యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌ | Three People Beaten Up Brutally In Prakasam | Sakshi
Sakshi News home page

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

Aug 2 2019 5:04 PM | Updated on Aug 2 2019 5:21 PM

Three People Beaten Up Brutally In Prakasam - Sakshi

ఆగ్రహానికి గురైన యువతి బంధువులు ఆ ముగ్గురు కుర్రవాళ్లను నమ్మించి బైకులో ఊరికి దూరంగా ...

సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండలో దారుణం చోటుచేసుకుంది. యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారంటూ ముగ్గురు యువకులను ఆమె కుటుంబసభ్యులు దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావటంతో సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ యువతిని ముగ్గురు యువకులు వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు ఆ ముగ్గురు కుర్రవాళ్లను నమ్మించి బైకులో ఊరికి దూరంగా ఉన్న జామాయిల్‌ తోటల్లోకి తీసుకెళ్లారు.

అక్కడ వారిని విచక్షణా రహితంగా కర్రలతో కొడుతూ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. బాధితుల బంధువులకు వీడియో చేరటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. శివ అనే బాధితుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement