
ప్రతీకాత్మకచిత్రం
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు.
సాక్షి, హైదరాబాద్ : అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా దేశాలు దాటిస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ 6 కోట్ల విలువైన బంగారాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దుబాయ్-హైదరాబాద్ విమానంలో ఈ బంగారాన్ని తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.