బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు.. | Youth Burnt Alive in Nalonda district | Sakshi
Sakshi News home page

బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు..

Published Tue, Dec 12 2017 10:39 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

Youth Burnt Alive in Nalonda district - Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలోని దేవరకొండ మండలం ముదిగొండలో దారుణం జరిగింది. సందగళ్ల సుభాష్(28) అనే యువకుడిని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు. మృతుని మానసిక స్థితి సరిగా ఉండదని గ్రామస్థులు చెపుతున్నారు. కాగా  దుండగులు అర్ధరాత్రి సమయంలో సుభాష్‌ కాళ్ళు, చేతులు కట్టేసి ఊరి బయట పొలాల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు అంతా దేవరకొండలో ఉంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement