పలిమెల: ఛత్తీస్గఢ్ నుంచి పిక్నిక్ కోసం వచ్చిన బృందంలోని ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని దమ్మూరు గ్రామం సమీపంలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ బ్లాక్ కాలనీకి చెందిన ఖుజూర్ అభిషేక్(22) ఐటీఐ చదువుతున్నాడు. అతడు తన మిత్రులతో కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను విడదీస్తూ మూడు నదుల సంగమ ప్రాంతానికి వచ్చాడు. అప్పటివరకు ఎంతో ఆనందంగా గడిపిన అభిషేక్ స్నానం కోసం నదిలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి అడుగున ఉన్న ఇసుకలో దిగబడిపోయాడు. ఈత రాని అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ ప్రవాహ ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితులకు సైతం ఈత రాకపోవడంతో అభిషేక్ను కాపాడే సాహసం చేయలేకపోయారు. వారు కేకలు వేయగా సమీపంలోని జాలర్లు అక్కడికి చేరుకునేలోపే అభిషేక్ కనిపించకుండా పోయాడు. యువకుడి గల్లంతుపై సమాచారం అందుకున్న ఛతీస్గఢ్లోని భద్రకాళి పోలీసులు అక్కడికి వచ్చి జాలర్లకు సహాయాన్ని అందిస్తున్నారు. రెండు రోజులుగా గాలించినప్పటికీ అభిషేక్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు.
గోదావరిలో యువకుడి గల్లంతు
Jan 7 2018 8:32 PM | Updated on Jan 7 2018 8:32 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
గోదారి తగ్గింది..
సాక్షి, ఖమ్మం(చర్ల) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉధృతి కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురవడంతో గోదావరికి వరదలు వచ్చాయి. బుధవారం అర్ధరా...
-
బాడీ బిల్డర్గా 'అడవి బిడ్డ'..!
నో స్పాట్లైట్... నో స్పాన్సర్... నో బిగ్–సిటీ జిమ్...ఎన్నో ‘నో’ల మధ్య ఆమె దగ్గర ఉన్న ఏకైక ‘యస్’ ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఛత్తీస్గఢ్లోని మారుమూల గ్రామానికి చెందిన ఖుష్బు నాగ్ను ‘బాడీబిల్డ...
-
మత్తుని చిత్తు చేసిన మహిళా యోధులు..!
మత్తును చిత్తు చేసిన మహిళా యోధులు ‘భూమాత అంత ఓపిక మహిళల సొంతం’ అంటారు. సహనానికి పర్యాయ పదంలా చెప్పే ‘మహిళ’ అవసరమైతే అపర కాళీ అవుతుంది.కేరళ నుంచి పంజాబ్ వరకు ఎన్నో ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకం...
-
నాగ్పూర్లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు(Chaitra Navratri celebrations) ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల రాష్ట్రీయ...
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరి చెరువులో పడ్డ కారు
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లోని బల్రామ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు మలుపు వద్ద అదుపుతప్పింది. దీంతో ఎగిరి పక్కనున్న చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది దుర్మరణం పాల...
Advertisement