వైఎస్సార్ జిల్లా : రాయచోటి పాలిటెక్నిక్ సమీపంలో ఓ కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఆదివారం సెలవు కావడంతో రాయచోటి మండలం మాసాపేటకి చెందిన హర్ష, బాలాజీతో పాటు మరో నలుగురు ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ హర్ష, బాలాజీ మునిగి చనిపోయారు. హర్ష(11) రాయచోటిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
బాలాజీ మాసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతులిద్దరినీ వెలికి తీశారు. హర్ష, బాలాజీ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment