కత్తులతో దాడి చేసుకున్న అన్నదమ్ములు | 3 injured in land controversy in guntur district | Sakshi
Sakshi News home page

కత్తులతో దాడి చేసుకున్న అన్నదమ్ములు

Published Wed, Jul 27 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, వెంకట్రావు ఇద్దరూ అన్నదమ్ములు. సోదరుల మధ్య ఇంటి స్థలం విషయంలో వివాదం చెలరేగడంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.కోటేశ్వరరావు, ఆయన మామ లక్ష్మయ్యలు కత్తిపోట్లకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement