లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ | Two Woman Theft Neckles In Lalitha Jewellers By Duping Staff | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ

Published Sat, Dec 9 2017 5:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Two Woman Theft Neckles In Lalitha Jewellers By Duping Staff - Sakshi

లలితా జ్యువెల్లర్స్‌ యజమాని కిరణ్‌(ఫైల్ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : 'డబ్బులు ఊరికే రావు' అనే మాటతో మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు పొందిన లలితా జ్యువెల్లర్స్‌లో శనివారం చోరీ జరిగింది. ఈ మేరకు జ్యువెల్లర్స్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు దోచుకెళ్లినట్లు జ్యువెల్లర్స్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు.

రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement