ ఎన్నికలే అయినప్పటికీ దాని వేడి ఢిల్లీ వరకు పాకింది. అధికార టీఆర్ఎస్పై బీజేపీ నేతలు విమర్శలతో రాజధానిలో రాజకీయ వేడి సెగలు పుట్టించింది. మరోవైపు ఎంఐఎం-బీజేపీ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు భాగ్యనగరంలో ప్రకంపనలు రేపాయి. గ్రేటర్ ఎన్నికల్లో తాము గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించగా.. నగర నడిబొడ్డున ఉన్న మాజీ ప్రధాని పీవీ, ఎన్టీఆర్ ఘాట్స్ను కూల్చివేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. (గ్రేటర్ ప్రచారం: ట్రంప్ ఒక్కరే మిగిలిపోయారు) మరోవైపు ప్రచారం చివరిరోజైన ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన కాషాయదళంలో మరింత ఉత్తేజాన్ని నింపగా.. రాజధానిలో పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆదివారం నాడు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్య్వూలో ఒవైసీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో తాను లైలా పాత్ర పోషిస్తుంటే.. మిగత పక్షాలన్నీ మజ్నూలా తన చుట్టే తిరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్ను పెట్టడమే) ‘పాత బస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు హ్యాస్యాస్పదం. కేవలం పాతబస్తీపైనే ఆ పార్టీ నేతలంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు. పాత బస్తీలో ఉన్న వారంతా కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతితోనే ఉంటున్నారు. బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలంతా నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. బిహార్లో బీజేపీ విజయం వెనుక తన పాత్ర ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల నేతలంతా నన్నే టార్గెట్గా చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో నేను లైలా లాంటి వాడిని, మిగతా వారంతా మజ్నూలా నా వెంట పడుతున్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. -
పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్కు వస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్టు కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేనుగా చార్మినార్ వద్దకు వెళ్లి అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరగి ఢిల్లీకి వెళ్తారు. ఇదిలాఉంటే హోంమంత్రి అమిత్ షా చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అటు బీజేపీ, ఎంఐఎం పార్టీ ల మధ్య మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచే పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా రంగంలోకి దింపారు. -
పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తాం: సంజయ్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్లో సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. (గ్రేటర్ పోరు.. రంగంలోకి అమిత్ షా) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘1948లో హైదరాబాద్ను పాకిస్తాన్లో కలపాలని ఎంఐఎం కోరింది. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారింది. ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవు. బీజేపీ చెప్పింది చేస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు’ అని అన్నారు. (బీజేపీ ముందు పవన్ కీలక ప్రతిపాదన!) -
పుట్టింటి నుంచి భార్య రావడంలేదని..
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పుట్టింటి నుంచి భార్య రావడం లేదని భర్త మొహమ్మద్ శబజ్ కొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శబజ్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంతోష్ నగర్కి చెందిన మొహమ్మద్ శబజ్ వృత్తి ఆటో డ్రైవర్. భవాని నగర్కి చెందిన బేగంతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. శబజ్ ఇది రెండవ పెళ్లి. నిత్యం మద్యం, వైట్నర్ సేవించి భార్యని కొట్టడం చిత్రహింసలకు గురిచేసేవాడు. భర్త వేధింపులు కట్టుకోలేక మహిళ పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేసింది. అనంతరం పుట్టింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తన ఇంటికి రావాలని శబజ్ భార్యతో గొడవపడ్డాడు. అయినప్పటీకి ఆమె రాకపోవడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. -
చూస్తుండగానే వరద నీటిలో గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. జంట నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముచెత్తింది. పాతబస్తీ ప్రాంతం నీట మునిగింది. పాల్లె చెరువు పూర్తిగా నిండిపోడంతో పాతబస్తీని వరదలు ముంచెత్తాయి. రోడ్ల వెంట పారుతున్న నీటి ప్రవాహం వాగులను తలపిస్తోంది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు హైదరాబాద్లో భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడుదామనుకుని ప్రత్నించినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వ్యక్తి వివరాలుతెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి దెబ్బతింది. రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ మూసారాం ప్రాంతాన్ని సందర్శించారు. బ్రిడ్జి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడింగ్, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. (వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు) -
పాతబస్తీ బండ్లగూడలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్లోని ఓ పహిల్వాన్కు చెందిన ఫామ్హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్ పరామర్శించారు. గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో తల్లీకూతుళ్లు మృతి.. ఇబ్రహీంపట్నం(హైదరాబాద్): ఇంటిగోడ కూలిపోయి తల్లీ కూతుళ్లు మృతి చెందగా కుమారుడుకి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మల్శెట్టిగూడలో క్యామ సువర్ణ(37) కూతురు స్రవంతి (14), కుమారుడు సంపత్ (18)తో కలసి ఓ ఇంటిలో నివాసముంటోంది. సోమవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ఇంటి గోడలు బాగా నానిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఇంటి పైకప్పు గోడలు కూలి సువర్ణ, స్రవంతి, సంపత్లపై పడ్డాయి. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సంపత్కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే అతడిని ఇబ్ర హీంపట్నం ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్ వర్షాలు: కొట్టుకొచ్చిన మొసళ్లు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని పురానాపూల్లో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. గడిచిన రెండు రోజులుగా రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న కురిసిన భారీ వర్షానికి రెండు మొసళ్లు కొట్టుకొచ్చాయి. స్థానికులు వన్యప్రాణి సంరక్షణా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, నెహ్రూ జూపార్క్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని బంధించే పనిలో నిమగ్నమయ్యారు. హిమాయత్ సాగర్ నుంచి వరద నీటిలో ఈ మొసళ్లు కొట్టుకొచ్చినట్టు అధికారులు భావిస్తన్నారు. ఇక భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. చెరువు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. (చదవండి: జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది) -
‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానిత ఉగ్రవాది, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్ జైల్లో ఉన్నా తన పంథా మార్చుకోలేదు. ఇప్పటికీ బరితెగిస్తూ అనేక మందిని జాతి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇతడు స్మార్ట్ఫోన్ సాయంతో ‘ఉగ్ర’నెట్వర్క్ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీని కోసం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) నిర్వహిస్తున్న ఆన్లైన్ మ్యాగజైన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’ను ఇతడే ప్రారంభించాడు. జమ్మూకశ్మీర్కు చెందిన ఐఎస్కేపీ ఉగ్రవాది సామి సాయంతో ఈ పని చేశాడు. సామి సైతం ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టై ఢిల్లీ జైల్లో ఉన్నాడు. ఐఎస్కేపీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఈ అంశాలు పొందుపరిచారు. గతంలో అరెస్టు అయి బెయిల్పై వచ్చిన బాసిత్ను ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్కు చెందిన దంపతులు జహన్ జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. బాసిత్ ఆదేశాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా వీళ్లు ప్రేరేపించారు. జైల్లో ఉన్న బాసిత్, బయట ఉన్న సామి కలిసి ‘వాయిస్ ఆఫ్ హింద్’ను మొదలెట్టారు. దీని ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తితో పాటు ఓ వర్గాన్ని మిగిలిన వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఓ దశలో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరిని ఢిల్లీకి రప్పించిన బాసిత్ ఓక్లా ప్రాంతంలోని జామియానగర్లో ఉంచాడు. ఈ ఏడాది ఏప్రిల్లో వీళ్లు అరెస్టయినా.. ‘వాయిస్ ఆఫ్ హింద్’ సంచికలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఏడు ఎడిషన్స్ రావడంతో బాసిత్ నెట్వర్క్లో మరికొందరు బయట ఉన్నారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. స్మార్ట్ఫోన్ వినియోగించిన బాసిత్ పుణేకు చెందిన నబీల్ ఎస్ ఖాత్రి, సాదియా అన్వర్ షేక్లను ఐఎస్కేపీలో కీలకంగా మార్చాడు. ఎన్ఐఏ అధికారులు బుధవారం ఈ ఐదుగురి పైనా చార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవరీ బాసిత్?: చాంద్రాయణగుట్ట పరిధిలోని గుల్షాన్ ఇక్బాల్ కాలనీకి చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన భావజాలంలో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యూల్, ఐఎస్కేపీల్లో కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
గ్యాంగ్వార్.. రౌడీషీటర్పై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాలాపత్తర్ లో పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. రౌడీషీటర్ షానుర్పై ప్రత్యర్థి వర్గం మరణాయుధాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షానూర్కు తీవ్రగాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. షానూర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వర్గ ఆధిపత్యం, పాత తగాదాలే దాడులకు కారణమని పోలీసులు భాస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. షానూర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
లాల్ దర్వాజా బోనాలు.. భక్తులకు నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామునే బలగంప కొనసాగింది. అనంతరం అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. ఆ తర్వాత ఆలయ కమిటీ తరఫున అధికారికంగా అమ్మవారికి ఒక్క బోనాన్ని సమర్పించింది. సాయంత్రం ఆరు గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. సోమవారం పోతరాజు స్వాగతం, రంగం (భవిష్యవాణి) కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిమితంగా కమిటీ సభ్యులతో ఘట ఊరేగింపు ఉంటుంది. పోలీసుల దిగ్భంధంలో ఆలయ పరిసరాలు కరోనా వైరస్ ప్రభావం కారణంగా బోనాలకు భక్తులను అనుమతించడం లేదు. మరోవైపు పోలీసులు...ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయానికి వచ్చే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు కోవిడ్ నిబంధనలలో భాగంగా నో ఎంట్రీ సూచికలను ఏర్పాటు చేశారు. నాగుల చింత నుండి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పీఎస్ నుండి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లు మూసివేశారున. (హైదరాబాద్ గాలి తిరిగింది!) ఇళ్లలోనే అమ్మవారికి బోనాల సమర్పణ.. ఇళ్లలోనే బానాల సమర్పణకు భక్తులు సిద్ధమయ్యారు. వాస్తవానికి పాతబస్తీలో ఆదివారం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆయా ప్రాంతాలలోని దేవాలయాల్లో కమిటీ తరఫున మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. -
కరోనా: ఇంటికే తాళం.. బస్తీ మొత్తానికి కాదు
