వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం | YSRCP Confirms UK, Europe, Singapore committees | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎన్నారై కమిటీ నియామకం

Published Tue, Nov 17 2015 7:11 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

YSRCP Confirms UK, Europe, Singapore committees

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఎన్‌ఆర్‌ఐ కమిటీల్లో భాగంగా యూకె, యూరోప్, సింగపూర్ కమిటీలను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్  జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీలను నియమించారు. యూకే-యూరోప్ కమిటీలో శివకుమార్ చింతన్, వెంకీ, అబ్బయ్య చౌదరి కొటారి, సందీప్ వంగల, పున్నారెడ్డి భీమానందం కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రవీంద్ర కందుల, పెరికల కనకాయ్, నవీన్‌రెడ్డిలను సలహా కమిటీ సభ్యులుగా నియమించారు. వీరితో పాటు 12 మందితో కార్యనిర్వహక కమిటీని ఏర్పాటు చేశారు.

 

పీసీ రావు (కోశాధికారి) వాసుదేవరెడ్డి మైరెడ్డి (గ్రేటర్ లండన్ ఇంచార్జీ), కిరణ్ పప్పుల (ఆపరేషన్ ఇంచార్జీ), కోటిరెడ్డి కల్లం (ఆపరేషన్స్ సపోర్ట్ సెల్), ప్రదీప్ చింత (కమ్యునికేషన్స్ ఇంచార్జీ), సతీష్ వనహరం (సోషల్ నెట్‌వర్క్ ఇంచార్జీ), భాస్కర్ మైలపాటి (టెక్నాలజీ సెక్రెటరీ), రవి మోచెర్ల (ఆర్గనైజింగ్ సెక్రెటరీ), సురేష్ ముదిరెడ్డి, ఓబుల్ రెడ్డి (యూత్ సెక్రెటరీ), జయంతి ఎస్ (మహిళా విభాగం), ప్రదీప్ కథి (మెంబర్‌షిప్ ఇంచార్జీ), రిజ్వాన్ దేవరకొండ (మైనారిటీ సెల్ ఇంచార్జీ) గా వ్యవహరిస్తారు.

ఈ కమిటీకి తోడుగా ఏడుగురిని ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా, మరో ఆరుగురిని కోర్ టీమ్‌గా ఏర్పాటు చేశారు. ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా విజయభాస్కర్ వైకుంఠం (హాంస్లో కో-ఆర్డినేటర్), మనోహర్ నక్కా (ఫెల్తం కో-ఆర్డినేటర్), భగవాన్ యనమల (ఈస్ట్ లండన్ కో-ఆర్డినేటర్), సుబ్బారెడ్డి ముప్పిడి (సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ కో-ఆర్డినేటర్), మహేష్ వాసిపల్లి (కేంబ్రిడ్జి కో-ఆర్డినేటర్), సునీతా ముక్కు (ఆక్స్‌ఫర్డ్ వుమెన్ సెల్ ఇంచార్జీ), చింతపంటి జనార్ధన్ (మిల్టన్ కీనెస్ ఇంచార్జీ) నియమితులు కాగా కోర్ టీమ్‌లో తాటిరెడ్డి, కృష్ణమోహన్, శ్రీకాంత్ అడుసుమల్లి, భాస్కర్ అరుణ్‌కుమార్ పెట్ల, శివారెడ్డి సింగంరెడ్డి, రవి కిరణ్ చింతలు ఉన్నారు.
 
 20 మందితో సింగపూర్ కమిటీ


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 20 మందితో కూడిన సింగపూర్ కమిటీ కార్యవర్గాన్ని వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నియమించినట్టు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. సింగపూర్ కమిటీ కన్వీనర్లుగా (త్రిసభ్య కమిటీ) కోటిరెడ్డి కొమ్మిరెడ్డి, డి.జయప్రకాష్, వత్సవాయి పృధ్వీరాజ్‌లు ఉన్నారు. కార్యదర్శులుగా రుద్ర భూంరాజ్, పేస మురళి, సుధాకర్ మారంరెడ్డి, వీరారెడ్డి వెన్న, బుచ మోహన్‌లను నియమించారు. కోశాధికారిగా చింతలపూడి గంగాధర్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా మరో 11 మందిని జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. డి.ప్రకాష్, పి.వేణుగోపాల్, గుంటి రామ్, ఎ.సురేష్, ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ మెరుగుమాల, శివరామిరెడ్డి వి, చినపన వెంకటేష్, సుగ్గు నీలాద్రి, శ్రీకాంత్‌రెడ్డి కల్లం, కె.లక్ష్మణ్‌లు నియమితులయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement