నెల్లూరు : నెల్లూరు జిల్లా దగదర్తి మండలం మనుబోలుపాడులో మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.