కరోనా వైరస్ పంజా విసరడంతో పాతబస్తీ విలవిల్లాడింది.. గ్రేటర్ పరిధిలో ఎక్కువగా కేసులు పాతబస్తీలోనే నమోదు కావడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కాలనీల రహదారులను మూసేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్లో ఉన్న వారిని క్వారంటైన్కు తరలించారు. అన్ని చర్యలు చేపట్టడంతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు పాతబస్తీలో 69 కంటైన్మెంట్ జోన్లు ఉండగా 54 కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. ప్రస్తుతం 15 మాత్రమేకొనసాగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో కేవలం ఆ ఇంటికి తాళం వేసి హోం కంటైన్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్బాగ్లో ఒకటి, యాకుత్పురాలో రెండు హోం కంటైన్మెంట్లు కొనసాగుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఇప్పటి వరకు 54 కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని సర్కిల్–6, 7, 8, 9, 10లలో 69 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు పరిస్థితులు మెరుగవుతుండటంతో అంచెలంచెలుగా జోన్లను తొలగిస్తున్నారు. మంగళవారం వరకు 54 కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. ప్రస్తుతం పాతబస్తీలో 15 మాత్రమే కొనసాగుతున్నాయి. వీటిలో కొన్నింటిని రెండు రోజుల్లో తొలగించనున్నారు. ఒకవైపు పాతబస్తీలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్తో వైద్య సేవలు పొంది ఆరోగ్యం మెరుగవడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండగా.. మరోవైపు కొత్త కేసులు నమోదవుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైనా కరోనా పాజిటివ్ కేసు నమోదైతే.. గతంలో మాదిరిగా బస్తీ మొత్తం కంటైన్మెంట్ జోన్లుగా మార్చకుండా.. కేవలం ఆయా ఇంటికే తాళం వేసి కట్టడి చేస్తున్నారు. దీన్ని హోం కంటైన్మెంట్ జోన్ అంటున్నారు. బహదూర్పురా నియోజకవర్గం పరిధి సర్కిల్–10లోని కిషన్బాగ్లో ఒకటి, యాకుత్పురా నియోజకవర్గం పరిధిలోని సర్కిల్–7లో రెండు కొత్తగా హోం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. మలక్పేట్ సర్కిల్–6లో మొత్తం 17 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ఇందులో మంగళవారం వరకు 13 తొలగించగా.. మరో 4 కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి. వీటిని కూడా బుధవారం తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాతబస్తీలో 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 85 మంది ఇప్పటి వరకు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 146 మంది మాత్రమే కరోనా పాజిటివ్తో వైద్య సేవలు పొందుతున్నారు. చార్మినార్లో కొత్తగా మూడు.. చార్మినార్లో మొత్తం 10 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. 7 జోన్లను తొలగించగా.. శనివారం కొత్తగా మరో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ కొత్తగా 3 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చార్మినార్లో మూడు పాతవి.. 3 కొత్తవి ఉన్నాయి. చార్మినార్ నియోజకవర్గం పరిధిలోని చార్మినార్ సర్కిల్–9లో శనివారం కొత్తగా 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే ఇంట్లో ముగ్గురు కాగా, ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో చార్మినార్ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 14 యాక్టివ్ కేసులున్నాయి. ఇక్కడ 22 మందికి కరోనా పాజిటివ్ రాగా, ఇందులో ఇద్దరు చనిపోయారు. ఆరుగురికి ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్జార్జీ అయ్యారు. యాకుత్పురాలో హోం కంటైన్మెంట్ యాకుత్పురా నియోజకవర్గం పరిధిలోని సంతోష్నగర్ సర్కిల్–7లోని 16 కంటైన్మెంట్ జోన్లను పూర్తిగా తొలగించినట్లు సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అలీవేలు మంగ తాయారు తెలిపారు. డబీర్పురాలో ఒక హోం కంటైన్మెంట్ జోన్ కొనసాగుతుందన్నారు. యాకుత్పురాలో ఒక వృద్ధుడు గుండెనొప్పితో మృతి చెందాడని, అతడి ఇంటిని కూడా హోం కంటైన్మెంట్ చేయనున్నామన్నారు. చాంద్రాయణగుట్టలో పూర్తిగా తొలగింపు చాంద్రాయణగుట్ట సర్కిల్–8లోని 10 కంటైన్మెంట్ జోన్లను తొలగించారు. ఈ సర్కిల్లో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. 25 మంది గాంధీ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 8 మంది వైద్య సేవలు పొందుతున్నారని డిప్యూటీ కమిషనర్ షెర్లీ పుష్యరాగం తెలిపారు. బహదూర్పురాలో కొత్తగా హోం కంటైన్మెంట్.. బహదూర్పురా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఫలక్నుమా సర్కిల్–10లో 13 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. మంగళవారం వరకు 9 జోన్లను తొలగించగా.. ప్రస్తుతం 4 మాత్రమే ఉన్నాయి. ఇందులో కొన్నింటిని బుధవారం తొలగించనున్నారు. ప్రస్తుతం 40 మంది కరోనా పాజిటివ్తో వైద్య సేవలు పొందుతున్నారని డీసీ జగన్ తెలిపారు. కిషన్బాగ్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో హోం కంటైన్మెంట్ చేశామన్నారు. నేరేడ్మెట్లో జోన్ ఎత్తివేత నేరేడ్మెట్: నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని శ్రీకాలనీ కంటెన్మెంట్ జోన్ను ఎత్తివేసినట్లు మల్కాజిగిరి డీసీ దశరథ్ సోమవారం పేర్కొన్నారు. గత నెల 16న ఓ వృద్ధుడికి పాజిటివ్ రావడంతో ఈ కాలనీని అధికారులు కంటెన్మెంట్ జోన్గా ప్రకటించారు. మళ్లీ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కంటెన్మెంట్ జోన్ను ఎత్తివేశామని డీసీ వివరించారు. జింకలబావి కాలనీలో రెండు పాజిటివ్ హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ సర్కిల్ పరిధి జింకలబావి కాలనీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో అధికారులు జింకలబావి కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం తెలిపారు. పాతబస్తీలో పరిస్థితి మెరుగవుతోంది.. పాతబస్తీలో పరిస్థితి మెరుగవుతోంది. కొత్త కేసుల నమోదు తగ్గింది. పాతబస్తీలో దాదాపు అన్ని సర్కిల్స్ పరిధిలో కంటైన్మెంట్ క్లస్టర్స్ తొలగించాం. చార్మినార్ జోన్ పరిధిలో ఇప్పటి వరకు 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చనిపోయిన వారు కాకుండా మిగతా వారంతా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 85 మంది పాజిటివ్ పేషంట్స్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోం కంటైన్మెంట్ చేస్తున్నాం. – ఎన్.సామ్రాట్ అశోక్, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ రామ్కోఠిలోమొదటిసారి సుల్తాన్బజార్: సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు కరోనా పాజిటివ్తో మృతి చెందడంతో మొదటి సారిగా కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు. చనిపోయిన వృద్ధుడి కుటుంబం ఇంటికి తాళం వేసి నిత్యావసర సరుకులను పోలీసులు అందజేస్తున్నారు. చీర్యాలలో ఎత్తివేత కీసర: చీర్యాల గ్రామంలో కంటైన్మెంట్ జోన్ను ఎత్తివేసినట్లు కీసర ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ తెలిపారు. గతనెల 18న ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన విషయం విధితమే.. సోమవారం ఆ కంటైన్మెంట్ను అధికారులు ఎత్తివేశారు. హోం కంటైన్మెంట్గా కానిస్టేబుల్ ఇల్లు అంబర్పేట: కరోనా పాజిటివ్ వచ్చిన నివాసాన్ని అధికారులు కంటైన్మెంట్ చేశారు. అంబర్పేట డివిజన్ చెన్నారెడ్డినగర్లో నివాసముండే కానిస్టేబుల్ నివాసాన్ని శనివారం జీహెచ్ఎంసీ అధికారులు కంటైన్మెంట్ చేశారు. -
పాతబస్తీలో గ్యాంగ్వార్.. రాళ్ల దాడి
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో నగరంలోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. స్థానిక భవానీ నగర్లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాళ్లు పెద్ద ఎత్తున రువ్వకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (కరోనా కలవరం : వీడని విషాదం) స్థానికల సమాచారం ప్రకారం బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
పోలీసులపై దాష్టీకాలా?
సాక్షి, హైదరాబాద్: వనపర్తిలో ఓ కానిస్టేబుల్ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారు. వాస్తవానికి తొలుత ఆ వాహనదారుడే పోలీసుపై దాడికి దిగిన వీడియో మరునాడు విడుదలైనా ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై ఓ కార్పొరేటర్ అకారణంగా చేయి చేసుకున్నాడు. కరోనా మహమ్మారిపై పోరులో వైద్యుల తరువాత పోలీసులు కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. కానీ, పలువురు నేతలు, పౌరులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులపై తి రగబడటం, వారిపై చేయి చేసుకోవడం కొం దరు అలవాటుగా మార్చుకుంటున్నారు. 40 రోజులకుపైగా కుటుంబానికి దూరంగా, ఎండనకా వాననకా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విధులు నిర్వహిస్తోన్న పో లీసులపై దాడులకు దిగుతూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీ యడం సబబేనా అన్న ప్ర శ్న పోలీసు కుటుంబాల్లో మొదలైంది. చిన్నాచి తకా విషయాల్లో వా స్తవాలు తెలుసుకోకుం డా రాజకీయ ఒత్తిడి, క్రమశిక్షణ పేరిట చర్య లు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఐపీఎస్ అధికారులే వాపోతున్నారు. వీరందరికీ కరోనా ఎందుకు వచ్చింది? డిపార్ట్మెంటులో ఇప్పటికే ఐదుగురు పోలీసు లు కరోనా బారినపడ్డారు. ఇన్ని త్యాగాలు చే స్తోంటే తిరిగి వారిపై దాడులు చేయడం, వారి నే కించపరిచేలా ప్రవర్తించడంపై పోలీసుల్లో అసంతృప్తి మొదలైంది. అసలు రాష్ట్రంలో తబ్లి గీ జమాత్కు వెళ్లొచ్చినవారిని గుర్తించడంలో పోలీసుల పాత్ర మరువలేనిది. కరోనా పా జిటివ్ రోగుల గుర్తింపు, ఐసోలేషన్ కేంద్రాల కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో గస్తీ కాయడం, కంటైన్మెంట్ జోన్లను పరిరక్షించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి విధుల వల్లే ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం రాజకీయ నేతలకు తెలియంది కాదు. పాతబస్తీలో మరింత చెలరేగుతున్నారు.. పాతబస్తీలో పలువురికి అసలు లాక్డౌన్ ఎం దుకు విధించారో అవగాహన లేదు. మాస్కు లు, హెల్మెట్లు లేకుండా ఇష్టానుసారం బయటి కి వస్తూ గుంపులుగా తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద నగరంలోనే అధిక కేసులు నమోదవడానికి ఈ నిబంధనల ఉల్లంఘనా ఒక కా రణమే. ఇదేంటని అడిగితే ప్రజలు, నేతలు పో లీసుల మీదకే తిరగబడుతున్నారు. ఇటీవల హోంమంత్రి కూడా ప్రజలపై లాఠీలు ఝుళి పించవద్దంటూ ఆదేశాలిచ్చి పోలీసుల చేతులు కట్టేసినంత పని చేశారు. ఆ మరునాడే ఓ కార్పొరేటర్ కానిస్టేబుల్పై చేయిచేసుకోవడం గమనార్హం. ఇలాగైతే పాతబస్తీలో పని చేయలేమని పోలీస్ సిబ్బంది అంటున్నారు. -
ఒక వైపు వర్షం.... మరో వైపు ఎండ
చాంద్రాయణగుట్ట/యాకుత్పురా/దూద్బౌలి: పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెట్ల కొమ్మలు, సెల్ టవర్లు కూలిపోయాయి. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ స్తంభాలు, తీగలు పడిపోవడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రైవేటు స్కూల్ భవనం పైనుంచి ఇటుకలు, పెచ్చులూడటంతో కింద ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఉప్పుగూడ ఆర్యూబీ బ్రిడ్జి సమీపంలో ఓ ఇంటిపై నుంచి జియో సెల్ టవర్ కూలి పడిపోయింది.గౌలిపురా పటేల్నగర్, ఛత్రినాక ఎస్సార్టీ కాలనీ, శ్రీరాంనగర్ ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.ఛత్రినాక నుంచి ఉప్పుగూడ ఆర్యూబీ వెళ్లే ప్రధాన రోడ్డు, లలితాబాగ్ రైల్వే బ్రిడ్జి పరిసరాల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉప్పుగూడలోని సిటీ స్పిరిట్ స్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ఇటుకలు పక్కనే ఉన్న రేకులపై పడటంతో స్వల్పంగా పగిలాయి. హుస్సేనీఆలంలో ప్రహరీ కూలి ఇద్దరికి గాయాలు భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించిన ప్రహరీ కూలి పక్కింటిపై పడటంతో ఇద్దరికి గాయాలకు సంఘటన హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. దూద్బౌలి హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పక్కన నిర్మాణంలో ఉన్న భవన ప్రహరీ కూలడంతో పక్కనే ఉండే జైనాబ్ బేగం, మహ్మద్ అక్తర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎండా..ఠండా ఒక వైపు వర్షం.... మరో వైపు ఎండలతో నగరంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. నిండు వేసవి వస్తుండటంతో నగరంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం నగరంలో 39 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యధికంగా సీతాఫల్మండిలో 41.3 డిగ్రీలు నమోదైంది. మరోవైపు సాయంత్రానికి వాతావరణం చల్లబడి నగరంలో పలు చోట్ల గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. నగరంలో అత్యధికంగా బండ్లగూడ లలితాబాగ్లో 20.5 మి.మీల వర్షపాతం నమోదైంది. చందూలాల్ బారాదరి, దూద్బౌలి, ఉప్పుగూడ విరాసత్నగర్, కిషన్బాగ్, కంచన్బాగ్, జుమ్మేరాత్బజార్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, కార్వాన్లతో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. -
లాక్డౌన్ మరింత కఠినతరం?
చార్మినార్: పాతబస్తీలో లాక్డౌన్ ప్రభావం కనిపించడం లేదు. రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఏదో కారణంతో వీధుల్లో కనిపిస్తున్నారు. లాక్డౌన్ను స్థానిక ప్రజలు సీరియస్గా తీసుకోకపోవడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్గా గుర్తించింది. ఇందులో పాతబస్తీ కూడా ఉంది. ఇక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిత్యావసర వస్తువుల పేరుతో వీధుల్లోకి వస్తున్న వారందరిని కట్టడి చేయడానికి లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి పోలీసు అధికారులు హాట్స్పాట్ ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. మటన్ షాపులు, చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? రోజుకు ఎన్ని పని చేస్తున్నాయి? అత్యధిక సంఖ్యలో ఏ దుకాణానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది? మార్కెట్లకు రోజుకెంత మంది వస్తున్నారు? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం పాతబస్తీని జల్లెడ పట్టనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ తర్జనభర్జన పడుతున్నారు. నిత్యావసరాల కోసం రోజంతా కాకుండా ఉదయం, సాయంత్రం ఏదో ఒక సమయాన్ని కేటాయిస్తే.. ఎలా ఉంటుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రోజుకు ఏదో ఒక సమయంలో రెండు గంటలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కేటాయిస్తే ఫలితాలుంటాయని ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ 124 మంది గుర్తింపు.. గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి పాతబస్తీలోని మలక్పేట్ సర్కిల్– 6 నుంచి 21 మంది, సంతోష్నగర్ సర్కిల్– 7 నుంచి 20, చాంద్రాయణగుట్ట సర్కిల్– 8 నుంచి 25, చార్మినార్ సర్కిల్– 9 నుంచి 21, ఫలక్నుమా సర్కిల్–10 నుంచి 37, రాజేంద్రనగర్ సర్కిల్–11 నుంచి నలుగురు వెళ్లి వచ్చారు. మొత్తం పాతబస్తీ నుంచి ఢిల్లీ సభలకు హాజరైన 124 మందిని సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు గుర్తించారు. ఇందులో ఇంకా కొంత మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు అంటున్నారు. 108 వస్తే జనం బెంబేలు.. 108 వాహనం ఎక్కడైనా కనిపిస్తే చాలు.. స్థానికుల్లో భయాందోళన మొదలవుతోంది. దూరం నుంచి కూడా ప్రజలు వచ్చి ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది.. కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నాడా.. ఏ ఇంట్లో ఉన్నాడు.. ఎంత మంది ఉన్నారు.. ఢిల్లీకి వెళ్లి వచ్చారా.. విదేశాల నుంచి వచ్చారా? అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇంటికి దూరంగా ఉండాలంటూ వారికి వారే సామాజిక దూరం మెయింటెన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒకే బస్తీలో కలిసిమెలిసి జీవనం చేసిన స్థానికులు.. 108 వచ్చి ఆగి.. ఎవరినైనా వైద్య పరీక్షలకు తీసుకెళ్లే చాలు.. రోజుల తరబడి వారి గురించే ఆలోచనలు, మంతనాలు. ఎవరైనా అనుమానితులుంటే.. తమ బస్తీని పూర్తిగా శానిటైజ్ చేయాలంటూ సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్తో ఇద్దరు పాతబస్తీ నివాసితులు మరణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. తమ ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించాలని కోరుతున్నారు. యునానీ ఆస్పత్రిలో.. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిని గుర్తించి గాంధీ ఆస్పత్రితో పాటు ఫీవర్ ఆస్పత్రి, బేగంపేట్ నేచర్ క్యూర్లతో పాటు చార్మినార్లోని యునానీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. యునానీ ఆస్పత్రిలో కేవలం తబ్లీగ్ జమాత్కు వెళ్లి వచ్చిన 119 మందిని చేర్చి పరిశీలనలో ఉంచారు. వీరందరికి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. ఇంకొంత మందిని సంబందిత అధికారులు,సిబ్బంది గృహ నిర్బంధం చేశారు. వీరే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి కోవిడ్ వైరస్ ప్రభావం వీరిపై ఉందా.. లేదా అనే వివరాలను సేకరిస్తున్నారు. విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. ఎన్ని రోజులున్నారు.. ఎప్పుడు తిరిగి వచ్చారు.. ఆరోగ్యం పరిస్థితి ఏమిటి.. ఇప్పటి వరకు ఏవైనా వైద్య పరీక్షలు చేయించుకున్నారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏమాత్రం వ్యాధి లక్షణాలున్నా.. వెంటనే సంబంధిత ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కనిపించని లాక్డౌన్ ప్రభావం.. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొంత మంది ఇష్టానుసారంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. వీరిని దక్షిణ మండలం పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ కొంత మంది వినడంలేదు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలుగడం లేదు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం లేదు. ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా దుకాణాల వద్దకు చేరుతున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది పాతబస్తీలోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే చార్మినార్, మక్కా మసీదు, గుల్జార్ హౌస్, యునానీ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. -
అరబ్షేక్కు గృహిణిని విక్రయించిన దళారీ
చాంద్రాయణగుట్ట: అరబ్ షేక్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దళారీలను అడ్డుపెట్టుకుని పేద మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్పేటకు చెందిన వివాహిత ఫాతిమా ఉన్నీసాకు బార్కాస్ కొత్తపేట నబీల్ కాలనీలో ఇల్లు ఉంది. ఆర్థిక అవసరాల నిమిత్తం ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్న ఫాతిమా ఉన్నీసా దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్ను చెప్పింది. ఇల్లు కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని సాబెర్ ఫిబ్రవరి 25న ఫాతిమాకు ఫోన్ చేశాడు. ఇల్లు చూపించేందుకని ఆమె తన చెల్లెలు వివాహిత రఫత్ ఉన్నీసా(25)తో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ముందస్తు పథకంలో భాగంగా అక్కడకు వచ్చిన అరబ్ షేక్ ఇబ్రహీం షుక్రుల్లా (60) ఫాతిమాను పెళ్లి చేసుకుంటా నని అడిగాడు. దానికామె అంగీకరించకపోవటంతో ఆమె చెల్లి రఫత్ను కూడా అడిగాడు. ఆమె కూడా తిరస్కరించి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. సాబె ర్ అనే దళారి రంగంలోకి దిగి, రఫత్ను విక్రయిస్తామని షేక్ దగ్గరనుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంతో సాబెర్ తన భార్య సమీనా ద్వారా రఫత్ను తన ఇంటికి వచ్చేలా ఒప్పించాడు. ఆమె రాగానే, నేరుగా షేక్ వద్దకు తీసుకెళ్లి ఇంట్లోకి నెట్టి బయటికి వచ్చేశారు. అప్పట్నుంచి ఆ షేక్ ఆమె పట్ల క్రూరంగా లైంగిక దాడికి దిగాడు. సిగరెట్లతో కాల్చుతూ చిత్ర హింసలకు గురి చేశాడు. తన చెల్లెలు జాడ కోసం ఫాతిమా దళారీ సాబెర్ను గట్టిగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. ఆ చిరునామాకు వెళ్లేసరికి షేక్ తన పాస్పోర్టును వదిలి పారిపోయాడు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు చిన్నారులను మింగిన గోడ
నాంపల్లి: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న శ్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానంకాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. -
కంప్యూటర్ కాలం.. కిరోసిన్ ఫ్యాన్
సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు. విదేశాలనుంచి దిగుమతి... నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్ ఫ్యాన్ కూడా ఇంగ్లండ్ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్ హనీఫ్ ఇల్యాస్ బాబా ఇంట్లో కిరోసిన్ ఫ్యాన్ ఇంకా పనిచేస్తోంది. డిజైన్ డిఫరెంట్.. దీనిని 1800లో ఇంగ్లాండ్లో కనుగొన్నారు. ఫ్యాన్ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి. నగరంలోనే అరుదుగా.. 1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్లో వచ్చాక దీనిగురించి ఆలోచించడం మానేశారు. పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్ తెలిపారు. -
దుబాయ్ లక్ష్యం.. పాతబస్తీ మార్గం!
సాక్షి, హైదరాబాద్: తమ తమ మాతృదేశాలు విడిచి అక్రమంగా భారత్లో ప్రవేశించిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారీ స్కెచ్తోనే దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ల దేశంలో ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో దుబాయ్, గల్ఫ్లాంటి విదేశాలకు వెళ్లడానికి భారత్ను తాత్కాలిక వేదికగా మార్చుకుంటుండగా.. మరికొందరు ఇక్కడే స్థిరపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది మెరుగైన జీవితం కోసం హైదరాబాద్కు వస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సులువుగా గుర్తింపు కార్డులు పొంది.. భారత పౌరులుగా చలామణీ అవుతున్నారు. కొందరు విదేశాల కు వెళ్లే యత్నాలు చేస్తుంటే. మరికొందరు ఇక్కడే సెటిలవుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దర ఖాస్తు చేసుకుంటున్నారు. వీటిపై విచారణ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. పాతబస్తీలో రూ.10కి ఓటరు కార్డు, రూ.200కు పాన్కార్డు, రూ.2,000కు పాస్ పోర్టు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వారికి ఉగ్రనేపథ్యముంటే.. అది అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మంటగలుపుతుందని అధికారులు వాపోతున్నారు. దుబాయ్కి ప్రణాళికలు.. దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వీరంతా పాతబస్తీ, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఖాళీస్థలాలు, చెరువుల్ని ఆక్రమించుకుంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు దీనిని పట్టించుకోవడం లేదు. పింఛన్లు, రేషన్కార్డులు తీసుకుంటూ భారత పౌరులకు దక్కాల్సిన పథకాలను కొట్టేస్తున్నారు. స్థానిక యువతతో స్నేహం చేస్తోన్న రోహింగ్యా, బంగ్లాదేశీ యువకులు మెల్లిగా పంథా మార్చారు. స్థానిక యువత దారిలోనే.. దుబాయ్, గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టులు సంపాదిస్తున్నారు. విజిటింగ్ వీసా మీద అయినా సరే.. విదేశాలకు వెళ్లేందుకు యత్నాలు మొదలుపెట్టారు. వారు విదేశీయులని తెలిసీ కొందరు ఏజెంట్లు సాయం చేస్తుండటం గమనార్హం. కసబ్కు దారం.. వీరికి ఆధార్! 2008లో దేశంలోకి అక్రమంగా చొరబడి చేతికి ఎర్రటి దారం కట్టుకుని ముంబైలో 26/11 దాడులకు పాల్పడిన కసబ్ను భారత పౌరుడంటూ పాకిస్తాన్ ప్రపంచానికి చాటిచెప్పే యత్నం చేసింది. నగరంలో ఓటర్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, పింఛన్, సంక్షేమ పథకాలు పొందిన రోహింగ్యాలు విదేశాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడితే.. భారత్ అంతర్జాతీయంగా తనమీద పడ్డ మచ్చను చెరిపేసుకోవడం చాలాకష్టమని, పలుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని పలువు రు అంటున్నారు. అమెరికా, యూరోప్ వంటి దేశాలకు రోహింగ్యాల వల్ల నష్టం కలిగితే.. భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్పోర్టులను రద్దు చేయాల ని పాస్పోర్టు ఆఫీసులకు లేఖలు రాస్తున్నారు. ఉపాధి కోసమా.. ఉగ్రకోణమా? వాస్తవానికి ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా వారిని వెంటనే అరెస్టుచేసి, జైలుశిక్ష లేదా తిరిగి పంపించడం చేస్తారు. వీరంతా వేలసంఖ్యలో వచ్చిన శరణార్థులు కావడంతో ఎవరినీ తిరిగి పంపే ప్రయత్నాలు జరగలేదు. వీరిలో చాలామంది ఉగ్రవాద సానుభూతిపరు లున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. భారత్ పాస్పోర్టులతో రోహింగ్యాలు విదేశాలకు వెళ్తున్నారన్న విషయం వెలుగుచూడగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా వెళ్లేవారు భారత పౌరుల ముసుగులో అక్కడ ఏదైనా ఉగ్రచర్యలకు పాల్పడితే.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మంటగలిసే ప్రమాదముందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. -
కేంద్రం నిఘా నేత్రం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని నకిలీ ధ్రువీకరణ పత్రాల అంశంలో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 127 మంది రోహింగ్యాలకు ఆధార్ కార్డుల వ్యవహారం, విదేశీయుల వద్ద భారత పాస్పోర్టుల అంశాలు కలకలం రేపడంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కొందరు స్థానికులు కావాలనే వీరికి ఈ పత్రాలు ఇప్పిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే వారిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా సమాచారం సేకరించింది. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తోన్న విదేశీయుల అక్రమాలపై కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు పంపుతూనే ఉన్నాయి. విదేశీయులు ఈ కార్డులు కలిగి ఉండటం వల్ల దేశభద్రతకు భంగం వాటిల్లడమే కాకుండా, ఈ కార్డులతో పలు దేశాల్లో ఉగ్రచర్యలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి వస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తీవ్రంగా పరిగణిస్తోన్న పోలీసులు యెమన్ దేశస్తుడికి పాస్పోర్టు వచ్చిన విషయంపై తెలంగాణ పోలీసులు కూడా సీరియస్గా దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణకు ఆదేశించారని సమాచారం. చూడగానే విదేశీయుడు అని తెలిసిపోతున్నా.. యెమన్ దేశస్తుడు ముబారక్కు భారత పాస్పోర్టు రావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని పాస్పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు అధికారిని ప్రశ్నించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకునే విచారణలో అతనికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పాస్పోర్టు వచ్చేలా సహకరిం చారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. భారత ధ్రువీకరణ కార్డులతో విదేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి ఉంటుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కార్డులతో పౌరసత్వం వచ్చినట్లు కాదు.. ఆధార్, పాన్, ఓట రు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న విదేశీయులపై ఇప్పటికే పదుల సం ఖ్యలో టాస్క్ఫోర్స్ పోలీసులు కేసులు పెట్టారు. వీరు ఈ గుర్తింపు కార్డులతో భారతీయులు అయిపోరని స్పష్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అసోంలో స్థిరపడిన పలువురు దాదాపు 15 రకాల భారత ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నా.. వారికి భారత పౌరసత్వం లభించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాతబస్తీ పరిణామాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా ధ్రువీకరణ పత్రాలెలా తీసుకుంటున్నారంటే?దేశంలో అక్రమంగా చొరబడి నగర శివార్లలో తలదాచుకుంటున్న వేలాది మందికి పాతబస్తీలో పలువురు ఆశ్రయం కల్పిస్తున్నారు. వీరిలో పలువురు కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు. వారు తమ ఖార్ఖానాల్లో తక్కువ ధరకు పనిచేసేందుకు వీరిని పెట్టుకుంటున్నారు. రాత్రిపూట సంచరించే సమయంలో, తరచుగా శివారు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ధ్రువీకరణ పత్రాలు అడుగుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సదరు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులే తమ ఇంటి కరెంటు బిల్లులు ఇచ్చి విదేశీయులకు ఓటరు, ఆధార్, పాన్ తదితర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తున్నారు. పాతబస్తీలో డబ్బులు తీసుకుని పనిచేసే కొందరు ఏజెంట్లు కూడా ఈ తతంగానికి సహకరిస్తున్నారు. దీంతో వీరు సులువుగా అన్ని రకాల ధ్రువీకరణలు పొందుతున్నారు. -
అంగట్లో పౌరసత్వం!
సాక్షి, హైదరాబాద్ : మీకు భారత పౌరసత్వం కావాలా? మీరు ఏ దేశస్తులైనా ఫర్వాలేదు. అంగట్లో ఆధార్, ముంగిట్లో పౌరసత్వం ఇవ్వడానికి మేం రెడీ..! ఇది ప్రస్తుతం మన భాగ్యనగరంలో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితి. దేశ భద్రతను పణంగా పెట్టి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఆఖరికి పాస్పోర్టు కూడా రూ.10 మొదలుకుని రూ.2 వేలకు అమ్ముతున్న దారుణ స్థితి దాపురించింది. ఇప్పటికే పాతబస్తీలో దాదాపు 400 మంది వరకు అక్రమమార్గంలో ఆధార్కార్డులు సంపాదిం చారంటూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోం శాఖకు ఇప్పటికే నివేదించింది. అయినా.. ఇలాంటి కేసులు పాతబస్తీలో ప్రతినెలా బయటపడుతూనే ఉండటం గమనార్హం. నిఘా లోపం వల్లే..! హైదరాబాద్పై ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెడతారు. గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా.. దానికి హైదరాబాద్తో ఏదో సంబంధం ఉండటం పరిపాటిగా ఉండేది. ఇటీవల భారత ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) ప్రయోగించిన హనీట్రాప్.. పాతబస్తీ కేంద్రంగా సాగుతోందని ఢిల్లీలో పోలీసులు గుర్తించి భగ్నం చేసిన విషయం తెలిసిందే. సహజంగానే పాతబస్తీకి విదేశీయుల తాకిడి అధికం. యాత్రికులతో పాటు ఆఫ్రికన్ విద్యార్థులు, మధ్యప్రాచ్య వ్యాపారులు, బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన శరణార్థులు వేలాదిమంది ఇక్కడ తలదాచుకుంటారు. వీరిలో శరణార్థులుగా వచ్చినవారిపై సరైన పోలీసు నిఘా కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది శరణార్థులు ఉంటారని అంచనా. అసలు వీరు ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టమైన గణంకాలు కూడా పోలీసుల వద్ద లేవన్న విమర్శలు వినిపించాయి. దీంతో యథేచ్ఛగా గుర్తింపు కార్డులు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. అక్రమంగా పాస్పోర్టులు.. విదేశీయుల వద్ద పాస్పోర్టు లాంటి అత్యున్నత గుర్తింపు కార్డులు ఉండటం పలు అనుమానాలకు బీజం వేస్తోంది. శరణార్థుల డేటా పోలీసుల వద్ద లేకపోవడం వల్లే వారికి సులువుగా పాస్పోర్టులు దక్కుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో పోలీసులు కొందరి వేలిముద్రలు, రక్తనమూనాలు తీసుకున్నారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే వారికి కలిసి వస్తోంది. వాస్తవానికి బంగ్లాదేశీయులు, మయన్మార్ దేశస్తులు చూడటానికి భారతీయుల్లాగానే ఉంటారు. వీరు బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చామని చెబుతూ ఈ కార్డులు పొందుతున్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను సులువుగా నెట్ సెంటర్ల ద్వారా సులువుగా సంపాదిస్తున్నారు. (కొందరు నెట్సెంటర్ల నిర్వాహకులు ఓటరు కార్డును రూ.10కే దరఖాస్తు చేస్తున్నారు). తర్వాత పాస్పోర్టుకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన కొందరు ఆఫ్రికా జాతీయుల్లా.. చూడగానే వారు విదేశీయులు అని ఇట్టే చెప్పేలా ఉంటారు. అలాంటి వారికి పాస్పోర్టులు రావడం చూసి అవాక్కవుతున్నారు. పాతబస్తీలో మయన్మార్, బంగ్లాదేశ్, యెమెన్ దేశాలకు చెందిన శరణార్థుల్లో చాలామంది అక్రమమార్గంలో పాస్పోర్టులు సంపాదించారు. వీరిలో కొందరిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా పట్టుబడని వారు చాలామందే ఉన్నారని సమాచారం. విదేశీయుల డేటా నిరంతరం నిర్వహించకపోవడం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాస్పోర్టు జారీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
కిరాతకం: తల్లీకూతుళ్ల దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో దారుణం జరిగింది. పవిత్ర శుక్రవారం రోజున ఇంటిని శుద్ధి చేసుకుంటున్న సమయంలో దుండగులు తల్లీకూతుళ్లను బలితీసుకున్నారు. కత్తులతో పొడిచి హత్యచేశారు. చాంద్రాయణగుట్టలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న జంట హత్యల ఉదంతం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. తాళ్లకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ హుస్సేన్, షహజాది బేగం (60) దంపతులు. వీరి కుమార్తె ఫరీదా బేగం (32) కూడావీరితోనే ఉంటోంది. అల్లుడు మెహతాŒ ఖురేషీ సౌదీలో ఉంటున్నారు. ఫరీదా బేగానికి ఇద్దరు కుమార్తెలు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఫరీదా బేగం పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. తండ్రి హుస్సేన్ టీ తాగేందుకని చాంద్రాయణగుట్టకు వెళ్లారు. దీంతో ఇంట్లో షహజాది బేగం, ఫరీదా బేగం మాత్రమే ఉన్నారు. కొద్దిసేపటి అనంతరం హుస్సేన్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే ఇంట్లో నుంచి ఇద్దరు దుండగులు బయటికి పారిపోతూ కనిపించారు. హుస్సేన్ అనుమానంతో లోనికి వెళ్లి చూడగా భార్య, కూతురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆయన ఫలక్నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఫరీదా బేగం మెడలో కత్తిని దించడంతో పాటు ఛాతి, కడుపు భాగాల్లో కూడా పొడిచినట్లు గుర్తించారు. షహజాదీ శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే పోలీసులు క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య జరిగిన గది నుంచి పక్కనే ఉన్న ప్రధాన రహదారి వరకు జాగిలం రెండుసార్లు వెళ్లివచ్చింది. ఫరీదాబేగం భర్త సోదరుడే నిందితుడు..? ఫరీదాబేగం భర్త మెహతాబ్ ఖురేషీ సోదరుడు రెహమాన్ ఖురేషీనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌదీలో రెహమాన్ పనిచేస్తూ కొంత డబ్బును తన సోదరుడు మెహతాబ్కు పంపించాడు. ఆ డబ్బుకు మరింత కలిపి ఘాజీమిల్లత్ కా>లనీలో మెహతాబ్ ఇల్లు కొని తన అత్త షహజాదీ బేగంపై రిజిస్ట్రేషన్ చేయించాడు. కొన్నాళ్ల అనంతరం ఇక్కడికి వచ్చిన రెహమాన్ ఇంటిలో తనకు వాటా ఇవ్వాలని కోరాడు. ఇల్లు ఇవ్వలేమని.. సగం డబ్బు ఇస్తామని అతని వదిన ఫరీదా పేర్కొంది. ఈ విషయమై పంచాయతీ పెట్టి అతనికి డబ్బులు చెల్లించారు. కానీ తన డబ్బుతో ఇల్లు కట్టుకొని.. ఫరీదా బేగం తల్లి షహజాది బేగం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించడం.. తనకు నామమాత్రపు డబ్బులు ఇచ్చారనే కోపంతో రెహమాన్ రగిలిపోయాడు. ఇందుకు ప్రధాన కారణమైన వదిన ఫరీదా, ఆమె తల్లి షహజాదీలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అదను చూసి శుక్రవారం ఉదయం తన దగ్గరి బంధువు ముల్తాన్ ఖురేషీతో కలిసి ఇద్దరిని అంతమొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా జంట హత్యలు పథకం ప్రకారం చేశారా? అదనుకోసం పలుమార్లు రెక్కీ నిర్వహించి దారుణానికి పాల్పడి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. మెహతాబ్ ఖురేషీ పాత్రపైనాఅనుమానాలు.. మృతురాలు ఫరీదా బేగం భర్త మెహతాబ్ ఖురేషీకి ముగ్గురు భార్యలు. వీరిలో ఫరీదా బేగం రెండో భార్య. సౌదీలో వ్యాపారం చేస్తున్న మెహతాబ్ తమను సరిగా చూసుకోవడం లేదంటూ ఫరీదాబేగం, చాంద్రాయణగుట్టలో ఉంటున్న మరో భార్య తరచూ చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో గతంలో ఫిర్యాదులు సైతం చేశారు. మరో భార్య ముంబైలో ఉంటోంది. సౌదీలోనే ఉండే మెహతాబ్ అప్పుడప్పుడు చాంద్రాయణగుట్టకు వచ్చేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇలా కుటుంబ సభ్యుల్లో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేక జంట హత్యలకు మెహతాబ్ పరోక్షంగా కారకుడయ్యాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గజ్వేల్లో అంత్యక్రియలు.. హత్యకు గురైన తల్లీకూతుళ్ల మృతదేహాలకు గజ్వేల్లో అంత్యక్రియలు చేశారు. షహజాది బేగం మరో కుమార్తె గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటుండడంతో.. చాంద్రాయణగుట్టలో తమకు ఎవరూ లేరని.. తన తల్లి, సోదరి అంత్యక్రియలను తమ ప్రాంతంలో జరుపుకొంటామని కోరడంతో పోలీసులు మృతదేహాలను ఆమెకు అప్పగించారు. దీంతో గజ్వేల్లో వారి అంత్యక్రియలు జరిగాయి. -
పాతబస్తీ నుంచి తరలి వెళుతున్న వ్యాపారం..
చార్మినార్: బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు పాతబస్తీ ప్రధాన వ్యాపార కేంద్రం. నిజానికి నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు ఆభరణాల క్రయవిక్రయాలకు ఆదరణ ఉంది. అయితే కొంత కాలంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 2000 వరకు దుకాణాలున్న పాతబస్తీలో సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఒకప్పటి వ్యాపారాలు ఇప్పుడు కనిపించడం లేదు. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అడ్దదిడ్డమైన ట్రాఫిక్కు తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ తమ బ్రాంచీలను నామమాత్రంగా కొనసాగిస్తునే... నగరంలో శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు... హెదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్కు వచ్చే పర్యాటకులకు చార్కమాన్లోని నగల దుకాణాలు ముందుగా దర్శనమిస్తాయి. పాతబస్తీ సంస్క ృతికి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడి బంగారు, వెండి, ముత్యాల నగల దుకాణాలు ప్రసిద్ధి చెందాయి. నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనాల పార్కింగ్కే సరైన పార్కింగ్ లేదని... ఇక కార్లు తదితర వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వినియోగ దారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటుపడుతున్నాయంటున్నారు. పాతబస్తీలోని చార్మినార్, చార్కమాన్, గుల్జార్హౌజ్, శాలిబండ, కాలికమాన్, మిట్టికాషేర్, ఘాన్సీబజార్ తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి, ముత్యాల ఆభరణాల షోరూంలున్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో గిరాకీ తగ్గడంతో ఇక్కడి వ్యాపారస్తులు నగరంలోని అబిడ్స్, సిద్ధంబర్బజార్, గన్ఫౌండ్రి, బషీర్బాగ్, సికింద్రాబాద్, బేగంబజార్, మెహిదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తమ షోరూంలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టతరంగా మారుతాయని ఇMý్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్య రద్దీ... తప్పని ట్రాఫిక్ తిప్పలు.. నగరంలో ప్రథమంగా నగల దుకాణాలు చార్కమాన్లోనే ప్రారంభమయ్యాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 2000కు పైగా ఉన్న ఇక్కడి దుకాణాలు ప్రతిరోజు కస్టమర్లకు తమ సేవలను అందజేస్తున్నాయి. పాతబస్తీని సందర్శించడానికి వచ్చే పర్యాటకులే కాకుండా నగర శివారు జిల్లాల వినియోగదారులు కూడా చార్కమాన్లోని బంగారు నగల దుకాణాలకు వచ్చి తమకు అవసరమైన ఆభరణాలను ఖరీదు చేస్తుండడంతో ప్రతిరోజూ వినియోగదారులతో ఇక్కడి నగల దుకాణాలు రద్దీగా మారతాయి. ప్రస్తుతం ఇక్కడి వ్యాపార పరిస్థితులు గతంలో కన్నా భిన్నంగా తయారయ్యాయి. వినియోగ దారులు రావడానికి సరైన మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇక్కడ గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాభివృద్దికి అటు ప్రజాప్రతినిధులు గానీ...ఇటు సంబందిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ దుకాణాల ముందు వరకు వాహనాల రాకపోకలు అందుబాటులో లేకపోవడంతో పాటు చిరువ్యాపారులను సైతం తమ షో రూంల ముందు అక్రమంగా వ్యాపారాలు కొనసాగించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతించడంతో రోజురోజుకూ తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వలస కార్మికులు బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసిఇవ్వడానికి పని చేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాతబస్తీలో నివాసం ఉంటున్న వలస కార్మికులు దుకాణాల యజమానుల నుంచి బంగారాన్ని ఆర్డర్లపై తీసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి ఇస్తుంటారు. గ్రాముల వారిగా మేకింగ్ చార్జీలను తీసుకునే వలస కార్మికులకు ఆర్డర్లు కరువయ్యాయి. దీంతో వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. పాతబస్తీకే గుండెకాయగా నిలిచిన నగల వ్యాపారాలు ఎంతో మంది వలస కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఆభరణాలను తయారు చేయడానికి ఎంతో మంది యువకులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆర్డర్లపై నగలను తయారు చేసి ఆయా దుకాణాలలోఅప్పగించి ఉపాధి పొందుతున్నారు. బెంగాళీలు గుల్జార్హౌజ్, కోకర్వాడీ, మామాజుమ్లా పాటక్, మూసాబౌలి, ఘాన్సీబజార్, జూలా, బండికా అడ్డా తదితర ప్రాంతాలలో చిన్న చిన్న ఖార్ఖానాలను ఏర్పాటుచేసుకొని బంగారు ఆభరణాలనుతయారు చేస్తున్నారు. ఇలా చార్కమాన్లోని నగల దుకాణాలు ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే... రాబోయే రోజుల్లోపాతబస్తీలో బంగారం, వెండి వ్యాపారాలుకనుమరుగయ్యే పరిస్థితలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వీడియో: పాతబస్తీలో విచ్చలవిడిగా!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రెండు చిన్న గ్యాంగ్ల మధ్య వాగ్వాదం మొదలై గొడవగా మారింది. దీంతో రెండు గ్యాంగ్లు రోడ్డుపైనే విచ్చలవిడిగా కొట్టుకున్నాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు నమోదు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్సాబ్ కుంట వద్ద ఈ ఘటన జరిగింది. చిన్నరోడ్ ప్రమాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో ప్రారంభమైన చిన్న గొడవ పెద్దదై.. రెండుగ్రూపులుగా మారి యువకులు కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు 100కు డయల్ చేయడంతో ఫలక్ నుమా పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలో గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన రెండు గ్యాంగ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు -
కోస్తా బరిలో బస్తీ పుంజు
చాంద్రాయణగుట్ట: కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పాతబస్తీ పహిల్వాన్లు కోడి పుంజులను పెంచేందుకు కూడా అంతే ఆసక్తి చూపుతున్నారు. తమ ఇంట్లోని పిల్లల్లా ఎంతో జాగ్రత్తగా సాకడమేకాదు.. వాటిని సంక్రాంతి బరిలోకి సైతం దించుతున్నారు. పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే కోడి పందాల్లో పాతబస్తీ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో పందెం రాయుళ్లు లక్షల ధనం వెచ్చించి ఏటా ఇక్కడి నుంచే కోడి పుంజులను తీసుకెళ్లడం విశేషం. తొలినుంచి పాతబస్తీ వాసులు గొర్రెలు, మేకలను పెంచడం ఆనవాయితీ. అయితే, పందెం కోళ్లకున్న డిమాండ్ను బట్టి వాటికి ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేకమైన మేతను సైతం పెడుతున్నారు. ప్రతిరోజు బాదం, పిస్తా, అక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్ల సొనను ఆహారంగా ఇస్తారు. అంతేకాదండోయ్.. ముఖ్యంగా ప్రతిరోజు నైపణ్యం కలిగిన కోచ్లతో రెండు పూటలా మసాజ్తో పాటు అలసిపోకుండా పరుగు, ఈత కొట్టిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటిని ప్రత్యేక ఎన్క్లోజర్లలో పెట్టి పెంచడం గమనార్హం. నచ్చితే చాలు.. ధర ఓకే.. కోస్తాంధ్ర, రాయలసీమలలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద కోడిపుంజు తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకంతో కోళ్లను తీసుకెళతారు. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని ఇక్కడి పహిల్వాన్లు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో పుంజులను విక్రయిస్తుంటారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి ఇస్తుంటారు. -
వరంగల్కు మాస్టర్ప్లాన్.. పాతబస్తీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని నీతి ఆయోగ్ చెప్పిందన్న ఒక ప్రశ్నకు సమాధానంగా.. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లో నీటి కొరత చాలా తక్కువగా ఉంద ని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరా బాద్కి నీటి సరఫరా సమస్య తలెత్తదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ను టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేందుకు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగిం చామని, చార్మినార్, గోల్కొండలకు ప్రపంచ వారసత్వ హోదా సంపాదించేందుకు ప్రయత్నిస్తు న్నామన్నారు. యూరప్, అమెరికా వంటి ప్రాంతా ల నుంచి మరిన్ని ఎక్కువ విమాన సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని, అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో నూతనంగా 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణాలకు ఆమోదం తెలిపామన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై సీఎం నేతృత్వంలోని కేబినెట్ సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఈ చట్టాన్ని పార్లమెంట్లో వ్యతిరేకించినందుకు మద్దతుగా నిలుస్తున్న నెటిజ న్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ హిందూ–ముస్లిం కమ్యూనల్ కార్డుని వాడుతుం దని, దీన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తారని ఒకరు అడిగిన ప్రశ్నకు.. ప్రజలను విభజించే ఎలాంటి ఎజెండానైనా ఎదుర్కొనేంత తెలివైనవారు తెలంగాణ ప్రజలు అని కేటీఆర్ బదులిచ్చారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే శాంతియుతమైందని, ఈ శాంతిని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సల్వకాలమే అవి సక్సెస్.. హైదరాబాద్లో శాంతియుత ధర్నాలకు అనుమతు ల విషయాన్ని అడగ్గా, కొద్దిరోజుల సమయంలోనే ఆర్ఎస్ఎస్, ఎంఐఎం లాంటి సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఐదు త్రైమాసికాల్లో వరుసగా తగ్గుతున్న ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలను చేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అవి స్వల్పకాలం మాత్రమే సక్సెస్ అవుతాయని, అంతిమంగా ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి వంటి కఠిన ప్రశ్నలకు కచ్చితంగా ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నేత ఆయనే.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకున్నా, తమ 60 లక్షల కార్యకర్తలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై తమకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారం వస్తుందని కేటీఆర్ అన్నారు. 2009లో రోడ్లపైన తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నుంచి, 2019లో మంత్రి స్థాయిలో పాలన చేస్తున్న పరిస్థితి వరకు జరిగిన పరిణామ క్రమాన్ని ‘టెన్ ఇయర్ చాలెంజ్’అంటూ స్పందించారు. టీఆర్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే తనకు మంత్రి పదవి దక్కిందన్న కేటీఆర్, మంత్రి పదవి కన్నా తనకు పార్టీ పదవే విలువైందని తెలిపారు. తనను అత్యధికంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకుడు సీఎం కేసీఆరే అని చెప్పారు. 2019 లో అన్ని జిల్లా పరిషత్ లను గెలుచు కోవడం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిందన్నారు. పాతబస్తీకి మెట్రో.. గచ్చిబౌలికి బీఆర్టీఎస్! హైదరాబాద్లో బీఆర్టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో కూకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలను కలిపే ప్రణాళిక ప్రారంభమైందన్నారు. పాతబస్తీకి కూడా మెట్రో రైలు సౌకర్యం వస్తుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్లాలని తాము చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందన్నారు. గోపనపల్లిలో విస్తృతంగా పెరుగుతున్న పలు గేటెడ్ కమ్యూనిటీలకు ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ నుంచి రోడ్డు లేదని, దీన్ని నూతన స్లిప్ రోడ్డు నిర్మాణంలో కవర్ చేస్తామన్నా రు. ఎల్బీనగర్లో ఇప్పటికే ఒక ఫ్లైఓవర్ పూర్తయిం దని మరో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు వస్తాయ న్నారు. 111 జీవోలో ఏదైనా మార్పు, చేర్పులు అవసరమైతే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అనంతగిరి, వికారాబాద్ ప్రాంతాలను గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం చేస్తారా అన్న ప్రశ్నకు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వాటి ఫలాలు త్వరలో చూస్తారని చెప్పారు. చేనేతకు పెద్ద ఫ్యాన్.. సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి నేరుగా స్పందన తెలుస్తుందని, తన పైన మర్యాద పూర్వకమైన మీమ్లు (హాస్యపూరిత చిత్రాలు) వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే దాదాపు మంత్రులంతా సోషల్ మీడియా లో చురుగ్గా భాగస్వాములయ్యారన్నారు. చేనేత వస్త్రాలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యం విద్య పట్టణ గ్రామీణ మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నారు. జనవరిలో వరంగల్కు మాస్టర్ప్లాన్ నూతన మున్సిపల్ చట్టంతో పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, మున్సిపల్ అధికా రుల విచక్షణతో సంబంధం లేకుండా ప్రజల అవస రాలు తీరుతాయని, ఈ మార్పులను వ్యవస్థీకృతం చేసేందుకు నూతన చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో డంప్ యార్డులు, వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. ఇంకా వెతుకుతున్నా.. తన కూతురితో ఉన్న ఫొటోపై ఓ నెటిజన్ కోరిక మేరకు కేటీఆర్ స్పందించారు. నా కూతురు వేగం గా ఎదుగుతోందని ఉప్పొంగిపోయారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అభినందించారు. డీజీపీ, హైదరాబాద్ సీపీకి శుభా కాంక్షలు తెలిపారు. కుటుంబాన్ని, వృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటారన్న నెటిజన్ ప్రశ్నకు.. ‘ఇంకా వెతుకుతున్నా’అని సమాధానమిచ్చారు. జగన్ పాలన.. మంచి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరు నెలల పాలనపైన స్పందించిన కేటీఆర్.. ‘ఒక మంచి ప్రారంభం’అని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరైందో కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నాయకత్వ లేమితో తెలంగాణ తల్లడిల్లుతుందన్న కామెం ట్లు చేసిన పలువురు, ఆంధ్ర రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేయాలని కోరడం, ఆ దిశగా తెలం గాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నడిపినం దుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేవి ఇవే..! అంతర్జాతీయ స్థాయి తయారీ రంగ కంపెనీల నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని.. ఇప్పటికే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొ చ్చాయని కేటీఆర్ చెప్పారు. 2020లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్ లో రెండో దశ టీహబ్–టీవర్క్స్ 2020 మొదటి అర్ధసంవత్సరంలో, జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతాయన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం దిశగా అనేక ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసు కుంటున్నాయని, ఇందులో భాగంగా తెలం గాణ ప్రభుత్వం కూడా ఇన్నొవేషన్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రాన్ని పాటిస్తోందని, పట్టణాభివృద్ధితో పాటు మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
పెన్షన్ దొంగల ముఠా అరెస్ట్ !
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ వృద్ధుల ఆసరా పెన్షన్ల పథకంలో కుంభకోణానికి పాల్పడిన ముఠాలోని నలుగురిని సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంపై హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళఙతే... పాత బస్తీకి చెందిన 250మంది ఆసరా పెన్షన్లను ఈ ముఠా మూడు నెలల నుండి డైవర్ట్ చేస్తున్నట్లు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇమ్రాన్ సోహెల్ అస్లాం సహాయంతో ఎమ్మార్వో పాస్వర్డ్తో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
కొనసాగుతున్న మొహర్రం ఊరేగింపు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహర్రం ఊరేగింపు కొనసాగుతోంది. డబిల్ పుర నుంచి చార్మినార్ వరుకు జరిగే ర్యాలీ సందర్భంగా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా పోలీసులను మోహరించారు. పూర్తిస్థాయి భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని సీపీ అంజనికుమార్ తెలిపారు. ఈ ర్యాలీ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో నేడు కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయని.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని వెల్లడించారు. గణేష్ నిమజ్జనాల సమయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ, నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఓల్డ్సిటీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్ అంజనీ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని, వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. ♦ డబీర్పుర వైపు నుంచి ఆల్వా బీబీ వైపు వచ్చే వాహనాలను సునార్ గల్లీ ‘టి’ జంక్షన్ నుంచి మత్తాకీ ఖిడ్కీ వైపు మళ్లిస్తారు. ♦ డబీర్పుర వైపు నుంచి వచ్చేవాహనాలను షేక్ ఫైజా కమాన్ వైపు అనుమతించకుండా జబ్బీర్ హోటల్ వైపు పంపిస్తారు. ♦ యాకత్పుర రైల్వే స్టేషన్ నుంచి షేక్ ఫైజా కమాన్ వైపు వెళ్లే వాహనాలను బడా బజార్ ‘టి’ జంక్షన్ నుంచి చావ్నీ మీదుగా మీర్ జుల్మా తలాబ్కట్ట వైపు పంపిస్తారు. ♦ పురానీ హవేలీ నుంచి ఏతిబజార్ చౌక్ వచ్చే వాహనాలను సెట్విన్ చౌరస్తా నుంచి డబీర్పుర వైపు మళ్లిస్తారు. ♦ మిట్టీ కా షేర్ నుంచి ఏతిబజార్ వైపు వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మదీనా చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ మొఘల్పుర నుంచి కోట్ల అలీజా వైపు వెళ్లే వాహనాలను బీబీ బజార్ చౌరస్తా నుంచి తలాబ్కట్ట వైపు మళ్లిస్తారు. ♦ మొఘల్పుర వాటర్ ట్యాంక్ నుంచి చౌక్ మదీనా ఖాన్ వైపు వచ్చే వాహనాలను హఫీజ్ ధంకా మసీదు నుంచి శాలిబండ వైపు పంపిస్తారు. ♦ శాలిబండ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను పార్శీ కేఫ్ నుంచి మొఘల్పుర వైపు పంపిస్తారు. ♦ పురానాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను చౌక్ ముర్గాన్ నుంచి ఛేలాపురా, షాగుంజ్, ఖిల్వత్ వైపు పంపిస్తారు. ♦ హిమ్మత్పురం నుంచి ఖిల్వత్, లాడ్ బజార్ వైపు వెళ్లే వాహనాలను మోతీగల్లీ నుంచి మూసాబౌలి వైపు మళ్లిస్తారు. ♦ షక్కీర్కోటి నుంచి వచ్చే వాహనాలను మిట్టీ కా షేర్ నుంచి ఘాన్సీబజార్, ఛేలాపుర వైపు పంపిస్తారు. ♦ సిటీ కాలేజ్, ముస్లింజంగ్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను న్యూ బ్రిడ్జ్ నుంచి అఫ్జల్గంజ్ వైపు మళ్లిస్తారు. ♦ నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా చౌరస్తా నుంచి సిటీ కాలేజ్ వైపు పంపిస్తారు. ♦ చాదర్ఘాట్, సాలార్జంగ్ బ్రిడ్జి, నూర్ ఖాన్ బజార్ వైపు నుంచి వచ్చే వాహనాలను దారుష్షిఫా చౌరస్తా నుంచి నయాపూల్ వైపు పంపిస్తారు. ♦ చాదర్ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలను కాలీఖబర్ వైపు పంపించరు. వీటిని శాంతి లాడ్జ్ వద్ద నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జి వైపు పంపిస్తారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఇలా ♦ మొహర్రం ఊరేగింపు నేపథ్యంలోసికింద్రాబాద్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవిమంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉంటాయి. ♦ ట్యాంక్బండ్, కర్బాలా మైదాన్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ నుంచి కవాడీగూడ, బైబిల్హౌస్, ఆర్పీ రోడ్ మీదుగా మళ్లిస్తారు. ♦ కర్బాలా మైదాన్ మీదుగా ఆర్పీ రోడ్కు వెళ్లే ట్రాఫిక్ను బేగంపేట్ పాత ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి ట్యాంక్బండ్ రోడ్ మీదుగా పంపిస్తారు. ♦ ఎంజీ రోడ్, సెంట్రల్ టెలిగ్రాఫిక్ ఆఫీస్ ఐలాండ్, రాణిగంజ్ మధ్య వన్వే అమలులో ఉంటుంది. కేవలం రాణిగంజ్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ట్రాఫిక్ను రాణిగంజ్ చౌరస్తా నుంచి మినిస్టర్స్ రోడ్ వైపు పంపిస్తారు. -
పడకలు లేవని ముప్పు తిప్పలు
సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్కు రిఫర్ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్ బారో సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్కు రిఫర్ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్ మాత్రమే కాదు.. వైరల్ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది. -
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. -
బోనాల జాతర షురూ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు. పాతబస్తీలో మొదలైన సందడి మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
బస్తీకి బంద్?
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: పాతబస్తీకి మెట్రో రైలు ప్రయాణం కలగానే మిగలనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పనులు చేపట్టేందుకు ఇప్పటికే అలైన్మెంట్ (మార్గం) పరిశీలన జరిగినప్పటికీ సవాలక్ష సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎంజీబీఎస్ – ఫలక్నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు దాదాపు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. మరో 69 ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించాలి. పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించాలి. ఇవన్నీ నిర్మాణ సంస్థకు కత్తిమీద సాములా మారాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టేందుకు ఎల్అండ్టీ విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్తుల సేకరణలో భాగంగా నష్టపరిహారం చెల్లించేందుకు దాదాపు రూ.100 కోట్లకు పైగా అవసరం. ఇక ఎంజీబీఎస్ – ఫలక్నుమా మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం.. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా, షంషీర్గంజ్ ప్రాంతాల్లో ఐదు స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు రూ.1250 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. మరోవైపు ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు మరో రెండేళ్లు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. ఇక ఈ రూట్లో దాదాపు 69 ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా మెట్రో మార్గాన్ని బహదూర్పురా, కాలపత్తర్, ఫలక్నుమా మీదుగా మళ్లించాలని గతంలో డిమాండ్లు వినిపించిన విషయం విదితమే. ఈ సమస్యల కారణంగానే ఎల్అండ్టీ ఓల్డ్సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా ఖర్చులతో రూ.4వేల కోట్లు నిర్మాణం వ్యయం పెరిగిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని ఎల్అండ్టీ వర్గాలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మెట్రో కోసం పోరాటం... పాతబస్తీకి మెట్రో కోసం రాజకీయ పార్టీలు పోరాటం కూడా చేశాయి. అయితే ప్రాజెక్టు మార్కింగ్లకే పరిమితవగా, ఇప్పటి వరకు ఒక్క పిల్లర్ ఏర్పాటు కాలేదు. మూసీనదిలో ఎంజీబీఎస్ వద్ద మాత్రమే రైలు రివర్సల్ సదుపాయం కోసం రెండు పిల్లర్లు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో వెంటనే మెట్రో పనులను ప్రారంభించాలని కోరుతూ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ జాయింట్ యాక్షన్ కమిటీ గతంలో ఎన్నో ఆందోళనలు చేసింది. మజ్లిసేతర పార్టీల నాయకులందరూ ఏకమై 2017 నవంబర్ 21న జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ సహా మిగతా పార్టీల నాయకులు ఈ జేఏసీలో భాగమై పాతబస్తీలో మెట్రో అవసరం, ప్రాధాన్యాన్ని వివరిస్తూ హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 2017 డిసెంబర్ 17న మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2018 ఆగస్టు 25న మెట్రో రైలు అలైన్మెంట్ పనులను ప్రారంభించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు పాతబస్తీలో పర్యటించారు. గతంలో ప్రతిపాదించిన విధంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులు చేపట్టడానికి ప్రాజెక్టు అధికారుల బృందం మార్గాన్ని పరిశీలించింది. ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్నుమా వరకు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా... ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ఆలస్యం ఎందుకు? పాతబస్తీలో మెట్రో పనులు చేపట్టకపోవడం సరైంది కాదు. గతంలో మెట్రో పనులను మజ్లిస్ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం మజ్లిస్ పనుల ప్రారంభానికి ముందుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పాతబస్తీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.– ఇ.టి.నర్సింహ, జేఏసీ నాయకులు (సీపీఐ) పనులు ప్రారంభించాలి ముందుగా ప్రకటించినట్లుగానే దారుషిఫా నుంచే మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గడువు లోగా మెట్రో పనులు ప్రారంభించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి. – కె.వెంకటేశ్, జేఏసీ నాయకులు (కాంగ్రెస్) -
ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారిన ఎంపీ..!
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ కానిస్టేబుల్గా మారారు. పాతబస్తీలోని ఫతే దర్వాజా చౌరస్తాలో వాహనాలు అడ్డదిడ్డంగా వెళ్లడంతో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్ అయింది. అదేసమయంలో ఎంపీ అసదుద్దీన్ కూడా చార్మినార్ నుంచి మిస్రాజ్గంజ్వైపు వెళ్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎంపీ వాహనదారులకు తగు సూచనలు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్వయంగా ఎంపీ కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పూనుకోవడంతో అక్కడున్న మిగతావారు ఆయనకు తోడుగా నిలిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంజాన్ మాసం కావడంతో ఫతే దర్వాజా చౌరస్తాలో రద్దీ ఎక్కువడా ఉంటుందని, వ్యాపారులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరడంతో ఈ కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాలుగోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పట్టు పెంచిన మజ్లిస్
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ పరిధిలో వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ మెరుగుపడినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ పోలైన ఓట్లలో బీజేపీ మినహా ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంక్ చేజారకుండా మరింత పెంచుకోగలిగాయి. లోక్సభ స్థానానికి ప్రధాన పక్షాలైన మజ్లిస్, బీజేపీ నుంచి పాత అభ్యర్థులు తలపడగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ పక్షాలు కొత్త ముఖాలను బరిలో దింపాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడగా పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లను మజ్లిస్ పార్టీ దక్కించుకుంది. గత లోకసభ ఎన్నికల కంటే ఆరు శాతం అధికంగా మజ్లిస్ పార్టీకి ఓట్లు పెరగగా, బీజేపీ మాత్రం ఓట్లు పెంచుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. గత ఎన్నికల కంటే 6.3 శాతం తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే మాత్రం ఓట్ల శాతం పెరిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాత ఓటు బ్యాంకు మాత్రమే పునరావృత్తమైంది. టీఆర్ఎస్ కొంత మొరుగుపడింది. మజ్లిస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగినా మెజార్టీలో వెనుకబడింది. ఎన్నికల బరిలో ఇలా... హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి నాలుగోసారి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించగా, బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ఫిరోజ్ఖాన్కు ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటికే ఆయన నాంపల్లి అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అధికార టీఆర్ఎస్ పక్షాన బరిలో దిగిన న్యాయవాది శ్రీకాంత్ గెలవలేకపోయినా ఓటు బ్యాంక్ను పెంచుకోగలిగారు. సెగ్మెంట్ వారిగా ఇలా... అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ శాతం పెరిగినట్లు కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి మలక్పేటలో 43.2 శాతం, కార్వాన్లో 53.2, చార్మినార్లో 53.7, చాంద్రాయణగట్టలో 68, యాకుత్పురాలో 49.3, బహదూర్పురాలో 75 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి మలక్పేటలో 16.2 శాతం, కార్వాన్లో 22.7, గోషామహెల్లో 45.4, చార్మినార్లో 21.12, చాంద్రాయణగుట్టలో 10.8, యాకుత్పురాలో 11.8 శాతం, బహదూర్పురాలో 5.7 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్కు నామమాత్రపు ఓట్ల పోలైనప్పటికి ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓటు బ్యాంక్ మరికొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది. -
భద్రతా వలయంలో భాగ్యనగరం
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిన రోజైన మే 18 (శనివారం) నేపథ్యంలో నగర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టింది. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన విషయం విదితమే. నగరంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గతానికి భిన్నంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు కోసం సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, టీఎస్ఎస్పీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ఏఎఫ్, క్యూఆర్టీ బలగాలను మోహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా ఏర్పాటుకు పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరిస్తున్నారు. గతంలో సమస్యాత్మక పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడేందుకుగాను షాడో టీమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్లను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిఘా ఉంచారు. పాతబస్తీతో పాటు దక్షిణ మండలం, పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇందుకుగాను అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. నగర వ్యాప్తంగా బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేయనున్నాయి. ఈ బందోబస్తు పర్యవేక్షణ కోసం కొందరు ఐపీఎస్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాను కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. వీరు శనివారం ఆద్యంతం ఆయా ప్రాంతాలకు బాధ్యత వహించనున్నారు. అధికారి ఇన్చార్జ్ శికా గోయల్, అదనపు సీపీ ⇔ సౌత్ జోన్ డీఎస్ చౌహాన్, అదనపు సీపీ ⇔ నగరం మొత్తం పర్యవేక్షణ టి.మురళీకృష్ణ, అదనపు సీపీ⇔ మాదన్నపేట, సైదాబాద్ అవినాష్ మహంతి, సంయుక్త సీపీ⇔ గోషామహల్, ఆసిఫ్నగర్ డివిజన్లు బీఎస్పీ రవికుమార్, కమాండెంట్⇔మీర్చౌక్, చార్మినార్ డివిజన్లు ఐఆర్ఎస్ మూర్తి, కమాండెంట్ ⇔సంతోష్నగర్ డివిజన్ ఎంఏ బారీ, అదనపు డీసీపీ ⇔ అంబర్పేట జి.జోగయ్య, అదనపు డీసీపీ ⇔ మొఘల్పుర, భవానీనగర్ ఎంఆర్ బేగ్, కమాండెంట్ ⇔ చార్మినార్/మక్కా మసీదు ఎం.కృష్ణారెడ్డి, అదనపు డీసీపీ ⇔ టప్పాచబుత్ర, కుల్సుంపుర వి.దేవేందర్కుమార్, అదనపు డీసీపీ ⇔ బాంబు నిర్వీర్య బృందాలు మద్దిపాటి శ్రీనివాసరావు, అదనపు డీసీపీ ⇔ మంగళ్హాట్, షాహినాయత్గంజ్ కేఎన్ విజయ్కుమార్, ఏసీపీ⇔ అంబర్పేట్ ఎన్బీ రత్నం, ఏసీపీ ⇔ హుస్సేనిఆలం, షాలిబండ -
పాతబస్తీలో కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురు చిన్నారులను రక్షించారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట చీరల వ్యాపారి ఫజల్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు మహిళలను పోలీసులు అదులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం రూ. 10వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే నిందుతులు ఇంకా ఎవరైనా చిన్నారులను కిడ్నాప్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
బాలుడి సమాచారం... భారీ నేరం
ఓ బాలుడు ఇచ్చిన సమాచారంతో బందిపోటు ముఠా భారీ దొంగతనానికి పాల్పడింది. పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11కిలోల వెండిని దోచుకెళ్లింది. సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11 కేజీల వెండిని దోచుకెళ్లిన బందిపోటు ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఆ దుకాణంలో పని చేసిన, దాని యజమాని సమీప బంధువు అయిన బాలుడు ఇచ్చిన సమాచారంతో పాత నేరగాళ్లు ఈ పని చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. నిందితులను నుంచి సొత్తును రికవరీ చేశామన్నారు. అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్తో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శాలిబండకు చెందిన అజర్ ఫతేదర్వాజా చౌరస్తా ప్రాంతంలో జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడి సమీప బంధువైన ఓ బాలుడు గతంలో ఈ దుకాణంలో పని చేశాడు. అప్పట్లో దుకాణానికి ఆలస్యంగా వచ్చినా, సరిగ్గా పని చేయనందుకు దండించాడు. కొన్ని సందర్భాల్లో ఈ బాలుడి తండ్రికి అజర్ మిగిలిన బంధువుల ముందు అకారణంగా అవమానించే వాడు. దీంతో సదరు మైనర్ మాజీ యజమానిపై కక్షకట్టాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు అనువైన సమయం, అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇదిలా ఉండగా ఖాజీపురాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ గతంలో ట్రావెల్ బిజినెస్తో పాటు చికెన్ సెంటర్ నిర్వహించాడు. దాదాపు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో వీటి నుంచి బయటపడేందుకు ఏదైనా నేరం చేయాలని భావించాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన సదరు మైనర్తో పాటు ఖాజిపుర వాసి మహ్మద్ ఆసిఫ్తో చెప్పాడు. అప్పటికే అజర్పై కక్షతీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాలుడు వెంటనే స్పందించాడు. అజర్ ప్రతి రోజు రాత్రి దుకాణం మూసిన తర్వాత ఆభరణాలను బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకుçవస్తాడని తెలిపాడు. దీంతో అతడిని దోచుకోవాలని పథకం పన్నిన నిజాముద్దీన్ తన స్నేహితులైన ఫలక్నుమా వాసులు షేక్ ఖాలిద్, మహ్మద్ జావేద్ఖాన్, మిశ్రీగంజ్కు చెందిన మహ్మద్ ముఖరం అహ్మద్లతో చర్చించాడు. వారందరూ ఈ నేరంలో సహకరించడానికి అంగీకరించడంతో నిజాముద్దీన్ బందిపోటు దొంగతనానికి స్కెచ్ వేశాడు. అజర్ కదలికలపై సమాచారం అందించే బాధ్యతలను మైనర్ నిర్వహించాడు. మిగిలిన ఆరుగురూ మూడు బృందాలుగా విడిపోయారు. అజర్ దుకాణం నుంచి ఇంటికి వెళ్లేందుకు మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి. రెక్కీ ద్వారా ఈ విషయం గుర్తించిన నిజాముద్దీన్ ఒక్కో బృందాన్ని ఒక్కో మార్గంలో కాపుకాసేలా చేశాడు. ఇందుకుగాను తన రెండు బైక్లతో పాటు ఖాలిద్కు చెందిన మరో దానిని వినియోగించారు. ఈ నెల 17 అర్థరాత్రి పథకం అమలు చేయాలని నిర్ణయించుకున్న నిజాముద్దీన్ తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఒక్కో బృందం ఒక్కో మార్గంలో కాపుకాసింది. ఆసిఫ్, ఖాలిద్లతో కూడిన టీమ్ మాత్రం శాలిబండలోని జగన్నాథస్వామి దేవాలయం వద్ద వాహనంపై వేచి ఉంది. నగల బ్యాగ్తో అజర్ దుకాణంలో పని చేసే మరో బాలుడితో కలిసి అదే మార్గంలో వస్తున్నట్లు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి వచ్చిన బాధితుడిని బైక్పై ఫాలో అయిన ఈ ఇద్దరు దుండగులు ఓ ప్రాంతంలో అడ్డగించారు. వాహనం నడుపుతున్న ఆసిఫ్ వెంటనే అజర్పై దాడి చేయగా, వెనుక కూర్చున్న ఖాలిద్ తన వద్ద ఉన్న కారం పొడి చల్లాడు. ఈ హడావుడిలో నగల బ్యాగ్ను చేజిక్కించుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శాలిబండ ఠాణాలో కేసు నమోదైంది. దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్ వర్మ, వి.నరేందర్, మహ్మద్ తర్ఖుద్దీన్లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. నేరం జరిగిన ప్రాంతంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను అధ్యయనం చేశారు. ఫలితంగా దుండగులు వాడిన వాహనాల వివరాలతో పాటు వారి ఆనవాళ్లు గుర్తించింది. వీరి కోసం వేటాడిన పోలీసులు సోమవారం మైనర్ సహా ఆరుగురినీ అదుపులోకి తీసుకున్నారు. అజర్ నుంచి లాక్కుపోయిన బ్యాగ్లో ఉన్న 11 కేజీల వెండిని విక్రయించేందుకు ఖాజిపురకు చెందిన మహ్మద్ సల్మాన్, సయ్యద్ జిలానీలకు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో వీరినీ పట్టుకున్న టాస్క్ఫోర్స్ బందిపోట్లు ఎత్తుకుపోయిన సొత్తు, నేరం చేయడానికి వినియోగించిన వాహనాలు రికవరీ చేశారు. ఐదుగురికీ నేరచరిత్ర... ఈ బందిపోటు గ్యాంగ్ లీడర్ నిజాముద్దీన్తో పాటు అతడికి సహకరించిన నలుగురు ప్రధాన అనుచరులకూ నేర చరిత్ర ఉంది. నిజాంను హుస్సేనిఆలం పోలీసులు కల్తీ నూనె విక్రయం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆసిఫ్పై ఇదే ఠాణాలో దోపిడీ కేసు నమోదై ఉంది. షేక్ ఖాలిద్ను వాహనచోరీ కేసులో అఫ్జల్గంజ్ పోలీసులు కటకటాల్లోకి పంపారు. కాలాపత్తర్ ప్రాంతంలో నివసించే ఘరానా నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి నేరగాడు బాంబ్ గౌస్కు ప్రధాన అనుచరుడు, స్నేహితుడు. ఈ నేపథ్యంలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అతడితో కలిసి అరెస్టు అయ్యాడు. ఫలక్నుమ ఠాణాలో రౌడీషీటర్గా ఉన్న జావేద్ ఖాన్పై మొత్తం 11 కేసులు ఉన్నాయి. మరో నిందితుడైన అంజాద్ బహదూర్పుర పరిధిలో జరిగిన వసీం పహిల్వాన్ హత్య కేసు, కాలాపత్తర్లో నమోదైన బెదిరింపు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. -
పాతబస్తీలో ప్రారంభమైన శోభాయాత్ర!
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్ బాగ్, రాణి అవంతీబాయ్ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్ షిఖా గోయల్ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్-13, టీయర్గ్యాస్ స్క్వాడ్స్-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. -
బద్దం బాల్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్రెడ్డి కన్నుమూశారు. బంజరాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు. అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకుల్లో బద్దం బాల్రెడ్డి ఒకరు. ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. బాల్రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బందిపోటు ముఠా గుట్టును కాలాపత్తర్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు గురువారం సీపీ అంజనీకుమార్ తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 17న కాలాపత్తర్లో దారి దోపిడీకి పాల్పడింది ఈ ముఠానే. మధ్యప్రదేశ్కు దీపంజాయ్ బుందేలా హైదరాబాద్కి వచ్చి.. చర్లపల్లి జైలులో ఉన్న తన సోదరుడిని ములాఖత్ ద్వారా కలిశారు. అయితే అదే రోజు దొంగల ముఠా సభ్యులు కూడా జైల్లో ఉన్న ఆఫ్రోజ్ ఖాన్ను కలిశారు. ఆ తర్వాత బుందేలా కదలికలను పసిగట్టిన ముఠా సభ్యులు సయ్యద్ యూనస్, సయ్యద్ అబద్దీన్లు తమను అతడికి పరిచయం చేసుకున్నారు. బుందేలా మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కి బయలు దేరగా.. నిందితులు తమ కారులో డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. కారులో వెళ్తుండగా కాలాపత్తర్లోని జీవన్ లాల్ మిల్క్ వద్ద బాధితున్ని కొట్టి 18 వేల రూపాయల నగదు, గోల్డ్ రింగ్ను చోరీ చేశారు. ముఠా సభ్యులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. వారిలో కొందరిపై పీడీ యాక్ట్లు కూడా ఉన్నాయ’ని తెలిపారు. -
పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. తెలంగాణలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సైక్లింగ్ పోలింగ్ జరిగినట్టు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనపై ఎన్నిక కమిషన్ విచారణకు ఆదేశించింది. స్పిరిట్తో సిరాచుక్కను చెరిపేందుకు ప్రత్యేక వ్యక్తులను కొన్ని పార్టీలు నియమించి, మహిళలతో మళ్లీ మళ్లీ ఓట్లు వేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైక్లింగ్ ఓటింగ్ జోరుగా సాగింది. ఒక్కో వ్యక్తితో వందల సంఖ్యలో ఓట్లు వేయించారు. -
పాతబస్తీలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్నా మలక్ పేట నియోజకవర్గం ఎంఐఎం పార్టీ ర్యాలీలో డ్రోన్ కెమెరాలు హాలచల్ చేశాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనతో పాటు, నిషేధిత డ్రోన్ కెమెరాలు ఉపయోగించడంతో చాదర్ ఘాట్ ఎస్ఐ, బీజేపీ నాయకులు నిర్వాహకులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పాతబస్తీలో అర్బయిన్ ర్యాలీ
చార్మినార్: హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన మరణించిన 40వ రోజును పురస్కరించుకొని మంగళవారం షియా ముస్లిం ప్రజలు పాతబస్తీ వీధుల్లో అర్బయిన్ (నిరసన) ర్యాలీని నిర్వహించారు. కోట్ల ఆలిజాలోని జాఫ్రీ మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీ కోట్లా ఆలిజా, ఎతేబార్చౌక్, మీరాలంమండి, పురానీహవేలి ద్వారా దారుషిఫా గ్రౌండ్ వరకు కొనసాగింది. షియా ముస్లింలు దారి పొడవున రక్తం చిందిస్తూ మాతం నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా మీర్చౌక్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా, మీర్చౌక్ ఏసీపీ ఆనంద్ తదితరులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. ర్యాలీలో నగరానికి చెందిన ప్రతినిధులతో పాటు కర్ణాటక, ముంబయి, చెన్నై తదితర ప్రాంతాలకు చెందిన అంజుమన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టార్గెట్ పాతబస్తీ!
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ ఓటు బ్యాంక్కు గండికొడుతున్న మజ్లిస్ (ఎంఐఎం)ను పాతబస్తీలోనే మట్టికరిపించేందుకు ఆ పార్టీ వ్యూహం రచిస్తోంది. వీటి మధ్య మైత్రి బంధం తెగిపోయినప్పటి నుంచి వివిధ రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బిహార్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మజ్లిస్ బరిలోకి దిగడంతో మైనారిటీ ఓట్లు చీలి, పట్టున్న స్ధానాల్లో సైతం కాంగ్రెస్ ఓటమి పాలైంది. మరోవైపు బీజేపీకి లాభం చేకూరింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మజ్లిస్పై సీరియస్గా ఉంది. తాజాగా తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్తో ఎంఐఎం దోస్తీ కట్టడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీని దెబ్బతీసి గుణపాఠం చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహ రచన చేస్తోంది. రెండు రోజుల క్రితం ఏకంగా కాంగ్రెస్ రథసారథి రాహుల్గాంధీ చార్మినార్లో జరిగిన రాజీవ్ సద్భావన యాత్ర సభలో పాల్గొని మజ్లిస్ పార్టీని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. అంతకముందు రాష్ట్ర స్థాయి అగ్ర నేతలు పాతబస్తీలోని ముస్లిం కుటుంబాలతో భేటీ అయ్యారు. పార్టీ జాతీయ మైనారిటీ సెల్ నేత నదీమ్ జావిద్ ఆదివారం ఇక్కడి మైనారిటీ నేతలతో సమావేశమై పాతబస్తీలోని రాజకీయ పరిస్ధితులపై చర్చించారు. పాతబస్తీలోని ప్రతి అసెంబ్లీ స్థానాన్ని సీరియస్గా తీసుకొని ఎన్నికల బరిలోకి దూకాలని కాంగ్రెస్ భావిస్తోంది. అవసరమైతే పార్టీ జాతీయ స్ధాయి ముస్లిం మైనారిటీ నాయకులను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. నాలుగింటిపై ప్రత్యేక దృష్టి... కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా మజ్లిస్ను టార్గెట్ చేసింది. ఎన్నికల బరిలో టీఆర్ఎస్, బీజేపీ పక్షాలు దిగే అవకాశం ఉన్నప్పటికీ... కేవలం మజ్లిస్పైనే దృష్టిసారించింది. పాతబస్తీ మజ్లిస్కు కంచుకోట కావడంతో ఇతర పక్షాలు తలపడడం అంత సులభం కాదు. మైనారిటీలు గణనీయంగా ఉండడంతో ఓటర్లు మొత్తం ఒకవైపు మొగ్గు చూపుతారు. గత ఎన్నికల ముందు వరకు మజ్లిస్తో దోస్తీ కారణంగా కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ చేస్తూ వచ్చింది. అంతకముందు వరకు పాతబస్తీలో కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ పెద్దగా లేకుండా పోయింది. తాజాగా పరిస్ధితులు తారుమారు కావడంతో కాంగ్రెస్... మజ్లిస్ను టార్గెట్ చేసింది. ఈసారి ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం మజ్లిస్కు ఏడు సిట్టింగ్ స్థానాలు ఉండగా... అందులో నాలుగు స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఎంఐఎంకు దీటైన పోటీ.. అక్బర్పై పహిల్వాన్ సై..!
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఎంఐఎంను ఎదుర్కొనేందుకు ఎంబీటీ (మజ్లిస్ బచావో తెహ్రీక్) పార్టీని కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. ఓల్డ్ సిటీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై భక్తచరణ్ దాస్ కమిటీతో కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. పొత్తులో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ పహిల్వాన్ కొడుకు గురువారమే భక్తచరణ్ దాస్ కమిటీని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫక్రుద్దీన్కు షాక్ కాంగ్రెస్ మైనారిటీ నేత ఫక్రుద్దీన్కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. టీపీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఫక్రుద్దీన్ను తొలగించి.. ఆయన స్థానంలో షేక్ అబ్దుల్లా సోహైల్ను అధిష్టానం నియమించింది. -
పాతబస్తీలో జెండా ఎగరేస్తాం
సాక్షి, సిటీబ్యూరో: ‘ముందస్తు’ ఎన్నికల్లో పాతబస్తీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, మజ్లిస్ కంచుకోటను బద్దలు కొడతామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో బలమైన అభ్యర్థులను బరిలో నిలుపుతామని చెప్పారు. పార్టీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాతబస్తీ ఏదో ఒక్క పార్టీ సొత్తు కాదని... ఇప్పటి వరకు దానిపై సీరియస్గా దృష్టి సారించలేదని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తెల్చుకుంటామన్నారు. మిత్రపక్షాలతో కలిసి నగరంలో క్లీన్స్వీప్ చేస్తామని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే సెక్యూలర్ పార్టీ అని... మజ్లిస్, టీఆర్ఎస్, బీజేపీ మూడూ ఒక్కటేనని ఆరోపించారు. మజ్లిస్ టీఆర్ఎస్కు సహకరిస్తోందని, టీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని ఆమోదంతోనే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్... బీజేపీతో జత కట్టడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో మజ్లిస్, టీఆర్ఎస్లకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. అక్కడందరూ తెలంగాణ ద్రోహులే... టీఆర్ఎస్లో రాజ్యమేలుతోంది తెలంగాణ ద్రోహులేనని అంజన్కుమార్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన మజ్లిస్... టీఆర్ఎస్కు మిత్రపక్షమైందన్నారు. తెలంగాణ ద్రోహులైన తుమ్మల, తలసాని తదితరులకు మంత్రి పదవులిచ్చి అందలం ఎక్కించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఉద్యమంలో భాగస్వామలైన వారికి, అమరులకు ఎలాంటి గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో గళం విప్పింది కాంగ్రెస్ ఎంపీలేనన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 12సార్లు పార్లమెంట్ను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ‘తెలంగాణ ఇచ్చింది... తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం మాయమాటలతో అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముందస్తు ఎన్నికల్లో చీటింగ్ టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. అన్నింట్లో వైఫల్యం... నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ నగరాభివృద్ధికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. వాగ్దానాల అమలుకు సంబంధించి కేసీఆర్ అన్నింటా వైఫల్యమయ్యారని అన్నారు. పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని మభ్య పెట్టాడన్నారు. మెట్రో, కృష్ణ జలాల ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, పనులు పూర్తయిన తర్వాత ప్రారంభించడంలో గొప్పేమిటని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పాత నగరానికి మెట్రోను విస్తరించాలన్నారు. కార్యకర్తలకు పెద్దపీట... రానున్న ప్రభుత్వం కాంగ్రెస్దేనని అంజన్కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. నగరంలోని 15 అసెంబ్లీ స్థానాల టికెట్ల కోసం సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారని, సర్వే ప్రకారం గెలుపు గుర్రాలకు అవకాశం రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో సమర్థులను బరిలో దింపుతామని, టికెట్ ఆశించి భంగపడ్డ వారు నిరాశ పడకుండా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పార్టీ మరవదని, అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. -
ఇరానీ చాయ్.. లాడ్బజార్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాతబస్తీలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించారు. ముందుగా చార్మినార్ కట్టడాన్ని తిలకించిన గవర్నర్, భవన అందాలకు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ట్రస్టీ శశికళ సన్మానించారు. అనంతరం లాడ్బజార్లో గాజుల దుకాణాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడి నుంచి సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించి అం దులోని చారిత్రాత్మక వస్తువులను తిలకించారు. అనం తరం చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించారు. గవర్నర్ రాకతో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడే మొహర్రం చరిత్రలో ఎంతో ప్రత్యేకం
సాక్షి సిటీబ్యూరో: చరిత్రలో మొహర్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. పూర్వం నుంచే ఈ విధానం ఉంది. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు. పవిత్ర దినం... ఇస్లామియా చరిత్రలో మొహర్రం మాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మొహర్రం మాసం పదో తేదీని ఆషూరా అంటారు. చరిత్రలో ఈ తేదీకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆదిమానవుడైన ఆదం ఆలైహిస్సలాంను దైవం సృష్టించింది, స్వర్గానికి పంపించింది ఆషూరా రోజునే. నోవా (నూహ్) ప్రవక్త నావను కనివిని ఎరగని భయంకర తుఫాన్ నుంచి రక్షించి, దైవం ఒడ్డుకు చేర్చింది ఈరోజే. యూనుస్ ప్రవక్తను చేప కడుపు నుంచి రక్షించింది కూడా ఈ రోజే. ఇబ్రహీంను నమ్రూద్ రాజు అగ్నిగుండంలో పడేసినప్పుడు దైవం ఆయన్ని అగ్ని నుంచి కాపాడాడు. మోషే ప్రవక్త, అనుయాయులను అష్టకష్టాలకు గురిచేసిన రాజు ఫిరోన్’(ఫారో) బారి నుంచి రక్షించాడు. దీనికి కృతజ్ఞతగా మోజెస్ ప్రవక్త అనుయాయులు (యాదులు) ఆ రోజు ఉపవాసం ఉండేవారు. మహ్మద్ ప్రవక్త రెండు రోజులు ఉపవాసం పాటించాలని బోధించారు. అంటే 9, 10వ తేదీల్లో గానీ 10, 11వ తేదీల్లో గానీ ఉపవాస వ్రతం పాటించాలి. ఆ ఆషూరా ఉపవాసాలకు రంజాన్న్ఉపవాసాల తరువాత స్థానం ఇచ్చారు మహ్మద్ ప్రవక్త(స). ఈ రెండు ఉపవాసాలు పాటించిన వారి గత పాపాలన్నీ దైవం క్షమిస్తాడు. మహ్మద్ ప్రవక్త(స) బోధనలతో ముస్లింలంతా పునీతులయ్యారు. ప్రజాస్వామ్యమే పరమావధి... మహ్మద్ ప్రవక్త పరమపదించిన తరువాత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకున్నారు. అటువంటి ప్రజాప్రతినిధిని ఖలీఫా అని పిలుస్తారు. మొట్టమొదటిసారిగా ఖలీఫాగా హజ్రత్ సిద్ధిఖ్æ ఎన్నికయ్యారు. ఆయన తరువాత వరుసగా హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరి పాలనా కాలంలో న్యాయం నాలుగుపాదాలపై నడిచింది. ఆర్థిక, ధార్మిక, రాజకీయ పరిపాలన రంగాలన్నింటిలోనూ సమతూకం నెలకొని ఉండేది. ప్రజలందరికీ ఎలాంటి వ్యత్యాసాలు, తారతమ్యాలు లేకుండా సమాన న్యాయం, గౌరవ మర్యాదలు లభించేవి. అందుకే వీరి పరిపాలన కాలం ప్రపంచ మానవ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంగా పేరొందింది. అధికార దాహం... నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామే హసన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్గా ఉన్న హజ్రత్ మావియా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల సలహా మేరకు అధికారం కోసం పోటీపడ్డారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య యుద్ధం వచ్చింది. కానీ ఇరువైపులా కరవాలాలు చేతపట్టిన అమాయక సొదర ప్రజానీకాన్ని చూసి ఇమామే హసన్ మనసు చలించిపోయింది. వెంటనే రణరంగం నుంచి నిష్క్రమించి ప్రజలు కట్టబెట్టిన రాజ్యాధికారాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా మావియా మనుసులో నాటుకున్న రాజ్యకాంక్ష అనే విషబీజం పెరిగి పెద్దదై అధికార వ్యామోహంతో తన కొడుకు యజీద్ను రాజుగా గుర్తించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చారు. రాజ్యంలో అలజడులు, హింసాకాండ చెలరేగాయి. ప్రజలు భయంతో యజీద్ను రాజుగా గుర్తించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యానికి పెద్దదెబ్బ తగిలింది. ప్రజాస్వామ్యవాదులకు ఈ పరిణామం ఏ మాత్రం రుచించలేదు. వారు రాచరికానికి ఎదురు తిరిగారు. ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించే బాధ్యత ఇమామే హసన్ భుజస్కంధాలపై మోపారు. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ సమస్యకైనా చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. అందుకని ఇమామే హసన్ ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ముఖాముఖి చర్చల కోసమని ఇమామ్ రాజధాని కుఫాకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న యజీద్ ఇమామ్ రాజధానికి చేరితే తన అధికారానికే ముప్పు వస్తుందని గ్రహించి ఆయన్ని అడ్డుకోవడానికి ఓ పెద్ద సైన్యాన్ని పంపాడు. మార్గ మధ్యలో కర్బలా అనే చోట యజీద్ సైన్యం ఇమామ్ పరివారాన్ని అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి ఇమామే హసన్ను హెచ్చరించాడు. తాను కేవలం చర్చల కోసమే రాజధానికి వెళుతున్నానని, దయచేసి తనను అడ్డగించవద్దని ఇమామే సెన్యాధికారిని కోరాడు. కానీ సైన్యాధిపతి ఇమామ్ మాటల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా యజీద్ను రాజుగా గుర్తించడమో, లేక యుద్ధమో తేల్చుకోమన్నాడు. ఆశయసాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే కాని.. దౌర్జన్యం ముందు తలవంచనన్నారు ఇమామే హసన్. ఆయనతో పాటు 72 మంది అమరులయ్యారు. షియా ముస్లింలు మొహర్రం మాసం మొదటి 10 రోజులు వీరి జ్ఞాపకార్థం మాతంగా పాటిస్తారు. మొహర్రం 10వ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు తమ రక్తాన్ని చిందించి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కుతుబ్షాహీ, ఆసఫ్జాహీల పాలనా కాలం నుంచి నేటికీ రాష్ట్ర ప్రభుత్వం బీబీకా ఆలం ఊరేగింపును నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్ల నుంచి ఏ దేశంలో, రాష్ట్రంలో లేని విధంగా బీబీకా ఆలం ఊరేగింపు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోంది. ఊరేగింపునకు బల్దియా ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: మొహర్రంను పురస్కరించుకొని చారిత్రాత్మక బీబీకా అలవా నుంచి శుక్రవారం జరిగే ఊరేగింపునకు వివిధ విభాగాల ద్వారా తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఊరేగింపు కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు రూ.3 కోట్లతో రోడ్ల మరమ్మతులు, అదనపు లైటింగ్, నూతన రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. బీబీకా ఆలం ఊరేగింపు మార్గంతో పాటు అన్ని అషూర్ఖానాల మార్గంలో రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్ల నిర్మాణం తదితర పనులతో పాటు అదనంగా 95 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఊరేగింపు మార్గంలో భవన నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించామని చెప్పారు. బీబీకా ఆలం నుంచి చాదర్ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో జలమండలి ద్వారా నాలుగున్నర లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఆధ్యాత్మికం..పాతబస్తీ ప్రత్యేకం
చార్మినార్: మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకరోజు తేడాతో కలిసి వస్తున్నాయి. 1985లో మొహర్రం సంతాప దినాలతో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒకే రోజు కలిసి వచ్చాయి. తిరిగి ఈసారి ఒక రోజు తేడాతో ఉత్సవాలు జరగనున్నాయి. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని షియా ముస్లిలు నగరంలోని ఆషుర్ఖానాలను తీర్చిదిద్దుతుండగా... వినాయక నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే నెలలో ఒక రోజు తేడాతో మొహర్రం సంతాప దినాల ప్రారంభం...వినాయక విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వెంటవెంటనే ప్రారంభమవుతున్నాయి. అలాగే 10వ,మొహర్రం సందర్బంగా పాతబస్తీ వీధుల్లో నిర్వహించే బీబీకాఆలం సామూహిక ఊరేగింపు ముగిసిన మరుసటి రోజే వినాయక నిమజ్జనోత్సవాలు జరుగనున్నాయి. ఒక వైపు మొహర్రం సంతాప దినాలు కొనసాగనుండగా...మరోవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగనున్నాయి. దీంతో నగరంలోని హిందువులు వినాయక ఉత్సవాల్లో నిమగ్నమవుతుండగా... షియా ముస్లిం ప్రజలు మొహర్రం సంతాప దినాల్లో పాల్గొననున్నారు. దీంతో ఇరువర్గాల ప్రజల కార్యక్రమాలతో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఇందుకోసం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో అటు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు షియా ముస్లింలతో సమావేశాలు నిర్వహించి తగిన సలహాలు,సూచనలు అందిస్తున్నారు. అదనపు బలగాలతో గట్టి బందోబస్తును నిర్వహించనున్నారు. 12నుంచి సంతాప దినాలు... హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ షియా ముస్లిం ప్రజలు ఈ నెల 12వ తేదీ నుంచి మొహర్రం సంతాప దినాలను కొనసాగించనున్నారు. ఈ నెల 11న రాత్రి ఆకాశంలో నెల వంక కనిపించిన వెంటనే మరుసటి రోజు సంతాప దినాల్లో పాల్గొంటారు. సంతాప దినాల్లో భాగంగా 21న, పాతబస్తీ వీధుల్లో అంబారీతో 10వ మొహర్రం సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది. డబీర్పురా బీబీకాఅలావాకు చెందిన బీబీకాఆలంతో షియా ముస్లింలు ఊరేగింపులో పాల్గొంటారు. సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్పురా బీబీకాఅలావాలో ఆలంలను ప్రతిష్టించి 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు మజ్లిస్, మాతం నిర్వహిస్తారు. 13నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 13వ, తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 23వ తేదీన విగ్రహాలను నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక నిమజ్జనోత్సవ ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఖరీదు చేసి మండపాలకు తరలిస్తున్నారు. పది రోజుల ముందుగానే ఉత్సవాల నిర్వాహకులు మండపాలు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆయా మండపాల వద్ద ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించనున్నారు.