రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
Published Wed, Aug 3 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంట ర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చిరాజు, చోడెం నరసింహరాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రామారావుపేట సెంటర్ వైపు వస్తున్నారు. అలాగే జైనవారిగూడెంకు చెందిన కోర్సా రాంబాబు కూడా ద్విచక్రవాహనంపై రామారావు పేట సెంటర్ వైపు వస్తుండగా, ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో చోడెం నరసింహరాజు, కోర్సా రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement